త్రిష కాదు మళ్లీ నయనతారనే | Nayanthara to star in 'Mookuthi Amman 2' | Sakshi
Sakshi News home page

త్రిష కాదు మళ్లీ నయనతారనే

Jul 14 2024 1:26 PM | Updated on Jul 14 2024 1:26 PM

Nayanthara to star in 'Mookuthi Amman 2'

నటి నయనతార క్రేజ్‌ ఇప్పట్లో తగ్గేలాలేదు. లేడీ సూపర్‌స్టార్‌ పట్టం ఈమెను వదిలేలా లేదు. అంతే కాదు ఇంకా బహుభాషా నటిగా ఏలేస్తున్నారీ సంచలన నటి. విషయం, విశేషం ఏదైనా వార్తల్లో ఉండే నటి నయనతార. అది సినిమాలోనైనా కావచ్చు, వ్యక్తిగతంగానైనా కావచ్చు. ఇప్పటికీ తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మళయాళంలో నివిన్‌ బాలీ సరసన డియర్, యష్‌కు జంటగా టాక్సిక్‌ చిత్రాలతో పాటు మన్నాంగట్టి అనే తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు. 

తాజాగా మరో చిత్రానికి సంతకం చేశారు. ఈమె 2020లో దేవతగా ప్రధాన పాత్రను పోషించిన మూక్కుత్తి అమ్మన్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఆర్‌జే.బాలాజీ కీలక పాత్రను పోషించి దర్శకత్వం వహించారు.  కాగా నాలుగేళ్ల తరువాత మూక్కుత్తి అమ్మన్‌ చిత్రానికి సీక్వెల్‌ రూపొందనుంది. కాగా మూక్కుత్తి అమ్మన్‌ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని, దీనికి మాసాణి అమ్మన్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆర్‌జే బాలాజీనే దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. అంతే కాకుండా ఇందులో నయనతార పాత్రలో నటి త్రిష నటించనున్నట్లు ప్రచారం వైరల్‌ అయ్యింది. 

అలాంటిది తాజాగా మూక్తుత్తి అమ్మన్‌ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించనున్నట్లు వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ చిత్ర సంస్థ శనివారం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఇందులో నటి నయనతారనే నాయకిగా నటించనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపోతే ఈ చిత్రం నిర్మాణంలో నయనతార, విఘ్నేశ్‌శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ భాగం కానున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు, చిత్రాన్ని 2025లో తెరపైకి తీసుకువచ్చేలే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి నయనతారను అమ్మవారిగా చూడబోతున్నామన్నమాట.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement