సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలి
● డీఆర్డీవో దత్తారాం
రెబ్బెన: ఉపాధి హామీ సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం కూలీలు పనులు చేయాలని డీఆర్డీవో దత్తారాం అన్నారు. శుక్రవారం మండలంలోని నక్కలగూడ శివారులో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా చేపట్టిన ఫారంపాండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ కూలీలందరూ రోజుకు రూ.300 కూలి పడేలా పనిచేయాలన్నారు. సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేస్తే కూలి వస్తుందన్నారు. రోజుకు 4 నుంచి 5 గంటలు పని చేయాలన్నారు. అనంతరం ఇందిరానగర్ నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో, ఈసీ, టీఏలు, ఎఫ్ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment