బాలికల వసతిగృహంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి బస | - | Sakshi
Sakshi News home page

బాలికల వసతిగృహంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి బస

Published Thu, Mar 6 2025 1:43 AM | Last Updated on Thu, Mar 6 2025 1:38 AM

బాలికల వసతిగృహంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి బస

బాలికల వసతిగృహంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి బస

జైపూర్‌: మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతిగృహంలో మంగళవారం రాత్రి జిల్లా బీసీ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ అధికారి భాగ్యవతి బస చేశారు. విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. వసతిగృహా పరిసరాలు, మరుగుదొడ్లు పరిశీలించారు. అ నంతరం 10వ తరగతి విద్యార్థులకు వార్షిక ప రీక్షలపై అవగాహన కల్పించారు. ఒత్తిడికి గురి కావద్దని, ప్రశాంతతో చదవాలని, ముఖ్యమైన విషయాలను నోట్స్‌ రూపంలో రాసుకుని ఎక్కువగా రివిజన్‌ చేస్తే ఉత్తీర్ణతతోపాటు మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వసతిగృహా సంక్షేమాధికారి సుధాలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement