విద్యార్థులు క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి
బాసర: విద్యార్థులు క్రీడా నైపుణ్యం ప్రదర్శించాలని ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. మంగళవారం బాసర ఆర్జీయూకేటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ డేలో భాగంగా 30 అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రణధీర్ సాగి, స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, పీడీలు రవికిరణ్, శ్యాంబాబు, పీఈటీలు రఘువీర్, వసంత, స్వప్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment