
నయనతార లీడ్ రోల్లో ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమా ఆరంభమైంది. సుందర్ సి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డా. ఇషారి కె. గణేశ్ నిర్మిస్తున్నారు. కోటి రూపాయలతో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.
‘‘నయనతార నటించిన ‘మూకుత్తి అమ్మన్: పార్ట్ 1’ భారీ విజయం సాధించింది. ఈ మూవీ తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో రిలీజ్ కాగా మంచి స్పందన లభించింది. ‘మూకుత్తి అమ్మన్ 2’ చిత్రం అన్లిమిటెడ్ నవ్వులతో కూడిన ఎగ్జయిటింగ్ కథాంశంతో ఉంటుంది. రూ. 100 కోట్ల బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రం పాన్ ఇండియా ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ మూవీని అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. నిర్మాతలు సునీల్ నారంగ్, సి. కల్యాణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment