నేత్రపర్వంగా అంజన్న రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా అంజన్న రథోత్సవం

Published Tue, Feb 18 2025 1:53 AM | Last Updated on Tue, Feb 18 2025 1:50 AM

నేత్రపర్వంగా అంజన్న రథోత్సవం

నేత్రపర్వంగా అంజన్న రథోత్సవం

హొసపేటె: తాలూకాలోని లోకికెరె గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా జరిగింది. ఆలయ నుంచి ఉత్సవ మూర్తిని పల్లకీ ద్వారా సకల వాయిద్యాలతో రథంపైకి తీసుకొచ్చి మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఉత్తవమూర్తిని రథంలో ప్రతిష్టించి లాగడంతో తరలివచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. రథానికి ఉత్తత్తి, అరటిపండ్లు, తరిగిన మిరియాలను భక్తి అంకితం చేశారు. రథాన్ని పాదాల వరకు లాగి తిరిగి మూలస్థానానికి తీసుకొచ్చారు. నందిధ్వజ కుణిత, సామల, హలగె, ఉరుమె తదితర జానపద వాయిద్యాలు రథోత్సవానికి శోభను చేకూర్చాయి. రథోత్సవానికి ముందు ఉదయం గ్రామస్తుల సమక్షంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు బసవేశ్వర స్వామి ఉచ్ఛాయం జరిగింది. రథోత్సవంలో తాలూకా చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానాహొసహళ్లి స్టేషన్‌ ఎస్‌ఐ సిద్రామ బిదారాణితో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement