అడవికి నిప్పు వన్యప్రాణులకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

అడవికి నిప్పు వన్యప్రాణులకు ముప్పు

Published Sun, Feb 16 2025 12:06 AM | Last Updated on Sun, Feb 16 2025 12:06 AM

-

సిర్పూర్‌(టి): అటవీ ప్రాంతాల్లో నిప్పు పెట్టడం ద్వారా వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉంటుందని ఎఫ్‌ఎస్‌వో మోహన్‌రావు అన్నారు. సిర్పూర్‌(టి) రేంజ్‌ పరిధిలోని మేడిపల్లి, చిన్నమాలిని గ్రామాల్లో పెద్దపులి దాడుల్లో మరణించిన పశువుల యజమానులకు శనివారం పరిహారం చెక్కులు అందించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజలు వేసవిలో తునికాకు, ఇప్పపువ్వుల సేకరణ కోసం అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టొద్దని సూచించారు. చిన్నమాలిని గ్రామానికి చెందిన సుర్పం గన్నుకు రూ.22వేలు, సుర్పం జంగుకు రూ.27వేలు, మేడిపల్లి గ్రామానికి చెందిన సిడాం భీంరావ్‌కు రూ.12వేల విలువైన చెక్కులు అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement