-
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
సౌత్ ఇండియా లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం నయన్,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్కు ఫుల్స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
స్టార్ డైరెక్టర్తో నయనతార కొత్త సినిమా
కోలీవుడ్లో తాజాగా ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గౌతమ్మీనన్ దర్శకత్వంలో నయనతార నటించబోతున్నారన్నదే ఆ వార్త. దక్షిణాదిలో దర్శకుడు గౌతమ్మీనన్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్టైలిష్ దర్శకత్వంలో పేరు గాంచిన 2001లో మిన్నలే (చెలి) అనే చిత్రం ద్వారా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో గౌతమ్మీనన్కు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క (ఘర్షణ), కమలహాసన్ హీరోగా వేట్టైయాడు వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులో ఈయన దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏ మాయ చేశావే' చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా నటి సమంత కెరీర్కు మైలురాయిగా నిలిచింది. కాగా ఈయన దర్శకుడిగా కొనసాగుతూనే నటుడిగాను ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో వైవిధ్య భరిత కథాపాత్రలను పోషిస్తున్నారు. గౌతమ్మీనన్ చివరగా దర్శకత్వం వహించిన చిత్రం వెందు తనిందది కాడు. శింబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధృవనక్షత్రం విడుదల కావాల్సి ఉంది. చిన్న గ్యాప్ తరువాత గౌతమ్మీనన్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో లేడీ సూపర్స్టార్ నయనతార కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఈ క్రేజీ చిత్రంలో మలయాల సూపర్స్టార్ మమ్మట్టి నటించనున్నారని టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇది తమిళ చిత్రమా? లేక మలయాళ చిత్రమా, అది కాకుండా పాన్ ఇండియా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. కాగా నయనతార, మమ్ముట్టి కలిసి 2016లో పుదియ నియమం అనే మలయాళ చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
కుమారునితో స్టార్ హీరోయిన్.. వీడియో పోస్ట్ చేసిన భర్త!
ప్రేమకు చిరునామా అమ్మ. మమతకు మారు పేరు అమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కన్న పిల్లల లాలనలో తరించిపోయోది అమ్మ. నటి నయనతార ఇప్పుడు అలాంటి మాతృత్వ మధుర్యాన్నే ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్గా అగ్రస్థానంలో రాణిస్తున్న నయనతార ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.కాగా, గత 2022లో దర్శకుడు విఘ్నేశ్ శివన్కు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఆరేళ్ల ప్రేమకు నిర్వచనం ఈ పెళ్లి. కాగా అదే ఏడాది అక్టోబర్ నెలలో నయనతార, విఘ్నేశ్ శివన్లు సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్ శివన్లో తమ జీవితంలో రీల్ విషయం, రియల్ విషయం గానీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.తమ పెళ్లి వేడుకను మాత్రం ఒక ఓటీటీ సంస్థకు విక్రయించి వార్తల్లోకి ఎక్కారు. ఇక పుట్టిన రోజు గాని, ఇతర వేడుకలు గాని సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే తమ పిల్లల అన్నప్రాసన వేడుక ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మాతృదినోత్సం సందర్భంగా నటి నయనతార తన చిన్నపిల్లగా మారిపోయారు.వారి ముద్దు మురిపాల్లో మురిసిపోయారు. పిల్లలను భుజాలపై మోస్తూ పరవశించిపోయారు. పిల్లలను లాలించి, మురిపించి అమ్మతనాన్ని అనుభవించారు. వారి చేతులు పట్టుకుని బుడి బుడి అడుగులు వేయిస్తూ ఆనందంతో పరవశించిపోయారు. ఈ వీడియోను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అందులో నయనతారను ఉద్ధేశించి విఘ్నేశ్శివన్ పేర్కొంటూ నువ్వే నా ప్రాణం, నా లోకం అని పేర్కొన్నారు. ఈ వీడియో చాలా క్యూట్గా ఉంది. అమ్మకు కన్నపిల్లల ముందు తన స్థాయి అస్సలు గుర్తుకురాదని ఈ వీడియోతో నయనతార మరోసారి నిరూపించారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
సూపర్ మామ్: తన క్యూటీస్తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
మే 12 ఆదివారం మాతృదినోత్సవ వేడుకలను ప్రపంచంమంతా ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీల దాకా మదర్స్ డేని ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయన తార ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.Happy Mother’s Day👩👦👦to all the Super Moms 😇💝 pic.twitter.com/BxYyOJl0vK— Nayanthara✨ (@NayantharaU) May 12, 2024 సూపర్ మామ్స్ అందరికీ హ్యాపీ మదర్స్డే అంటూ నయన్ తన విషెస్ అందించారు. తన కవల పిల్లలిద్దరితో ఆనందంగా గడుపుతున్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కమెంట్ చేశారు. ఇంకా స్టార్ హీరోయిన్ అలియా తన ఫ్యామిలీతో గడిపిన ఫోటోను షేర్ చేసింది. భర్త రణబీర్ కపూర్, అత్తగారు నీతూ కపూర్ ,తల్లి సోనీ రజ్దాన్,సోదరి షాహీన్ భట్తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.అలాగే కాజల్ అగర్వాల్ కూడా తల్లితో ఉన్న ఒక ఫోటోలు షేర్ చేసి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందించింది. -
నయనతారకు క్రేజీ ఛాన్స్.. భారీగా డిమాండ్ చేస్తోన్న భామ!
జీవితంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అది డబ్బు కావచ్చు ఇంకేదైనా కావ్వవచ్చు. జరిగిన ఏ ఒక్క క్షణం తిరిగి రాదు. అందుకే ఉన్న సమయంలోనే సంపాదించుకోవడం అయినా, అనుభవించడం అయినా. ఈ నగ్న సత్యం బాగా తెలిసిన నటి నయనతార. నటిగా ఆదిలో అవరోధాలను ఎదుర్కొన్నా, తన ప్రతిభ, అంది వచ్చిన అదృష్టంతో ఎదుగుతూ అందలం ఎక్కారు. లేడీ సూపర్ స్టార్గా రాణిస్తున్నా.. మరో పక్క నిర్మాతగా, ఇతర వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా డబ్బెవరికి చేదు అన్న సామెతలా కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదనిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్గా రాణిస్తూనే కథానాయికగా కాకుండా అక్కగా.. చెల్లెలిగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు.ఆ మధ్య ఇమైకా నొడిగళ్ చిత్రంలో నటుడు అధర్వకు అక్కగా.. ఆ తరువాత తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ఇప్పుడు కన్నడ నటుడు యశ్ కు అక్కగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన పాత్రలు ఉండవచ్చు.. అంతకంటే ముఖ్యమైనది డబ్బు. అవును ఇది అక్షరాలా నిజం.లేడీ సూపర్స్టార్ నయనతారకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ చిత్రానికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నాంగట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ములాయంలో నివీన్ బాలి సరసన కథానాయికిగా నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ప్రాముఖ్యత కలిగిన అక్క పాత్ర చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇప్పుడు ఆ పాత్రలో నయనతారను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి నయనతార డబుల్ పారితోషికం అంటే రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
టాక్సిక్లో..?
యశ్ ‘టాక్సిక్’ సినిమాలో నయనతార భాగం కానున్నారా? అంటే అవుననే టాక్ కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ నటి–దర్శకురాలు గీతూ మోహన్దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ, శ్రుతీహాసన్ వంటి స్టార్స్ పేర్లు వినిపించాయి. అలాగే యశ్కు సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం జరిగింది.దీనికి తోడు తాను సౌత్ సినిమా అంగీకరించినట్లు ఆ మధ్య కరీనా స్వయంగా వెల్లడించారు. అది ‘టాక్సిక్’ సినిమానే అనే ప్రచారం సాగింది. అయితే తాజాగా షూటింగ్ కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి కరీనా కపూర్ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్లేస్లో నయనతారను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. 2010లో ఉపేంద్ర నటించిన ‘సూపర్’ కన్నడలో నయనతారకు తొలి సినిమా. వార్తల్లో ఉన్న ప్రకారం నయనతార ‘టాక్సిక్’ సినిమా చేస్తే.. పద్నాలుగేళ్ల తర్వాత ఆమె కన్నడ సినిమా చేసినట్లవుతుంది. -
అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
హీరోయిన్ నయనతార.. తన 'అన్నపూరణి' సినిమా వివాదంలో చిక్కుకోవడంపై మరోసారి నోరు విప్పింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకుంది. కానీ కంటెంట్ విషయంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని కామెంట్స్ రావడంతో నెట్ఫ్లిక్స్.. ఈ చిత్రాన్ని పూర్తిగా ఓటీటీ నుంచే తీసేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నయన్.. మరోవైపు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. గతేడాది రిలీజైన 'అన్నపూరణి' మూవీ ఫ్లాఫ్ కావడం, వివాదాల్లో ఇరుక్కోవడం నయనతార జీర్ణించుకోలేకపోయింది. ఇప్పటివరకు ఈ మూవీ వివాదంపై నోరు మెదపని ఈమె.. ఇటీవల ఒక వేదికపై స్పందించింది. సమాజంలోని అసమానతలను అధిగమించి సక్సెస్ అయ్యే కథా పాత్రల్లో నటించడం, మనఃస్ఫూర్తిగా ఎంపిక చేసుకోవడం తన బాధ్యత అని చెప్పింది. అలానే మహిళల గొంతుగా ప్రతిబింబించాలని తాను అనుకుంటున్నట్లు పేర్కొంది.నిజానికి నయనతార జీవితం చాలామంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఎన్నో ఆటంకాలను, ఇబ్బందుల్ని అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరుకుంది. 40కి దగ్గరవుతున్నప్పటికీ హీరోయిన్గా హిట్లు కొడుతోంది. ప్రస్తుతం తమిళంలో మన్నాంగట్టి సిన్స్ 1960, టెస్ట్ సినిమాల్లో నటిస్తోంది. 'జవాన్' లాంటి హిట్ తర్వాత హిందీలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్) -
నిమిషానికి రూ.1 కోటి సంపాదిస్తున్న బ్యూటీ.. త్రిష, నయనతార కాదండోయ్ (ఫోటోలు)
-
Nayanthara-Vignesh: బ్రేకప్ రూమర్స్ తర్వాత మరో ఫోటో షూట్.. ట్రెండింగ్లో నయనతార ఫోటోలు
-
నయన్కు మరో క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్!
దక్షిణాదిలో లేడీ సూపర్స్టార్ నయనతార మరో బాలీవుడ్ చిత్రానికి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్ చేస్తునే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకై క నటి నయన్. దక్షిణాదిలో సూపర్స్టార్గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్ సూపర్హిట్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్ను పూర్తి చేశారు. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. దర్శకుడు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యాన్ లోల్డన్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్ను పూర్తి చేశారట. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్. నటుడు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జవాన్ చిత్రంలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్ను అందుకున్న నయనతారకు అక్కడ మరో సూపర్ అవకాశం వరించినట్లు తాజా సమాచారం. సూపర్ హిట్స్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె నాయకిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. -
లేడీ సూపర్స్టార్ నయన్ లగ్జరీ వాచ్..ధర తెలిస్తే!
లేడీ సూపర్స్టార్ నయనతార భర్త, ట్విన్స్తో కలిసి కొత్త ఏడాది(విషు) వేడుకలను ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచు కోవడంతోపాటు, అందరికి పండుగ శుభాకాంక్షలకు కూడా అందించింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన రోలెక్స్ ఓస్టెర్ ఫ్యాన్స్ను ఎట్రాక్ట్ చేసింది. సమ్మర్ సీజన్లో క్లాసిక్ సమ్మర్ రెడీ యాక్సెసరీరీ జతగా లగ్జరీ వాచ్నుధరించింది. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ లగ్జరీ వస్తువులు కావడం విశేషం. ఇందులో రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్ వాచీ మరీ స్పెషల్. కాటన్ సూట్కు మ్యాచ్ అయ్యేలా లైట్ పింక్ కలర్ డయల్ ఉన్న రోలెక్స్ వాచ్ అతికినట్టు సరిపోయింది. దీని ధర సుమారు రూ. 53 లక్షలట. నయన్ బర్త్డే సందర్బంగా భర్త విఘ్నేష్ శివన్ రూ.2.7 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే షూట్ టైం అంటూ చీరలో అద్భుతమై ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది నయనతార. కాగా నయనతార కరియర్ పరంగా వరుసగా హిట్లతో దూసుకుపోతోంది.అలాగే ఇటీవల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టింది. ఒక కొత్త స్టూడియోను నిర్మిస్తున్న విషయాన్ని న్యూజర్నీ అంటూ ఇటీవల ఇన్స్టాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) அனைவருக்கும் இனிய தமிழ் புத்தாண்டு சித்திரை திருநாள் நல்வாழ்த்துகள் #TamilNew2024 ഏവർക്കും ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ#HappyVishu2024 pic.twitter.com/Wh6MlGu21r — Nayanthara✨ (@NayantharaU) April 15, 2024 -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
నయనతార తీసిన సినిమాకు సీఏఐబీ అవార్డ్
నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ పక్క నటిస్తూనే మరోవైపు భర్తతో కలిసి పలు చిత్రాల్ని నిర్మిస్తోంది. అలానే రౌడీ పిక్చర్స్ పతాకంపై ఇతర సంస్థలు నిర్మించిన చిత్రాలను విడుదల చేస్తోంది. అలా ఇటీవల ఈ సంస్థ విడుదల చేసిన సినిమా 'కూళంగల్'. ఇప్పుడు ఈ చిత్రం మరో అవార్డుని కైవసం చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) గ్రామీణ ప్రజల జీవనాన్ని ఆవిష్కరించే విధంగా దర్శకుడు పీఎస్.వినోద్రాజ్.. ఈ సినిమా తీశారు. అంతా కొత్తవాళ్లు నటించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. పలు అవార్డులు కూడా గెలుచుకుంది. తాజాగా శనివారం సాయంత్రం చైన్నెలోని చైన్నె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సీఏఐబీ-2023 అవార్డుల కార్యక్రమంలో కూళంగల్ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. దీంతో పాటు నటుడు శశికుమార్ కథానాయకుడిగా నటించిన 'అయోతి' కూడా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. కూళంగల్, అయోతి చిత్రాలు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకోవడం తమిళ సినీ పరిశ్రమకే గౌరవం అని ఈ వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) -
తమిళ న్యూ ఇయర్ వేడుకల్లో నయనతార ఫ్యామిలీ.. (ఫోటోలు)
-
లేడీ సూపర్స్టార్కు గట్టి పోటీ.. ఆమె దెబ్బకు మాలీవుడ్కు!
ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. లేడీ సూపర్స్టార్గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైన్నె సుందరి త్రిష నుంటి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో త్రిష కోలీవుడ్లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుతం కోలీవుడ్లో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ ఇదే. నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవల ఈమె నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగట్టి, సెంథిల్కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి. నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు. ఆ తరువాత తెలుగులోనూ స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లుఅర్జున్లతో కలిసి నటించే అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా మలయాళంలోనూ నటిస్తున్నారు. దీంతో నయనతార కూడా మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అలా ఈమె మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్. అల్పోన్స్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు. దీంతో కొంతకాలం మాలీవుడ్కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి డియర్ స్టూడెంట్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో నయనతార టీచర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నటుడు నివిన్ బాలి హీరోగా నటిస్తున్నారు. -
గ్రీన్సిగ్నల్
మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు నయనతార. మలయాళ నటుడు నివిన్ ΄పౌలి నటించనున్న చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్నారామె. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఓ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సందీప్ కుమార్ అండ్ జార్జ్ ఫిలిప్ రాయ్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నివిన్ ΄పౌలికి చెందిన ΄పౌలి జూనియర్ పిక్చర్స్, కర్మ మీడియా నెట్వర్క్ ఎల్ఎల్పీ, రౌడీ పిక్చర్స్ అండ్ అల్ట్రా కలిసి ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రాన్ని నిర్మించనున్నాయి. -
ఆ హీరో వల్లే ఒక్కటైన నయన్-విఘ్నేశ్ (ఫోటోలు)
-
అర్థరాత్రి నడి రోడ్డుపై నయనతార.. వీడియో వైరల్
కొందరు సెలబ్రిటీల చిన్న చిన్న కోరికలు ఆసక్తిగా ఉంటాయి. అలాంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈ లేడీ సూపర్స్టార్ జీవితమే సంచలనం అని చెప్పవచ్చు. అన్నింటికీ మించి మనోధైర్యం నిండుగా ఉన్న నటి. కాకపోతే తన జీవితంలో ఎదురైన అవరోధాలను తట్టుకుని, ఈ స్థాయికి చేరుకునేవారే కాదు. వృత్తిని, వ్యక్తిగతాన్ని చాలెంజ్గా తీసుకుని, అత్యున్నత స్థాయికి చేరుకున్న నటి నయనతార. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, ఇల్లాలిగా, పిల్లలకు తల్లిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈ సంచలన తార ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినా కానీ చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడంలో ఇప్పటికీ వెనుకాడడం లేదు. రెండు దశాబ్ధాలుగా అగ్ర కథానాయకిగా కొనసాగుతున్న ఈ కేరళ భామ తల్లిదండ్రులు ఇప్పటికీ కేరళలోని కొచ్చిలోనే నివసిస్తున్నారన్నది తెలిసిందే. కాగా ఇటీవల తన తండ్రి కురియన్ పుట్టిన రోజు సందర్భంగా నయనతార కుటుంబ సమేతంగా కొచ్చికి వెళ్లారు. కాగా ఇటీవల ఒక రోజు అర్ధరాత్రి భర్తను, పిల్లల్ని వదిలి ఆ సమీపంలోని ఎంజీ రోడ్డుకు వచ్చారు. అంత అవసరం ఏమోచ్చిందంటారా? అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఐస్క్రీమ్ కొట్టుకు వెళ్లి ఐస్క్రీమ్ కొనుక్కొని హాయిగా తినడం మొదలెట్టారు. విశేషం ఏమిటంటే ఆ ప్రాంతంలో నయనతార భారీ కటౌట్ ఒకటి ఉంది. దాన్ని చూస్తూ నయనతార ఐస్క్రీమ్ తిన్నారు. అంతటి సెలబ్రిటీ అర్ధరాత్రి నడిరోడ్డుపై నిలబడి ఐస్క్రీమ్ తింటుంటే ఎవరి కంటా పడకుండా ఉంటుందా? అలా కొందరు అభిమానులు అక్కడికి వచ్చి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నయనతారను విష్ చేశారు. ఈమె కూడా వారితో ముచ్చటించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు అంత రాత్రిపూట ఆమెకు ఐస్క్రీమ్ తినాలని అనిపించడం ఏమిటీ, ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయటకు రావడం ఏమిటీ? అనే ఆశ్చర్యాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 🎥 pic.twitter.com/CdjCKle1bv — Nayanthara✨ (@NayantharaU) April 4, 2024 -
నయన్- విఘ్నేశ్లను కలిపిన స్టార్ హీరో ఎవరంటే?
నయనతార- విఘ్నేశ్ శివన్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే స్టార్ కపుల్. నయనతార హీరోయిన్గా నటించిన నానుమ్ రౌడీ దాన్ (2015) సినిమాకు విఘ్నేశ్ (విక్కీ) దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో నేను రౌడీ అనే టైటిల్ పేరిట రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఉయిర్, ఉలగం అని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులయ్యారు. ఇకపోతే వీరి మధ్య లవ్ పుట్టడానికి ఓ స్టార్ హీరో కారణమంటున్నాడు విక్కీ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్ రౌడీ ధాన్ కథ నయనతారకు చెప్పమని ధనుష్ సరే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. మొదట్లో ఈ స్క్రిప్ట్ నచ్చలేదన్న విజయ్ సేతుపతి నయన్ ఓకే చేసిందనగానే తను కూడా సంతకం చేశాడు. ఈ సినిమా వల్ల నయన్కు ఎక్కువ సమయం కేటాయించాను. తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ప్రేమకు ధనుషే కారణమయ్యాడు' అని చెప్పాడు. నానుమ్ రౌడీ ధాన్ మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. -
తొలిసారి తండ్రి ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరోయిన్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార తాజాగా తన తండ్రి కురియన్ కొడియట్టు పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తన చిన్ననాటి ఫోటోను ఆమె షేర్ చేశారు. అందులో చిన్న వయసులో ఉన్న నయనతారను ఎత్తుకుని కురియన్ ఆడిస్తున్న సందర్భంలో క్లిక్మనిపించిన ఫోటోలా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తన తండ్రి జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు నయనతారా కేరళ వెళ్లింది. అక్కడ తన బంధువులతో కలిసి దిగిన ఫొటోలను కూడా ఆమె పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా రాసుకొచ్చింది. 'నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మై ఫరెవర్ లవ్.. ఐ లవ్యూ అచ్చా(నాన్న) అని నయనతార రాసుకొచ్చింది. ఆపై 'హ్యాపీ బర్త్డే డాడ్, మిస్టర్ కురియన్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆపై తన తండ్రి గురించి నయన్ ఇలా చెప్పింది. 'నేను, మా నాన్న, అమ్మ అందరం కలిసి కూర్చోని మాట్లాడుకోవడం చాలా అరుదు. నేను కుటుంబం- పని రెండింటినీ వేరుగా ఉంచేందుకు ఎక్కువగా ఇష్టపడుతాను. పనిలో రాజీపడకపోవడం, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం, క్రమశిక్షణ... ఇవన్నీ నాకు మా నాన్న కురియన్ నుంచే వచ్చాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నను హీరోగానే చూశాను. మా నాన్న నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. కష్ట సమయంలో ఎలా నిలబడాలో నాన్న నుంచే తెలుసుకున్నాను.' అని తెలిపారు. నయన్ తండ్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారి అని తెలుసా? నయనతార తండ్రి కురియన్ కొడియట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారిగా పనిచేశారు. గత ఐదేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. తనకు కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం వస్తే గనుక.. తన తండ్రిని పూర్తి ఆరోగ్యవంతుడిలా మార్చేయాలని కోరుకుంటానని ఆమె చెప్పింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం తన తండ్రే అని నయనతార చెప్పడం విశేషం. -
రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే!
తమిళసినిమా: నటి త్రిష తన స్నేహితురాలు, లేడీ సూపర్స్టార్ నయనతారను దాటేసి నంబర్వన్ స్థానానికి చేరుకున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు వరకూ దక్షిణాదిలోనే నంబర్వన్ కథానాయకిగా నయనతార వెలుగొందారు. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే నటి త్రిష క్రేజ్ మాత్రమే బాగా పెరిగింది. అంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పకతప్పదు. నటి త్రిష కెరీర్ పొన్నియిన్సెల్వన్ చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి. ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్ పడిపోయింది. ఒక టైమ్లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి. అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది. అందులో నటి ఐశ్వర్యరాయ్ కూడా నటించారు. నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్ చేశారు. రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది. ఆ చిత్రం సూపర్హిట్ అయ్యింది. అంతే త్రిష సెకండ్ ఇన్నింగ్కు ఆ చిత్రంతోనే బీజం పడింది. ఆ తరువాత విజయ్కు జంటగా లియో చిత్రంలో నటించారు. ప్రస్తుతం అజిత్కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్లాల్కు జంటగా రామ్, నివిన్బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్లో కూడా ఒక ప్రత్యేక పాట, కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. కాగా లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు. దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్వన్ స్థానానికి ఎగబాకారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
లోకేష్ కనగరాజ్తో లారెన్స్ సినిమా.. నయన్ ఒప్పుకుంటుందా?
తమిళసినిమా: కోలీవుడ్లో ప్రస్తుతం స్టార్ దర్శకుడు ఎవరంటే ఠక్కున వచ్చే బదులు లోకేష్ కనకరాజ్ అనే. ఈయన చేసింది ఇప్పటికి అక్షరాలా ఐదు చిత్రాలే. అయితే అన్నీ వసూళ్ల వర్షం కురిపించినవే. మా నగరంతో దర్శకుడిగా పరిచయం అయిన ఒక బ్యాంకు ఉద్యోగి లోకేష్ కనకరాజ్. ఈ చిత్రం విజయం సాధించడంతో ఖైదీ చిత్రాన్ని కార్తీ హీరోగా చేశారు. అదీ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చేసిన మాస్టర్ చిత్రం వసూళ్లు కొల్లగొట్టింది. ఆ తరువాత కమలహాసన్ హీరోగా విక్రమ్ 2 చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నమోదైంది. ఇటీవల మరోసారి విజయ్ హీరోగా చేసిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్ల విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇలా స్టెప్ బై స్టెప్ స్టార్ హీరోలతో పని చేస్తున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171 చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా చిత్రంలో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇంతకు ముందెప్పుడూ చూడని రజనీకాంత్ను ఈ చిత్రంలో చూస్తారని దర్శకుడు చెబుతున్నారు. చిత్ర టైటిల్ను ఏప్రిల్ 22వ తేదీన, షూటింగ్ను జూన్ నెలలో మొదలెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే లోకేష్ కనకరాజ్ చాలా మంది దర్శకుల తరహాలో జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్లో తన శిష్యులు, సన్నిహితులతో చిత్రాలు నిర్మిస్తానని చెప్పారు. ఆ విధంగా ఉరియడి చిత్రం ఫేమ్ విజయకుమార్ హీరోగా అబ్బాస్ ఏ.రఘుమాన్ దర్శకత్వం వహించిన ఫైట్ క్లబ్ చిత్రాన్ని గత ఏడాది చివరిలో విడుదల చేశారు. తాజాగా రత్నకుమార్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రత్నకుమార్ ఇంతకు ముందు మేయాదమాన్, ఆడై, కులు కలు వంటి చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా తాజా చిత్రంలో నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఇది హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ తరహా చిత్రాలే లారెన్స్ను హీరోగా నిలబెట్టాయన్నది తెలిసిందే. ఇకపోతే ఇందులో ప్రధాన పాత్రలో నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్ర కథను దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాయడం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నయనతార నటుడు లారెన్స్ సరసన నటించడానికి ఒకే అంటారా? అన్న చర్చ జరుగుతోంది. -
Nayanthara-Vignesh Shivan Photos: భర్తను వదిలి ఉండలేకపోతున్న నయనతార
-
20 రోజులు దూరంగా.. భర్త కోసం అల్లాడిపోయిన నయనతార
కోలీవుడ్లో సంచలన జంట ఎవరైనా ఉన్నారంటే అది నయనతార, విఘ్నేశ్ శివన్నే. వీరు సుదీర్ఘ ప్రేమలో ఉన్న తరువాత పెళ్లికి సిద్ధం అయ్యారు. 2022 జూన్ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. అలాగే సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వారికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. పెళ్లికి ముందు వరకూ పుట్టిన రోజులు, పండుగలు అంటూ ట్రిప్పుకు వెళ్తూ.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేవారు. రాక కోసం ఎదురుచూశాం ఇప్పుడు తమ కవల పిల్లలతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా విదేశానికి వెళ్లిన భర్త విఘ్నేశ్ శివన్ను ఎంతగానో మిస్ అయ్యామంది నయనతార. తాను, తన పిల్లలు అతడి రాకకోసం ఎదురు చూశామని, విఘ్నేశ్ శివన్ తిరిగి వచ్చిన తరువాత ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో తెలుపుతూ ఇన్స్ట్రాగామ్లో ఫోటోలు షేర్ చేసింది. మాటల్లో చెప్పలేం.. విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ఏల్ఐసీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కోసం ఇటీవల సింగపూర్ వెళ్లారు. ఈ చిత్రం సింగపూర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా నయనతార తన ఇన్స్ట్రాగామ్లో '20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. నిన్ను ఎంతో మిస్ అయ్యాం' అని పేర్కొన్నారు. అందులో పిల్లలతో కలిసున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
హీరో డైరెక్షన్లో నటించనున్న స్టార్ హీరోయిన్..!
కోలీవుడ్ నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార పచ్చజెండా ఊపారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుబ్రమణ్యపురం చిత్రం ద్వారా కథానాయకుడు, దర్శకుడిగా పరిచయమైన శశికుమార్ ఆ తరువాత నాడోడిగళ్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో శశికుమార్ హీరోగా స్థిరపడిపోయారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈయన ఈ మధ్య కథానాయకుడిగా నటించిన అయోథి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక నటి నయనతార విషయానికి వస్తే లేడీ సూపర్స్టార్గా ఆమె రాణిస్తున్నారు. ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్లోనూ విజయాన్ని అందుకున్నారు. గతేడాది ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న తన 75వ చిత్రం అన్నపూరణి తీవ్ర నిరాశ పరిచింది. అంతే కాకుండా వివాదాల్లో చిక్కుకుని కేసుల వరకూ వెళ్లి ఓటీటీలో నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా.. నయన్కు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే విజయాలే ముఖం చాటేస్తున్నాయి. ప్రస్తుతం టెస్ట్ అనే క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రంతో పాటు మన్నాంగట్టి అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా తాజాగా నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరలవుతోంది. ఇదీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నయనతార పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి శశికుమార్ దర్శకత్వం మాత్రమే చేయనున్నట్లు.. నటన జోలికి వెళ్లడం లేదని సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement