లంచగొండి ఎస్‌ఐకి సంకెళ్లు | - | Sakshi
Sakshi News home page

లంచగొండి ఎస్‌ఐకి సంకెళ్లు

Published Sun, Feb 16 2025 12:50 AM | Last Updated on Sun, Feb 16 2025 12:50 AM

-

మైసూరు: హత్య కేసును మూసివేసేందుకు రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఓ ఎస్‌ఐ లోకాయుక్త వలలో చిక్కిన ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలోని బెట్టదపురలో జరిగింది. వివరాలు.. బెట్టదపుర స్టేషన్‌ ఎస్‌ఐ శివశంకర్‌ ఓ కేసును మూసివేస్తానని, ఇందుకు లంచం ఇవ్వాలని సంబంధీకులకు తెలిపాడు. డబ్బులు ఇవ్వలేమని, కేసుతోను తమకు సంబంధం లేదని వారు చెప్పినా ఎస్‌ఐ వినిపించుకోలేదు. దీంతో వారు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి ఎస్‌ఐ శివశంకర్‌ రూ.80 వేలు తీసుకుంటూ ఉండగా, లోకాయుక్త అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement