యశవంతపుర: వచ్చే జూన్, జూలై మాసంలో తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపింది. సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది శశికిరణ్ శెట్టి హాజరై మే నెలలో టీపీ, జడ్పీ స్థానాల రిజర్వేషన్లను ప్రకటించి, జూన్, జూలై నెలల్లో ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. మూడేళ్ల నుంచి టీపీ, జడ్పీ ఎన్నికలను నిర్వహించలేదు. ఎన్నికల సంఘం న్యాయవాది ఫణీంద్ర.. ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటిస్తే ఎన్నికలను జరపడానికి ఈసీ సిద్ధమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment