Yogi Babu
-
రోడ్డు ప్రమాదంలో స్టార్ నటుడు మృతి అంటూ ప్రచారం
చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్గా రాణిస్తున్న యోగిబాబు రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కొంత సమయం క్రితం సోషల్మీడియా ద్వారా ఒక పోస్ట్ ద్వారా ఆయన వివరణ ఇచ్చారు. యోగిబాబు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కల్పిత వార్తల పట్ల తాను చింతిస్తున్నట్లు యోగిబాబు తెలిపారు.చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు యోగిబాబు మరణించారని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే నెట్టింట ట్రెండ్ అయిపోయింది. దీంతో యోగి బాబు తన ఎక్స్ పేజీలో వివరణ ఇస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. 'నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కానీ, ఆ కారులో ఉన్నది నేను కాదు. కనీసం నా సహాయకుడు కూడా ఆ కారులో ప్రయాణించలేదు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. మీ దృష్టికి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుపుతున్నాను. తప్పుడు వార్తల వల్ల నా స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు, పత్రికాధిపతులు వంటి అనేకమంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. నా క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. నా పట్ల వారు చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.' అని ఆయన తెలిపారు.Im fine all. This is false news pic.twitter.com/EwO3MB3T2Q— Yogi Babu (@iYogiBabu) February 16, 2025 -
OTT: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్నటీనటులు: యోగిబాబు, వాణి భోజన్, చంద్రన్, నితిన్ సత్య, దీపా శంకర్, తదితరులుదర్శకత్వం: రాధామోహన్ఓటీటీ: హాట్ స్టార్వేడుకేదైనా, వేదికేదైనా, సందర్భం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా మనిషికి ఎప్పటికీ తృప్తినిచ్చేది రుచికరమైన వంటలు. లేచీ లేవగానే కాఫీ టీ ల దగ్గర నుండి రాత్రి పడుకోబోయేముందు డెజర్ట్ వరకు మనం తినే ప్రతి పదార్ధానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది మరి. తినే పదార్థాల మార్కెట్ అన్ని రంగాలలో విరివిగా వుంది. ఆ కోవలేనే హాట్ స్టార్ వేదికగా ఇటీవల ఓ సిరీస్ విడుదలైంది. దాని పేరే చట్నీ సాంబార్. మనం రోజూ విరివిగా వాడే పదాలు ఇవి. చట్నీ సాంబార్ రుచిలో ఎంత బాగుంటాయో ఈ సిరీస్ కూడా అదే విధంగా ఉంటుంది.ప్రముఖ దర్శకులు రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వర్ధమాన తమిళ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఇక కధాంశానికొస్తే రత్నసామి అనే వ్యక్తి ఊటీలో అముదా కేఫ్ను నడుపుతుంటాడు , ఈ కేఫ్ లో సాంబార్ చాలా ఫేమస్. ఒకరోజు రత్నసామి తీవ్రఅనారోగ్యానికి గురవుతాడు. మరణశయ్యపై, అతను తన తల్లిని వివాహం చేసుకునే ముందు అముద అనే మహిళతో నివసించాడని మరియు ఆమె ద్వారా తనకు ఒక కొడుకు ఉన్నాడని తన కొడుకు కార్తీక్కు వెల్లడిస్తాడు. కార్తీక్ నుండి తన సవతి సోదరుడిని కలుస్తానని వాగ్దానం పొందిన తరువాత, రత్నసామి మరణిస్తాడు. కార్తీక్ సవతి సోదరుడు సచిన్. చెన్నై నగరంలో సచిన్ ఓ దోసెలబండి నడుపుతుంటాడు. అతని దగ్గర చట్నీ ఫేమస్. కార్తీక్ సచిన్ ను కనుగొని, అతనిని ఊటీకి రత్నసామి అంత్యక్రియలు జరపడానకి తీసుకువస్తాడు. ఇంట్లో ఉన్న ఎవరికీ సచిన్ నచ్చడు. మరి ఇంట్లో వారినందరినీ మెప్పించి సచిన్ వచ్చిన పని నెరవేర్చాడా? ఈ దశలో కార్తీక్ మరియు సచిన్ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కున్నారన్న విషయం ఇడ్లీ లేదా దోశలు తింటూ ఈ చట్నీ సాంబార్ ను హాట్ స్టార్ లో చూశేయండి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ ఈ చట్నీ సాంబార్.-ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో ఫుల్ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ యోగిబాబు ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'బూమర్ అంకుల్'. కోలీవుడ్లో మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. స్వదీస్ ఎమ్ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓవియా, రోబో శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది.ఇప్పటి వరకూ తమిళ్లో అందుబాటులో ఉన్న 'బూమర్ అంకుల్' సినిమా తెలుగులో జులై 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు తెలుగు ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బూమర్ అంకుల్ గట్టిగా నవ్విస్తాడంటూ స్ట్రీమింగ్ డేట్ను తమ సోషల్ మీడియా ఖాతాలో ఆహా వెళ్లడించింది. ఇందులో నేసమ్ (యోగిబాబు)- అమీ (ఓవియా) దంపతులుగా కనిపిస్తారు. విదేశీ యువతి అమీతో నేసమ్కు పరిచయం ఏర్పడటం.. ఆపై పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కానీ వారు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు..? విడాకులు కావాలనుకున్న నేసమ్కు తన సతీమణి ఎలాంటి కండీషన్ పెడుతుంది..? వంటి అంశాలను జులై 20న అహాలో చూడండి. -
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్పుల్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
తమ్ముడి ప్రేమ కోసం యువతి కుటుంబాన్ని ఒప్పించిన యోగి బాబు
తమిళ చిత్రసీమలో చాలా కష్టపడి విజయం సాధించిన ప్రముఖ హాస్య నటుల్లో యోగి బాబు ఒకరు. కమెడియన్ గానే కాకుండా కథానాయకుడిగా పలు చిత్రాల్లో రాణిస్తున్నాడు. తాను కథానాయకుడిగా నటించిన చిత్రాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినా.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే కథానాయకుడిగా నటిస్తానని చెబుతూ ఇతర చిత్రాల్లో హాస్య పాత్రల్లో ఆయన నటిస్తున్నాడు.సినిమా కెరియర్ ప్రారంభంలో ఛాన్స్ల కోసం వెతుకుతున్న సమయంలో భోజనానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఎలాగైనా తన కుటుంబాన్ని మంచి ఉన్నత స్థానంలో ఉంచాలని ఆయన నిరంతరం శ్రమించాడు. తన కలలను నిజం చేసుకున్న యోగిబాబు.. నేడు చెన్నైలోనే చాలా స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాత యోగి బాబు 2020లో భార్గవిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతేడాదే యోగి బాబు తన బిడ్డ మొదటి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు.అయితే, ఈ నేపథ్యంలో యోగి బాబు ఇంట్లో మరో విచిత్రం చోటుచేసుకుంది. నటుడు యోగిబాబు తమ్ముడు విజయన్ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మైసూర్కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. తమిళ చిత్రసీమలో దర్శకుడిగా ఎదగాలని విజయన్ ఉన్నాడు. ఈ క్రమంలో యోగి బాబు కాల్షీట్తో సహా ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయన్ చూసుకునేవాడు. అతడికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం కావడం ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమలో పడటం జరిగింది. అయితే, వీరిద్దరీ సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో పెళ్లిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.దీంతో యోగి బాబు నేరుగా మహిళ కుటుంబీకులను సంప్రదించి వారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. జూన్ 3వ తేదీన యోగి బాబు స్వగ్రామం సెయ్యర్లో వీరి వివాహం చాలా సింపుల్గా రహస్యంగా జరింపించారు. ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ ఫోటోలు ఆయన ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. తమ్ముడి ప్రేమ వివాహాన్న దగ్గరుండి జరిపించిన యోగిబాబును వారందరూ ప్రశంసిస్తున్నారు. -
హీరో లేకుండానే బ్లాక్ బ్లస్టర్: ఏకంగా 800 శాతం లాభాలు
ఏదైనా సినిమా విజయవంతం కావాలంటే దర్శక నిర్మాతలతో పాట ఎలా ఉన్నా హీరోదే కీలక పాత్ర అనేది చాలాకాలంగాకొనసాగుతున్న ట్రెండ్. ఈ ట్రెండ్కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అవుతున్న సినిమాలకు కొదవలేదు. అయితే హీరో లేకుండానే కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు మీ కోసం.. 2010ల మధ్యకాలంలో తమిళం , తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో మహిళా ప్రధాన చిత్రాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క శెట్టి, నయనతార లాంటి హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ నమోదు చేశారు. వీటిల్లోచాలావరకు హిందీతోపాటు, ఇతర భాషలలో కూడా రీమేక్ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్ హిట్ మూవీ ‘కొలమావు కోకిల’. తక్కువ బడ్జెట్తో తెరకెక్కి, తొమ్మిది రెట్లకుపైగా లాభాలను సంపాదించింది. నయనతార టైటిల్ రోల్లో నటించిన ‘కొలమావు కోకిల’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై, నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహించగా యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే తెలుగులో కోకోకోకిల పేరుతో రీమేక్ అయింది. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే, ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. రూ. 8 కోట్ల బిడ్జెట్తో నిర్మితమై, ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 800 శాతం లాభపడిన చిత్రంగా రికార్డు దక్కించుకుంది. 2022లో, కొలమావు కోకిల సినిమాను హిందీలో నూతన దర్శకుడు సిద్ధార్థ్ సేన్ రీమేక్ చేశారు. పంజాబ్ నేపథ్యంలో తెరకెక్కిన గుడ్లక్ జెర్రీ చిత్రంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సౌరభ్ సచ్దేవా తదితరులు నటించారు. ఈ చిత్రం థియేటర్స్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. కథ ఏంటంటే.. కోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లిని కాపాడుకుందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ. ఎప్పటిలాగానే కోకిల పాత్రలో నయనతార పెర్పార్మెన్స్ అదరిపోతుంది.భారీ ఫైట్స్, హోరెత్తించే బీజీఎంలు, ఎలివేషన్స్ ఉండవు కానీ తన అమాయకత్వంతోనే విలన్లకు చెక్ చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయన్ను ప్రేమించే వ్యక్తిగా కమెడియన్ యోగిబాబు వినోదం బాగా పండించాడు. వీరిద్దరిపై చిత్రించిన పాట యూట్యూబ్లో ట్రైండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. -
భూమిక, యోగిబాబు 'స్కూల్' మొదలైంది
నటి భూమిక, యోగిబాబు, దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న స్కూల్ చిత్రం బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. క్వాంటమ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆర్కే విద్యాధరన్, మంజు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఆర్ కె విద్యాధరన్ నిర్వహిస్తున్నాడు. బక్స్, శ్యామ్స్ ముఖ్యపాత్రలు పోసిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్యన్ గోవిందరాజన చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా స్కూల్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పాఠశాలలో జరిగే అవినీతి అక్రమాలను ఆవిష్కరించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రం స్కూల్ చిత్రం అని చెప్పారు. విద్యార్థుల దృష్టిలో సమాజంలో జరిగే ఆత్మహత్యలు, ప్రమాదాలు, అన్యాయాలు వంటి పలు ఆసక్తికరమైన సంఘటనతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఇందులో విద్యార్థులను శారీరక రీత్యా పరిశోధించే ప్రధాన అధ్యాపకులుగా నటి భూమిక, విద్యార్థుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించే పాఠశాల ఉపాధ్యాయుడిగా యోగిబాబు నటించారని చెప్పారు. పాఠశాలలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ అంశాలను ఇన్వెస్టిగేషన్ చేసి అధికారిగా దర్శకుడు కేఎస్రవికుమార్ నటించారని తెలిపారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి మొదలవుతుందని దర్శకుడు చెప్పారు. -
కార్తీ, కమల్ ప్రాజెక్ట్లను కాదని కమెడియన్తో సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్
హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారిన దర్శకుడు హెచ్.వినోద్. అజిత్తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ సినిమా అయిన పింక్ చిత్రాన్ని కూడా తమిళ్లో వినోద్ డైరెక్ట్ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్ కమలహాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్.వినోద్ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఆ నటుడి మరణం బాధాకరం.. దర్శకుడి భావోద్వేగం
యోగిబాబు, ఇనయా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం తూక్కుదురై. బాలశరవణన్, సెండ్రాయన్, కుంకి అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఓపెన్ గేట్ పిక్చర్స్ పతాకంపై అన్బు, వినోద్, అరవింద్ కలిసి నిర్మించారు. డేనిస్ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రవివర్మ చాయాగ్రహణం, మనోజ్, కేఎస్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న తూక్కుదురై చిత్రం ఈనెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు డేనిస్ మంజునాథ్ ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు డేనిస్ మంజునాథ్ మాట్లాడుతూ.. నిర్మాత అన్భు, నటుడు మారిముత్తు ఈ చిత్రం కోసం ఆరంభం నుంచి ఎంతగానో శ్రమించారని చెప్పారు. అలాంటిది ఈ రోజు నటుడు మారిముత్తు లేకపోవడం బాధాకరం అన్నారు. ఇది ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేని కుటుంబసమేతంగా జాలీగా చూసి ఆనందించే కథా చిత్రం అని చెప్పారు. ఫిబ్రవరి 9న విడుదల చేయాలని భావించామని అయితే అప్పుడు భారీ చిత్రాలు విడుదల కానుండడంతో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఉత్రా ప్రొడక్షన్స్ అధినేత హరి ఉత్రా పొందారు. తాను ఇప్పటి వరకు విడుదల చేసిన చిత్రాల్లో భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదేనని ఆయన పేర్కొన్నారు. చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా? -
విభిన్నమైన కథాంశంతో వస్తోన్న స్టార్ కమెడియన్..!
నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బోట్. నటి గౌరీ జీ.కిషన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వడివేలు హీరోగా హింసై అరసన్ 23 పులికేసి, విజయ్ హీరోగా పులి, ప్రకాష్ రాజ్, సంతానం, గంజా కరుప్పు ప్రధాన పాత్రలు పోషించిన అరై ఎన్ 305, రాఘవా లారెన్స్ హీరోగా నటించిన ఇరుంబు కోట్టై మురట్టు సింగం వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈ తాజా చిత్రాన్ని భారీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రభా ప్రేమ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోట్ పూర్తిగా వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇది 1940 ప్రాంతంలో చైన్నెలో జపాన్ బాంబులతో దాడి చేసినప్పుడు పదిమంది తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బోట్ ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అందులో నటుడు యోగి బాబు ఒకరిని చెప్పారు. అయితే ఆ బోట్ సముద్ర మధ్యలో ఆగిపోవడం, రంధ్రం పడి నీరు బోట్లోకి రావడం వంటి పలు కష్టాలను ఎదుర్కొంటారన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు. వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. షూటింగ్ ఎక్కువ భాగం సముద్రంలో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు ఇది యాక్షన్, థ్రిల్లింగ్తో కూడిన పొలిటికల్ కామెడీ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం , కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా.. ఈ జిబ్రాన్ సంగీతాన్ని, మాధేష్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. A uniquely intriguing #BOATTeaser that sparks curiosity. It's my pleasure to share this and extend congratulations to the entire crew ! https://t.co/qhgIovhnpJ#ThroughoutInMidSea @chimbu_deven @iYogibabu @Gourayy @Madumkeshprem @GhibranVaibodha @maaliandmaanvi @cde_off pic.twitter.com/OVc9evIXtx — chaitanya akkineni (@chay_akkineni) December 16, 2023 -
ఎవరూ ఊహించని పాత్రలో కనిపించనున్న ఐశ్వర్య రాజేష్
టాలీవుడ్,కోలీవుడ్లలో వైవిధ్య కథా పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్. ఈమె హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు. తాజాగా ఎవరూ ఊహించన విధంగా నర్సు అవతారం ఎత్తారు. ఐశ్వర్య రాజేష్ కథానాయకిగా నటిస్తున్న కొత్త చిత్రం తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ద్వారకా ప్రొడక్షన్పై ప్లాసీ కన్నన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సవరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ విశ్వాసం, రజనీకాంత్ 'పెద్దన్న' చిత్రాలకు సంభాషణలు అందించారన్నది గమనార్హం. నటుడు యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, సుమన్రెడ్డి, సంతాన భారతి, అర్జున్ చిదంబరం, భగవతీ పెరుమాళ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి ఇమాన్ సంగీతాన్ని తమిళ్ అళగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఆస్పత్రి నేపథ్యంలో సాగే కామెడీ, థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ నర్సుగా నటిస్తున్నారని చెప్పారు. చిత్రం ఆధ్యంతం వినోదభరితంగా సాగుతూ కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరించేదిగా ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. -
రూమర్స్పై స్పందించిన సంపూర్ణేశ్ బాబు
సంపూర్ణేష్బాబు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా బిగ్బాస్లో కూడా అడుగుపెట్టి బుల్లితెర ద్వారా ప్రతి ఇంటికి పరిచయం అయ్యాడు. తాజాగా సంపూర్ణేష్బాబు కీలక పాత్రలో 'మార్టిన్ లూథర్ కింగ్' అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో సంపూర్ణేష్బాబు రానున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండగా ఇప్పటి వరకు తనపై వస్తున్న రూమర్స్కు ఆయన స్పందించాడు. 'ఇండస్ట్రీలో కొందరు మిమ్మల్ని తొక్కేయడం వల్లే మీరు పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజమేనా?’ అని హోస్ట్ ప్రశ్నించగా అలాంటిదేం లేదని సంపూర్ణేశ్ బాబు తెలిపాడు. తాను అందరితోనూ మంచిగానే ఉంటానని నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదన్నాడు. తనకు అనారోగ్యం వల్ల సినిమాలు చేయడం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అందులో కూడా నిజం లేదని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ‘మార్టిన్ లూథర్ కింగ్’ రిలీజ్ తర్వాత నెలల వ్యవధిలోనే అవి ప్రేక్షకుల ముందుకొస్తాయని తెలిపారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'మండేలా' చిత్రానికి 'మార్టిన్ లూథర్ కింగ్' రీమేక్. పొలిటికల్ సెటైరికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేశ్ మహా, నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. తమిళంలో యోగిబాబు తన నటనతో మండేలా సినిమాను నిలబెట్టాడు. తనదైన కామెడీతో పాటు, ఎమోషనల్ సీన్స్లోనూ చక్కగా నటించాడు. మరి తెలుగులో సంపూర్ణేష్బాబు ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. అక్టోబర్ 27న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. -
స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ యోగిబాబు గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. కోలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరిస్తూనే ఉన్నారు. తాజాగా తన ముద్దుల కూతురు మొదటి బర్త్డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) కోలీవుడ్ సినిమాల్లో యోగిబాబు తనదైన కామెడీతో అభిమానులను సంపాదించుకున్నారు. కమెడియన్గా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవలే రిలీజైన రజినీకాంత్ చిత్రం జైలర్లోనూ మెప్పించారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ జవాన్లో కనిపించారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం అయాలన్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!) -
కమెడియన్ యోగి బాబు కూతురు పుట్టినరోజు వేడుకలకు కదిలొచ్చిన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్కు గోల్డెన్ ఛాన్స్
సంచలన నటి నయనతార మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి మన్నాంగట్టి సిన్స్ 1960 అనే టైటిల్ నిర్ణయించారు. నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్, నరేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ ఎస్.లక్ష్మణ్ కుమార్ భారీఎత్తున నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: Manchu Lakshmi: నాకే అడ్డొస్తావా అంటూ ఒక్కటి ఇచ్చేసిన మంచులక్ష్మి!) ఈ చిత్రం ద్వారా యూట్యూబ్ విక్కీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాగా ఇది ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న 10వ చిత్రం అన్నది గమనార్హం. ఒక యూట్యూబర్కు దర్శకత్వం వహించే అవకాశాన్ని నయనతారా ఇవ్వడంతో ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద సంచలనంగా మారింది. విక్కీ కూడా ఇప్పటికే రెండు చిన్న సినిమాలను తెరకెక్కించాడు. అతనిలోని ప్రతిభను గుర్తించే నయనతారా అవకాశం ఇచ్చారని సమాచారం. కొలమావు కోకిల వంటి విజయవంతమైన చిత్రం తరువాత నయనతార, యోగిబాబు కాంబినేషన్ రూపొందడంతో ఈ మన్నాంగట్టి సిన్స్ 1960 చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్పోస్టర్ను, మోహన్ పోస్టర్ను చిత్ర వర్గాలు విడుదల చేయగా అవి ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చిత్ర షూటింగ్ను త్వరలో ప్రారంభించనున్నట్లు నిర్మాత తెలిపారు. -
అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ.. తాజాగా మరో సినిమా..
ఇప్పుడు తమిళంలో నటుడు యోగిబాబు లేని చిత్రం లేదు..! అన్నట్లు ఉంది అక్కడి పరిస్థితి! స్టార్ హీరోల చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటిస్తూనే మరో పక్క కథానాయకుడిగానూ నటిస్తున్నారు. అలా ఆయన హీరోగా నటించిన చిత్రాలు ఇటీవల వరుసగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవలే యోగిబాబు హీరోగా నటించిన లక్కీమెన్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బూమర్ యాంగిల్, హైకోర్ట్ మహారాజా, వానవన్, రాధామోహన్ దర్శకత్వంలో నటిస్తున్న చట్నీ సాంబార్ మొదలగు అరడజనుకు పైగా చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. తాజాగా యోగిబాబు కథానాయకుడిగా మరో నూతన చిత్రం మంగళవారం తెన్కాశీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీనికి ఆంధ్రా మెస్ జయ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని 23 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ అధినేత సంచయ్ రాఘవన్, రూక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మధు అలెగ్జెండర్ కలిసి నిర్మిస్తున్నారు. వైవిధ్యభరిత కథా కథనాలతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: 13 ఏళ్లుగా ఎంతగానో ప్రేమించాం.. 'మా లక్ష్మీ చనిపోయింది' అంటూ డైరెక్టర్ ట్వీట్.. -
షూటింగ్లకు రాకుండా తిప్పలు పెడుతున్న యోగిబాబు?
నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లక్కీమ్యాన్. నటి రేచ్చల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి నటుడు బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు తాను దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ పానీపూరికి మంచి ఆదరణ లభించిందన్నారు. తాజాగా లక్కీమ్యాన్ చిత్ర కథను నటుడు యోగిబాబుకు చెప్పగా వెంటనే నటించడానికి అంగీకరించారన్నారు. యోగిబాబును ఇండియన్ నటుడు అని చెప్పవచ్చునన్నారు. అంతటి ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ఆయన గురించి ఇటీవల పలు వదంతులు ప్రచారం అవుతున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. యోగిబాబు ఇంటిలో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా, షూటింగ్కు ఇబ్బంది కలుగుతుందని, కష్టాన్ని భరిస్తూనే తమ చిత్రంలో నటించారన్నారు. కాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్ శక్తివేల్కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ చెప్పినట్లుగా ఈ చిత్రం తన జీవితాన్ని తిరిగి చూసుకునేట్లు ఉందన్నారు. ఇంతకు ముందు తాను కొన్ని చిత్రాల్లో నాలుగైదు సన్నివేశాల్లో నటించినా తన పేరును ప్రచారానికి వాడుకోవడం అభిమానులను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. దాని గురించి అడిగితే సమస్యగా మారుతోందన్నారు. తాను షూటింగ్లకు సరిగా రావడం లేదనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. షూటింగ్కు రాకుండా తానెక్కడికి వెళతానన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. తాను కథలను విని కాకుండా వారి కష్టాలను విని నటిస్తున్నానని యోగిబాబు వెల్లడించారు. చదవండి: చిన్నాచితకా పాత్రలకు సైతం కాంప్రమైజ్.. కెరీర్ కోసం నేనూ అడ్జస్ట్ అయ్యా..: నటి -
తెలుగులో ధోని ‘ఎల్జీఎమ్’ వచ్చేస్తుంది
భారత క్రికెటర్ ఎంఎస్ ధోని ‘ఎల్జీఎమ్’తో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించిన ఈ చిత్ర తెలుగు, తమిళంలో ఈ నెల 4న విడుదల కానుంది. తెలుగులో జేపీఆర్ ఫిల్మ్ప్, త్రిపుర ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియాలే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లికి ముందే కాబోయే అత్తగారికి కండీషన్స్ పెట్టిన గడుసరి కోడలుగా ఇవానా కనిపిస్తుంది. లవ్ టుడే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇవానా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటన ఎలా ఉండబోతుందనేది ట్రైలర్లో చిన్న టచ్తో చూపించించారు దర్శకుడు రమేష్ తమిళ్ మణి. ఇక కొడుకు ప్రేమ కోసం కోడలి పెట్టిన కండీషన్స్ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే తల్లి పాత్రలో నదియా నటించారు. ‘‘ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడాలనుకున్న అమ్మాయి కాబోయే అత్తగారి గురించి తెలుసుకునేందుకు ఆమెతో కొద్ది రోజులు జర్నీ చేయాలనుకుంటుంది. ఈ పాయింట్తో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కమెడియన్ యోగి బాబు హీరోగా కొత్త సినిమా..
కథానాయకుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు యోగిబాబు. ఇతడు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వానవన్. ఎడెన్ ప్లిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై థామస్ రెన్ని జార్జ్ నిర్మిస్తున్నాడు. ఈయన గత ఏడాది సాయిపల్లవి నటించిన గార్గి సినిమాకు సహ నిర్మాత అన్న విషయం తెలిసిందే! మలయాళ దర్శకుడు సజన్ కె.సురేంద్రన్ వానవన్కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో యోగిబాబుతో పాటు రమేష్ తిలక్, కాళీ వెంకట్, లక్ష్మీ ప్రియా, చంద్రమౌలి, మాస్టర్ శక్తి రిత్విక్, లవ్ టుడే ప్రార్థన నాదన్, కల్కి రాజా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది ఫీల్గుడ్ ఫాంటసీ చిత్రంగా ఉంటుందని డైరెక్టర్ సజన్ చెప్తున్నారు. అదే సమయంలో యోగిబాబు స్టైల్లో వినోద భరిత సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. అందరినీ అలరించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులందరికీ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర షూటింగ్ మధురై, చైన్నెలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షూటింగ్ చివరి దశకు చేరుకుందన్నారు. కాగా శనివారం యోగిబాబు పుట్టిన రోజు సందర్భంగా వానవన్ చిత్ర టైటిల్ను, మోషన్ పోస్టర్ను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, మావీరన్ చిత్ర దర్శకుడు మడోన్నా అశ్విన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. Here is my next movie first look motion poster of #VAANAVAN Directed by @sajinksofficial 🎬#Edenflicks #ThomasGeorge@thilak_ramesh @LakshmiPriyaaC @Kaaliactor pic.twitter.com/c9SxkxIw9C — Yogi Babu (@iYogiBabu) July 22, 2023 చదవండి: ఇప్పట్లో 'గుంటూరు కారం' కష్టాలు తీరవా..? మహేష్ క్లారిటీ ఇవ్వాల్సిందేనా? -
మూవీ టైటిల్ 'చట్నీ- సాంబార్'.. హీరోగా ప్రముఖ కమెడియన్!
కోలీవుడ్లో ఫేమస్ కమెడియన్ యోగిబాబు ఓ వైపు హాస్య పాత్రలో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన మావీరన్ చిత్రంలో కమెడియన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి చట్నీ సాంబార్ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో నటి వాణి భోజన్ హీరోయిన్గా నటిస్తుండగా.. నితిన్, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. యోగి బాబు ఇప్పటికే ఎస్జే సూర్య, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన బొమ్మై చిత్రం గత నెల 16వ తేదీన విడుదల కాగా.. మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ సంస్థతో కలిసి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. దీనికి అజేష్ సంగీతాన్ని.. ప్రసన్నకుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ను శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకుడు రాధా మోహన్ చిత్రాలు అంటేనే కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి. కాగా ఈ చిత్రం టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. అదే సమయంలో ఇందులో వినోదానికి కొదవ ఉండదు అనిపిస్తుంది. దీంతో ఈ చట్నీ సాంబార్ చిత్రంపై ఆసక్తి నెలకొంది. -
శివ కార్తికేయన్ ‘మహావీరుడు’మూవీ స్టిల్స్
-
రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని
MS Dhoni Hilarious Response Over Yogi Babu Wanting To Join CSK: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఆఫ్ ది ఫీల్డ్ అంతే సరదాగా ఉంటాడు. ఆటలో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకునే తలా.. ప్రస్తుతం సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్తో పెనవేసుకున్న బంధాన్ని మరింత పదిలం చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ రంగంలోకి దిగాడు. లెట్స్ గెట్ మ్యారీడ్ తమ బ్యానర్పై తెరకెక్కిన తొలి సినిమా LGM (Let's Get Married) ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్లో ధోని, అతడి సతీమణి సాక్షి తమ చేతుల మీదుగా ట్రైలర్ను ఆవిష్కరించారు. LGMలో నటించిన హరీశ్ కళ్యాణ్, నదియా, ఇవానా, కమెడియన్ యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎస్కేకు ఆడాలని ఉంది ఈ సందర్భంగా యోగిబాబు తనదైన శైలిలో హాస్యం పండించాడు. అంతేకాదు తనకు చెన్నై సూపర్ కింగ్స్లో భాగం కావాలని ఉందంటూ తన మనసులో ఉన్న కోరికను ధోని ముందు బయటపెట్టాడు. ఇందుకు ధోని కూడా అంతే సరదాగా స్పందించాడు. ‘‘రాయుడు రిటైర్ అయ్యాడు. కాబట్టి సీఎస్కేలో మీకు తప్పకుండా చోటు ఉంటుంది. మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. కానీ మీరిప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా!నేనైతే మీరు ఎల్లప్పుడు జట్టుతో ఉంటూ నిలకడగా ఆడాలని కోరుకుంటా. కానీ వాళ్లు మాత్రం ఫాస్ట్ బౌలింగ్తో మిమ్మల్ని గాయపరుస్తారు మరి జాగ్రత్త’’ అని తలా యోగిబాబుకు బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. రాయుడు అరుదైన ఘనత అంబటి రాయుడు ఐపీఎల్-2023 తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎడిషన్లో చెన్నై టైటిల్ గెలిచి ఏకంగా ఐదోసారి చాంపియన్గా నిలవడంతో రాయుడు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరుసార్లు(ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్కే తరఫున 3) విజేతగా నిలిచిన జట్టులో భాగమైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ముంబై సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా నిలిచాడు. చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా.. -
రెమ్యునరేషన్ తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలకు షాక్!
తమిళనాడులో హీరోలు, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు హీరోలపై మండిపడుతున్నారు. సరైన కథలతో కాకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే ఎలా డేట్లు సర్దుబాటు చేస్తామని అటు నటులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య జరుగుతున్న వివాదంపై తమిళనాడు చిత్రమండలి స్పందించింది. శింబు, ఎస్జే సూర్య, అధర్వ, విశాల్, యోగి బాబు.. ఐదుగురు నటులకు రెడ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఈ నిర్ణయంపై హీరోలు ఏమని స్పందిస్తారో చూడాలి! చదవండి: తనను ఎక్కడ సమాధి చేయాలో ముందే చెప్పిన రాకేశ్ మాస్టర్ -
సాక్షి ధోని నిర్మాతగా లెట్స్ గెట్ మ్యారీడ్.. పోస్టర్ చూశారా?
కుటుంబ నేపథ్యంలో రూపొందే ఫీల్ గుడ్ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి కథా చిత్రమే లెట్స్ గెట్ మ్యారీడ్. సినిమా పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఎల్జీఎం పేరుతో ప్రచారంలో ఉన్న చిత్రం పూర్తి పేరు లెట్స్ గెట్ మ్యారీడ్. ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని సమర్పణలో ఆయన సతీమణి సాక్షి ధోని చిత్ర నిర్మాణం రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. నటుడు హరీష్ కల్యాణ్, నటి నదియ, యువనా, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్రం షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సెకండ్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. చిత్ర షూటింగ్ ప్రణాళిక ప్రకారం పూర్తి చేసినట్లు నిర్మాత సాక్షి ధోని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది మంచి ఫీల్గుడ్ మూవీగా ఉంటుందని చెప్పారు. చక్కని వినోదంతో అనుబంధాలను ఆవిష్కరించే మంచి కుటుంబ కథా చిత్రంగా ఎల్జీఎం చిత్రం ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Presenting the second look poster of #LGM! Get ready to join us on this fun journey. #LGM படத்தின் செகண்ட் லுக் போஸ்டரை வழங்குகிறோம்! இந்த வேடிக்கையான பயணத்தில் எங்களுடன் சேர தயாராகுங்கள்! pic.twitter.com/nR2UydHcWp — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) May 27, 2023 -
కమెడియన్ యోగిబాబు సరసన మరోసారి నయనతార!
నయనతార లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా విజయం సాధించిన చిత్రాలలో కోలమావు కోకిల ఒకటి. ఆమెకు వన్సైడ్ లవర్గా నటుడు యోగిబాబు నటించారు. ఆ చిత్రం ఆయనకు హీరో ఇమేజ్ తెచ్చి పెట్టింది. నయనతార చుట్టూ తిరిగే కథా చిత్రంలో యోగిబాబుది కీలకపాత్ర. 2018లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఒక ముఖ్య అంశానికి హాస్యం జోడించి తెరకెక్కించిన చిత్రం కోలమావు కోకిల. ఈచిత్రంతో దర్శకుడుగా పరిచయమైన నెల్సన్ ఇప్పుడు రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. కాగా నయనతార, యోగిబాబు మళ్లీ కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ఇంతకుముందు కార్తీక్ హీరోగా సర్దార్, శశికుమార్ కథానాయకుడిగా ఆర్జే బాలాజి హీరోగా రన్ బేబీ రన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం ద్వారా విక్కీ అనే నవ దర్శకుడు పరిచయం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్ పైకి వెళ్లనున్నట్లు సినీవర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ఖాన్ సరసన హిందీలో జవాన్ చిత్రంలో నటిస్తున్న నయనతార తర్వాత తన 75వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు అదేవిధంగా వై నాట్ పిక్చర్స్ పతాకంపై శశికాంత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్లతో కలిసి నటించనున్నారు. ఇది కథానాయకుడు ప్రాధాన్యత కలిగిన కథా చిత్రం అని దర్శక నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. వీటితోపాటు మరికొన్ని అవకాశాలు నయనతార కోసం ఎదురుచూస్తున్నాయి. -
పరాక్రమవంతుడు
సూర్య, దిశా పటానీ జంటగా, యోగిబాబు కీలక పాత్రలో శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్లతో కలిసి జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్ను ఖరారు చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ టీజర్ను విడుదల చేశారు. డైరెక్టర్ శివ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సూర్య గంభీరంగా కనిపిస్తారు. ‘కంగువ’ మాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. షూటింగ్ను పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘త్రీడీలో పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషల్లో ‘కంగువ’ టైటిల్ను ఫిక్స్ చేశాం. కంగువ అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంది.. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఉగాదికి రిలీజవుతున్న కాజల్ ఘోస్టీ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఉగాదికి ప్రేక్షకులకు థ్రిల్ని పంచేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టి’. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రాన్ని ‘కోస్టి’ పేరుతో గంగ ఎంటర్టైన్ మెంట్స్ ఈ నెల 22న తెలుగులో విడుదల చేస్తోంది. ‘‘హారర్ కామెడీగా రూపొందిన చిత్రం ‘కోస్టి’. ఇందులో తండ్రి, కుమార్తె మధ్య అనుబంధంతో పాటు థ్రిల్ అంశాలు కూడా ఉన్నాయి. ఆడియన్స్ ఉలిక్కిపడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇన్ స్పెక్టర్ ఆరతి పాత్రలో కాజల్ బాగా నటించారు. గ్యాంగ్స్టర్ దాస్గా దర్శకుడు కేఎస్ రవికుమార్ చేశారు. సామ్ సీఎస్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఉగాదికి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. -
ఉగాదికి భయపెడతానంటున్న కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఉగాదికి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. కాజల్ అగర్వాల్, రాధికా శరత్కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’. ఈ చిత్రం గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెలుగులో విడుదల కానుంది. ‘‘ఘోస్టీ’లో పోలీస్గా, సినిమా హీరోయిన్గా కాజల్ ద్విపాత్రాభినయం చేశారు. ఆత్మలకు, కాజల్ పాత్రలకు సంబంధం ఏంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. ఉగాదికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
స్టార్ కమెడియన్ యోగిబాబుకు ధోని గిఫ్ట్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి అభిమానులెక్కువ. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. అభిమానులన్నా ధోనికి అమితమైన ప్రేమ. తన చర్యతో ఎన్నోసార్లు అభిమానులను సంతోషపెట్టిన దాఖలాలు ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ యోగిబాబుకు కూడా ధోని అంటే విపరీతమైన అభిమానం. ఐపీఎల్లో సీఎస్కే మ్యాచ్లు చెన్నైలో ఉన్నప్పుడల్లా యోగిబాబు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు. కేవలం ధోనిని చూసేందుకే మ్యాచ్లకు వచ్చేవాడు. ధోని ఆటోగ్రాఫ్ కోసం యోగిబాబు ట్రై చేసి విఫలమయ్యాడు. అయితే తాజాగా తాను ఆరాధించే ధోని.. స్వయంగా బ్యాట్పై ఆటోగ్రాఫ్ చేసి యోగిబాబుకు గిఫ్ట్గా ఇవ్వడం అతన్ని సంతోషపెట్టింది. ఆ బ్యాట్పై ''బెస్ట్ విషెస్... యోగిబాబు'' అని రాసి ధోని సంతకం చేశాడు. ధోని ఆటోగ్రాఫ్ విషయాన్ని యోగిబాబు ట్విటర్ వేదికగా గర్వంగా చెప్పుకున్నాడు. ధోని సంతకం ఉన్న బ్యాట్ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ''బ్యాట్ గిఫ్ట్గా ఇచ్చినందుకు థాంక్యూ ధోని సార్.. మీ క్రికెట్ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి.'' అని క్యాప్షన్ జత చేశాడు. ఆ తర్వాత తాను నటిస్తున్న సినిమా టీంతో కలిసి ధోని ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్తో ఫోటోలకు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ధోనికి.. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ 2023 చివరిదని ప్రచారం జరగుతుంది. ఆరంభం నుంచి సీఎస్కేతో పాటే ఉన్న ధోని విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. సీఎస్కేను నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపాడు. గతేడాది ఐపీఎల్లో ధోని తనంతట తానుగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జడేజాకు పగ్గాలు అప్పగించారు. అయితే ఒత్తిడిని భరించలేక జడ్డూ సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో మళ్లీ ధోనినే జట్టును నడిపించాల్సి వచ్చింది. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటికే ధోని తన ఐపీఎల్ ప్రాక్టీస్ను ఆరంభించిన సంగతి తెలిసిందే. తన స్వస్థలమైన రాంచీ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఖాళీగా ఉన్న సమయాల్లో తన వ్యక్తిగత పనులపై కూడా దృష్టి సారించాడు. ఇటీవలే రాంచీ వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్కు ధోని కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. pic.twitter.com/nMuQPVvtw8 — Yogi Babu (@iYogiBabu) February 15, 2023 Direct from #MSDhoni hands which he played in nets . Thankyou @msdhoni sir for the bat .... Always cherished with the - your cricket memory as well as cinematic memory #dhonientertainmentprod1 #sakshidhoni . pic.twitter.com/2iDv2e5aBZ — Yogi Babu (@iYogiBabu) February 15, 2023 చదవండి: 'సర్' అనొద్దు.. అలా పిలవడాన్ని అసహ్యించుకుంటా' -
కమెడియన్ యోగిబాబు ‘లక్కీ మ్యాన్’
తమిళసినిమా: హీరోగా, కమెడియన్గా వరుస పెట్టి చిత్రాలు చేస్తున్న నటుడు యోగిబాబు. తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి లక్కీమ్యాన్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో యోగిబాబు, వీర, రాచర్, రబేకా, అబ్దుల్ లీ, ఆర్ఎస్ శివాజీ, అమిత్ భార్గవ్, సాత్విక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా థింక్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సందీప్ కే విజయ్ చాయాగ్రహణం, సాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ.. ఇది సమాజంలో జరుగుతున్న ఒక ప్రధాన సమస్యను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అదే విధంగా కమర్షియల్ అంశాలతో ఫీల్గుడ్ మూవీగా ఉంటుందని చెప్పారు. అదృష్టవంతుడైన ఒక యువకుడు జీవితంలో అది ఎంతవరకు ఉంటుంది, దానిని నమ్ముకున్న అతని గమ్యం ఎటువైపు సాగుతుంది అన్న ఆసక్తికరమైన అంశాలతో ఉంటుందన్నారు. ఈ పాత్రకు ప్రతిభావంతుడైన నటుడు అవసరమయ్యారని దీంతో నటుడు యోగిబాబు కరెక్ట్గా నప్పుతారని భావించి ఆయన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. చిత్రంలో ఆయనకు స్థాయికి తగ్గట్లుగా వినోదం ఉంటుందని తెలిపారు. చిత్ర షూటింగ్ను చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. కాగా చిత్రం పస్ట్లుక్ పోస్టర్ను సోమవారం విడుదల చేసినట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
LGM: ధోని తొలి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తాజాగా తమ బ్యానర్పై రూపొందబోతున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నదియా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్స్ మ్యారేడ్) - అనే టైటిల్ని ఖరారు చేస్తూ మోక్షన్ పోస్టర్ విడుదల చేశారు. నూతన దర్శకుడు రమేష్ తమిళమణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘మంచి కథల ద్వారా దేశంలోని నలుమూలలో వున్న ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్టైన్మెంట్ లక్ష్యం. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోంది’ అని గతంలో సాక్షి అన్నారు. We're super excited to share, Dhoni Entertainment's first production titled #LGM - #LetsGetMarried! Title look motion poster out now! @msdhoni @SaakshiSRawat @iamharishkalyan @i__ivana_ @HasijaVikas @Ramesharchi @o_viswajith @PradeepERagav pic.twitter.com/uG43T0dIfl — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) January 27, 2023 -
రిలీజ్కు రెడీ అయిన కమెడియన్ యోగిబాబు చిత్రం
ప్రస్తుతం నటుడు యోగిబాబు లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క కథనాయకుడిగానూ బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రాల్లో బొమ్మై నాయకి ఒకటి. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ నీలం ప్రొడక్షన్స్, వారినీ ఫిలిమ్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. కథా, కథనం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ సుందర్ సంగీతాన్ని, అదిశయరాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఇటీవల ఒక పాటను విడుదల చేసినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంలోని మరో పాటను శుక్రవారం విడుదల చేస్తామన్నారు. అదే విధంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బొమ్మై నాయకి చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. చిత్ర కథా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు తెలిపారు. -
శబరిమలైలో కమెడియన్ యోగిబాబు సినిమా ప్రారంభం
తమిళసినిమా: నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సన్నిదానం పో చిత్ర షూటింగ్కు శబరిమలైలో శ్రీకారం చుట్టారు. సర్వదా సినీ గ్యారేజ్, షీమోన్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు మధుసూదన్, షబీర్ బదాన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. యోగిబాబు, ప్రమోద్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ చిత్రానికి రాజీవ్ వైద్య దర్శకత్వం వహిస్తున్నారు. అయ్యప్పమాల ధరించి శబరిమలైకి వెళ్లిన దర్శకుడు, నటి నయనతార భర్త విఘ్నేశ్శివన్ ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. చిత్రం శబరిమలై నేపథ్యంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. శబరిమలై సన్నిధానం, అక్కడ డోలీ మోసే వారు, సన్నిధానంలో ఏర్పాటు చేసిన పోస్టాఫీస్ వంటి పలు అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయని తెలిపారు. -
నిర్మాతపై దుష్పచారం, నటుడు యోగిబాబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు
చిన్న పాత్రల నుంచి కామెడీ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు కథానాయడిగా మారిన నటుడు యోగిబాబు. అయితే తన ప్రవర్తనతో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. కోలీవుడ్లో కొందరు దర్శక-నిర్మాతలు ఈయనపై గుర్రుగా ఉన్నారు. తాజాగా మరో నిర్మాత యోగిబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎనీ టైం మనీ ఫిలిమ్స్ పతాకంపై గిన్నిస్ కిషోర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి నిర్మించిన చిత్రం దాదా. ఇందులో యోగి బాబు, నితిన్ సత్య కథానాయకులుగా, గాయత్రి నాయకిగా నటించారు. మనోబాలా, నాజర్, సింగం ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆర్హెచ్ అశోక్ చాయాగ్రహణను, కార్తీక్ కృష్ణ సంగీతాన్ని అందించారు. వినోదమే ప్రధానంగా రూపొందించిన దాదా చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నై ప్రసాద్ ల్యాబ్లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. చిత్ర దర్శక నిర్మాత గిన్నిస్ కిషోర్ మాట్లాడుతూ.. ఇందులో నటించిన యోగిబాబు చాలా ఇబ్బందులు పెట్టారని, చిత్రంలో తాను నటించింది 4 సన్నివేశాల్లోనే అంటూ, చిత్రాన్ని ఎవరు కొనుగోలు చేయవద్దని బయ్యర్లకు ఫోన్ చేసి మరి దుష్పచారం చేసి తన వ్యాపారానికి దెబ్బ కొట్టారని ఆరోపించారు. యోగిబాబు 4 సన్నివేశాలు నటించారో, 40 సన్నివేశాలు నటించారో చిత్రం చూసిన తర్వాత మీరే చెప్పాలన్నారు. అదే విధంగా చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. తన తదుపరి చిత్రంలో నటించడానికి యోగిబాబుకు అడ్వాన్స్ కూడా ఇచ్చానని, అయితే ఇప్పుడు చిత్రంలో నటించడానికి ఆయన నిరాకరిస్తున్నారని, దీనిపై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన చిత్రంలో నటించకపోతే మరో చిత్రంలో నటించకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు యోగిబాబు తీరును తప్పుబట్టారు. -
జైలర్తో పోరాటం!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. ఇందులో రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్లో జాయిన్ అయ్యారు కన్నడ స్టార్ శివరాజ్కుమార్. ఈ చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, శివరాజ్కుమార్ కాంబినేషన్లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
కమెడియన్ యోగిబాబు హీరోగా ఫాంటసీ కథా చిత్రం
నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటిస్తున్న ఫాంటసీ కథా చిత్రం యానై ముగత్తాన్. ప్రముఖ మలయాళ దర్శకుడు రెజెశ్ మిథిలా ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ ఇది వినోదభరితంగా సాగే ఫాంటసీ కథా చిత్రమని చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ సినిమాలో గణేశ్ అనే పాత్రలో యోగిబాబు నటిస్తున్నారని, అదే పేరుతో ఆటోడ్రైవర్గా నటుడు రమేష్ తిలక్ నటిస్తున్నారని చెప్పారు. వీరిద్దరి జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయని, ఆ తరువాత జరిగే పరిణామాలే చిత్ర కథ అని తెలిపారు. ఇక వీళ్లు నివసిస్తున్న ఇంటి యజమానిగా నటి ఊర్వశి, పాన్ మసాల కొట్టు యజమానిగా నటుడు కరుణాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ఈ సినిమాకు కార్తీ ఎస్.నాయర్ ఛాయాగ్రహణం, భారత్ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. -
పందిపిల్ల ఇతివృత్తంతో కమెడియన్ మూవీ.. థియేటర్లలో సందడి
చెన్నై సినిమా: 'పన్నికుట్టి' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. కొత్త దర్శకుడు అను చరణ్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో కమెడియన్ యోగిబాబు, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషించారు. సమీర్ భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్ పొంది శుక్రవారం (జులై 8) విడుదల చేసింది. వినోదం మేళవించిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. యోగిబాబు కామెడీ పంచ్ డైలాగ్స్కు ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. నటుడు కరుణాకరన్ నటన ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పందిపిల్ల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే కరుణాకరన్ వాటి నుంచి బయటపడేందుకు ఒక స్వామిజీని ఆశ్రయిస్తాడు. ఆయన ఏం చేశాడు? కరుణాకరన్ సమస్యల నుంచి బయటపడ్డాడా? అంశాలకు దర్శకుడు హాస్యాన్ని జోడించి చిత్రాన్ని జనరంజకంగా తీర్చి దిద్దారు. నమ్మకమే జీవితం అనే చక్కని సందేశంతో కూడిన ఈ చిత్రం థియేటర్లలో వినోదాలు విందులో సందడి చేస్తోంది. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పన్నికుట్టి
అందమైన ఫ్యామిలీ కథా చిత్రంగా వినోదభరితంగా సాగేలా పన్నికుట్టి చిత్రం ఉంటుందని దర్శకుడు అనుచరణ్ తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ టాకీస్ పతాకంపై సమీర్ భరత్రామ్ నిర్మించిన చిత్రం ఇది. యోగిబాబు, కరుణాకరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇందులో లక్ష్మీప్రియ నాయకిగా పరిచయం అవుతున్నారు. దిండుకల్ లియోని స్వామిజీగా ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కే సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. జీవితంలో నిరాశతో కృంగిపోయి దాని నుంచి బయట పడటానికే కామిడీ కథా చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. రవి మురుగయ్యా రాసిన కథే ఈ చిత్రం అని తెలిపారు. నిర్మాతకు కథా చెప్పగా నచ్చేసిందని, దిండుకల్ లియోని నటించడం సంతోషకరంగా పేర్కొన్నారు. మూగజీవాలను నటింపజేయడం సాధారణ విషయం కాదనీ, చాలా అవరోధాలను ఎదుర్కొని, కొన్ని వ్యూహాలను ఉపయోగించి ఇందులో పందిపిల్లను నటింపజేసినట్లు చెప్పారు. చిత్రం చూసిన తరువాత నమ్మకమే జీవితం అని భావిస్తారని, ప్రేక్షకులు చిత్రం చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని దర్శకుడు తెలిపారు. -
టైం ట్రావెల్ చేయనున్న కమెడియన్.. ఏకంగా రూ.50లక్షల ఖర్చుతో..!
తమిళసినిమా: టైం ట్రావెల్ చేయడానికి యోగిబాబు సిద్ధమవుతున్నారు. దర్శకుడు ఆర్.కన్నన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కథాంశంతో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో యోగిబాబు కథానాయకుడిగా చేయనున్నారు. దీనికి పెరియాండవర్ అనే పేరును నిర్ణయించినట్లు దర్శకుడు తెలిపారు. యోగిబాబు శివుడిగా నటించనున్నట్లు చెప్పారు. నాయకిగా ఒక ప్రముఖ నటిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. చిత్రం కోసం వీసీఆర్ రోడ్డులో రూ.50లక్షలతో శివాలయం సెట్ను వేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. చదవండి: Adivi Sesh: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్ -
క్రికెటర్ నట్టూకు ఆ కమెడియన్ క్లోజ్ ఫ్రెండ్ తెలుసా?
చెన్నై: యువ క్రికెటర్ నటరాజన్ను హాస్యనటుడు యోగిబాబు సోమవారం కలిశారు. ఫిజియోథెరపీ కోసం బెంగళూరులో ఉన్న నటరాజన్ను కలిసిన యోగిబాబు ఆయనకు కుమారస్వామి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను నటరాజన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన మిత్రుడు యోగిబాబును కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో గుర్తిండిపోయే రోజని పేర్కొన్నాడు. -
తమిళ నటుడుపై ఫిర్యాదు
చెన్నై : నటుడు యోగిబాబుపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. హాస్య నటుడి నుంచి కథానాయకుడు స్థాయికి ఎదిగిన నటుడు యోగిబాబు. కాగా ఇటీవల ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. ఇందులో నటుడు యోగిబాబు నాయీ బ్రాహ్మణుడి పాత్రలో నటించారు. మండేలా చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ తమిళనాడు నాయీ బ్రాహ్మణ కార్మికుల సంక్షేమ సంఘం నిర్వాహకులు శుక్రవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో వారు పేర్కొంటూ మండేలా చిత్రంలో నాయీ బ్రాహ్మణ కార్మికులను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, అదేవిధంగా వైద్య సామాజిక వర్గానికి చెందిన 40 లక్షల మంది మనోభావాలకు భంగం కలిగే విధంగా సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మండేలా చిత్ర దర్శక నిర్మాతలు అందులో నటించిన యోగిబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: సరదా మాటలు.. రొమాంటిక్ పాటలు! -
రాజకీయ వ్యవస్థకు అద్దం పట్టేలా ‘మండేలా’
చెన్నై: నేటి రాజకీయ వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించిన చిత్రం మండేలా. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్, విష్ బెరీ ఫిలిమ్స్, ఎల్ ఎల్ పీ సంస్థల సమర్పణలో యాన్ ఓపెన్ వీడియో ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన చిత్రం మండేలా. నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సంగిలి మురుగన్, జీఎం సుందర్, నటి షీలా రాజ్కుమార్, కన్నరవి ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి కథ, దర్శకత్వ బాధ్యతలను మడోనా అశ్విన్ నిర్వహించారు. ఎస్ శశికాంత్ నిర్మించిన ఈ చిత్రానికి చక్రవర్తి రామచంద్ర సహా నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడు బాలాజీ మోహన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహించారు. దీనికి భరత్ శంకర్ సంగీతాన్ని, విదు ఆయ్యన్న ఛాయాగ్రహణం అందించారు. ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా రూపొందించిన చిత్రం మండేలా. ఆ గ్రామ ప్రెసిడెంట్కు ఇద్దరు భార్యలు ఉంటారు. ఐదుగురు కొడుకులు తర్వాత ప్రెసిడెంట్ బాధ్యతను తమకంటే తమకు కట్టపెట్టాలని తండ్రిపై ఒత్తిడి తీసుకొస్తారు. చివరికి ఇద్దరు ప్రెసిడెంట్ పదవికి పోటీకి సిద్ధమవుతారు. రెండు వర్గాలకు ఓటర్లు సరి సమానంగా ఉంటారు. అలాంటి సమయంలో ఆ గ్రామంలో ఉన్న ఒక నాయీబ్రాహ్మణ యువకుడి ఓటు కీలకంగా మారుతుంది. అతని ఓటు కోసం వారు పడే పాటులేమిటన్నదే మండేలా చిత్రం. నేటి సమకాలీన రాజకీయాలకు అద్దంపట్టేదిగా దర్శకుడు మండేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు. చదవండి: వీరప్పన్ కూతురు కథానాయికగా తెరంగేట్రం -
పెళ్లి చేసుకున్న స్టార్ కమెడియన్..
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు పెళ్లి చేసుకున్నారు. తిరుత్తణిలోని మురుగన్ ఆలయంలో బుధవారం ఉదయం మంజు భార్గవితో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే సినీ పరిశ్రమలోని తన సన్నిహితుల కోసం యోగి త్వరలోనే చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. కాగా, యోగి, భార్గవిలది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. యోగికి కమెడీయన్గా తమిళనాట విశేషమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మంచి కామెడీ టైమింగ్తో తనకంటూ స్పెషల్గా అభిమానులను ఏర్పరుచుకున్నారు. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. ఇటీవల రజనీకాంత్ దర్బార్ చిత్రంలో యోగి ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరో తెరకెక్కుతున్న కర్ణన్ చిత్రంలో యోగి నటిస్తున్నారు. అలాగే పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
లవ్ బాస్కెట్లో...
రెండేళ్లుగా హారర్ మూవీస్తో ప్రేక్షకులను భయపెట్టడానికే ఆసక్తి చూపించారు నటి అంజలి. ఈ రూట్కి కాస్త బ్రేక్ ఇచ్చి ప్రేక్షకులను నవ్వించాలని నిర్ణయించుకున్నారు. వినోద ప్రధానంగా సాగే ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారామె. ఈ చిత్రానికి కృష్ణన్ జయరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ హిల్ స్టేషన్ నేపథ్యంలో జరుగుతుంది. ఓ ఆసక్తికర విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో బాస్కెట్ బాల్ ప్లేయర్ కమ్ కోచ్గా నటిస్తున్నారు అంజలి. ఈ పాత్ర కోసం ఆమె బాస్కెట్ బాల్లో శిక్షణ తీసుకున్నారు. అంజలిని లవ్ బాస్కెట్లో పడేయాలనుకునే పాత్రల్లో యోగిబాబు, రమర్ నటిస్తున్నారు. ‘‘ఫ్యాంటసీ కామిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళతాం’’ అన్నారు కృష్ణన్. -
కామెడీ విత్ యాక్షన్తో..
తమిళసినిమా: నటుడు సంతానం కామెడీ విత్ యాక్షన్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. సంతానం నటిస్తున్న తాజా చిత్రం డకాల్టీ. ఈ చిత్రం ద్వారా బెంగాలీ బ్యూటీ రిత్తికాసేన్ హీరోయిన్గా కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తోంది. ఇకపోతే యోగిబాబు, రాధారవి, రేఖ, బాలీవుడ్ నటుడు హేమంత్పాండే, సంతానభారతి, మనోబాలా, నమోనారాయణ, స్టంట్శిల్వా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సంతానంతో నటుడు యోగిబాబు తొలిసారిగా నటిస్తున్నారు. దర్శకుడు శంకర్ శిష్యుడు విజయ్ఆనంద్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ హాలీవుడ్ నటుడు జాకీచాన్ చిత్రాల తరహాలో డకాల్టీ చిత్రం కామెడీతో కూడిన ఫైట్స్ సన్నివేశాలతో జనరంజకంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ను తిరుచెందూర్, తిరునెల్వేలి, కారైక్కుడి, చెన్నై, అంబాసముద్రం, కడప, పూనే, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. కాగా దీన్ని 18 రీల్స్ పతాకంపై తిరుపూర్కు చెందిన ప్రముఖ డాక్టర్, సినీ డిస్ట్రిబ్యూటర్ ఎస్పీ. చౌదరి భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా గాయకుడు విజయ్నారాయణన్ సంగీతదర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తరువాత నిర్మాత ఎస్పీ.చౌదరి సంతానం హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు నటించిన దిల్లుక్కు దుడ్డు చిత్రానికి పార్టు–3ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని ఆయన 3డీ ఫార్మెట్లో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం గురించి నటుడు సంతానంతో చర్చలు జరుపుతున్నట్లు నిర్మాత తెలిపారు. -
యోగిబాబు కామెడీ హైలెట్గా..!
నాడైనా, నేడైనా, ఏనాడైనా కామెడీ చిత్రాలకు కాసుల వర్షం కురుస్తుంది. నేల విడిసిన సాము కాకపోతే వినోదభరిత చిత్రాలకు ప్రేక్షకులు విజయాలను అందించడం ఖాయం. అలాంటి చిత్రంగా కడలై పోడ ఒరు పొన్ను వేణుం ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఆనంద్రాజన్. ఆర్జీ మీడియా పతాకంపై డీ.రాబిన్సన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో యోగిబాబు కామెడీ హైలైట్గా ఉంటుందంటున్నారు దర్శకుడు ఆనంద్రాజన్. దీని గురించి ఆయన తెలుపుతూ నటుడు యోగిబాబును మరో కోణంలో చూపించే చిత్రంగా కడలై పోడ ఒరు పొన్ను వేణుం ఉంటుందన్నారు. సాధారణంగా కామెడీని వృత్తి గా చేసే యోగిబాబు, ఈ చిత్రంలో ఆయన చేసే వృత్తే కామెడీగా ఉంటుందన్నారు. ఆ వృత్తిలో ఆయనకు కుడి ఎడమగా యువతులు పని చేస్తుంటారని వారిని ప్రేమలో దించడానికి యోగిబాబు చేసే ప్రయత్నాలు వినోదభరితంగా ఉంటాయని చెప్పారు. అలా యోగిబాబు చేతిలో చిక్కిన హీరో ఆజార్ ఆయన నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు జాలీగా ఉంటాయన్నారు. బుల్లితెరపై ప్రాచుర్యం పొం దిన నటుడు ఆజార్ వెండితెరకు పరిచయం అవుతున్న ఈ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సాజిత్, మన్సూర్అలీఖా న్, సెంథిల్, స్వామినాథన్, దీనా, మనోహర్, కాజల్ ముఖ్య పాత్రల్లో నటించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలోనే నిర్వహించనున్నట్లు దర్శకుడు ఆనంద్రాజన్ తెలిపారు. దీనికి జిపిన్ సంగీతం, జే.హరీశ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. -
యాక్టర్ కాదు డైరెక్టర్
ఇన్ని రోజులూ దర్శకులు యాక్షన్ చెప్పగానే యాక్షన్ చేసిన ‘జయం’ రవి త్వరలోనే స్టార్ట్ కెమెరా, యాక్షన్ అనడానికి రెడీ అయ్యారు. త్వరలోనే దర్శకుడిగా మారతానని రవి ప్రకటించారు. ప్రస్తుతం యాక్టర్గా ఫుల్ బిజీబిజీగా ఉంటూ మంచి సక్సెస్లు అందుకుంటున్నారు ‘జయం’ రవి. హీరోగా 25 సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్ చైర్లో కూర్చోడానికి సిద్ధమయ్యారు. అయితే తన డైరెక్షన్లో తాను యాక్ట్ చేయరట. కమెడియన్ యోగిబాబును మెయిన్ లీడ్గా తీసుకొని ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ప్రస్తుతం యాక్టర్గా ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక డైరెక్టర్గా తన తొలి సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. -
మిల్కీబ్యూటీ కొత్త అవతారం
నటి తమన్నా కొత్త అవతారం ఎత్తారు. నిజం చెప్పాలంటే బాహుబలి వంటి ఒకటి రెండు చిత్రాల్లో తనలోని నటనా ప్రతిభను చాటుకునే అవకాశం వచ్చినా, చిత్రాన్నంతా తనపై వేసుకుని మోసే సత్తా కలిగిన అవకాశం 10 ఏళ్లు దాటిన తన కెరీర్లో లభించలేదనే చెప్పాలి. అగ్రనటీమణులగా రాణిస్తున్న నయనతార, అనుష్క లాంటి వారు అలాంటి పాత్రల్లో తామేమిటో నిరూపించుకున్నారు. త్రిష కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించారు. అయితే వాటిలో తను సక్సెస్ను అందుకోలేకపోయారు. నటి అంజలి కూడా కథానాయకి ప్రధాన పాత్ర కలిగిన చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా నటి తమన్నా ఆ కోవలో చేరిపోయారు. ఇటీవల తెలుగు చిత్రం ఎఫ్2 హిట్ కావడంతో చాలా ఖుషీగా ఉన్న ఈ మిల్కీబ్యూటీకి మరింత జోష్ను అందించేలా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్లో మంచి ఫేమ్లో ఉన్నారు. తమన్నా, ప్రభుదేవా జంటగా నటించిన దేవి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం విశాల్తో ఒక చిత్ర షూటింగ్లో ఉన్నారు. తరువాత మరో చిత్రంలోనూ ఆయనతో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలోనూ నటించే అవకాశం తమన్నాను వరించింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని అదే కన్గళ్ చిత్రం ఫేమ్ రోహిన్ వెంకటేశన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో అంటూ ఎవరూ ఉండరట. అయితేనేం హీరోలు లేని కొరతను తీర్చేస్తున్న కమెడియన్ యోగిబాబు ఉండనే ఉన్నాడు. ఇటీవల ఇతను లేని చిత్రమే లేదని చెప్పవచ్చు. ఇప్పుడు తమన్నా చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా మునీశ్కాంత్, సత్యన్, కాళీ వెంకట్, బుల్లితెర ఫేమ్ టీఎస్కే ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య ఉంటుందన్నారు. అలా నటి తమన్నాకు ఒక సమస్య ఎదురవుతుందని, దాన్ని ఆమె తన మిత్రబృందంతో కలిసి ఎలా ఛేదించి బయట పడిందన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. హర్రర్ కథాంశంతో కూడిన ఈ చిత్రానికి వినోదాన్ని జోడించి తెరపై ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో కొంతభాగం షూటింగ్ను చేసి ప్రస్తుతం కోడైకెనాల్లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. -
‘నిర్మాతల కష్టసుఖాలు నాకు తెలుసు’
ధర్మప్రభు చిత్రంలో యమధర్మరాజు కుమారుడిగా యోగిబాబు నటించారు. హాస్య చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు యోగి బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులు ఉన్నారని, యమలోకంలో తాను, భూలోకంలో శ్యామ్ నటిస్తున్నట్లు తెలిపారు. తాను ముత్తుకుమార్ 15 ఏళ్లుగా స్నేహితులమని తెలిపారు. తాము లొల్లుసభా నుంచి వచ్చే తక్కువ ఆదాయంతో జీవిస్తూ వచ్చామని, కొన్ని రోజులు భోంచేయకుండా డాబాపై పడుకున్న సందర్భాలు ఉన్నాయని, అప్పట్లో అనుకున్న కథ ప్రస్తుతం చిత్రంగా రూపొందుతుందన్నారు. యోగి బాబు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘చిత్రంలో నటిస్తారా, డేట్స్ దొరుకుతాయా’ అని ముత్తుకుమార్ ప్రశ్నించగానే వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో గుర్కా చిత్రంలోనూ నటించేందుకు ఒప్పుకున్నానని, ఇద్దరు దర్శకులు స్నేహితులు కావడంతో 45 రోజుల పాటు నిద్రలేకుండా రాత్రింబవళ్లు నటిస్తూ వచ్చానన్నారు. తాను యముడి గెటప్లో అందంగా కనిపిస్తున్నానని నటి రేఖ తెలిపారని, ఇదే విషయాన్ని తానూ అనుభూతి చెందినట్లు పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తాను మాట్లాడే డైలాగ్స్ చూసి యూనిట్లో భయపడుతున్నారని, ఈ చిత్రం తన జీవితంలో మరచిపోనిదిగా మిగిలిపోతుందని అన్నారు. తాను అధిక పారితోషికం తీసుకునే వ్యక్తిని కాదని నిర్మాతల కష్టసుఖాలు తనకు తెలుసన్నారు యోగిబాబు. బయటి వ్యక్తులు వ్యాపింపజేసే వదంతులు నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. -
సమ్మర్లో ‘జోంబీ’
చిన్న చిన్న పాత్రలతో కమెడియన్గా ఎదిగిన నటుడు యోగిబాబు ఇప్పుడు కథానాయకుడి స్థాయికి చేరుకున్నాడు. ఒక పక్క హాస్యనటుడిగా బిజీగా ఉన్నా, మరో పక్క తన కోసమే తయారు చేసిన కథా చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలా యోగిబాబు నటిస్తున్న తాజా చిత్రాల్లో జోంబీ ఒకటి. ఇందులో నటి యాషిక నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రానికి యువన్ నలన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ జోంబీ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి అయ్యిందని చెప్పారు. చిత్ర షూటింగ్ అధిక భాగం చెన్నై, వీసీఆర్ రోడ్డులోని ఒక గెస్ట్హౌస్లో నిర్వహించినట్లు తెలిపారు. ప్రేమ్జీ అమరన్ సంగీతాన్ని అందించిన చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర కథ చెన్నై, వీసీఆర్ రోడ్డు, పాండిచ్చేరిలలో ఒకే రాత్రి జరిగే సంఘటన ఇతివృత్తంగా ఉంటుందని చెప్పారు. దీన్ని ఎస్ 3 పిక్చర్స్ పతాకంపై ఆర్.వసంత్ మహాలింగం, వి.ముత్తుకుమార్ నిర్మిస్తున్నారు. -
రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో ‘ధర్మప్రభు’
ఇప్పుడు కోలీవుడ్లో మంచి స్వింగ్లో ఉన్న హాస్యనటుడు యోగిబాబు. వడివేలు, వివేక్ వంటి వారి తరం తరువాత సూరి, సతీశ్ లాంటి వారు కామెడీ నటులుగా వెలుగులోకి వచ్చారు. అయితే వారిని కూడా పక్కన పెట్టేశాడు నటుడు యోగిబాబు. ఇతను లేని చిత్రాలనే లెక్క చెప్పగలం.. నటిస్తున్న చిత్రాల సంఖ్యను చెప్పడం కష్టమే అవుతుంది. దాదాపు హీరో స్థాయి పాత్రల్లో నటించేస్తున్నాడు. తాజాగా రజనీకాంత్ కొత్త చిత్రంలో కూడా నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యోగిబాబు ప్రధానంగా టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ధర్మప్రభు. ఇంతకుముందు విమల్, వరలక్ష్మీశరత్కుమార్ జంటగా నటించి న కన్నిరాశి చిత్ర దర్శకుడు ముత్తుకుమరన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ధర్మప్రభు. ఈ చిత్రంలో యోగిబాబు, కరుణాకరన్, రాధారవి, మనోబాలా, జననీఅయ్యర్ ప్రధా న పాత్రల్లో నటించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఇది యముడు ప్రధాన ఇతివృత్తంగా వినోదాన్ని రంగరించి తెరకెక్కుతున్న చిత్రం. యోగిబాబు యమ ధర్మరాజుగా నటిస్తున్నారు. చిత్ర టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజర్ను చూస్తుంటే సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం లోని అన్నాడీఎంకేను, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలను సంధించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ధర్మప్రభు చిత్రంలో యమలోకంలో యోగిబాబు మా ట్లాడుతూ భూలోకంలో అర్హత లేనివారికి పదవులు దక్కుతున్నాయి. ఇప్పుడు యమలోకంలో కూడానా? ఇక్కడ అర్హత కలిగినవారే పదవుల్లో ఉన్నారు. అమ్మ పోతే, చిన్నమ్మ, నాన్నపోతే, చిన్నాన్న, అకౌంట్లో డబ్బు వేస్తానని చెప్పి అలంకారంగా తయారవుతున్నారు, లాంటి సంభాషణలు చిత్రంలో చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోది ఎన్నికల ముందు దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఎకౌంట్లో రూ.5 లక్షలు వేస్తానని వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అమ్మ.చిన్నమ్మ లాంటి సంభాషణలు అన్నాడీఎంకేను విమర్శించే విధంగా ఉన్నాయి. ఇలా రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో రూపొందుతున్న ధర్మప్రభు చిత్రం విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
వినోదాల విందుగా పన్నికుట్టి
తమిళసినిమా: రజనీకాంత్తో 2.ఓ వంటి భారీ బ్రహ్మాండ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత శుభాష్కరన్ తాజాగా నిర్మిస్తున్న వినోదాత్మక కథా చిత్రం పన్నికుట్టి. కిరుమి చిత్రం ఫేమ్ అనే చరణ్ మురుగయ్యా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు కరుణాకరన్, యోగిబాబు, సింగంపులి, దిండుగళ్ లియోని, టీపీ.గజేంద్రన్, లక్ష్మీప్రియ, రామర్, పళయ జోక్ తంగదురై ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఆండవన్ కట్టళై, 49ఓ, క్రిరుమి చిత్రాల సంగీత దర్శకుడు కే దీనికి సంగీత బాణీలను కడుతున్నారు. సతీశ్ మురుగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పుడు నటుడు యోగిబాబు క్రేజే వేరు. ప్రతి చిత్రంలోనూ ఇతను ఏదో ఒక పాత్రలో కనిపించాల్సిందే. అంతే కాదు ఇటీవల హీరో తరహా పాత్రల్లోనూ నటించేస్తున్నాడు. అదే విధంగా నటుడు కరుణాకరన్ అన్ని తరహా పాత్రల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పన్నికుట్టి చిత్రంతో ప్రేక్షకులకు వినోదాల విందు అందించబోతున్నారు. పన్ని కుట్టి అంటే పందిపిల్ల అని అర్థం. ఈ చిత్రం దాని చుట్టూ తిరుగుతుందని సమాచారం. -
వడివేలు పాత్రలో యోగిబాబు?
తమిళసినిమా: నటుడు వడివేలు పాత్రను మరో నటుడు యోగిబాబు రీప్లేస్ చేయబోతున్నాడా? ఇప్పుడు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఈ విషయమే. వడివేలు ఒకప్పటి కామెడీ కింగ్. అలాంటి స్థాయిలో ఉండగా హీరోగా అవతారమెత్తాడు. అందుకు కారణం ప్రముఖ దర్శకుడు శంకర్నే. ఈయన ఎస్.ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రంతో వడివేలును ఏకంగా ద్విపాత్రాభినయంలో హీరోగా పరిచయం చేశారు. దీనికి శంకర్ శిష్యుడు శింబుదేవన్ దర్శకుడు. ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో వడివేలు కామేడీ పాత్రలను పక్కన పెట్టేసి హీరో పాత్రలపైనే దృష్టి సారించాడు. శంకర్, దర్శకుడు శింబుదేవన్ పులికేసికి సీక్వెల్ను చేపట్టారు. వడివేలునే హీరో.ఈ చిత్రం కోసం చెన్నైలో బ్రహ్మాండ సెట్స్ వేసి షూటింగ్ తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఆ తరువాతనే వివాదాలు తలెత్తాయి. దర్శకుడికి, వడివేలుకు మధ్య భేదాభిప్రాయాలు కారణంగా ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చిత్రం కోసం వేసిన భారీ సెట్స్ కూలగొట్టాల్సిన పరిస్థితి. నిర్మాతగా దర్శకుడు శంకర్కు సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. దీంతో నిర్మాతల మండలి, నడిగర్సంఘంలో ఫిర్యాదులు, పంచాయితీలు చాలానే జరిగాయి. ఒక దశలో వడివేలు నష్టపరిహారం చెల్లించాలంటూ శంకర్ డిమాండ్ చేశారు. వడివేలుపై రెడ్ కార్డు పడనుందనే ప్రచారం జరిగింది. ఇంత రాద్ధాంతం తరువాత ఎట్టకేలకు వడివేలు మళ్లీ నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడనే ప్రచారం జరిగింది. అయితే చిత్ర షూటింగ్ మాత్రం మొదలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వడివేలు పాత్రలో నటుడు యోగిబాబును నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. యోగిబాబు గురించి చెప్పాలంటే ఇప్పుడు నంబర్వన్ కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. గత ఏడాదిలో ఇతను 10 చిత్రాల్లో నటించాడు. అంతే కాదు ఇప్పుడితను హీరోగా అవతారమెత్తాడు. ధర్మప్రభు అనే చిత్రంలో యముడుగా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇతనికి పెద్ద అభిమాన గణమే ఉంది. దీంతో ఇంసై అరసన్ 24ఆమ్ పులికేసి చిత్రంలో వడివేలుకు బదులు యోగిబాబును నటింపజేసే అలోచనలో చిత్ర వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఇప్పటికీ వడివేలునే నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వడివేలు దిగి రాకపోతే యోగిబాబును లైన్లో పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. ఈ విషయంలో వాస్తవాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
యోగిబాబుతో యాషిక రొమాన్స్
చిన్న చిన్న పాత్రలతో కోలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగిన హాస్య నటుడు యోగిబాబు. అలాంటి నటుడిప్పుడు కథానాయకుడి స్థాయికి ఎదిగిపోయాడు. కోలమావు కోకిల చిత్రంలో ఏకంగా అగ్రనటి నయనతారను ఏకపక్షంగా ప్రేమించే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ హాస్య నటుడిప్పుడు చాలా మంది యువ హీరోలకంటే బిజీగా ఉన్నాడు.అందులో పాత్రలతో పాటు, కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు ఉండడం విశేషం. హీరోగా నటించడానికి ఎర్రగా, బుర్రగా, ఆరడుగుల అందగాడై ఉండాల్సిన అవసరం లేదని యోగిబాబు ద్వారా మరోసారి రుజువైంది. నల్లగా, పొట్టిగా, బొజ్జ వంటి ఆకారాలే యోగిబాబుకు నటుడిగా ప్లస్ అయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం ఇతను గూర్కా, ధర్మప్రభు చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా జాంబి అనే మరో కొత్త చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం యోగిబాబును వరించింది. విశేషం ఏమిటంటే ఇందులో అతనితో నటి యాషికా ఆనంద్ రొమాన్స్ చేయనుండడం. ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమై పాపులర్ అయిన నటి యాషికాఆనంద్. ఆ తరువాత బిగ్బాస్ రియాలిటీ షో సీజర్–2లో పాల్గొని ప్రాచుర్యం పొందిన ఈ అమ్మడు ఇప్పుడు ఓడవుమ్ ముడియాదు ఒళిక్కవుమ్ ముడియాదు, కళగు–2, చిత్రాలతో పాటు నటుడు మహత్తో కలిసి ఒక చిత్రంలో నటిస్తోంది. తాజాగా యోగిబాబుతో జాంబి చిత్రంలో నటించడానికి రెడీ అయ్యింది. ఇందులో ఈ బ్యూటీ యోగిబాబుకు ప్రేయసిగా నటించబోతోందట. కామెడీ థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని ఎస్–3 పిక్చర్స్ పతాకంపై వసంత్ మహాలింగం, ముత్తులింగం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.భువన్నల్లన్ దర్శకత్వం వహించనున్నారు. -
గుమ్మడికాయ కొట్టేశారు
ఆ మధ్య అజిత్ గుబురు గడ్డంలోనే కనిపించారు. ఇది ఆయన తాజా చిత్రం ‘విశ్వాసం’ కోసమే. కానీ ఇప్పుడు అజిత్ క్లీన్ షేవ్లో కనిపిస్తున్నారు. ఎందుకో ఊహించేయవచ్చు. ‘విశ్వాసం’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ఈ చిత్రనిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ‘వీరమ్, వేదాలం, వివేగమ్’ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘విశ్వాసం’. ఇటీవల పుణేలో జరిగిన ఫైనల్ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. దీంతో ఈ చిత్రం షూటింగ్కు గుమ్మడికాయ కొట్టారు అజిత్. ఇటీవల రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ను గమనిస్తే అజిత్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో యోగిబాబు, ‘రోబో’ శంకర్, తంబి రామయ్య కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
నయన్ తరువాత కెనడా మోడల్తో.
సినిమా: తమిళ సినిమాలో ప్రస్తుతం హాస్య నటుడు యోగిబాబు అంత బిజీ నటుడు మరోకరు లేరన్నది వాస్తవం. అంతే కాదు ఆయనంత లక్కీ నటుడు ఇంకోకరు లేరనే చెప్పాలి. అగ్రనటి నయనతారతో రొమాన్స్ చేయడానికి చాలా మంది యువ నటులు కలలు కంటుంటే కొలమావు కోకిల చిత్రంలో యోగిబాబు ఆమెను పిచ్చపిచ్చగా ప్రేమించే యువకుడిగా నటించి మెప్పించాడు. తాజాగా ఒక కెనడా మోడల్తో నటించడానికి రెడీ అవుతున్నాడు. అవును ఈయన గూర్ఖా అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇందులో ఆయనతో కెనడాకు చెందిన ప్రముఖ మోడల్ ఎలిస్సా నటించనుంది. శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ అమెరికాతో సహా పలువురు మోడల్స్ను పరిశీలించి చివరికి కెనడా మోడల్ ఎలిస్సాను ఎంపిక చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఆడిషన్లో చెప్పింది అర్థం చేసుకుని చక్కగా నటించి ఎలిస్సా ఈ అవకాశాన్ని దక్కించుకుందన్నారు. అయితే అందరూ ఊహించుకున్నట్లు ఎలిస్సా నటుడు యోగిబాబుకు జంటగా నటించడం లేదని, వీరి మధ్య రొమాన్స్ సన్నివేశాలు ఉండవని చెప్పారు. డిశంబరులో చిత్ర షూటింగ్ను ప్రారంభించి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ రిహార్సల్స్లో ఉందని చెప్పారు. ఇందులో కుక్క ముఖ్య పాత్రను పోషించనుందని తెలిపారు. దీన్ని 4 మంకీస్ స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. మరికొందరు ప్రముఖ నటీనటులు నటించనున్న ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం, రూపన్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర నటీనటులను, సాంకేతిక వర్గాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈయన ప్రస్తుతం నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న 100 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. -
జంతుర్ మంతర్ సైలెన్స్... యాక్షన్!
మాట్లాడటానికి భాష కావాలి కానీ భావాలను చెప్పడానికి అక్కర్లేదు. ఆలకిస్తే మౌనం కూడా మాట్లాడుతుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే కళ్లు కూడా కథలు చెబుతాయి. ఇలాంటప్పుడు సిల్వర్ స్క్రీన్పై ప్రతిభ ఉన్న యాక్టర్స్తో పాటు మూగజీవాలు నటిస్తే తప్పేముంది! ప్రేక్షకులకు మంచి వినోదం దొరుకుతుంది. ప్రస్తుతం మూగజీవాలు కీలకపాత్రలుగా రూపొందుతున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. తోడుగా... విశ్వాసంగా...! వెండితెర దేవదాస్కు మందు బాటిల్తో తోడుగా ఉంది కుక్కే. అందుకనే కదా మూగజీవాల్లో విశ్వాసానికి పర్యాయపదంగా కుక్కను చెబుతారు. కానీ తప్పుడు శిక్షణ ఇచ్చామో.... ‘ఒక్కడు’ సినిమాలో తెలంగాణ శకుంతల ఉన్న క్లైమాక్స్ సన్నివేశాన్ని ఓసారి గుర్తు చేసుకోవడమే. మరీ.. ఇప్పుడు కుక్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న సౌత్ సినిమాల గురించి తెలుసుకుందాం. రాత్రివేళలో గుర్కా చేతిలో టార్చిలైట్తో పాటు ఓ కుక్క ఉంటే దొంగల పని అరికట్టడం మరింత సులువు అవుతుంది. అలా ఓ సెక్యూరిటీ గార్డ్ తనకు ఎదురైన ఓ సమస్యను ఓ కుక్క సాయంతో ఎలా పరిష్కరించాడనే నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘గుర్కా’. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డుగా హాస్యనటుడు యోగిబాబు లీడ్ రోల్ చేస్తున్నారు. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. అలాగే కన్నడ ‘కిర్రిక్పార్టీ’ సినిమాతో ఫేమ్ సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రస్తుతం ‘777 చార్లీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఓ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ డాగ్ రక్షిత్కు ఎప్పుడూ తోడుగా ఉంటుందట. ఉండి? ఏం చేస్తుంది? అంటే వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు ఈ సినిమా దర్శకుడు కిరణ్రాజ్. గొరిల్లా ప్లాన్! తన ఫ్రెండ్స్ గ్యాంగ్లోకి ‘గోరిల్లా’ను చేర్చుకుని ఓ ప్లాన్ వేశారు యాక్టర్ జీవా. ఆ ప్లాన్ తాలూకు డీటైల్స్ షాలినీ పాండేకి తెలుసు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. అలాగే జీవా ప్లాన్ సక్సెస్ కావడం కోసం గొరిల్లా చేత గన్పట్టించారు జీవా. మరి.. గొరిల్లా ఎవర్ని షూట్ చేసిందనే విషయం సిల్వర్స్క్రీన్పై చూసి తెలుసుకోవాల్సిందే. పగ పట్టిందెవరు? అసలు పాములు పగపడతాయా? వాటికి శక్తులు ఉన్నాయా? అమావాస్య, పౌర్ణమి వంటి సందర్భాలతో పాములకు ఏవైనా లింక్ ఉందా? ఇటువంటి విషయాలపై ఎప్పటినుంచో పరిశోధన జరుగుతూనే ఉంది. సైన్స్ సంబం«ధీకులు ‘నో’ అంటే దైవాన్ని నమ్మేవారు ‘ఎస్’ అంటున్నారు. ఇవన్నీ ఏమో కానీ ఈ కథనాలపై చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా తమిళంలో ‘నీయా 2’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో జై, వరలక్ష్మి శరత్కుమార్, కేథరిన్, రాయ్ లక్ష్మీ నటిస్తున్నారు. ఇందులో హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నటిస్తున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల కీబోర్డ్ పట్టుకోవాల్సిన జై.. నాగస్వరం ఊదుతారట. ఎందుకంటే వెండితెరపై చూడండి అంటున్నారు ‘నీయా 2’ దర్శకుడు ఎల్. సురేశ్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయిందని టాక్. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘పున్నమినాగు’, సాయికుమార్ నటించిన ‘నాగదేవత’ సినిమాల్లో పాము లక్షణాలు హీరో పాత్రల్లో కనిపిస్తాయి. కానీ ‘పాంబన్’ సినిమా కోసం సగం పాముగా మారారు తమిళ నటుడు శరత్ కుమార్. ఈ సినిమాకు ఎ. వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి శరత్ కుమార్తో కలిసి నటిస్తున్నారు వరలక్ష్మీ శరత్కుమార్. మూగజీవాలతో షూటింగ్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా లొకేషన్లో టీమ్ అందరూ చాలా ఓర్పుగా ఉండాలి. ఒక్కోసారి చిన్న షాట్ కోసం కూడా చాలా టైమ్ వెచ్చించాల్సి రావచ్చు. అలాగే సినిమా విడుదల సమయంలో సంబంధిత అధికారుల నుంచి టీమ్ అనుమతి పొందాల్సిందే. ఎలాగూ గ్రాఫిక్స్ వర్క్స్ ఉండనే ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నా.. పర్లేదు. సినిమా చూసి ఆడియన్స్ ఆనందపడాలి. కాసుల రూపంలో ఆ సంతోషం మాకు షేర్ కావాలి అని ఆయా సినిమా నిర్మాతలు అనుకుంటున్నారు. ఇలాంటి సినిమాలను ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడతారని అనుకోవచ్చు. అదుగోనండీ బంటీ సాధారణంగా పందిపిల్ల అంటే అందరూ అదోరకంగా చూస్తారు. అదే వెండితెరపై విన్యాసాలు చేస్తే ఎంజాయ్ చేయకుండా ఉండరు. ఈ థ్రిల్ కోసమే దాదాపు రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు దర్శక–నటుడు రవిబాబు. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో బంటీ అనే కీలకపాత్రలో పందిపిల్లను నటింపజేశారు టీమ్. అంతేకాదు.. ఈ సినిమాకు లైవ్ యాక్షన్ 3డీ యానిమేషన్ టెక్నాలజీని కూడా యాడ్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాను భారతీయ అన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ‘అదుగో’ పేరుతో విడుదల చేస్తారు. మిగిలిన భాషల్లో ‘బంటీ’ అనే టైటిల్ పెట్టారు. అన్నట్లు ఈ సినిమాలో బంటీపై పాటలు కూడా ఉన్నాయటండోయ్. ఈ సినిమాలో నటి పూర్ణ ఓ స్పెషల్ సాంగ్ కూడా చేశారు. వర్మ, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. త్వరలో విడుదల కానుంది. ‘అదుగో’ లో బంటి గజ రాజసం అడవి నేపథ్యంలో సినిమా వెండితెరపైకి వస్తుందంటే అందులో కచ్చితంగా ఒక్కసీన్లో అయినా గజరాజు కనిపిస్తాడు. ఆ మాటకొస్తే... ఎన్టీఆర్ ‘అడవిరాముడు’, చిరంజీవి ‘అడవిదొంగ’, రాజేంద్రప్రసాద్ ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాల్లో గజరాజు పాత్ర ఎంత పవర్ఫుల్లో ప్రేక్షకులకు తెలియనిది కాదంటారా. ఏనుగుతో ఈ వెండితెర మ్యాజిక్ను రిపీట్ చేయడానికే టాలీవుడ్ టార్జాన్ రానా, బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్, ‘తమిళ బిగ్బాస్ 2’ ఫేమ్ అరవ్ ప్రయత్నిస్తున్నారు. అడవి జీవితం ఎలా ఉందో బందేవ్ని అదేనండీ... రానాని పలకరిస్తే... థాయ్లాండ్, కేరళ అడవుల్లో తాను తిరిగిన ఎక్స్పీరియన్స్ను షేర్ చేస్తున్నారట. ముఖ్యంగా ఏనుగులతో గడిపిన సీన్స్ను గుర్తుచేస్తున్నారట. ఇదంతా ఆయన తాజాగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమా ప్రభావమని ఊహించవచ్చు. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్కు ‘కాదన్’ అని, హిందీ వెర్షన్కు ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. రానా ఫస్ట్లుక్ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో ఏనుగుల భాషను బాగా అర్థం చేసుకుని వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్. జమాల్కు ఈ అవసరం ఎందుకొచ్చిందంటే ‘జంగ్లీ’ సినిమా కోసం. మనుషులకు–ఏనుగులకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఆధారంగానే ఈ సినిమా రూపొందుతోంది. థాయ్లాండ్లో ఎక్కువగా షూట్ చేశారు. ఈ సినిమాకు అమెరికన్ డైరెక్టర్ చెక్ రసెల్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరవ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ‘రాజ్ భీమా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు నరేశ్ సంపత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కేవలం గజరాజు మాత్రమే కాదు. మిగతా జంతువులకూ ప్రాధాన్యం ఉంటుందట. ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలు విడుదలైతే చిన్నపిల్లలు ఏనుగమ్మా.. ఏనుగు.. మా ఊరి థియేటర్స్లోకొచ్చిందేనుగు అని పాడుకుంటారేమో. రానా అరవ్ జీవా, షాలినీపాండే విద్యుత్ జమాల్ యోగిబాబు రక్షిత్శెట్టి వరలక్ష్మి జై శరత్ కుమార్ -
మిస్టర్ గుర్కా
హాస్యనటుడు యోగిబాబు టైటిల్ రోల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. శామ్ ఆంటోని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను హీరో శివ కార్తీకేయన్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘గుర్కా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. యోగిబాబు లీడ్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో కుక్క కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తుందని చిత్రబృందం చెబుతోంది.ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘యోగిబాబు లీడ్ రోల్లో నటిస్తున్న గుర్కా ఫస్ట్ లుక్, టైటిల్ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు శివకార్తీకేయన్. ‘‘నా నెక్ట్స్ సినిమా ‘గుర్కా’ అని అనౌన్స్ చేయడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు యోగిబాబు. -
ట్రాక్ మార్చాడు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్...ఇలా ఏ ఇండస్ట్రీ అయినా టాప్ కమెడియన్స్ హీరోలుగా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రాక్లోకి రావడానికి తమిళ హాస్యనటుడు యోగిబాబు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన హీరోగా సామ్ అంటోన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ‘‘యోగిబాబును దృష్టిలో ఉంచుకుని ఓ కథను రెడీ చేశా. ఆ స్క్రిప్ట్ను ఆయనకు వినిపించాను. హీరోగా నటించడానికి ఒప్పుకున్నారు.ఇందులో ఆయన సెక్యూరిటీ గార్డ్ పాత్ర చేస్తారు. ఓ కుక్క కూడా ఓ కీలక పాత్ర చేస్తుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని సామ్ అంటోని పేర్కొన్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాను తమిళంలో ‘డార్లింగ్’ పేరుతో రీమేక్ చేశారు ఆంటోని. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’ సినిమా యోగిబాబు కెరీర్లో 100వ చిత్రం కావడం విశేషం. -
ఆన్ స్క్రీన్.. ఆన్ సెట్స్
ఏడాది తిరగక ముందే తమిళ హీరో శివకార్తీకేయన్తో హీరోయిన్ నయనతార మళ్లీ జోడీ కట్టారు. గతేడాది ‘వేలైక్కారన్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజేష్ దర్వకత్వంలో ఈ జంట నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. రాధిక, సతీష్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా మొదలైన 25 రోజుల తర్వాత సెట్లో జాయిన్ అయ్యారు నయనతార. యాక్షన్ ఎలిమెంట్స్తో కామెడీ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం సాగనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ రేపు స్క్రీన్కి రానుంది. అలాగే శివ కార్తీకేయన్ నెక్ట్స్ రిలీజ్ ‘సీమరాజా’. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. -
లవ్లీ టీమ్తో...
సౌత్ లాంగ్వేజెస్లోనే కాదు హిందీ భాషలోనూ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు అలనాటి కథానాయిక రాధిక. 1980లలో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. రీసెంట్గా తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తల్లి పాత్రలో కనిపించారామె. ఇప్పుడు శివకార్తీకేయన్ హీరోగా రాజేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ తమిళ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు రాధిక. ‘లవ్లీ టీమ్తో జాయిన్ అయ్యాను’ అని ఆమె షూటింగ్ స్పాట్ ఫొటోను షేర్ చేశారు. నయతనార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో హాస్యనటులు యోగిబాబు, సతీష్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. -
మోహిని వచ్చేస్తోంది
దాదాపు రెండేళ్లు పూర్తి కావొచ్చింది తెలుగు తెరపై చెన్నై సుందరి త్రిష కనిపించి. 2016లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘నాయకి’లో నటించారామె. ఇప్పుడు మళ్లీ ‘మోహిని’ సినిమాతో తెలుగు తెరపై కనిపించనున్నారు. త్రిష ప్రధాన పాత్రలో ఆర్. మాదేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మోహిని’. ఈ చిత్రాన్ని అదే టైటిల్తో లక్ష్మి పిక్చర్స్ తెలుగులో విడుదల చేయనుంది. ఎస్. లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస రావు పల్లెల, కరణం మధులత నిర్మాతలు. గుంటూరు కాశిబాబు, డీవీ మూర్తి సహ–నిర్మాతలు. జాకీ, యోగి బాబు, పూర్ణిమ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. ‘‘ట్రైలర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్తో తెరకెక్కించారు. త్రిష నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘మోహిని’ సినిమాను ఈ నెల 27న విడుదల చేయనున్నాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు చిత్రబృందం. -
వెళ్లండి.. మళ్లీ రాకండి
ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్లి, అక్కణ్ణుంచి వచ్చేటప్పుడు ‘వెళ్లొస్తాం’ అంటాం. కానీ హాస్పిటల్కి వెళితే మాత్రం వెళ్తాం అని మాత్రమే డాక్టర్స్కు చెబుతాం. ఎందుకంటే.. మళ్లీ అనారోగ్యంతో హాస్పిటల్కి రాకూడదని, లైఫ్లో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో. ప్రజెంట్ నటి నయనతారకు కూడా వెళ్తాం అని చెప్పగానే ‘వెళ్లండి.. మళ్లీ రాకండి’ అంటున్నారట. అర్థం కాలేదా? ఆమె డాక్టర్ అని చెప్తున్నాం. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వాసం’లో నయనతార నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ముంబైలో స్టార్ట్ అయ్యిందని సమచారం. ఇందులో నయనతార డాక్టర్గా నటిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో అజిత్ డబుల్ రోల్ చేస్తున్నారన్న వార్త షికారు చేస్తోంది. వివేక్, యోగిబాబు, కోవై సరళ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారమ్. -
సంక్రాంతికి...
పొంగల్ బాక్సాఫీస్పై అజిత్ గురిపెట్టాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వాసం’. నయనతార కథానాయిక. వివేక్, యోగిబాబు, బోస్ వెంకట్ కీలక పాత్రలు చేస్తున్నారు. ‘వీరమ్, వేదాళం, వివేగం’ సినిమాల తర్వాత అజిత్–శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘విశ్వాసం’ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. తాజాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని కోలీవుడ్ టాక్. సెకండ్ షెడ్యూల్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. తన కెరీర్లో వంద సినిమాలకు సంగీతం అందించిన డి. ఇమ్మాన్ తొలిసారి అజిత్తో వర్క్ చేస్తున్నారు. హాస్యనటుడు యోగిబాబు కెరీర్లో ‘విశ్వాసం’ 100వ సినిమా కావడం విశేషం. -
చింపాంజీ.. వెరీ చిలిపి
స్టూడెంట్ గ్యాంగ్, రౌడీ గ్యాంగ్, కామెడీ గ్యాంగ్.. ఇలా డిఫరెంట్ గ్యాంగ్ల గురించి వింటాం. సినిమాల్లో చూస్తాం. మరి.. గొరిల్లా గ్యాంగ్ పవర్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ‘గొరిల్లా’ సినిమా చూడాల్సిందే. కొత్త దర్శకుడు డాన్ శాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవా, షాలినీ పాండే, యోగిబాబు, రాధా రవి, సతీష్, వివేక్ ప్రశన్న, రాజేంద్రన్ ఈ గొరిల్లా గ్యాంగ్ సభ్యులు. ‘గొరిల్లా’ ఫస్ట్ లుక్ను శుక్రవారం విడుదల చేశారు. ‘విక్రమ్వేదా’ ఫేమ్ శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘‘చింపాజీలు చాలా తెలివైనవి. అవి చేసే చిలిపి చేష్టలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో చింపాంజీ ఓ మేజర్ క్యారెక్టర్ చేసింది. యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ తీయడానికి చింపాజీకి నాలుగు నెలలు ముందే ట్రైనింగ్ ఇప్పించాం. సినిమా విడుదల తర్వాత మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ మెచ్చుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
దీపావళికి సర్కార్
ఈ ఏడాది దీపావళికి థియేటర్స్లోకి కొత్త సర్కార్ రానుంది. హీరో విజయ్ ఈ సర్కార్కు లీడర్. ‘కత్తి, తుపాకీ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న సినిమాకు ‘సర్కార్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో కీర్తీ సురేశ్ హీరోయిన్. వరలక్ష్మీ శరత్కుమార్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. విజయ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ త్రీ లుక్స్లో కనిపించనున్నారట. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. విజయ్, వరలక్ష్మీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘విజయ్, నా కాంబినేషన్లో వచ్చిన ‘కత్తి, తుపాకీ’ చిత్రాల కన్నా ‘సర్కార్’ ఇంకా సూపర్గా ఉంటుందని కాన్ఫిడెంట్గా చెప్ప గలను’’ అన్నారు మురుగదాస్. -
నేను మీకు వీరాభిమానిని..
తమిళసినిమా: మనిషి ఎంత సంపాదించినా రుచికరమైన ఆహారం బుజించకుంటే ఫలితం ఏముంటుంది. అదీ తన కిష్టమైన వారి విందు అయితే మహా పసందుగా ఉందనిపిస్తుంది. యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ అలాంటి ఇష్టమైన వారి పసందయిన విందును ఆరగించి మైమరచి ఆ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆయన చెబుతున్నదెవరి గురించో అయితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అగ్రనటి నయనతార తనకు పసందైన భోజనాన్ని పంపిస్తారని అనిరుధ్ చెబుతున్నారు. ఆ సంగతేంటో చూద్దాం రండీ. లేడీ సూపర్స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రాలలో కొలమావు కోకిల ఒకటి. నయనతార చుట్టూ తిరిగే ఈ చిత్రంలో హస్య నటుడు యోగిబాబు ప్రేమ అంటూ ఆమె చూట్టూ తిరుగుతాడు. ఇదే మంచి వినోదాన్నిచ్చే అంశం కాగా ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత భాణీలను అందించడం మరో అస్సెట్. ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలై విశేష ఆదరణను పొందుతున్నాయట. దీంతో నయనతార అనిరుధ్ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ప్రతిగా అనిరుధ్ ఆమె మంచితనాన్ని, గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆయనేమన్నారో చూద్దాం. నయనతారది చాలా మంచి వ్యక్తిత్వం. అందరితోనూ చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. ఆమెకు నా సంగీతం అంటే చాలా ఇష్టం. నా పాటలు విని పరవశించిపోతారు. పలుమార్లు నాకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతుంటారు. నేను మీకు వీరాభిమానిని అని మెసేజ్లు పంపిస్తుంటారు. కొన్ని సార్లు మంచి మంచి వంటకాలతో పసందైన విందును నాకు పంపిస్తుంటారు. అలాంటి ఆమె ప్రేమాభిమానాలు నాకు చాలా ఇష్టం అంటూ అనిరుధ్ నయనతారను ప్రశంసలతో ముంచెత్తారు. -
ఫీల్ గుడ్ మూవీగా సెమ
తమిళసినిమా: నాకు పెళ్లి కూతురుని కుదర్చడం కోసం పడే పాట్లే సెమ చిత్రం అని అన్నారు నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం సెమ. దర్శకుడు పాండిరాజ్ పసంగ ప్రొడక్షన్స్, పి.రవిచంద్రన్ లింగా భైరవి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. ఇందులో జీవీకి జంటగా అర్తన నటించగా యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. పాండిరాజ్ శిష్యుడు వల్లికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న జీవీ.ప్రకాశ్కుమార్ మాట్లాడుతూ సెమ పూర్తిగా వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. సాధారణంగా సినిమాల్లో హీరోలు పనీ పాటా లేకుండా తిరుగుతుంటారన్నారు. అయితే సెమ చిత్రంలో హీరో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారన్నారు. చేపలను అమ్మడానికి వెళతాడని, అవి అమ్ముడు పోకపోతే ఎండ బెట్టి మరుసటి రోజు వాటినే మళ్లీ అమ్ముతాడన్నారు. ఇలా చాలా హుషారుగా ఉండే పాత్ర అది అని చెప్పారు. హీరోకు వధువును చూసే సన్నివేశాలు చాలా వినోదంగా ఉంటాయన్నారు. నాలుగైదు పెళ్లి చూపులకు వెళ్లినా సెట్ కాదని, ఆ తరువాత ఒక అమ్మాయి ఓకే అయినా ఆ పెళ్లి జరగదని, అందుకు కారణాలు ఏమిటి, చివరికీ హీరో పెళ్లి జరిగిందా? లేదా? అన్న పలు జాలీ సన్నివేశాలతో కూడిన చిత్రంగా సెమ ఉంటుందని చెప్పారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన మంచి ఫీల్ గుడ్ మూవీగా ఉంటుందని జీవీ పేర్కొన్నారు. ముందుగా ఆయన మాట్లాడుతూ స్టెర్లైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో ప్రజలు పోరాడుతూ తుపాకీ గుళ్లకు బలవుతున్న సమయంలో ఈ చిత్ర సమావేశాన్ని నిర్వహించడం బాధగా ఉందన్నారు. పోరాటం ప్రజల హక్కు అని, దాన్ని పోలీసులు అణచి వేసే ప్రయత్నం, పోరాటంలో పాల్గొన్నవారిని కాల్చి చంపడం ఖండించదగ్గ విషయంగా జీవీ పేర్కొన్నారు. -
‘కాశి’ మూవీ రివ్యూ
టైటిల్ : కాశి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : విజయ్ ఆంటోని, అంజలి, సునైనా, యోగి బాబు, జయప్రకాష్ సంగీతం : విజయ్ ఆంటోని దర్శకత్వం : కృతిగ ఉదయనిధి నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లోనూ ఘనవిజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్తో తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్, తరువాత తను హీరోగా నటించిన ప్రతీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కానీ బిచ్చగాడు స్థాయిలో విజయం మాత్రం సాధించలేకపోయాడు. అందుకే మరోసారి మదర్ సెంటిమెంట్ను నమ్ముకొని కాశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా విజయ్ ఆంటోని టాలీవుడ్లో మరో విజయం సాధించాడా..? కథ ; భరత్ (విజయ్ ఆంటోని) న్యూయార్క్లో డాక్టర్. సొంత హాస్పిటల్, హోదా, మంచి కుటుంబం అన్నీ ఉన్నా భరత్ను ఏదో పొగొట్టుకున్నా అన్న భావన వెంటాడుతుంటుంది. ఓ చిన్న బాబును ఎద్దు పొడిచినట్టుగా ఓ కల చిన్నతనం నుంచి వస్తుంటుంది. (సాక్షి రివ్యూస్) తన తల్లి కిడ్నీలు ఫెయిల్ అవ్వటంతో భరత్ జీవితం మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు తను అమ్మానాన్నలు అనుకుంటున్న వారు తనను పెంచిన తల్లిదండ్రులు మాత్రమే అని తెలుస్తుంది. దీంతో తనకు రోజు వచ్చే కలకు తన గతానికి ఏదో సంబంధం ఉందన్న నమ్మకంతో తనను కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు భరత్. అనాథశ్రమంలో తన తల్లిపేరు పార్వతి అని, ఆమె సొంత ఊరు కంచెర్లపాలెం అని తెలుసుకొని ఆ ఊరికి వెళతాడు. ఈ ప్రయత్నంలో భరత్ విజయం సాధించాడా..? తన తల్లిదండ్రులను కనుక్కోగలిగాడా..? అసలు భరత్ వారికి ఎలా దూరమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయ్ ఆంటోని, అంతా తానే అయి సినిమాను నడిపించాడు. నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే బలమైన భావోద్వేగాలు చూపించే అవకాశం రాకపోవటంతో నాలుగు పాత్రలు కూడా రొటీన్గా సాగిపోతాయి. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన యోగిబాబు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.(సాక్షి రివ్యూస్) హీరోయిన్ గా నటించిన అంజలిది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో నటించిన జయప్రకాష్ తప్ప ఇతర నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారే. విశ్లేషణ ; బిచ్చగాడు సినిమాలో మదర్ సెంటిమెంట్తో సక్సెస్ సాధించిన విజయ్ ఆంటోని మరోసారి అదే సెంటిమెంట్ను నమ్ముకొని కాశి సినిమా చేశాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన కొడుకు తన గతాన్ని వెతుక్కుంటూ చేసే ప్రయాణమే కాశి కథ. అయితే ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో దర్శకురాలు కృతిగ ఉదయనిధి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అసలు కథను పక్కన పెట్టి కథతో సంబంధం లేని పిట్టకథలతో సినిమాను నడిపించారు. (సాక్షి రివ్యూస్)పూర్తిగా తమిళ నటులు, తమిళ నేటివిటీతో తెరకెక్కటం కూడా తెలుగు ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. గత చిత్రాల్లో సూపర్ హిట్ మ్యూజిక్తో ఆకట్టుకున్న విజయ్ ఆంటోని ఈ సారి పాటలతోనూ మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : స్క్రీన్ప్లే తమిళ నేటివిటి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఖోఖో కాదు..కోకో
తమిళసినిమా: ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించాలంటే కోలీవుడ్లో నయనతార, టాలీవుడ్లో అనుష్కలే ముందు గుర్తుకొస్తారని చెప్పవచ్చు. అలాంటిది అనుష్క చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క చిత్రం ఉంది. తను పెళ్లికి రెడీ అవుతోందని, అందుకే కొత్త చిత్రాలు అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. నిజాలేమిటన్నది అనుష్క నోరు విప్పితే కానీ తెలియదు. నయనతార మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. ఈమె గురించి పెళ్లి వార్తలు కాదుగానీ, యువ దర్శకుడు విఘ్నేశ్శివతో సహజీవనం చేస్తున్న ప్రచారం మాత్రం మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే నయనతార చేతి నిండా చిత్రాలతో తమిళంతో పాటు, తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ యమ బిజీగా ఉంది. మాయ చిత్రం తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వరుసగా నయనతార తలుపు తడుతున్నాయి. మధ్యలో డోర చిత్రం నిరాశపరచినా, నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయూర్ కాలం హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో పాటు, శివకార్తికేయన్కు జంటగా వేలైక్కారన్ వంటి కమర్శియల్ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంతో పాటు, మలయాళంలో నవీన్పాల్తో ఒక చిత్రం చేస్తోంది. వీటిలో శివకార్తికేయన్తో రొమాన్స్ చేసిన వేలైక్కారన్ చిత్రం వచ్చే నెల 29న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా నయనతార మరో కథానాయకి పాత్ర చుట్టూ తిరిగే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. బ్లాక్ కామెడీ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి ఖోఖో అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జరగడంతో ఇదేదో క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం అని చాలా మంది భావించారు. నిజానికి ఈ చిత్ర టైటిల్ ఖోఖో కాదట. కోకో అట. కోకో అంటే కోలమావు కోకిల అట. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నయనతార చిత్రానికి ఈయన సంగీత బాణీలు కట్టడం అన్నది ఇదే తొలిసారి అవుతుంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. -
హాస్యనటులతో సంఘవి
తమిళసినిమా: హాస్య నటులు పవర్స్టార్ శ్రీనివాసన్, గంజాకరుప్పు, యోగిబాబుతో నటి సంఘవి ఒక చిత్రంలో నటించనున్నారు. వీరితో పాటు రోషన్, హర్షిత, మెర్కురి సత్య, కేపీ.శంకర్, జీవిత, స్నేహన్రాజా, కేపీ.సెంథిల్కుమార్, బోండామణి, త్రిలోక్, వి.రాజా, ఆర్.స్టాలిన్, కింగ్కాంగ్, రణాదేవి, ఎంఆర్జీ.రాజేశ్వరి, మయిలైదేవి, వీరమణి, కాదల్ హుస్సేన్ ముఖ్య పాత్రలు ధరించనున్నారు. ఈ చిత్రానికి నాన్యార్ తెరియుమా అనే టైటిల్ను నిర్ణయించారు. గ్లామర్ సినీగైడ్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి నవీన్రాజా దర్శకత్వం వహించనున్నారు. నాన్ యార్ తెరియుమా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ పోలీస్ అధికారి కావాలన్న లక్ష్యంతో చెన్నైకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఒక ఆడ దెయ్యం ప్రవేశిస్తుందన్నారు.ఆ ముగ్గురు పోలీస్ అధికారులు కావాలంటే ఆ దెయ్యం మూడు నిబంధనలు విధిస్తుందన్నారు. వాటిని సవాల్గా తీసుకున్న ఈ ముగ్గురు పోరాటంలో పడే బాధలను వినోదభరితంగా తెరకెక్కించనున్న చిత్రం నాన్ యార్ తెరియుమా అని తెలిపారు. దీనికి చంద్రన్సామి ఛాయాగ్రహణం, రశాంత్ సంగీతాన్ని అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.