●వరద తగ్గింది.. వారధి తేలింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య వారధిలా పనిచేస్తోంది. ఆనకట్ట పైనుంచి వర్షాకాలం మొదలు కొద్దిరోజుల కిందటి వరకు నీరు ప్రవహించింది. దీంతో జలపాతం మాదిరి కనిపించగా ఇప్పుడు గోదావరి నీటిమట్టం తగ్గడంతో ఆనకట్ట బయటపడి వారధిలా పనిచేస్తోంది. ఏటా ఈ ఆనకట్ట వేసవిలో వారధిలా, శీతాకాలంలో జలపాతంలా, వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ కొత్త అందాలు సంతరించుకుంటుంది. అయితే, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. – అశ్వాపురం
Comments
Please login to add a commentAdd a comment