-
హీరో లేకుండానే బ్లాక్ బ్లస్టర్: ఏకంగా 800 శాతం లాభాలు
ఏదైనా సినిమా విజయవంతం కావాలంటే దర్శక నిర్మాతలతో పాట ఎలా ఉన్నా హీరోదే కీలక పాత్ర అనేది చాలాకాలంగాకొనసాగుతున్న ట్రెండ్. ఈ ట్రెండ్కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అవుతున్న సినిమాలకు కొదవలేదు. అయితే హీరో లేకుండానే కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు మీ కోసం.. 2010ల మధ్యకాలంలో తమిళం , తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో మహిళా ప్రధాన చిత్రాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క శెట్టి, నయనతార లాంటి హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ నమోదు చేశారు. వీటిల్లోచాలావరకు హిందీతోపాటు, ఇతర భాషలలో కూడా రీమేక్ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్ హిట్ మూవీ ‘కొలమావు కోకిల’. తక్కువ బడ్జెట్తో తెరకెక్కి, తొమ్మిది రెట్లకుపైగా లాభాలను సంపాదించింది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘కొలమావు కోకిల’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై, నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించగా యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే తెలుగులో కోకోకోకిల పేరుతో రీమేక్ అయింది. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే, ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. రూ. 8 కోట్ల బిడ్జెట్తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 800 శాతం లాభపడిన చిత్రంగా రికార్డు దక్కించుకుంది. 2022లో, కొలమావు కోకిల సినిమాను హిందీలో నూతన దర్శకుడు సిద్ధార్థ్ సేన్ రీమేక్ చేశారు. పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిన గుడ్లక్ జెర్రీ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సౌరభ్ సచ్దేవా తదితరులు నటించారు. ఈ చిత్రం థియేటర్స్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. కథ ఏంటంటే.. కోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లిని కాపాడుకుందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ. ఎప్పటిలాగానే కోకిల పాత్రలో నయనతార పెర్పార్మెన్స్ అదరిపోతుంది.భారీ ఫైట్స్, హోరెత్తించే బీజీఎంలు, ఎలివేషన్స్ ఉండవు కానీ తన అమాయకత్వంతోనే విలన్లకు చెక్ చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయన్ను ప్రేమించే వ్యక్తిగా కమెడియన్ యోగిబాబు వినోదం బాగా పండించాడు. వీరిద్దరిపై చిత్రించిన పాట యూట్యూబ్లో ట్రైండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. -
భూమిక, యోగిబాబు 'స్కూల్' మొదలైంది
నటి భూమిక, యోగిబాబు, దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న స్కూల్ చిత్రం బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. క్వాంటమ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆర్కే విద్యాధరన్, మంజు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఆర్ కె విద్యాధరన్ నిర్వహిస్తున్నాడు. బక్స్, శ్యామ్స్ ముఖ్యపాత్రలు పోసిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్యన్ గోవిందరాజన చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా స్కూల్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పాఠశాలలో జరిగే అవినీతి అక్రమాలను ఆవిష్కరించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రం స్కూల్ చిత్రం అని చెప్పారు. విద్యార్థుల దృష్టిలో సమాజంలో జరిగే ఆత్మహత్యలు, ప్రమాదాలు, అన్యాయాలు వంటి పలు ఆసక్తికరమైన సంఘటనతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఇందులో విద్యార్థులను శారీరక రీత్యా పరిశోధించే ప్రధాన అధ్యాపకులుగా నటి భూమిక, విద్యార్థుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించే పాఠశాల ఉపాధ్యాయుడిగా యోగిబాబు నటించారని చెప్పారు. పాఠశాలలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ అంశాలను ఇన్వెస్టిగేషన్ చేసి అధికారిగా దర్శకుడు కేఎస్రవికుమార్ నటించారని తెలిపారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి మొదలవుతుందని దర్శకుడు చెప్పారు. -
కార్తీ, కమల్ ప్రాజెక్ట్లను కాదని కమెడియన్తో సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్
హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారిన దర్శకుడు హెచ్.వినోద్. అజిత్తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ సినిమా అయిన పింక్ చిత్రాన్ని కూడా తమిళ్లో వినోద్ డైరెక్ట్ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్ కమలహాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్.వినోద్ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఆ నటుడి మరణం బాధాకరం.. దర్శకుడి భావోద్వేగం
యోగిబాబు, ఇనయా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం తూక్కుదురై. బాలశరవణన్, సెండ్రాయన్, కుంకి అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఓపెన్ గేట్ పిక్చర్స్ పతాకంపై అన్బు, వినోద్, అరవింద్ కలిసి నిర్మించారు. డేనిస్ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రవివర్మ చాయాగ్రహణం, మనోజ్, కేఎస్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న తూక్కుదురై చిత్రం ఈనెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు డేనిస్ మంజునాథ్ ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు డేనిస్ మంజునాథ్ మాట్లాడుతూ.. నిర్మాత అన్భు, నటుడు మారిముత్తు ఈ చిత్రం కోసం ఆరంభం నుంచి ఎంతగానో శ్రమించారని చెప్పారు. అలాంటిది ఈ రోజు నటుడు మారిముత్తు లేకపోవడం బాధాకరం అన్నారు. ఇది ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేని కుటుంబసమేతంగా జాలీగా చూసి ఆనందించే కథా చిత్రం అని చెప్పారు. ఫిబ్రవరి 9న విడుదల చేయాలని భావించామని అయితే అప్పుడు భారీ చిత్రాలు విడుదల కానుండడంతో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఉత్రా ప్రొడక్షన్స్ అధినేత హరి ఉత్రా పొందారు. తాను ఇప్పటి వరకు విడుదల చేసిన చిత్రాల్లో భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదేనని ఆయన పేర్కొన్నారు. చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా? -
విభిన్నమైన కథాంశంతో వస్తోన్న స్టార్ కమెడియన్..!
నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బోట్. నటి గౌరీ జీ.కిషన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వడివేలు హీరోగా హింసై అరసన్ 23 పులికేసి, విజయ్ హీరోగా పులి, ప్రకాష్ రాజ్, సంతానం, గంజా కరుప్పు ప్రధాన పాత్రలు పోషించిన అరై ఎన్ 305, రాఘవా లారెన్స్ హీరోగా నటించిన ఇరుంబు కోట్టై మురట్టు సింగం వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈ తాజా చిత్రాన్ని భారీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రభా ప్రేమ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోట్ పూర్తిగా వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇది 1940 ప్రాంతంలో చైన్నెలో జపాన్ బాంబులతో దాడి చేసినప్పుడు పదిమంది తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బోట్ ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అందులో నటుడు యోగి బాబు ఒకరిని చెప్పారు. అయితే ఆ బోట్ సముద్ర మధ్యలో ఆగిపోవడం, రంధ్రం పడి నీరు బోట్లోకి రావడం వంటి పలు కష్టాలను ఎదుర్కొంటారన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు. వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. షూటింగ్ ఎక్కువ భాగం సముద్రంలో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు ఇది యాక్షన్, థ్రిల్లింగ్తో కూడిన పొలిటికల్ కామెడీ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం , కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా.. ఈ జిబ్రాన్ సంగీతాన్ని, మాధేష్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. A uniquely intriguing #BOATTeaser that sparks curiosity. It's my pleasure to share this and extend congratulations to the entire crew ! https://t.co/qhgIovhnpJ#ThroughoutInMidSea @chimbu_deven @iYogibabu @Gourayy @Madumkeshprem @GhibranVaibodha @maaliandmaanvi @cde_off pic.twitter.com/OVc9evIXtx — chaitanya akkineni (@chay_akkineni) December 16, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement