ఆసిఫాబాద్రూరల్: కాగజ్నగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలను శుక్రవారం డీఐఈవో కళ్యాణి తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రాక్టికల్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 570 మంది విద్యార్థులకు 543 మంది హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 75 మందికి 71 మంది హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు జనరల్ విభాగంలో 364 మందికి 348 మంది, ఒకేషనల్ విభాగంలో 106 మందికి 103 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment