వ్యవసాయం.. ‘లక్ష్మి’ కటాక్షం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయం.. ‘లక్ష్మి’ కటాక్షం

Published Sat, Mar 8 2025 2:02 AM | Last Updated on Sat, Mar 8 2025 1:58 AM

వ్యవసాయం.. ‘లక్ష్మి’ కటాక్షం

వ్యవసాయం.. ‘లక్ష్మి’ కటాక్షం

ప్రకృతి వ్యవసాయంలో గూడూరుకు చెందిన మహిళ రైతు జి. లక్ష్మీదేవి అద్భుతంగా రాణిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాకు 10 ఎకరాల భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఏటీఎం నమూనాలో ఒక ఎకరాలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. పెట్టుబడి కోసం రూ.15 వేలు ఖర్చు చేయగా.. రూ.లక్షకుపైగా ఆదాయం వచ్చింది. మిగిలిన మూడు ఎకరాల్లో వివిధ పంటలు వేస్తున్నాం. మా పంటల సాగును ప్రత్యేక బృందాలు వచ్చి అధ్యయనం చేశాయి. పంటలను పరిశీలించి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి కూడా అభినందించారు.’’

– కర్నూలు(అగ్రికల్చర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement