Upasana
-
Valentine's Day Special: టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడీ రామ్చరణ్- ఉపాసన (ఫోటోలు)
-
క్లీంకారతో రామ్ చరణ్.. ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ సంక్రాంతి సెలబ్రేషన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగను సినీతారలు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలంతా తమ ఫ్యామిలీతో కలిసి పొంగల్ వేడుకలు చేసుకున్నారు. ఈ పండుగ వేళ రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లీంకారతో దిగిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. హ్యాపీ సంక్రాంతి అంటూ షేర్ చేసింది.మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సంక్రాతి సెలబ్రేషన్స్ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బన్నీతో కలిసి పిల్లలు అయాన్, అర్హతో పండుగ రోజు దిగిన ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ సంక్రాంతి-2025 అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.సంక్రాంతి సినిమాల సందడి..గేమ్ ఛేంజర్కు మిక్స్డ్ టాక్..రామ్ చరణ్-శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు.డాకు మహారాజ్కు పాజిటివ్ రెస్పాన్స్..నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్కు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా మాస్ ఆడియన్స్ను మెప్పించింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది డాకు మహారాజ్. ఈ మూవీ ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం..అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన మరో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దిల్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
'ఇది మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం'.. ఉపాసన ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిదని పోస్ట్ చేశారు.ఆయన మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని(అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్) ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్లో సేవలందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రామజన్మ భూమిలో సేవ చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy. Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024 -
క్లీంకార ఫోటో షేర్ చేసిన ఉపాసన.. బాల్యం గుర్తొస్తోందంటూ..
రామ్చరణ్ సతీమణి ఉపాసన.. తమ గారాలపట్టి క్లీంకార ఫోటో షేర్ చేసింది. ముత్తాత (ఉపాసన తాతయ్య), తాతయ్య (ఉపాసన తండ్రి)తో కలిసి అపోలో ఆస్పత్రిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జరిగిన పవిత్రోత్సవాల్లో చిన్నారి పాల్గొందని తెలిపింది. ఉపాసన ఎమోషనల్తాత చంకనెక్కిన క్లీంకారను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయంది. అలాగే ఈ గుడి తనకెంతో ప్రత్యేకమని పేర్కొంది. అలాగే ఈ ఆనందకర క్షణాలను వెలకట్టలేనని పోస్ట్ కింద రాసుకొచ్చింది. ఇక ఉపాసన షేర్ చేసిన ఫోటోలో క్లీంకార ముఖం స్పష్టంగా కనిపించకూడదని కాస్త బ్లర్ చేసింది.ఇంత పెద్దగా అయిపోయిందా?ఇది చూసిన అభిమానులు.. ఈ చిట్టితల్లిని ఇంకెప్పుడు చూస్తామో అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో క్లీంకార అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే రామ్చరణ్- ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కూతురు పుట్టింది. 2023 జూన్లో జన్మించిన తన ముద్దుల మనవరాలికి చిరంజీవి క్లీంకార అని నామకరణం చేశారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: కడుపులో బిడ్డకు గ్యారెంటీ ఇవ్వమన్నారు: స్టెల్లా ఎమోషనల్ -
రామ్ చరణ్ దంపతులపై క్యూట్ వీడియో.. స్పందించిన ఉపాసన!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు.. మెడికల్ రంగంలో ఎంటర్ప్రెన్యూరర్గా రాణిస్తోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. గేమ్ ఛేంజర్ సాంగ్తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది. ఎడిటింగ్ చాలా ముద్దుగా ఉంది.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ రొమాంటిక్ సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. గేమ్ ఛేంజర్లో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలిచింది. What a cute edit. ❤️ ❤️ thank u for all the love. https://t.co/AMtAtr2w0T— Upasana Konidela (@upasanakonidela) November 28, 2024 -
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి శ్రీకృష్ణుని పూజలో పాల్గొన్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. క్లీంకారతో పాటు రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ కూడా పూజల్లో పాల్గొన్నారు.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఆ తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పనిచేయనున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ సరసన జాన్వీకపూర్ నటించనుంది. Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami 🙏❤️ pic.twitter.com/68LEYJISdy— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024 -
మెల్బోర్న్లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్.. వరల్డ్ కప్ తో రామ్ చరణ్ (ఫొటోలు) (ఫొటోలు)
-
ఇంత ఘోరాలు జరుగుతుంటే ఇండిపెండెన్స్ డే ఎలా?.. ఉపాసన ఆవేదన
ఇండిపెండెన్స్ సందర్భంగా రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్ వైరలవుతోంది. కోల్కతాలో వైద్యవిద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందని ప్రశ్నించింది. ఇంతటి అనాగరిక సమాజంలో మనం బతుకున్నామా? అని నిలదీసింది. మెడికల్ ప్రొఫెషన్లపై ఇంత దారుణం జరుగుతుంటే ఇక మనుషుల ప్రాణాలకు రక్షణ ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా మనం ఇప్పటికీ అనాగరిక సమాజంలో బతుకుతున్నామంటే ఏమని స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామని ఉపాసన ప్రశ్నించింది. ఇది ఎప్పటికీ మానవత్వం అనిపించుకోదని తెలిపింది. మహిళలే దేశానికి వెన్నెముక లాంటివారని.. ఇప్పటికే దాదాపు 50శాతం మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో మహిళల కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రధానంగా హెల్త్ కేర్ రంగంలోకి ఎక్కువమంది మహిళలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి మహిళ భద్రత, గౌరవం కాపాడేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
పారిస్ ఒలింపిక్స్ 2024: ఫ్యామిలీతో రామ్చరణ్ సందడి (ఫోటోలు)
-
పారిస్ వీధుల్లో మనవరాలు క్లీంకారతో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్..
-
ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా చెర్రీ భార్యగా, వ్యాపారవేత్తగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ నెల 20న తన పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ స్పెషల్గా విష్ చేశారు. 'క్లీంకార మమ్మీ' అంటూ కొత్త పేరుతో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.అయితే తాజాగా నటుడు, కమెడియన్ భద్రం.. ఉపాసనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసనపై ప్రశంసలు కురిపించారు. ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కొరకు లాఫ్టెడ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఓ సెషన్ నిర్వహించమని అడిగినప్పుడు మీకు ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, కేరింగ్ అర్థమైందన్నారు. మీ ఫ్యామిలీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి పట్ల అంతే కేరింగ్గా ఉంటూ.. వారు కూడా బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు భద్రం తన ట్విటర్లో పోస్ట్ చేశారు. Happy Happy Birthday @upasanakonidela Ma'am pic.twitter.com/2jQksINIpx— భద్రం (@BhadramDr) July 20, 2024 -
రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది
గ్లోబల్స్టార్ రామ్ చరణ్ దంపతులు అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ల వివాహానికి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి భారీగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి లగ్జరీ కారులో ఎయిర్పోర్ట్కు వెళ్లారు. ఇప్పుడా వీడియో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.టాలీవుడ్ టాప్ హీరోల వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ గ్యారేజీలో మెర్సిడేజ్, రోల్స్ రాయిస్ ఫాంథమ్, ఫెరారీ, ఆస్టో మార్టిన్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ దంపతులు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహానికి వెళ్లేందుకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే, రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టార్ను డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్కు వచ్చారు. దీని ధర దాదాపు రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ కారు ఇండియాలో రెండోది కావడం విశేషం. సౌత్ ఇండియాలో మొదటి కారు కావడం గమనార్హం.రోల్స్ రాయిస్ కారుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా తక్కువ మంది వద్దే ఈ కెంపెనీకి చెందిన కార్లు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ లేటెస్ట్ వర్షన్ రోల్స్ రాయిస్ కారును కొన్నారు. జనవరి 2024లో ఈ మోడల్ లాంఛ్ అయింది. ఈ కారు అందుకున్న రెండో వ్యక్తిగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.Charan Babu Off to Mumbai 👍👍👍New Rolls Royce Spectre Car (Second Car in India its cost around 7.5 Cr)#RamCharan pic.twitter.com/eqkjiAJUEa— Praveen (@AlwaysPraveen7) July 11, 2024Screen presence &Royality @AlwaysRamCharan 🦁Present Generation lo #RamCharan offline styling 👌🔥Eh dress ayna easy ga set ayipodi aha body ki pic.twitter.com/m4AikXYzDj— vijay (@vijay_mbfan) July 11, 2024 -
ముంబయికి గ్లోబల్ స్టార్ దంపతులు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబయికి బయలుదేరి వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి సతీసమేతంగా హాజరు కానున్నారు. తాజాగా ఆయన భార్య ఉపాసన, ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన గేమ్ ఛేంజర్ ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. #RamCharan brings his A Swag to the airport as he departs for Mumbai with #KlinKaara & @upasanakonidela for Anant Ambani & Radhika Merchant's Wedding !The Debonair @AlwaysRamCharan 🦁 pic.twitter.com/SVlrMZVbE4— Trends RamCharan ™ (@TweetRamCharan) July 11, 2024 -
Klin Kaara Photos: గ్రాండ్గా క్లీంకార ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Klin Kaara Photos: మెగా మనవరాలు క్లీంకార ఫస్ట్ బర్త్ డే.. క్యూట్ ఫొటోలు
-
12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు ఉపాసన మరో క్యూట్ ఫొటోతో వచ్చేసింది. రామ్ చరణ్తో పెళ్లి జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతూ సింపుల్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టింది. అయితే థ్యాంక్స్ చెప్పడంతో పాటు కూతురు క్లీంకాక లేటెస్ట్ ఫొటోని కూడా ఇందులో జోడించింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)2012లో రామ్ చరణ్, ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. తొలుత ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపించాయి. కానీ రానురాను మెగా ఫ్యామిలీలోనే చరణ్-ఉపాసన.. వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అయిపోయారు. వీళ్లకు గతేడాది జూన్లో కూతురు పుట్టింది. ఈ బుజ్జాయికి క్లీంకార అని పేరు పెట్టుకున్నారు.పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయటపెట్టట్లేదు. ఇప్పుడు కూడా తను, చరణ్.. కూతురిని నడిపిస్తున్నట్లు వెనక నుంచి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అంటే మెగా మనవరాలు బుడిబుడి అడుగులు వేసేస్తుందని ఈ పోస్ట్తో ఉపాసన చెప్పకనే చెప్పేసింది.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
వన్యప్రాణుల సంరక్షణ నేషనల్ అంబాసిడర్గా ఉపాసన
కొణిదెల... కామినేని కుటుంబాల్లో ఉపాసన చాలా ప్రత్యేకం.. మెగా ఇంటికి కోడలిగా ఆమె అడుగుపెట్టిన సమయం నుంచి ఆమె పేరు మరింత పాపులర్ అయింది. గ్లోబల్స్టార్ హీరో రాంచరణ్ సతీమణిగా బెస్ట్ కపుల్స్ అనిపించుకున్న ఉపాసన టాలీవుడ్తో పాటు వ్యాపార ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసింది.అపోలో హాస్పిటల్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోసిస్తున్న ఉపాసనకు మరో బాధ్యతను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్గా నియమితులైంది. ఈ విషయాన్ని నాగర్కర్నూల్ డీఎఫ్వో రోహిత్ గోపిడి తాజాగా తెలిపారు. అపోలో ఆసుపత్రి ట్రస్ట్ యందు వైస్ చైర్పర్సన్గా ఆమె విధులు నిర్వహిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం ప్రకారం నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనుంది.ఈ ఒప్పందం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో గాయపడిన పులులు, ఏనుగులు వంటి ప్రాణులకు వైద్యం అందించడమే కాకుండా.. అటవీశాఖ సిబ్బందికి కూడా అపోలో ఆసుపత్రిలో ఉచిత చికిత్సను అందించనున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్
సలార్తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్.. కల్కి 2898 ఏడీ చిత్రంతో మరోసారి రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఉపాసన ఇంటికి బుజ్జిఅయితే సినిమా రిలీజ్కు ముందే బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ సిరీస్ లాంచ్ చేశారు. ఇందులో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ సిరీస్కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా బుజ్జి ఉపాసన ఇంటికి చేరింది. అదెలాగంటారా? కల్కి 2898 ఏడీ చిత్రయూనిట్ బుజ్జిని పోలి ఉన్న చిన్న బొమ్మను, పాత్రల స్టిక్కర్స్ను రామ్చరణ్- ఉపాసనల కూతురు క్లీంకారకు బహుమతిగా ఇచ్చింది. చిత్రయూనిట్కు థ్యాంక్స్వాటితో క్లీంకార ఆడుకుంటున్న ఫోటోను ఉప్సీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే కూతురు ముఖం కనిపించకుండా ఆ ఫోటో తీసింది. తనకు ఈ బహుమతి పంపినందుకు హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రింయాక దత్లకు కృతజ్ఞతలు తెలియజేసింది.చదవండి: Bujji And Bhairava Review: యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే.. -
చరణ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఉపాసన పోస్ట్
ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనక కూడా ఒక మగవాడు ఉంటాడని ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఎంత వైరలయ్యాయో తెలిసిందే! ఇద్దరూ ఒకరికొకరు తోడుగా, అండగా నిలబడితే ఆ బంధం కలకాలం నిలుస్తుందని చెప్పకనే చెప్పింది ఉపాసన. కేవలం సూక్తులు చెప్పడం కాదు దాన్ని ఆచరించి చూపిస్తున్నారీ జంట.ఉపాసన వెంటే..ఆ మధ్య చరణ్ ఆస్కార్ కోసం అమెరికాకు వెళ్తే కడుపుతో ఉన్నా సరే ఉపాసన అతడి వెంటే వెళ్లింది. ఇప్పుడు ఉప్సీ వృత్తిపరమైన వ్యవహారాల కారణంగా ఒమన్ దేశానికి వెళ్లింది. షూటింగ్స్తో ఎంతో బిజీగా ఉండే చరణ్ పనులన్నీ పక్కనపెట్టి భార్యతో సహా వెళ్లాడు. తమ పాప క్లీంకారను కూడా తీసుకెళ్లారు. గర్వంగా ఉంది..ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'చరణ్ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నేను చేసే పనులకు సపోర్ట్గా నిలబడుతున్నావు. తండ్రిగానూ బాధ్యత నెరవేరుస్తున్నావు. అలాగే ఈ మీటింగ్ను ప్రత్యేకంగా మార్చిన మహిళామణులందరికీ థ్యాంక్స్' అంటూ మూడు ఫోటోలు షేర్ చేసింది. అందులో ఉపాసన కెమెరా వైపు పోజిస్తే చరణ్ మాత్రం ప్రకృతిని ఆస్వాదిస్తూ వెనుదిరిగి నిల్చున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..! -
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా 'అత్తమ్మాస్ కిచెన్'తో నిర్వచించారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా 'అత్తమ్మాస్ కిచెన్' కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు. అవి ఆన్లైన్లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి.తాజాగా 'అత్తమ్మాస్ కిచెన్' పేజీ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు. అందులో తన అత్తగారు అయిన పద్మతో కలిసి లావణ్య త్రిపాఠి కనిపించారు. కొత్త ఆవకాయ్ పచ్చడిని తయారు చేస్తూ ఫోటోలు దిగారు. అయితే, ఆ ఫోటోలపై కొందరు కామెంట్లు చేశారు. 'అత్తమ్మాస్ కిచెన్' ప్రొడక్ట్ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. ఆవకాయ్ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఆపై వారి జుట్టుని కూడా అలా వదిలేశారు. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి..? ఏ మాత్రం హైజీన్ పాటించడం లేదంటూ విమర్శలు చేశారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ పేజీ నుంచి నెటిజన్లకు తిరిగి సమాధానం వచ్చింది. వాస్తవంగా కస్టమర్స్ కోసం చేసేటప్పుడు చాలా హైజీన్ పాటిస్తామని తెలిపారు. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్ కాబట్టి అలా కనిపించారని తెలిపారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, అవి చాలా హైజిన్గా మెయింటైన్ చేస్తామని ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని వారు చెప్పారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) -
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
-
Ram Charan Photos: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు)
-
గుండుతో క్లీంకార.. ఏనుగుతో చిల్ అవుతోన్న గ్లోబల్ స్టార్!
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రంలో కియారా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల వైజాగ్లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం దొరకడంతో ఫుల్గా చిల్ అవుతున్నారు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్కు వెళ్లారు. ఈ సమ్మర్ వేకేషన్లో తన ముద్దుల కూతురు క్లీంకారతో ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన కలిసి గున్న ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. అంతే కాకుండా వారితో క్లీంకార కూడా ఫోటోలో కనిపించింది. అయితే ఇందులో క్లీంకార గుండు చేయించుకుని కనిపించింది. 'థ్యాంక్యూ నాన్న.. ఇది ఒక అద్భుతమైన అనుభవం.. ఏనుగుల సంరక్షణ క్యాంప్లో చాలా నేర్చుకున్నా' అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. Thank you, Mr. C/Naana, for an incredible experience. Learned so much at the elephant rescue camp. ❤️🐘#bestdad @AlwaysRamCharan pic.twitter.com/eBt6JpdCX7 — Upasana Konidela (@upasanakonidela) April 7, 2024 -
రామ్చరణ్ బర్త్డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
-
తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్ , ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో పాటు తిరుమల చేరుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ముద్దల కూతురు ఫోటో రివీల్ అయింది. శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడం జరిగింది. అది కాస్త అభిమానులకు చేరువ కావడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతేడాది జూన్ 20న జన్మించిన క్లీంకార ఫేస్ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు. కానీ నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by TIRUMALA DEVASTANAM OFFICIAL (@anandanilayam_) -
ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. అవమానం పడ్డ చోటే జెండా పాతాడు
మెగాస్టార్ వారసుడు నేడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. సుమారు 17 ఏళ్ల క్రితం 'చిరుత'గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'గా మారాడు. తన నటనతో 'రంగస్థలం'పై 'రచ్చ' చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'తుఫాన్' క్రియేట్ చేశాడు. అభిమానుల గుండెల్లో 'గోవిందుడు అందరివాడు' అయ్యాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ 'వినయ విధేయ రాముడు' అని అందరితో పిలిపించుకున్నాడు. 'ఎవడు' అయినా సరే తన దారికి అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానంటూ 'ఆర్ఆర్ఆర్'తో గాండ్రించాడు. అలాంటి వాడు ఎవడో తెలుసా..? పాన్ ఇండియా 'మగధీరుడు' రామ్ చరణ్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1985 మార్చి 27న జన్మించిన చరణ్ నేడు గ్లోబల్ స్టార్గా ఎదిగారు. మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలుగా వచ్చారు. కానీ చరణ్ చాలా ప్రత్యేకం. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వ్యక్తిత్వం కలిగిన హీరో. ఉపాసనతో పెళ్లికి ముందు రామ్ చరణ్ వేరు. పెళ్లి తరువాత రామ్ చరణ్ వేరు. టాలీవుడ్లో వేలు ఎత్తి చూపించుకోని విధమైన ప్రవర్తనను రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తున్న హీరో ఎవరైనా వున్నారా అంటే అది రామ్ చరణ్ నే. మెగాస్టార్ తర్వాత చరణ్ పేరు తప్పక ఉంటుంది మెగాస్టార్ చిరు తర్వాత డ్యాన్స్ బాగా చేసే టాలీవుడ్ హీరోలు ఎవరు..? అని ఎవరినైనా అడిగితే వారు చెప్పే జాబితాలో చరణ్ గ్యారెంటీగా ఉంటుంది. చిన్నప్పుడు డ్యాన్స్కు దూరంగా ఉండే చరణ్ ఇప్పుడు తన టాలెంట్తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నాడు. అయితే, తన తండ్రి చిరంజీవి మంచి డ్యాన్సర్ కాబట్టి కుమారుడు 'అదుర్స్ అనిపించేలా చేస్తే బాగుణ్ను' అని అనుకునేవారు. చరణ్ డ్యాన్స్ చేస్తాడా, లేదా? అని అభిమానులు కూడా టెన్షన్ పడేవారు. తండ్రి తన నుంచి ఏం ఆశిస్తున్నారో గ్రహించిన చెర్రీ ఎవరి ట్రైనింగ్ అవసరంలేకుండా తనంతట తానే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన డ్యాన్స్కు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. 'చిరుత' అలా సెట్ అయింది కానీ.. చరణ్ను తన వారసుడిగా దింపే సమయం చిరంజీవికి వచ్చింది. అందుకోసం అల్లుఅరవింద్తో చర్చలు జరిపారు. ఒక స్టార్ డైరెక్టర్ ద్వారా చరణ్ను ఇండిస్ట్రీకి పరిచయం చేయాలని ఆలోచించారు. దాంతో అప్పటికే స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళిని సంప్రదిస్తే.. చరణ్ నటనపై నాకు అవగాహన లేదని, మొదటి సినిమాను ఒక మంచి దర్శకుడితో తెరకెక్కించమని ఆయన సలహా ఇచ్చాడు. కానీ రెండవ సినిమా ఖచ్చితంగా నేనే చేస్తాను అని రాజమౌళి చెప్పారట. దాంతో చిరంజీవి దర్శకుడు పూరీ జగన్నాథ్ని పిలిపించి అసలు విషయం చెప్పడం. ఆపై వెంటనే పూరీ రెండు మూడు కథలను వినిపించగా చివరికి చిరుత స్టోరి ఓకే అయ్యింది. భారీ అంచనాల మధ్య 'చిరుత' 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. మొదటి రోజే దాదాపు ఈ సినిమా రూ.5 కోట్ల షేర్ను సాధించి ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది. సౌత్లో ఒక డెబ్యూ హీరోకు ఆ రేంజ్ కలెక్షన్లు రావడం టాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాతో తన నటనకుగాను చెర్రీ 'స్పెషల్ జ్యూరీ' విభాగంలో 'నంది' అందుకున్నాడు. కానీ కొందరు కావాలనే ఈ సినిమాలో చరణ్ లుక్స్పై విమర్శలు భారీగానే చేశారు. చరణ్కు నటన రాదని, హీరో ఫేస్ కాదని పలువురు క్రిటిక్స్ విమర్శించారు. కేవలం ఈ సినిమా పూరీ టేకింగ్, చిరంజీవి మేనియాతోనే హిట్టయిందని పలువురు అభిప్రాయపడ్డారు. అప్పుడు ఏమాత్రం చరణ్ కుంగిపోలేదు.. విమర్ళలను తీసుకున్నాడు. తనను తాను మార్చుకున్నాడు. 'మగధీర'తో సమాధానం ఇచ్చాడు ఫస్ట్ మూవీ ఓకే.. మరి నెక్ట్స్ ఏంటి? అంటూ చెర్రీ భవిష్యత్తుపై ఇంకొందరు లెక్కలు వేస్తుంటే.. 'మగధీర'తో సమాధామిచ్చాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ సినిమా సుమారు రూ.150 కోట్లు వసూళ్లు (గ్రాస్) చేసి, టాలీవుడ్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. రెండో చిత్రంతోనే అగ్ర కథానాయకుల జాబితాలో చేరిన చరణ్ మూడో ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అదే ‘ఆరెంజ్’. 'ధృవ'తో రూట్ మార్చుకున్నాడు రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ.. ఇలా మళ్లీ కమర్షియల్ ధోరణిలో సాగుతున్న అతను ‘ధృవ’తో రూటు మార్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ’ చరణ్ మార్కెట్ను అమాంతం పెంచింది. ఆ తర్వాత వచ్చిన ‘రంగస్థలం’ ఆయన ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో చరణ్ నటనకు విమర్శకుల సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 130కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. చరణ్ తన నటన, అభినయంతో ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రప్పించాడు. దాని తర్వాత వినయ విధేయ రామ, ఆచార్యతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు చరణ్. అవమానం జరిగిన చోటే జండా పాతాడు బాలీవుడ్లో చరణ్ డెబ్యూగా ‘జాంజీర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో తుఫాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘొర పరాజయాన్ని చవిచూసింది. అంతే కాకుండా బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్ను తీవ్రంగా విమర్శించారు. బిగ్ బీ అమితాబ్ నటించిన జాంజీర్ పేరును చెడగొట్టాడని, చరణ్ది వుడెన్ ఫేస్ అని విమర్శించారు. అలా ఎన్నో విమర్శలు ఎదర్కొని నిలబడ్డాడు. ఎళ్లు గడిచాయి.. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. పక్కా ప్లాన్తో బాలీవుడ్కు తన రేంజ్ ఎంటో ఆర్ఆర్ఆర్తో చూపించాడు. బాలీవుడ్ ఏంటీ..? ఏకంగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు.. టాలీవుడ్ కీర్తిని ప్రపంచానికి చాటేలా చేశాడు. చెర్రీ.. ఎన్టీఆర్తో కలిసి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీసు వద్ద రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని టాలీవుడ్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉన్నా నటన, డ్యాన్స్ విషయంలో చరణ్ అభిమానుల్ని ఎక్కడా నిరుత్సాహపరచలేదని చెప్పొచ్చు. ఇలాంటి స్పీడ్ డ్యాన్సర్కు మరో స్పీడ్ డ్యాన్సర్ (ఎన్టీఆర్) తోడైతే ఎలా ఉంటుందో ‘నాటు నాటు’తో ప్రపంచానికి చూపించారు. వారిద్దరి స్టెప్పులకు ‘ఆస్కార్’ అవార్డు వరించింది. ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ సీన్కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ వచ్చాయి. ఎన్టీఆర్ను చరణ్ కొరడా దెబ్బలు కొట్టే సన్నివేశంలో ఆయన పలికించిన భావాలకు అక్కడి క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు. అలా అవమానం జరిగిన చోటే తన సత్తా ఎంటో రుచి చూపించాడు. -
శ్రీవారి సేవలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు..
-
పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న రామ్ చరణ్ దంపతులు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. పుట్టినరోజు నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉపాసనతో పాటుగా చరణ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వారితోపాటు తన కూతురు క్లిన్ కారను కూడా శ్రీనివాసుడి సన్నిధికి తీసుకుకొచ్చారు. దీంతో ఆలయం వద్ద రామ్చరణ్ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
తిరుమల చేరుకున్న రామ్ చరణ్ దంపతులు.. పోటోలు వైరల్!
-
Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్ని పరిచయం చేసిన రామ్చరణ్.. ఫొటోలు వైరల్
-
'అమ్మా, నాన్నతో తొలిసారి అలా'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్లో జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ లుక్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చెర్రీ డిఫరెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే షూటింగ్కు కాస్తా విరామం లభించండంతో గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యారు. వైజాగ్ సముద్ర తీరాన తన ముద్దుల కూతురు, భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేశారు. క్లీంకారతో ఎత్తుకుని బీచ్లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన ఇన్స్టాలో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది.. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్ను గజమాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఆమెను కలవడం ఆనందంగా ఉంది: ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్లోనే ఉంటోంది. ఇటీవలే అయోధ్యకు వెళ్లిన ఉపాసన కుటుంబం సభ్యులతో కలిసి బాలరామున్ని దర్శించుకున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్కు ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ.. ' ఈరోజు అంతర్గత ప్రపంచశాంతి కోసం హార్ట్పుల్నెస్ గ్లోబల్ మహోత్సవ్ పాల్గొనడం గౌరవంగా ఉంది. ముఖ్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని నా కుమార్తె క్లీంకారతో సహా కలవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా కమలేశ్ దాజీ నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను స్వీకరించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. హార్ట్పుల్నెస్ గ్లోబల్ మహోత్సవ్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో జరిగింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
'ఒక కల నెరవేరిన వేళ'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే అయోధ్య బలరామున్ని దర్శించుకున్నారు. తన తాతయ్య, నానమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆలయం ప్రారంభించాక ఉపాసన తొలిసారి అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!) తాజాగా తన అయోధ్య పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పంచుకుంది. తన కోరిక తీరిందని.. ఒక కల నెరవేరిందని.. ఇదొక అద్భుతమైన.. దివ్యమైన అనుభూతి అని తెలిపింది. నా జీవితంలో మరిచిపోలేని ప్రయాణంలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని రాసుకొచ్చింది. తెల్లవారుజూమున 4 గంటలకు స్వామివారిని దర్శించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Upasana Konidela Photos: కొణిదెలవారి కోడలు ఉపాసన.. ప్రత్యేక క్షణాలు (ఫొటోలు)
-
యూపీ సీఎంతో మెగా కోడలి భేటీ!
మెగా కోడలు ఉపాసన కొణిదెల నేడు అయోధ్య బాలరామున్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన తాతగారు అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డితో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలుసుకున్నారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ‘ది అపోలో స్టోరీ’ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్కు ఆమె అందజేశారు. ఆపోలో హాస్పిటల్స్ నిర్వహణతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించడంలో ఉపాసన పాత్ర కీలకంగా ఉంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుసుకున్న తర్వాత అయోధ్యలో ఆపోలో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థయాత్రలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సెంటర్లోని అధునాతన సేవల గురించి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ఈ సెంటర్లో విస్తృత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవి ప్రాథమిక ప్రథమ చికిత్స నుంచి గుండెపోటు,స్ట్రోక్తో సహా వైద్య అత్యవసర సేవల వరకు ఉన్నాయని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలు,పిల్లలకు 24x7 క్రిటికల్ కేర్ సపోర్ట్తో పాటు ICU బ్యాకప్ కూడా ఉంటుందని వారు చెప్పారు.ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వారు ప్రకటించారు. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ను నిర్మించనున్నారు. ఈ ప్రకటన ప్రకారం, శ్రీరామ్ లల్లా దర్శనానికి వచ్చే యాత్రికులకు కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అయోధ్యను సందర్శించే యాత్రికుల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల అపోలో హాస్పిటల్స్ అచంచలమైన నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమని అపోలో హాస్పిటల్స్ లక్నో ఎండి, సిఇఒ డాక్టర్ మయాంక్ సోమాని అన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
అయోధ్యలో మెగా కోడలు.. బాలరామునికి ప్రత్యేక పూజలు!
మెగా కోడలు, రామ్చరణ్ సతీమణి ఉపాసన అయోధ్య బలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామునికి పూజలు చేశారు. ఆలయంలో దాదాపు 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్ సేవ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలకు తన తాతయ్య, నానమ్మతో సహా కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
మెగా డాటర్కు స్పెషల్ విషెస్.. లావణ్య త్రిపాఠి, ఉపాసన పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురిగా సుస్మిత కొణిదెల అభిమానులకు తెలుసు. టాలీవుడ్లో కాస్ట్యూమ్స్ డిజైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించింది. తక్కువ సినిమాలకే పని చేసినా టాలీవుడ్లో మంచి కాస్ట్యూమ్ డిజైనర్గా పేరు గడించింది. తాజాగా ఇవాళ చిరంజీవి పెద్దకూతురు, మెగా డాటర్ సుస్మిత కొణిదెల బర్త్ డే కావడంతో పలువురు ఇండస్ట్రీ తారలు విషెస్ చెబుతున్నారు. మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే విషెస్ చెబుతూ తమ ఇన్స్టా స్టోరీస్లో ఫోటోలు షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మెగా డాటర్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. -
'రామ్ చరణ్ గారు.. ఈ రోజు ఏం చేస్తున్నారు'.. ఉపాసన వీడియో వైరల్!
మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను ఉపాసన పోస్ట్ చేసింది. ఉమెన్స్ డే స్పెషల్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఏంటి? మన చరణ్ అన్నయ్య ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో ఉపాసన మాట్లాడుతూ..' అత్తమ్మగారు.. ఈ రోజు మీ కిచెన్లో ఏం చేస్తున్నారు? రామ్ చరణ్ గారు మీరు ఏం వంటలు చేస్తున్నారు' అంటూ ఫన్నీగా ప్రశ్నలు అడిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
అత్తమ్మపై మెగా కోడలు ప్రశంసలు.. ఎందుకంటే?
మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సంబంధం లేనప్పటికీ ఎంటర్ప్రెన్యూరర్గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రి ద్వారా మహిళల గతేడాది ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వూలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం. తాజాగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. అత్తమ్మ, చిరంజీవి భార్య సురేఖపై ప్రశంసలు కురిపించింది. ఈ మహిళ దినోత్సవం రోజున 60 ఏళ్లలో మా అత్తమ్మ ఎంటర్ప్రెన్యూరర్గా రాణిస్తోంది. మనదేశంలో చాలామంది అత్తమ్మలు, అమ్మలు బిజినెస్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇష్టమైన వృత్తిలో సాధించిన విజయాలను ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉపాసన పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా..ఇటీవల ఉపాసన నాలెడ్జి సిటీలోని టి–హబ్లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి.. ఆమే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుత కాలంలో ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. This Women’s Day my mother-in-law is making her debut as an entrepreneur in her 60’s 🙌 Imagine how rich our country would be if more athammas & amma’s became entrepreneurs!! Let’s celebrate more women joining the workforce & following their passion https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/05tz4UPBfE — Upasana Konidela (@upasanakonidela) March 8, 2024 -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్రెడ్డి -
కెరీరే కావాలి.. ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఈ పని చేయండి: ఉపాసన
రామ్చరణ్ నీడలో ఉండటం సంతోషంగా ఉందంటోంది ఉపాసన. తన భార్య మంచి ఇల్లాలని, తను చేసే గొప్ప పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయంటున్నాడు రామ్చరణ్. మార్చి 8న ఉమెన్స్ డే. ఈ సందర్భంగా చరణ్ దంపతులు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముందుగా ఉపాసన మాట్లాడుతూ.. 'మా ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు కావడంతో పెళ్లవగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లనిపించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. తనకు నీడగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నాను. పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఆత్మవిశ్వాసంతో పెంచారు మా తాతయ్య స్త్రీ మూర్తులను ఎక్కువగా పూజించేవారు. మా అమ్మవాళ్లను ఎంతో ఆత్మవిశ్వాసంతో పెంచారు. మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఇది స్త్రీ లోకం అని భావించే ఇంట్లో నేను పుట్టిపెరిగాను అని చెప్పుకొచ్చింది. రామ్చరణ్ మాట్లాడుతూ.. ఉపాసన కేవలం నా భార్య కావడం వల్లే గుర్తింపు రాలేదు. తను చేసే మంచి పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. పలు రంగాల్లో తనకు ప్రావీణ్యం ఉంది. ఇంట్లో కుటుంబంతో ఉన్నా లేదా ఏదైనా ప్రాజెక్టుల ద్వారా పలువురికి సేవ చేయాలన్నా ఎంతో నిబద్ధతగా వ్యవహరిస్తుంది. వారసత్వాన్ని ఎంతో అందంగా ముందుకు తీసుకెళ్తుంది అని పేర్కొన్నాడు. ఆలోచనల్లో మార్పు రావాలి పిల్లలు పుట్టగానే చాలామంది ఉద్యోగాలు మానేస్తుంటారు? ఎందుకిలా అన్న ప్రశ్నకు ఉపాసన మాట్లాడుతూ.. ఒకసారి తల్లయ్యాక మునుపటిలా పని చేయడం కత్తిమీద సాములాగే ఉంది. ఎంత ప్రయత్నించినా పని చేయడం కష్టమవుతోంది.. చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ముందు ఈ ఆలోచనా ధోరణి మారాలి. అలాగే కంపెనీల్లో కూడా మహిళలకు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పుచేర్పులు చేయాలి. మెటర్నటీ లీవ్స్.. మహిళలు వారి అవసరాలకు తగ్గట్లు తీసుకునేలా అవకాశం కల్పించాలి. దీని గురించి ఇప్పటికే నేను కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నాను. పిల్లలు తర్వాత అనుకునేవారు.. ముఖ్యమైన విషయం ఏంటంటే? ఆడవాళ్లు వారి ఎగ్స్ను కాపాడుకోవాలి. వాటిని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. జీవితంలో సెటిలవ్వాలి, తర్వాతే పిల్లల కోసం ప్రయత్నిద్దాం అనుకునేవారు వారి ఎగ్స్(అండాలు) దాచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇప్పుడు పిల్లల్ని కనొచ్చు అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ మీకు ఉపయోగపడతాయి. ఈ విధానం మహిళలకే కాదు దేశ పురోగతికి సైతం సాయపడుతుంది. నేను కూడా నా ఎగ్స్ దాచుకున్నాను. కరెక్ట్ సమయమిదే అనిపించినప్పుడే క్లీంకారను కన్నాం' అని తెలిపింది. చదవండి: ప్రీవెడ్డింగ్.. ఖాన్స్ త్రయంతో పాటు రామ్చరణ్కు భారీగానే ముట్టిందా? -
మా అత్తమ్మే నాకు స్ఫూర్తి : రాంచరణ్ సతీమణి ఉపాసన
రాయదుర్గం(హైదరాబాద్): మహిళలు కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తారని, కుటుంబ మనుగడలో వీరి పాత్ర కీలకమని హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన అన్నారు. నాలెడ్జి సిటీలోని టి–హబ్లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి..ఆమే నాకు స్ఫూర్తి’ అని చెప్పారు. ప్రధానంగా నేడు ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. ఎలికో లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ వనితా దాట్ల మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో టి–హబ్ సీఈఓ ఎంశ్రీనివాసరావు, హెచ్ఎస్బీసీ ఎండీ మమతా మాదిరెడ్డి, పూర్వవిద్యార్థుల సంఘం కో¸ûండర్ ఆదితి ఆర్య కోటక్, శిల్పారెడ్డి ప్రసంగించారు. -
ఉపాసన కాళ్లు నొక్కిన రామ్చరణ్.. వీడియో వైరల్
ప్రముఖ బిజినెస్మెన్ ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి ఇంకా నాలుగు నెలల సమయముంది. కానీ అప్పుడే పెళ్లి వేడుకలు మొదలుపెట్టేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా దేశవిదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఆల్రెడీ మొదలైన ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్, పాప్ సింగర్ రిహాన్నా సహా అనేకమంది అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. కునుకు తీసిన భార్య.. బాలీవుడ్ తారలు సైతం గుజరాత్లోని జామ్నగర్లోనే తిష్ట వేశారు. ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమాల కోసం టాలీవుడ్ నుంచి రామ్చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో వీరు జామ్నగర్కు వెళ్లారు. విమానంలో ఉపాసన కునుకు తీస్తుండగా చరణ్ ఆమె కాళ్లు నొక్కుతూ కనిపించాడు. అక్కడే ఉన్నవాళ్లు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా క్షణాల్లో అది వైరల్గా మారింది. అవార్డు ఇచ్చేయాల్సిందే! ఇది చూసిన జనాలు ఇంక ఆలస్యం చేయొద్దు, చరణ్కు బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. భార్యకు సేవ చేయడం చరణ్కు కొత్తేమీ కాదు. ఇంటి పనుల్లో సాయం చేయడం దగ్గరి నుంచి షాపింగ్కు వెళ్తే బ్యాగులు మోయడం వరకు అన్నీ చేస్తుంటాడు. ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని తు.చ తప్పకుండా పాటిస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా కించిత్తు గర్వం లేకుండా భార్యకు సేవ చేస్తున్న చరణ్ను పురుషులంతా ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు మహిళామణులు. 🥹❤️@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/dmGBnk7V5Q — Raees (@RaeesHere_) March 1, 2024 చదవండి: ప్రశాంత్ నీల్ ఇంట్లో జూ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. కారణం ఇదే -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి ఈ ఏడాది జూలైలో పెళ్లి జరగనుంది. రాధిక మర్చంట్తో ఏడడుగులు వేయబోతున్నాడు. అయితే పెళ్లికి ఇంకా చాలా టైముంది. కానీ ముందస్తు పెళ్లి వేడుక మాత్రం అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. గుజరాత్లోని జామ్నగర్ దీనికి వేదికగా నిలిచింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) మార్చి 1-3వ తేదీ వరకు కళ్లు చెదిరే రీతిలో జరిగే ఈ వేడుకకు మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ స్టార్స్ అందరూ దాదాపుగా హాజరు కానున్నారు. ఇకపోతే టాలీవుడ్ నుంచి మాత్రం కేవలం రామ్ చరణ్ దంపతులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ఈవెంట్స్కు హాజరయ్యాడు. అలా ఇప్పుడు అంబానీ ఇంట జరిగే ముందస్తు పెళ్లి వేడుకలో తన భార్య ఉపాసనతో కలిసి కనిపించబోతున్నాడు. శుక్రవారం ఉదయానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఒక్కొక్కరుగా జామ్ నగర్కి చేరుకుంటున్నారు. చరణ్ దంపతులు కూడా ఈ సాయంత్రానికి అక్కడికి చేరుకోవచ్చు. (ఇదీ చదవండి: బిగ్బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా) -
రెండో బిడ్డను కనడానికి రెడీగా ఉన్నా..: ఉపాసన
కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు. కానీ ఇప్పుడు అన్నింటినీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లయినా, పిల్లలయినా ఏదో హడావుడిగా కానివ్వడం లేదు. అందుకు రామ్చరణ్- ఉపాసన దంపతులే ఉదాహరణ. పెళ్లయిన పదేళ్ల తర్వాతే పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. పిల్లల కోసం ఎవరెంత పోరు పెడుతున్నా సరే లెక్క చేయలేదు, ఇదే కరెక్ట్ సమయం అనిపించేంతవరకు వెయిట్ చేశారు. ఆ తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు. అలా గతేడాది క్లీంకారకు జన్మనిచ్చారు. మనల్ని మనమే పట్టించుకోవాలి తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన త్వరలోనే రెండో బిడ్డను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. 'మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. సెకండ్ ప్రెగ్నెన్సీకి రెడీ.. జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయం. నేను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నాను. నా పక్కనున్న మేడమ్ కూడా లేట్గానే పిల్లలు కావాలనుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధపడలేదు. అది నా ఇష్టం. అంతేకాదు, నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఉపాసన మరో శుభవార్త చెప్పబోతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెండో రౌండ్కు రెడీ అంటూ ఓ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఉప్సీ. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: రకుల్ వంతైపోయింది.. నెక్స్ట్ బంగారం హీరోయిన్.. -
మెగా కోడళ్ల నయా బిజినెస్!
మెగాస్టార్ చిరంజీవి సతీమణి పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్లొ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషెష్ చెప్పారు. ఈ క్రమంలో ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు. చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్లు వారి కడుపులను నింపుతుంది. ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా "అత్తమ్మ కిచెన్"ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు. వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు, సంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన, సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా "అత్తమ్మ కిచెన్" నిలుస్తుంది. సురేఖ కొణిదెల పుట్టినరోజున వారు ఈ వెంచర్కు ప్రారంభించారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో (athammaskitchen.com) అందుబాటులో ఉన్నాయి. ఉప్మా,పొంగల్,పులిహార,రసం వంటి ఉత్పత్తులు ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ. 1,099 ఉంది. ఆన్లైన్లో డబ్బు చెల్లించి వాటిని పొందవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయిని వారు తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం మెగాస్టార్ సతీమణి చేసిన రెసిపీని మీరు ఆస్వాదించండి. అత్తమ్మాస్ కిచెన్ గురించి ఏం చెప్పారంటే సురేఖ కొణిదెల పుట్టినరోజున ప్రారంభించారు. ఉపాసన కొణిదెల నేతృత్వంలోని "అత్తమ్మ కిచెన్" ప్రొడక్ట్స్లో, కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో ఉంది. ఈ ప్రొడక్ట్స్ కోసం దిగువ లింక్లను అనుసరించండి: వెబ్సైట్: www.athammaskitchen.com వాట్సప్:http://api.whatsapp.com/send?phone=919866589955&text=Hi ట్విట్టర్:https://twitter.com/athammaskitchen ఇన్ స్టాగ్రాం: https://www.instagram.com/athammaskitchen ఫేస్ బుక్: https://www.facebook.com/people/Athammas-Kitchen View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఉపాసన.. చరణ క్లీంకారం!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. ఉపాసన-రామ్ చరణ్ లవ్ స్టోరీ.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరెంజ్’ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె ఎంటర్ప్రెన్యూరర్గా రాణిస్తున్నారు. తాజాగా ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది. వాలెంటైన్ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా లవ్ సింబల్ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే తన సిస్టర్ అనుశ్ పాల కుటుంబంతో దిగిన పిక్స్ను పంచుకున్నారు. ట్విన్ సిస్టర్స్ను కలిసిన క్లీంకార అంటూ పోస్ట్ చేసింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్గా నటిస్తోంది. ♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW — Upasana Konidela (@upasanakonidela) February 14, 2024 -
ట్విన్ సిస్టర్ను కలిసిన క్లీంకార.. ఉపాసన ట్వీట్ వైరల్
-
ట్విన్ సిస్టర్స్ను కలిసిన మెగా వారసురాలు.. ఫోటో వైరల్!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. పాప జన్మించిన శుభవేళ మెగా ఫ్యామిలీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ దంపతులు ఈ ఫోటోకు పోజులిచ్చారు. ఇందులో ఆమె తన సిస్టర్ అనుశ్ పాల, ఆమె భర్త కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోలో అనుశ్ పాల దంపతులు తమ ట్విన్ డాటర్స్ను చేతుల్లో పట్టుకుని కనిపించారు. వీరంతా కలిసి ఓ ఫంక్షన్లో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ఉపాసన తన ఫోటోను పోస్ట్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. తన ట్వీట్లో రాస్తూ..'మేము అద్భుతమైన ముగ్గురిని మీకు పరిచయం చేస్తున్నా. వీరంతా పవర్ పఫ్ గర్ల్స్. క్లీంకార తన ఇద్దరు సిస్టర్స్ ఆరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరత ఇబ్రహీంలతో కలిసిపోయింది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన మెగాఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. Introducing the awesome threesome - power puff girls🩷 Klinkaara Konidela is joined by her 2 sisters Ayraa Pushpa Ebrahim & Ryka Sucharita Ebrahim pic.twitter.com/ChUodsLuwN — Upasana Konidela (@upasanakonidela) February 12, 2024 -
రాజకీయాలపై కొణిదెల ఉపాసన కామెంట్స్
తమిళ రాజకీయాల్లోకి స్టార్ హీరో విజయ్ అడుగుపెట్టిన సమయం నుంచి చాలా మంది ప్రముఖులు ఇప్పటికే వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ గురించి తాజాగా కొణిదెల ఉపాసన ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తమిళనాడులో ఒక నటుడుగా విజయ్ ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్నారని ఉపాసన అన్నారు. గతంలో కూడా ఆయన మాదిరి చాలామంది చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు ముఖ్యమంత్రులుగా కూడా సేవలు చేశారని ఆమె తెలిపారు. ప్రస్తుతం విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారంటే గొప్ప విషయమే అని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకునే లీడ్ర్ ఎవరున్నా సపోర్ట్ చేయాలనేది తన అభిప్రాయమని.. అలాంటి వారికి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వెనక్కి మాత్రం లాగకూడదని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్లో విజయ్ మంచి రాజకీయనాయకుడు కాగలరని భావిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. కానీ తాను మాత్రం రాజకీయాల్లోకి ఎట్టిపరిస్థితిల్లో రానని ఉపాసన తేల్చి చెప్పారు. ఉపాసన ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్లో ఉంటారు. తన కుటుంబంలో జరిగిన శుభకార్యాలకు సంబంధించిన పలు ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు రామ్ చరణ్తో పాటు గేమ్ ఛేంజర్ సినిమా సెట్స్ నుంచి కూడా ఆమె పలు ఫోటోలు షేర్ చేసుకున్నారు. -
మా తాత బర్త్ డే నాకెంతో ప్రత్యేకం.. వేదికపై ఉపాసన ఎమోషనల్!
భారతీయ వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిన ప్రముఖ వైద్యుడు, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్ సీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్య రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాంటి ప్రతాప్ సీ రెడ్డి తన అపోలో ఆస్పత్రి సేవలను దేశంవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీన ఆయన 91వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన మనవరాలు, రామ్చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్ బుక్ను డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం పట్ల ఎలా అనిపిస్తుందని ఉపాసనను ప్రశ్నించారు. దీనికి ఉపాసన చెప్పిన సమాధానం వైరల్గా మారింది. ఉపాసన మాట్లాడుతూ.. 'మా గ్రాండ్ ఫాదర్ మాత్రమే కాదు.. ఇప్పుడు క్లీంకార గ్రాండ్ ఫాదర్ కూడా పద్మ విభూషణ్ అందుకున్నారు. మా కుటుంబంలో ఇద్దరు ఈ పురస్కారం అందుకోవడం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మా తాత జన్మదినం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజును భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలలు కనే యువ వ్యాపారవేత్తలు, మహిళలతో కలిసి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. వైద్య రంగంలో ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం, ఆయన కలలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తామని' ఉపాసన పేర్కొన్నారు. కాగా.. సినీ రంగంలో చేసిన సేవలకు మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది. అంతకుముందు 2010లో ప్రతాప్ చంద్ర రెడ్డి కూడా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. Happy 91st Birthday Thatha @DrPrathapCReddy The Apollo Story is an emotional tribute to every girl child to dream without boundaries & to every father to support their daughters as equals Thank You @amarchitrkatha @RanaDaggubati for helping us put this together@ApolloFND pic.twitter.com/mPPuUjpbdG — Upasana Konidela (@upasanakonidela) February 5, 2024 -
ఆ విషయంలో చరణ్పై జెలసీ.. ఉపాసన ఇంట్రస్టింగ్ కామెంట్స్
మెగా కోడలు ఉపాసన ఫుల్ సంతోషంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు తన కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణ్లు ఉన్నారు. చిరంజీవికి ఈ మధ్యే పద్మవిభూషణ్ రాగా ఆమె తాతయ్య, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్ సి రెడ్డికి 14 ఏళ్ల క్రితమే ఈ పురస్కారం వరించింది. సోమవారం (ఫిబ్రవరి 5న) ఈయన 91వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చెన్నైలో జన్మదినోత్సవ వేడుక జరిపారు. నేనే ఎక్కువ మాట్లాడుతా ఈ సెలబ్రేషన్స్ వేడుకలో ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్ బుక్ను డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాసన కొందరికి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. చరణ్ వింటూ ఉంటాడు. నేను బయటకు వెళ్లినప్పుడు అతడు క్లీంకారను చూసుకుంటాడు. తను బయటకు వెళ్తే నేను చూసుకుంటాను. జెలసీగా అనిపిస్తుంది ఒక విషయం గురించైతే నాకు మాట్లాడటానికి కూడా ఇష్టం లేదు (నవ్వుతూ). ఆడపిల్లలు నాన్నకూచి అంటుంటారు కదా.. అది నిజం. నా విషయంలోనూ అదే జరిగింది. చరణ్ను చూడగానే క్లీంకార ముఖం వెలిగిపోతుంది. సంతోషంతో కనురెప్పలు ఆడిస్తుంది. అది చూస్తే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. అయితే చరణ్ తనను చాలా కేరింగ్గా చూసుకుంటాడు. అతడు నాకు భర్త మాత్రమే కాదు స్నేహితుడు కూడా! అన్ని విషయాలు నాతో పంచుకుంటాడు. నాతోనే కెమిస్ట్రీ బాగుంటుంది కొన్నిసార్లు అతడి సినిమాల్లో హీరోయిన్తో కలిసి చేసిన సీన్లు చూసినప్పుడు ఏంటిదని అడిగేదాన్ని. ఇది నా వృత్తి. అర్థం చేసుకో.. దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే! అని చెప్పేవాడు. సరేలే అని వదిలేసేదాన్ని. ఏదో సరదాగా అడుగుతా కానీ, అతడు ఏ హీరోయిన్తో నటించినా పట్టించుకోను. హీరోయిన్స్ కన్నా నాతోనే తన కెమిస్ట్రీ బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా చరణ్- ఉపాసనల పెళ్లి 2012లో జరిగింది. గతేడాది వీరు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. లలితా సహస్రనామాల్లో ఒకటైన క్లీంకార అనే పేరును కూతురికి నామకరణం చేశారు. చదవండి: సారాంశ్.. రియల్ లైఫ్ స్టోరీ.. ఒక్కగానొక్క కొడుకు మరణం.. పీక్కుతిన్నారు! -
క్లింకార కేర్ టేకర్ ఎవరో తెలుసా ?
-
అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన
మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. చిరంజీవి కొడుకు రామ్చరణ్ని పెళ్లి చేసుకున్న తర్వాత మెగా ఫ్యాన్స్కి బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఈమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుంటాయి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువని చెప్పొచ్చు. అలాంటిది తాజాగా ఓ బుక్ లాంచ్ సందర్భంగా ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులోనే చరణ్తో బాండింగ్, కూతురు క్లీంకార గురించి పలు సంగతుల్ని చెప్పుకొచ్చింది. అందుకే ఇన్నాళ్లకు.. పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు కదా, ఎలా ఫీలవుతున్నారు? అని అడగ్గా.. 'అందరూ తల్లి కావడం గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నా. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు లాంటి మాటలు నా వరకు వచ్చాయి. ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మేం అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలని అనుకున్నాం. అందుకే ఇన్నేళ్లు పట్టింది' అని ఉపాసన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) చరణ్కి నాకు బౌండ్రీస్ ఇక భర్త చరణ్తో బాండింగ్ గురించి అడగ్గా.. 'రామ్ ఎప్పుడూ కూడా 'ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం' అని అంటుంటాడు. అలానే మేం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం, మా ఇద్దరి మధ్య హద్దులు(బౌండరీస్) కూడా ఉంటాయి. కెరీర్ విషయంలో ఒకరి దానిలో మరొకరం కల్పించుకోం. కానీ వ్యక్తిగత జీవితం విషయానికొచ్చేసరికి మాత్రం ఒక్కటిగా ఉంటాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది. 2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో వీళ్ల జంటపై ట్రోల్స్ వచ్చాయి. కానీ రానురాను ఉపాసన.. మెగా ఫ్యాన్స్కి బాగా సుపరిచితురాలైపోయింది. ఇప్పడు చరణ్ ని ఎంత అభిమానిస్తారో.. ఉపాసనని కూడా మెగా అభిమానులు అంతే అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చెప్పిన మాటలు ఫ్యాన్స్ మధ్య డిస్కషన్కి కారణమయ్యాయి. (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!) -
రామ్ చరణ్ కూతురు కేర్ టేకర్..సావిత్రికి జీవితం ఎంతో తెలిస్తే షాక్..!
-
క్లీంకారకు కేర్ టేకర్గా సావిత్రి.. ఆమె జీతం ఎంతో తెలిస్తే..
రామ్ చరణ్- ఉపాసనల గారాల పట్టి క్లీంకార జన్మించిన సమయం నుంచి మెగాఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అందరూ చెబుతున్న మాట. రామ్ చరణ్ RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కితే తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. మెగా ప్రిన్సెస్ రాకతో వారి కుటుంబంలో ఎప్పుడూ సందడిగానే ఉంది. దీంతో వారి ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతుంటారు. తాజాగా మెగా వారసురాలు అయిన క్లీంకారను చూసుకునేందుకు నానీ (కేర్ టేకర్ లేదా ఆయా)ను నియిమించుకున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమె పేరు సావిత్రి కాగా, గతంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు అయిన తైమూర్కు సావిత్రి కేర్ టేకర్గా పనిచేసింది. ఆపై షాహిద్ కపూర్ ఇంట్లో కూడా ఆమె కేర్ టేకర్గా కొనసాగింది. ఇప్పుడు మెగా ప్రిన్సెస్ అయిన క్లీంకార ఆలనా పాలనా చూసుకునేందుకు సావిత్రిని వారు నియిమించుకున్నారట. చాలా రోజుల క్రితమే రామ్ చరణ్ సొంత ఇంటిని నిర్మించుకుని షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్తో పాటు పలు ప్రాజెక్ట్ల వల్ల ఎప్పుడూ షూటింగ్ బిజీలో ఉంటారు. ఉపాసన కూడా ఆపోలో ఆస్పత్రిలో తన బాధ్యతలను నిర్వర్తించడంలో నిత్యం బిజీగానే ఉంటారు. ఆ సమయంలో క్లీంకార కూడా ఎప్పుడూ ఉపాసన వెంటే ఉంటుంది. దీంతో పాపను చూసుకునేందుకు సావిత్రి అయితే బాగుంటుందని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కూతురి కోసం లక్షలు లక్షలు వెచ్చించి ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారు ఉపాసన. చిన్నపిల్లలను సరిగ్గా అర్థం చేసుకుంటూ వారి ఆలనా పాలనను చూసుకునే సామర్థ్యం సావిత్రిలో ఉందని గతంలో కరీనా కపూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయింది. ప్రస్తుతం క్లీంకారకు కేర్టేకర్గా ఉన్న సావిత్రికి నెలకు లక్షన్నర జీతం ఇస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఒక ఆలయానికి రామ్చరణ్ దంపతులు వెళ్లారు. అప్పుడు ఓ పర్సనల్ పని మీద ముంబై వచ్చారని చరణ్ టీమ్ మెంబర్ ఒకరు తెలిపారు. అప్పుడు సావిత్రి కూడా వారితో ఉండటం గమనించవచ్చు. మరొక కార్యక్రమంలో కూడా క్లీంకారతో ఆమె కనిపించడంతో మెగా వారసురాలికి కేర్ టేకర్గా సావిత్రి ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై రామ్ చరణ్ దంపతులు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
గవర్నర్ను కలిసిన మెగా కోడలు ఉపాసన.. ఎందుకంటే?
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ను మెగా కోడలు ఉపాసన కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల కోసం గవర్నర్ తీసుకుంటున్న చర్యలను ఉపాసన కొనియాడారు. వారి అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్ చేస్తున్న పనులు నా హృదయాన్ని కదిలించాయని అన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ.. ఉపాసన తన ట్విటర్ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Met with the Honorable Tamilisai Soundararajan Garu, the esteemed Governor of Telangana. Getting a deeper understanding of what she is doing for tribal welfare has really touched my heart.❤️ Kudos to u Ma’am, for your remarkable work. 🙏🏼✨@DrTamilisaiGuv #tribalwelfare pic.twitter.com/dUAXqZ5Zi4 — Upasana Konidela (@upasanakonidela) February 1, 2024 -
చిరంజీవికి పద్మవిభూషణ్.. రేర్ ఫోటో షేర్ చేసిన ఉపాసన
టాలీవుడ్ మెగాస్టార్కు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు ఆయనకు దక్కడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఎందరికో దిక్సూచిగా నిలిచారు. ఇప్పటికే ఆయనకు 2006లో పద్మ భూషణ్ అవార్డు వరించింది. తాజాగా ఆయనకు పద్మవిభూషణ్ రావడంతో మెగాస్టార్ కుటుంబ సభ్యులతో పాటు తెలుగు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. తాజాగా ఆయన కోడలు ఉపాసన ఒక ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేస్తూ మరోసారి మెగాస్టార్కు శుభాకాంక్షలు తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్లో చిరంజీవితో పాటు ఐదుగురు మనవరాళ్లుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. అందులో చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పిల్లలు సమారా, సంహితతో పాటుగా శ్రీజ పిల్లలు నివ్రితి, నివిష్క ఉన్నారు. కానీ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార ఫోటోను మాత్రం రివీల్ చేయలేదు. మొఖం స్పష్టంగా కనిపించకుండా బ్లర్ చేసి ఉంచారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు. తన మామయ్య చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ఉపాసన ఇలా తెలిపారు. చిరంజీవి అంటే కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. దాతృత్వంలోనూ ఆయన ముందుంటాడు. జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మాకు స్ఫూర్తిని ఇచ్చాడు. చిరంజీవికి అభినందనలు. చిరుత, పద్మవిభూషణ్తో సత్కరించారని ఉపాసన తెలిపింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Chiranjeevi: మెగాస్టార్కు పద్మ విభూషణ్.. ఉపాసన ట్వీట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు కరోనా, లాక్డౌన్లో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్తో సత్కరించింది. (ఇది చదవండి: మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి) తాజాగా మెగాస్టార్కు పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా కోడలు ఉపాసన హర్షం వ్యక్తం చేసింది. చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. కంగ్రాట్స్ మామయ్య అంటూ పద్మ విభూషణ్కు అవార్డులు పొందిన వారి లిస్ట్ను పోస్ట్ చేసింది.ఇది చూసిన అభిమానులు సైతం మెగాస్టార్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అది నిజమేనంటూ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి 2006లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. Congratulations dearest Mamaya ❤️❤️❤️❤️ @KChiruTweets pic.twitter.com/4AtL1e7mJf — Upasana Konidela (@upasanakonidela) January 25, 2024 -
క్లీంకారపై స్పెషల్ సాంగ్.. విన్నారా?
రామ్చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లైన 11 ఏళ్లకు బుజ్జాయి పుట్టింది. గతేడాది జూన్లో జన్మించిన ఈ పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఇదేదో అల్లాటప్పాగా పెట్టిన పేరు కాదు! లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వెనుక సీక్రెట్ బయటపెట్టాడు. ఇక క్లీంకార పుట్టినప్పటినుంచి మెగా ఫ్యామిలీ ప్రతి పండగను మరింత వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సంక్రాంతిని ఎంతో గ్రాండ్గా జరుపుకున్నారు.హైదరాబాద్లో కాకుండా బెంగళూరులో వేడుకలు జరుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఇదిలా ఉంటే క్లీంకార గురించి ఓ పాట రెడీ చేశారు మెగా ఫ్యాన్స్. దీన్ని సంక్రాంతి కానుకగా ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహవీర్ ఎల్లందర్ కంపోజ్ చేసిన ట్యూన్కు తగ్గట్లుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ రాశాడు. దీన్ని ధనంజయ్ అద్భుతంగా ఆలపించాడు. చదవండి: పెళ్లి తర్వాత భర్తతో హీరోయిన్ సంక్రాంతి వేడుకలు -
మెగా హీరో బర్త్డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!
గతేడాది ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 24న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. కాగా.. ఉప్పెన చిత్రంతో సూపర్హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!) తాజాగా మెగా హీరో 29వసంతంలోకి అడుగుపెట్టారు. జవనరి 13న వైష్ణవ్ తేజ్ బర్త్ డేను మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పాల్గొన్ని సందడి చేశారు. వైష్ణవ్ తేజ్తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సైతం మెగా హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. A heart-warming glimpse of lovely couple Mega Power star @AlwaysRamCharan & @upasanakonidela with #VaisshnavTej from his birthday celebrations 😍#RamCharan #GameChanger #TeluguFilmNagar pic.twitter.com/yyjBwe52JS — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్
మెగా ఫ్యామిలీ అంతా ఈసారి సంక్రాంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోనున్నారు. చరణ్ కూతురికి ఇదే తొలి పండగ కావడంతో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో కాకుండా మరో చోట జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ) గతేడాది జూన్లో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. ఈ పాపకు ఇప్పుడు జరగబోయే సంక్రాంతి ఫస్ట్ టైమ్. కాబట్టి ఈసారి బెంగళూరులోని ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే చరణ్ దంపతులు, అకీరా నందన్ తదితరులు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లోనే షెడ్యూల్ జరుగుతోంది. సంక్రాంతి కాబట్టి చిన్న విరామం తీసుకున్నారు. పండగ ముగిసిన తర్వాత మళ్లీ షూటింగ్ బిజీలో పడిపోతాడు. మరోవైపు చిరు కూడా తన కొత్త మూవీ బిజీలో ఉన్నారు. ఇకపోతే ఈసారి బెంగళూరులో జరిగే సంక్రాంతి వేడుకలకు దాదాపు మెగా హీరోలందరూ కూడా హాజరుకానున్నారని సమాచారం. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) Man Of Masses #RamCharan off 🛫 for Sankranti Occasion with Family ❤️ Visuals from Hyderabad Airport. pic.twitter.com/n0EWvUOFgK — Ujjwal Reddy (@MEHumanTsunaME) January 13, 2024 -
రామ్చరణ్ దంపతులకు ఆయోధ్య ఆహ్వానం
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు, కళాకారులు, సాధువులు హాజరు కానున్నారు. జనవరి 22న జరగబోయే ఈ విశేష కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, ధనుష్.. తదితరులకు ఆహ్వానాలు అందాయి. మొన్న తండ్రికి, ఇప్పుడు తనయుడికి పిలుపు తాజాగా రామ్చరణ్ దంపతులకు అయోధ్య వేడుకకు రమ్మని పిలుపు అందింది. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్.. హైదరాబాద్లోని రామ్చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. మరోవైపు హనుమాన్ చిత్రయూనిట్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది. ఎవరూ ఆకలితో వెళ్లకుండా కాగా అయోధ్యలో జరగనున్న శ్రీరాముని పవిత్రోత్సవానికి వచ్చేవారు ఆకలితో వెనుదిరగకుండా ఉత్సవ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 45 ప్రాంతాల్లో భోజనశాలలు సిద్ధం చేస్తున్నారు. భక్తులకు వివిధ రాష్ట్రాల వంటకాలను అందుబాటులో ఉంచననున్నారు. శ్రీరాముడి కోసం 2.5 కిలోల బంగారు విల్లును సిద్ధం చేస్తున్నారు. విల్లు, బాణాలను రాములవారి విగ్రహానికి అలంకరించనున్నారు. #RamCharan Received the Official Invitation at his Residence for Ram Mandir 🙏🛕pran pratishtha ceremony on Jan 22nd. Jai Shri Ram 🚩@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/U73wamMfMD — Trends RamCharan ™ (@TweetRamCharan) January 12, 2024 చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? -
చరణ్ వెనుక నేను కాదు, నా విజయం వెనుక..
టాలీవుడ్ స్టార్ కపుల్స్లో రామ్చరణ్-ఉపాసన ఒకరు. ఉపాసన షాపింగ్ చేసుకుంటే చరణ్ బ్యాగులు మోయడం.. భర్తకు అవార్డు వస్తుందంటే గర్భంతో ఉన్నా సరే ఉపాసన విదేశాల్లో వాలిపోవడం.. ఇలాంటివి చూసిన జనాలు భార్యాభర్తలంటే ఇలా ఉండాలని అనుకోవడం చాలా మామూలు విషయం. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి ఎంతో విలువిస్తాడు చరణ్. కూతురు పుట్టాక అయితే వీలైనంతవరకు తనతో ఆడుకోవడానికే సమయం కేటాయిస్తున్నాడు. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అటు ఉపాసన సైతం కేవలం గృహిణిగా మిగిలిపోలేదు. అపోలో హాస్పిటల్స్లో కీలక పదవిలో ఉంది. అలాగే బి పాజిటివ్ మ్యాగజైన్కు చీఫ్ ఎడిటర్గానూ వ్యవహరిస్తోంది. ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె చేసే సేవా కార్యక్రమాలకైతే లెక్కే లేదు. ఇలా ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా సరే పర్సనల్ లైఫ్ను మాత్రం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటున్నారు. తాజాగా ఉప్సీ ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టింది. నా విజయం వెనుక.. 'ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అందరూ అంటుంటారు. నేనేమంటానంటే.. ప్రతి మహిళ విజయం వెనుక ఆమెకు అండగా, రక్షణగా నిలబడే ఒక మగవాడు ఉంటాడు' అంటూ రామ్చరణ్ను ట్యాగ్ చేసింది. దీనికి ఇండియా ఫోర్బ్స్ మ్యాగజైన్పై భర్తతో దిగిన ఫోటోను జత చేసింది. ఇందులో ఉప్సీ సోఫాలో కూర్చోగా చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారగా.. భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం, సపోర్ట్ ఇచ్చిపుచ్చుకుంటే ఇలా ఆదర్శ దంపతులుగా నిలుస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. They say, behind every successful man there is a woman. I say, behind every successful woman there is a supportive & secure man. @AlwaysRamCharan @ForbesIndia pic.twitter.com/vtEtjZiedM — Upasana Konidela (@upasanakonidela) December 28, 2023 చదవండి: వెండితెర వెలుగుల రాణి.. సంచలన విషయాన్ని బయటపెట్టింది -
క్రిస్మస్ రోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్చరణ్ భార్యగానే కాకుండా స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటుంది. ఇటీవలె బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. ప్రతీ అకేషన్ను స్పెషల్గా జరుపుకుంటుంది. రీసెంట్గా మెగా ఫ్యామిలి క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. చూడటానికి చాలా సింపుల్గా కనిపించిన ఆ డ్రెస్ ధర లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం.ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింట సెర్చ్ చేయగా, కళ్లు చెదిరే ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.గూసీ బ్రాండ్కు చెందిన రెడ్ కలర్ స్కర్ట్లో తళుక్కున మెరిసింది ఉపాసన. చూడటానికి సింపుల్గా కనిపించిన ఈ డ్రెస్ ధర అక్షరాలా రూ. 3,01,545. దీంతో అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అయినా సెలబ్రిటీలు అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్లో ఉపాసన చాలా క్లాసీ లుక్లో కనిపిస్తున్నారంటూ పొగిడేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
రామ్ చరణ్పై ఉపాసన ప్రశంసలు.. పోస్ట్ వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జోడిగా కనిపించనుంది. అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ ఫ్యామిలీ ఫుల్ టైమ్ గడిపేస్తున్నారు. ఇటీవలే ముంబై వెళ్లిన చెర్రీ దంపతులు శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తొలిసారిగా తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతేకాకుండా మహారాష్ట్ర సీఎంను కలిసి రామ్ చరణ్ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: మనోజ్-మౌనికల కొత్త వ్యాపారం.. నాలుగున్నరేళ్లుగా సీక్రెట్గా..) అయితే ప్రస్తుతం సినీతారలంతా క్రిస్మస్ ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. ఇప్పటికే మెగా కుటుంబసభ్యులంతా కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన- రామ్ చరణ్ సైతం తమ గారాలపట్టి క్లీంకారతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబంతో కలిసి పండుగ జరుపకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. Merry Christmas ❤️❤️❤️@AlwaysRamCharan Best dad 🤗 pic.twitter.com/fKnkZIVQ6z — Upasana Konidela (@upasanakonidela) December 26, 2023 -
‘మహా’ సీఎంను కలిసిన రామ్చరణ్ దంపతులు..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. ఈ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లారు. నగరంలోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లారు. ఈ ఏడాది జూన్ నెలలో ఈ జంటకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు.. వధువు ఎవరంటే?) అయితే ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చెర్రీ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రజల అతిథ్యం, అప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. Dear Honorable Chief Minister Garu, Shrikanth Shinde Garu, and the Vibrant People of Maharashtra, We express our heartfelt gratitude for your exceptional hospitality and warmth.🙏 @CMOMaharashtra pic.twitter.com/8uqTZgpGmM — Upasana Konidela (@upasanakonidela) December 22, 2023 View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
క్లీంకార పుట్టి 6 నెలలు.. ముంబైలో మహాలక్ష్మి గుడికి వెళ్లిన చరణ్ దంపతులు (ఫోటోలు)
-
బిడ్డతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లిన రామ్ చరణ్ దంపతులు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తొలిసారి బిడ్డతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. తమ కుమార్తె క్లీంకారతో కలిసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. (ఇది చదవండి: పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!) ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మెగా దంపతులకు ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామ్చరణ్తో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. (ఇది చదవండి: బిగ్బాస్ రన్నరప్ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే?) -
Ram Charan Diwali Bash: రామ్చరణ్-ఉపాసన ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
మెగాస్టార్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్.. స్టార్ హీరోలంతా ఇక్కడే!
వెలుగులు విరజిమ్మే దీపావళి పండగను మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. కేవలం కుటుంబసభ్యుల మధ్యే కాకుండా ఇండస్ట్రీలోని అత్యంత దగ్గరి స్నేహితులను కూడా పార్టీకి పిలిచారు. ఈ క్రమంలో సూపర్స్టార్ మహేశ్బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేశ్ తమ కుటుంబంతో పార్టీకి విచ్చేసి సందడి చేశారు. క్లీంకార పుట్టాక తొలి దీపావళి క్లీంకార పుట్టిన తర్వాత రామ్చరణ్- ఉపాసన దంపతులు జరుపుకుంటున్న తొలి దీపావళి కావడంతో ఈసారి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఇంట్లో ప్రత్యేక విందు పార్టీ ఇచ్చారు. దీనికోసం స్టార్ హీరోలు కుటుంబసమేతంగా రావడం విశేషం. ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో, మహేశ్ బాబు.. నమ్రతతో కలిసి హాజరయ్యారు. పార్టీలో ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. నలుగురు హీరోలు ఒకేచోట ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నలుగురు హీరోలు ఒకేచోట కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ పార్టీకి మంచు లక్ష్మి సైతం హాజరైంది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే మహేవ్బాబు గుంటూరు కారం, రామ్చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. వెంకటేశ్ సైంధవ్ , ఎన్టీఆర్ దేవర సినిమాలతో బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్.. ఏ సినిమాకో తెలుసా? -
ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. నమ్రత కూడా..
వెలుతురు పోయాక చీకటి వస్తుంది.. చీకటి పోయాక వెలుతురు వస్తుంది. ఇది ప్రతిరోజూ జరిగేదే! కానీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించేందుకు వచ్చేదే దీపావళి పండగ. ఈరోజు పూజలు, పునస్కారాలతో పాటు స్వీట్లు, సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు రోడ్లపై పటాకులు పేలుస్తూ నానా రచ్చ చేస్తుంటారు. అమ్మాయిలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని చూసుకుని మురిసిపోతుంటారు. తర్వాత అందంగా ముస్తాబై దీపావళి వేడుకలు షురూ చేస్తారు. సెలబ్రిటీలైతే మరింత ఘనంగా పండగ జరుపుకుంటారు. మరి ఈ పండగ రోజు(నవంబర్ 12న) తారలు సోషల్ మీడియాలో ఏమేం ఫోటోలు షేర్ చేశారో చూద్దాం.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Krésha (@kreshabajaj) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: కన్నుమూసిన సీనియర్ హీరో.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే.. -
లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు
భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు. పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ. ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది. భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా... అని ఆయన కోపగించుకోలేదు. ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు. నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు. నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఇటలీలో వాలిపోయిన మెగా ఫ్యామిలీ.. క్లీంకార విషయంలో పెద్ద పొరపాటు!
మెగా హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి అంతా సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఈ జంట మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కానున్నారు. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సైతం ఇటలీ చేరుకున్నారు. (ఇది చదవండి: కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!) తాజాగా మెగాస్టార్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్-ఉపాసన తమ ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో మెగా ఫ్యామీలితో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకే ఫోటోలో కనిపించారు. కొణిదెల- కామినేని ఫ్యామిలీ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. క్లీంకార ఫేస్ రివీల్! అయితే ఈ ఫోటోలో నెటిజన్స్ మెగా మనవరాలు క్లీంకార వైపే ఆసక్తి చూపారు. ఆ ఫోటోకు ఓ స్విమ్మింగ్ ఫూల్ ముందు పోజులివ్వడంతో నీటిలో రివర్స్లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్ను ఉపాసన కవర్ చేయలేదు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఉపాసన మేడం.. మీరు క్లీంకార ఫేస్ను నీటిలో కవర్ చేయడం మరిచిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ క్లీంకారను చూసినంత ఆనందంలో మునిగిపోయారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
కూతురితో బతుకమ్మ ఆడిన ఉపాసన, వీడియో వైరల్
తీరొక్క పూలతో చేసే బతుకమ్మ పండగ అంటే ఆడబిడ్డలకు చెప్పలేనంత సంబరం. ఆడపిల్లలకే కాదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండగను వేడుకగా చేసుకుంటారు. నిన్న(అక్టోబర్ 22) సద్దుల బతుకమ్మ.. ఆ రోజు అంతా పెద్ద బతుకమ్మలు చేసి, దాని చుట్టూ చేరి ఆడిన త్వాత వచ్చే ఏడాదికి మళ్లీ రావమ్మా అని సాగనంపారు. బతుకమ్మ సెలబ్రేషన్స్లో మెగా ఫ్యామిలీ సామాన్యులేనా సెలబ్రిటీలు సైతం బతుకమ్మను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈ పండగను రెట్టింపు సంతోషంగా జరుపుకుంది. క్లీంకార పుట్టిన తర్వాత ఇదే తొలి బతుకమ్మ పండగ కావడం విశేషం. సేవ సమాజ్ బాలికా నిలయంలో చిన్నారులతో కలిసి వేడుక చేసుకున్నాఉ. ఉపాసన కూడా వారితో కలిసి బతుకమ్మ ఆడటమే కాకుండా క్లీంకారను ఎత్తుకుని వారితో కలిసి డ్యాన్స్ చేసింది. కుటుంబం బలాన్నిస్తుందంటూ పోస్ట్ 'జనాలు నాకు శక్తినిస్తే, కుటుంబం బలాన్నిస్తుంది. ఎంతో ప్రత్యేకమైన దసరా పండగ రోజు అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన శక్తిని మనలో నింపుకుందాం.. సానుకూల దృక్పథాన్ని పెంచుదాం. మా అమ్మమ్మ ఆచరించే సాంప్రదాయాలను దసరా సజీవంగా ఉంచుతోంది. బాలికా నిలయంలో దసరా వేడుక చేసుకుని సంతోషాన్ని పంచుకున్నాం' అని క్యాప్షన్లో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది. ఈ వీడియోలో చిరంజీవి దంపతులు, రామ్చరణ్, వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: అడివి శేష్ నా ముఖం మీదే అడిగాడు: రానా దగ్గుబాటి -
బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?
ఈ ఏడాది జూన్లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు. బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్ ట్రిప్కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్పోర్ట్లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది. అయితే ఈ జంట ఇటలీ వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!) Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip @AlwaysRamCharan pic.twitter.com/cHmwISRQ1H — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip@AlwaysRamCharan pic.twitter.com/tO4QZwndIq — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 -
Pre-Wedding Party: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
మాల్దీవుల్లో పూజాహెగ్డే.. చెల్లితో ఉపాసన.. బర్త్డే సెలబ్రేషన్స్!
మాల్దీవుల్లో పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ గ్లామర్ టెంపరేచర్ పెంచేస్తున్న మౌనీ రాయ్ బ్లాక్ డ్రస్లో కేక పుట్టిస్తున్న కృతిశెట్టి జిగేలు వెలుగుల్లో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ చీరలో మెరిసిపోతున్న రాధిక అలియాస్ నేహాశెట్టి జిమ్ వర్కౌట్తో హీరోయిన్ కీర్తి సురేశ్ చాలా బిజీ చెల్లి పుట్టినరోజు.. రేర్ పిక్స్ పోస్ట్ చేసిన ఉపాసన View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)