Akshay Kumar Bachchhan Paandey Movie Gets April 2022 OTT Release - Sakshi
Sakshi News home page

Bachchan Pandey Movie: ఓటీటీలోకి 'బచ్చన్‌ పాండే' చిత్రం.. ఎప్పుడు ? ఎక్కడంటే ?

Published Mon, Apr 11 2022 7:30 PM | Last Updated on Mon, Apr 11 2022 8:13 PM

Akshay Kumar Bachchan Pandey OTT Release Date Confirmed - Sakshi

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం 'బచ్చన్ పాండే'. ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా అలరించారు.  ఈ చిత్రం తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్‌గా వచ్చింది. అలాగే తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా 'గద్దల కొండ గణేష్' పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం 'బచ్చన్ పాండే'. ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా అలరించారు.  ఈ చిత్రం తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్‌గా వచ్చింది. అలాగే తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా 'గద్దల కొండ గణేష్' పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. మార్చి 18న విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. 'బచ్చన్‌ పాండే' మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఏప్రిల్‌ 15 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. 

'బచ్చన్‌ పాండే మూవీ ఒక అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌. ఈ వినోదాన్ని మిస్‌ అయిన ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి తీసుకువస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ గదిలో కూర్చొని మొత్తం యాక్షన్‌, డ్రామా, కామెడీతో నిండి ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌ 15న ప్రైమ్‌ వీడియోలో ఆస్వాదించవచ్చు. మేము ఈ సినిమాను ఎంత ఎంజాయ్‌ చేశామో మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.' అని అక్షయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

చదవండి: షూటింగ్‌లో ఏం కనిపించేది కాదు.. ప్రాణం పోయినంత పనైంది: అక్షయ్‌ కుమార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement