
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
ఉమ్మడి జిల్లా నుంచి 1,677 మంది హాజరు
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు శనివారం వివిధ కేంద్రాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్, వర్గల్లోని 10 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్ష జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 2,610 మందికి గాను 1,677మంది విద్యార్థులు హాజరయ్యారు. 11వ తరగతి ప్రవేశపరీక్షకు మొత్తం 1,621 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,114 (68.72%) మంది హాజరైనట్లు నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ పేర్కొన్నారు. 9వ తరగతి ప్రవేశపరీక్షకు 989 మందికి గాను 563 (56.93%) విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment