కుటుంబ కలహాలతో ఒకరి ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్కు చెందని తూర్పటి మోహన్(28) నిత్యం మద్యం తాగి వస్తుండటంతో భార్య కాశవ్వ మందలించేది. అలాగే తరుచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి మద్యం తాగివచ్చిన మోహన్, భార్యతో గొడవపడి, అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మనస్తాపం చెంది గ్రామశివారులోని తన తల్లి సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఇందల్వాయి మండలంలో ఒకరు..
ఇందల్వాయి: మండలంలోని ఓ వ్యక్తి మానసికంగా సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన గాండ్ల శ్యామ్(24) గతంలో గల్ఫ్కి వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఇంటివద్దనే వ్యవసాయ పనులతోపాటు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈమధ్య అతను మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడంతోపాటు మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి ఇంకా పెళ్లి కాలేదని, మృతుడి తల్లి పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment