భర్త ఆచూకీ చెప్పండి.. ఖతార్‌ నుంచి ఫోన్‌ చేసి, 6 నెలలైంది.. | - | Sakshi

భర్త ఆచూకీ చెప్పండి.. ఖతార్‌ నుంచి ఫోన్‌ చేసి, 6 నెలలైంది..

Nov 27 2024 7:58 AM | Updated on Nov 27 2024 10:06 AM

భర్త ఆచూకీ చెప్పండి

భర్త ఆచూకీ చెప్పండి

 ప్రవాసి ప్రజావాణిలో దట్నూర్‌ మహిళ ఫిర్యాదు

జగిత్యాల క్రైం: తన భర్త ఎక్కడున్నాడో తెలియడం లేదని, ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ ఓ మహిళ ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని దట్నూర్‌కు చెందిన రాచూరి రాజేందర్‌ ఖతార్‌ వెళ్లాడు. 6 నెలల క్రితం భార్య సునీతకు ఫోన్‌ చేసి, ఉద్యోగం పోయిందని, తాను మాల్టా దేశానికి వెళ్తానని చెప్పాడు. రూ.5 లక్షలు కావాలంటే భార్య, తల్లి అప్పు చేసి, అతని బ్యాంక్‌ అకౌంట్‌కు పంపించారు. 

ఆ మరుసటి రోజు నుంచే అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వ స్తోంది. ఆయన ఖతార్‌లో ఉన్నాడా, ఇండియా వచ్చాడా తెలియడం లేదని కుటుంబసభ్యులు కంటతడి పెడుతున్నారు. సునీత మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసి ప్రజావాణికి కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ మంద భీంరెడ్డితో కలిసి హాజరైంది. అక్కడ ప్రవాసి ప్రజావాణి నోడల్‌ ఆఫీ సర్‌ దివ్య దేవరాజన్‌ను కలిసి, ఫిర్యాదు చేసింది. తన భర్త ఎక్కడున్నాడో ఆచూకీ కనిపెట్టాలంటూ వే డుకుంది. స్పందించిన ఆమె పోలీసుల ద్వారా కేసు దర్యాప్తు చేయించాలంటూ జగిత్యాల శిశు సంక్షేమ శాఖ అధికారి నరేశ్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement