
టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్బాబు, రామ్చరణ్ తమ ప్రాజెక్ట్లలో బిజీగా ఉండగా వాళ్ల సతీమణులిద్దరూ దుబాయ్లో పార్టీ చేసుకున్నారు. మహేశ్ భార్య నమ్రత, రామ్చరణ్ భార్య ఉపాసన ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం మనందరికీ తెలిసిందే. దుబాయ్ ఎక్స్పో 2020లో భాగంగా వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లి క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన.. నమత్ర, ఆమె సోదరి శిల్పా, మనీశ్ మల్హోత్రా తదితరులకు లంచ్ పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
'ఇష్టమైనవారితో రుచికరమైన విందు. ఈ మధ్యాహ్నాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. ఉపాసన.. నీలా అద్భుతమైన వంటకాలతో విందును ఎవరూ ఇవ్వలేరు. మనీశ్.. నిన్నిక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. మనమంతా మరోసారి హైదరాబాద్లో ఇలాంటి పార్టీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అది కూడా త్వరలోనే! అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది నమ్రత. 'నిజంగా చాలా ఎంజాయ్ చేశాం. లవ్లీ మీటింగ్. త్వరలోనే హైదరాబాద్లో కూడా ప్లాన్ చేద్దాం' అని బదులిచ్చింది ఉపాసన.
Comments
Please login to add a commentAdd a comment