Regina Cassandra
-
అజిత్ 'పట్టుదల' HD మూవీ స్టిల్స్
-
ఆ సంఘటనతో మతం మారాను: రెజీనా కసాండ్రా
సినీ పరిశ్రమలో మతాంతర వివాహాలు ఆపై వాటి నుంచి వచ్చే సమస్యలు వంటి కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని నిజ జీవితంలోనూ ఈ విధానం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. చాలామంది ప్రముఖులు మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. కోలీవుడ్కు చెందిన నటి రెజీనా కుటుంబంలో కూడా ఇలాంటి ఘటనే ఉంది. టాలీవుడ్లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,పిల్ల నువ్వు లెని జీవితం,సౌఖ్యం వంటి చిత్రాల్లో ఆమెకు గుర్తింపు వచ్చింది. రెజీనా తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్లో నటించిన ఆమె ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసింది. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ల్లోనూ ఆమె నటించారు. తాజాగా నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన విడాముయర్చి చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. కాగా తన మతం గురించి ప్రస్తావన వస్తే ఆమె ఇలా పేర్కొన్నారు.పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలుగా ఉన్న ఈమె ఆ తరువాత క్రిస్టియన్ మతానికి మారినట్లు చెప్పారు. దీని గురించి నటి రెజీనా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తన తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన వారిని తండ్రి ఇస్లాం మతస్తుడని పేర్కొన్నారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తాను పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలిగా పెరిగానన్నారు. (సంధ్య థియేటర్: పవన్ కల్యాణ్ 23 ఏళ్ల రికార్డ్ను బీట్ చేసిన 'పుష్ప'రాజ్)అయితే, తను ఆరేళ్ల వయసులో ఉండగా అమ్మానాన్న విడిపోయారని గుర్తుచేసుకుంది. అప్పుడు తన అమ్మగారు తిరిగి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి రెజీనా పేరుకు ‘కసాండ్రా’ జత చేశారట. దీంతో తాను బాప్తిజం పొంది బైబిల్ చదివినట్లు చెప్పారు. అలా ఆమె రెజీనా కసాండ్రాగా అందరికీ పరిచయం అయింది. వాస్తవానికి తన అసలు పేరు రెజీనా మాత్రమేనని చెప్పింది. మతం విషయంలో తనకు ఎలాంటి పట్టింపులు లేవని ఆమె పేర్కొన్నారు. చర్చి, మసీద్, గుడి.. ఇలా ఎక్కడికైనా వెళ్తానని కూడా పంచుకున్నారు. -
హీరోలతో రిలేషన్ రూమర్స్.. 'మ్యాగీ' కాంట్రవర్సీ.. రెజీనా ఇప్పుడేం చేస్తోంది? (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఫ్యాషన్ వీక్లో మెరిసిన..రెజీనా..ఈషారెబ్బా.. (ఫొటోలు)
-
సౌత్కు, బాలీవుడ్కు ఉన్న పెద్ద తేడా ఇదే!: రెజీనా
చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి ఇక్కడే సెటిలైపోయింది రెజీనా కసాండ్రా. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్పై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో హిందీ చిత్రపరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది నుంచి వచ్చే నటీమణులు ఎందరో భాష విషయంలో ఇబ్బందిపడుతూ ఉంటారు. వారిలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మనకు భాష రాదంటే సినిమాలో సెలక్ట్ చేయడానికి బాలీవుడ్ ఇష్టపడదు. కానీ సౌత్లో ఇలా ఉండదు. భాష రాకపోయినా సినిమాకు ఎంపిక చేసుకుంటారు.కాస్టింగ్ ఏజెంట్లు ఉండరుపైగా బాలీవుడ్లో పని చేయాలనుకున్న కొత్తలో నేను ముంబైలోనే ఉండాలన్నారు. మీటింగ్స్కు హాజరవుతూ ఉండాలన్నారు. సౌత్లో ఇలాంటి నియమనిబంధనలేమీ ఉండవు. కాస్టింగ్ ఏజెంట్లు అన్న పదానికి కూడా చోటు లేదు. కేవలం మేనేజర్లు, పీఆర్వోలు ఉంటారు. ఇప్పుడిప్పుడే టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు సౌత్లోనూ ప్రవేశిస్తున్నాయి.అందుకే నా కోసం ఓ టీమ్ఇకపోతే బాలీవుడ్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అలాగని నాకు త్వరగా ఆఫర్లు రావాలని మార్కెట్లో నన్ను నేను అమ్ముకోలేదు. కానీ ఇలా మొండిగా ఉంటే ఛాన్సులు రావని ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే నాకంటూ ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాను. వాళ్లే నాకోసం సంబంధిత వ్యక్తులతో బేరసారాలు, సంప్రదింపులు జరుపుతూ ఉంటారు అని రెజీనా చెప్పుకొచ్చింది.చదవండి: కన్నడ సినిమా రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్.. ఫస్ట్ మూవీ ఇదేనా..? -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న 'ఉత్సవం'
దసరా సందర్భంగా థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రం ‘ఉత్సవం.’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ,రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది.అంతరించిపోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్ను, నేటి ట్రెండ్కు తగ్గట్టుగా కథనంతో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్, యూత్ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న అమెజాన్ ప్రైమ్లోకి వచ్చిన ఈ చిత్రం బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీతో పాటు అనూప్ రూబెన్స్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
ఆ సమయంలో అమ్మకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయా: రెజీనా
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా నటి రెజీనాకు అభిమానులు ఉన్నారు. సుమారు 17 ఏళ్లుగా ఆమె పలు సినిమాలతో పాపులర్ అయ్యారు. ఒకప్పుడు తమిళం, తెలుగు ,హిందీ తదితర చిత్రాల్లోనూ కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం పెద్దగా ఛాన్సులు రావడం లేదు. దీంతో వెబ్ సిరీస్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే, తాజాగా తమిళంలో నటుడు అజిత్ కథానయకుడిగా నటిస్తున్న విడాముయర్చి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇండస్ట్రీలో రెజీనా చాలా బోల్డ్ నటి అనే చెప్పాలి. సాధారణంగా నటీమణులు వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చెప్పుకోవడానిక ఇష్టపడరు. అయితే రెజీనా మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఈమె సినిమా విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను ధైర్యంగా బయటకు చెప్పేస్తారు. ఆ మధ్య తాను చాలా మందితో డేటింగ్ చేశాయని చాలా బోల్డ్గా చెప్పిన ఈ అమ్ముడు తాజాగా మరో వ్యక్తిగత విషయాన్ని బయట పెట్టారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రెజీనా ఇటీవల ఇన్స్ట్రాగామ్లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక అభిమాని చెప్పకూడని ఏదైనా విషయం చేసి తల్లిదండ్రుల వద్ద దొరికిపోయారా అని ప్రశ్నించాడు. అందుకు బదులిచ్చిన రెజీనా ఒకసారి పక్క ఇంట్లో ఎదో జరుగుతుంది. అప్పుడు నేను ఎవరికీ చెప్పకుండా ఏం జరుగుతుందో చూద్దాం అని ఇంటిలోకి తొంగి చూస్తుండగా అమ్మ కంటిలో పడ్డానని, అప్పుడు అమ్మ తనను గట్టిగానే చివాట్లు పెట్టారని చెప్పారు. ఇరుగుపొరుగు ఇళ్లలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలనే ఆలోచన మంచిది కాదని హెచ్చరించింది. కాగా 33 ఏళ్ల ఈ పరువాల భామ ఇప్పటికీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. -
సందీప్, సాయి ధరమ్తేజ్తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్
రెజీనా కసాండ్రా తన ఎఫైర్స్ గురించి తాజాగా రివీల్ చేశారు. తను నటించిన కొత్త చిత్రం 'ఉత్సవం' విడుదల సందర్భంగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా, టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్తో పాటు సాయి ధరమ్ తేజ్తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వారిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోనుందంటూ కూడా సోషల్మీడియాలో వైరల్ అయింది. అయితే, సందీప్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఆమె స్నేహితురాలు మాత్రమే.. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ పేర్కొన్నారు. తాజాగా రెజీనా కూడా రియాక్ట్ అయ్యారు.'సందీప్, సాయి ధరమ్తేజ్ ఇద్దరూ కేవలం స్నేహితులు అయినప్పటికీ, వారితో నా అనుబంధం చాలా భిన్నంగా ఉంటుంది. సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. మేము ఇద్దరం ఒకరిపై మరొకరం తరచూ అరచుకుంటాం. ఒక్కోసారి ఒకరితో ఒకరం రెండు నెలలు మాట్లాడుకోము. కానీ, కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెడుతాం. మా సంభాషణ ఎలా ఉంటుందంటే.. అసలు మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు అనేంతగా ఉంటుంది. ఇదీ చదవండి: హీరోయిన్ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్సాయి కూడా నాకు చాలామంచి స్నేహితుడు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా స్వీట్ పర్సన్. అతనితో నా బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సందీప్తో గొడవపడినట్లు సాయితో జరగదు. అలా మేమిద్దరం ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అయినప్పటికీ, ప్రేక్షకులు మాకు ఎప్పుడూ సీక్రెట్గా పెళ్లి చేసేస్తుంటారు.' అని రెజీనా తెలిపింది. కొద్దిరోజుల క్రితం కూడా ఓ బిజినెస్మేన్తో రెజీనా వివాహం అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా ఆమె పెళ్లి చుట్టూ పుకార్లు వస్తూనే ఉన్నాయి.అదే ఇంటర్వ్యూలో రెజీనాకు ఎలాంటి వ్యక్తి కావాలో కూడా చెప్పుకొచ్చింది. బాధ్యత తెలియని వ్యక్తితో కలిసి ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదని చెప్పింది. తనను జాగ్రత్తగా చూసుకునే వాడు అయితే చాలు అంటూ ఆమె పేర్కొంది. తన జీవితంలో చాలామందితో రిలేషన్షిప్లో ఉన్నాను షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒక రకంగా తాను సీరియల్ డేటర్ అంటూ నవ్వేసింది. అయితే, ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నానని, ఇప్పుడు ఎక్స్ బాయ్ఫ్రెండ్స్ మాత్రమే తనకు ఉన్నారిని చెప్పింది. ఈ విషయంలో తాను ఎలాంటి అబద్దం చెప్పడంలేదని పేర్కొంది. -
‘ ఉత్సవం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉత్సవంనటీనటులు:దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులునిర్మాత: సురేష్ పాటిల్రచన, దర్శకత్వం: అర్జున్ సాయిసంగీతం: అనూప్ రూరబెన్స్సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్విడుదల తేది: సెప్టెంబర్ 13, 2024కథేంటంటే..అభిమన్యు నారాయణ(ప్రకాశ్ రాజ్).. అంతరించి పోయిన సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టేకించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్లో రంగస్థల నటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమ-కృష్ణలు ప్రేమలో పడతారు.అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతారు. మరోవైపు స్నేహితులైన అభిమన్యు, మహాదేవ్లు కృష్ణ, రమలకు పెళ్లి చేయాలని ఫిక్సవుతారు. అయితే ఈ విషయం తెలియకుండా ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రమనే అని కృష్ణకు, పెళ్లి కొడుకు కృష్ణనే అని రమకు తెలియదు. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు.అయితే ఈ విషయాన్ని అటు పెళ్లికొడుకు వాళ్లు, ఇటు పెళ్లి కూతురు వాళ్లు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దాచి..పెళ్లి సమయానికల్లా వాళ్లను వెతికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అసలు రమ-కృష్ణలు ప్రేమలో ఎలా పడ్డారు? విడిపోవాడానికి గల కారణం ఏంటి? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు రమ-కృష్ణలు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సినిమాలకు స్పూర్తి నాటకాలు. ఆ నాటక కళాకారుల మీద తీసిన సినిమానే ‘ఉత్సవం’. ఒకవైపు రంగస్థల కళాకారులు కష్టాలను చూపిస్తూనే ఓ చక్కని ప్రేమకథను చెప్పొకొచ్చాడు దర్శకుడు అర్జున్ సాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్నితెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్క్రీన్ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని సన్నివేశాలు వస్తుంటాయి. అలాగే ఎమోషనల్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఈ మధ్యే వచ్చిన రంగమార్తండా సినిమాలను గుర్త చేస్తాయి. హీరోహీరోయిన్ల లవ్స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)ఫస్టాఫ్లోహీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారులు కష్టాలను చూపించారు. ఇక సెకండాఫ్లో నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నం.. అలాగే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటో చూపించారు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లే రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..దిలీప్ ప్రకాష్కి ఇది రెండో సినిమా . అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. తండ్రికి విలువనిచ్చే కొడుకుగా, ఓ మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్లో శివుడి అవతారంలో కనిపించి.. తనదైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్గా నాజర్ కూడా అదరగొట్టేశాడు. , రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'చాలామందితో రిలేషన్లో ఉన్నా.. కానీ'.. రెజీనా షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ సినీ ప్రియులకు రెజీనా పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో ఆడియన్స్ను మెప్పించింది. ప్రస్తుతం ఉత్సవం మూవీతో మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్ను అలరించేందుకు వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన తాజా చిత్రం 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈరోజే అంటే సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చేసింది. హార్న్బిల్ పిక్చర్స్పై సురేష్పాటిల్ నిర్మించారు.అయితే అంతకుముందు మూవీ ప్రమోషన్లలో భాగంగా రెజీనా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను చాలామందితో రిలేషన్లో ఉన్నానని తెలిపింది. అయితే నాకు చాలా ప్రపోజల్స్ ఉన్నాయని.. ఈ విషయంలో నేను ఒక సీరియల్ డేటర్ అని చెప్పొచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం వీటన్నింటికీ దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది రెజీనా.(ఇది చదవండి: వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్)అయితే గతంలో ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్తా ఆగిపోయింది. తాజా ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ గురించి రెజీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
నాటకం అమ్మలాంటిది – అనిల్ రావిపూడి
‘‘నాటకం అమ్మలాంటిది. సినిమా అనేది ఆ అమ్మకి బిడ్డలాంటిది. నాటకాల గురించి ఈ తరానికి చాలా కొద్దిగా తెలిసి ఉంటుంది. కానీ, నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగాన్ని ఏలిన చాలామంది గొప్పనటులు ఉన్నారు. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకుని మంచి కాన్సెప్ట్తో తీసిన ‘ఉత్సవం’ సినిమా విజయోత్సవం జరుపుకోవాలి’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జు¯Œ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనిల్ రావిపూడి అతిథిగా çహాజరయ్యారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు దిలీప్ ప్రకాష్. ‘‘కళ కోసం జీవితాలన్నీ అంకితం చేసిన 150 కుటుంబాలు ఉన్నాయి. వారి అంకితభావం చూసి ‘ఉత్సవం’ సినిమా తీశా’’ అని అర్జు¯Œ సాయి తెలిపారు. ‘‘ఉత్సవం’ చాలా మంచి సినిమా’’ అని సురేష్ పాటిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్ రూబె¯Œ్స, లిరిక్ రైటర్ అనంతశ్రీరామ్, రైటర్ రమణ గోపిశెట్టి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు. -
స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరో, రెజీనా..
-
‘ఉత్సవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రేక్షకుల మనసుని హత్తుకుంటాయి: రెజీనా కసాండ్రా
‘‘నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ నాటకాలంటే ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్లో వేశాను. నాటక రంగంపై పరిశోధన చేసి ‘ఉత్సవం’ కథని రాసుకున్నారు అర్జున్ సాయిగారు. ఈ సినిమాలో రంగస్థలం నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలుఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా ఉంటాయి’’ అని హీరోయిన్ రెజీనా కసాండ్రా అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా అర్జున్ సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్బిల్ పిక్చర్స్పై సురేష్పాటిల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు, కన్నడ, హిందీలో విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా రెజీనా కసాండ్రా మాట్లాడుతూ–‘‘ఉత్సవం’లో కార్పోరేట్ ఎం΄్లాయ్పాత్ర చేశా. చాలా స్వతంత్ర భావాలున్న క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. స్వతంత్ర భావాలున్న మహిళలకు నాపాత్ర నచ్చుతుంది. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు.. అన్ని వాణిజ్య అంశాలున్న కథ. దిలీప్ ప్రకాష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రకాష్ రాజ్గారు, నాజర్ గారు థియేటర్ ఆర్ట్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. రసూల్గారి అద్భుతమైన విజువల్స్, అనూప్ రూబెన్స్గారి చక్కని సంగీతం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నా మొదటి సినిమా ‘ఎస్ఎంఎస్’ చేసినప్పుడే వెర్సటైల్ నటిగా ఉండాలని భావించాను. అది దూరం కాకుండా ఇన్నాళ్లు వైవిధ్యమైనపాత్రలు చేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం సన్నీ డియోల్గారు హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమా చేస్తున్నాను. అలాగే మరో రెండు హిందీ చిత్రాలు ఒప్పుకున్నాను’’ అన్నారు. -
ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్.. ట్రైలర్ వచ్చేసింది!
దిలీప్ ప్రకాశ్, రెజీనా జంటగా నటించిన తాజా చిత్రం ఉత్సవం. ఈ సినిమాకు అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్బిల్ పిక్చర్స్ బ్యానర్పై సురేశ్ పాటిల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రంగస్థల నాటకం ప్రధాన అంశంగా ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూస్తుంటే ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, ప్రకాశ్ రాజ్, నాజర్, అలీ, ఎల్బీ శ్రీరామ్, అనీశ్, ఆమని, సుధా, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
‘రూరల్ విమెన్స్ లీడర్షిప్ ’కార్యక్రమంలో నటి రెజినా (ఫొటోలు)
-
పారా స్పోర్ట్స్ శిబిరంలో సినీ నటి రెజీనా సందడి (ఫొటోలు)
-
Regina Cassandra: టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రెజీనా (ఫొటోలు)
-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా.. మోడల్గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రెజీనా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరీస్పై దృష్టి పెట్టింది. వరుసగా వెబ్సీరీస్ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజను ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి.. కొన్నిరోజుల తర్వాత ఓ తమిళ స్టార్ హీరోతో సీక్రెట్గా రొమాన్స్ చేస్తుందని కూడా టాక్ వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అని తర్వాత తేలిపోయింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే అనుకుని సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్మేన్ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) -
Utsavam Movie: ఆకట్టుకుంటున్న ‘ఫస్ట్ కిస్’ సాంగ్
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్ని ప్రారంభించారు మేకర్స్. ‘ఫస్ట్ కిస్..’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేసింది యూనిట్. చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల పాడారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఉత్సవం’ రూపొందింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ‘ఫస్ట్ కిస్..’ పాట యువతను ఆకట్టుకుంటుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
చివరకు అలాంటి పాత్రలు కూడా చేస్తున్న స్టార్ హీరోయిన్!
రెజీనా పేరు చెప్పగానే తెలుగు యంగ్ హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు కెరీర్ అంతా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెబ్ సిరీసులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా హిట్ కావడం లేదు. దీంతో ఎలాంటి పాత్రకు అయినా సరే రెడీ అంటోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ 'విడమయూర్చి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అజిత్ పుట్టినరోజు కానుకగా మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కొత్త మూవీ చేస్తాడు. (ఇదీ చదవండి: అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!) -
ఓటీటీలోకి హారర్- థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా చూసేయండి
కోలీవుడ్లో ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో 'కంజూరింగ్ కన్నప్పన్' సూపర్ హిట్ కొట్టింది. సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సతీష్, రెజీనా, నాసర్, శరణ్య ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. హారర్-థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో మంచి కలెక్షన్స్ సాధించింది. డిసెంబర్ 8, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం. ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా జనవరి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళ్లో మాత్రమే బిగ్ స్క్రీన్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం, కన్నడలో కూడా విడుదల కానుంది. కథ : గేమింగ్ ఇండస్ట్రీపై చాలా ఆసక్తి ఉన్న సతీష్ ఉద్యోగం కోసం పలు ప్రయత్నాలు చేస్తు ఉంటాడు. అతను డ్రీమ్ క్యాచర్ అని పిలువబడే మంత్రముగ్ధమైన వస్తువును తీసుకొని దాని నుంచి అద్భుతాలు క్రియేట్ చేస్తాడు. అలా సతీష్ నిద్రలోకి జారుకున్నప్పుడల్లా స్వప్న ప్రపంచంలో దెయ్యం వలలో చిక్కుకుంటాడు. చివరికి అతని కుటుంబం తనలాగే చిక్కుకుపోవడంతో ఏం జరిగిందనేది సినిమా.. కామెడీ- హారర్తో పాటు ఇందులో థ్రిల్లింగ్ తెప్పించే సన్నివేశాలు కూడా ఉంటాయి. -
Regina Cassandra Traditional Pics: పొద్దు తిరుగుడు పువ్వులా రెజీనా ఎంత ముద్దుగా ఉందో! (ఫోటోలు)
-
నాకు సారీలో నడుము కనపడిన చిరాకు వస్తుంది..!
-
నువ్వు బాగాలేవు అని నాఫేస్ మీదనే అన్నాడు
-
ఎంత క్యూట్ పాడింది..!
-
చాలా కాలం తర్వాత రెజీనాకు గోల్డెన్ ఛాన్స్
అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నటి రెజీనాకు అవకాశం వరించినట్లు తాజా సమాచారం. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్ 62వ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది. విడాముయర్చి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఆది నుంచి పలు మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. ఈ చిత్రానికి ముందుగా విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగడంతో ఆ తర్వాత దర్శకుడు మగిళ్ తిరుమేణి పేరు తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది అతనే.. టాలీవుడ్పై షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్!) చిత్ర కథలోని చేర్పులు మార్పులు జరిగాయి. నటి త్రిష, బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా, విలన్గా అర్జున్ దాస్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఆ తర్వాత చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో అర్జున్ దాస్ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆ పాత్రను నటుడు ఆరవ్ పోషిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో నటి హ్యుమా ఖురేషీ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈమె ఇంతకుముందు అజిత్ జంటగా వలిమై చిత్రంలో నటించారు. కాగా ఇప్పుడు విడాముయర్చి చిత్రంలో ఆమెకు బదులు నటి రెజీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఈమెకు లక్కీ చాన్స్ అనే చెప్పాలి. ఇటీవల సరైన అవకాశాలు లేక వెబ్ సిరీస్ లో నటిస్తున్న రెజీనాకు ఈ చిత్రం నుంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా ఇన్ని మార్పులు చేర్పులు తర్వాత విడాముయర్చి చిత్రం షూటింగ్ అజర్బైజాన్ దేశంలో ప్రారంభమైంది. తదుపరి దుబాయ్ అబుదాబి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొని చివరిగా చైన్నెలో షూటింగ్ను ముగించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. కాగా దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
హార్రర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా!
టాలీవుడ్లో శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. కోలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించింది. ఇటీవలే ఓ వెబ్సిరీస్లోనూ నటించిన రెజీనా తాజాగా తమిళంలో కంజూరింగ్ కన్నప్పన్ అనే చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు సతీష నాజర్, శరణ్య పొన్వన్నన్, ఆనంద్రాజ్, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సెల్విన్ రాజ్సేవియర్ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) ఈ చిత్రం గురించి సెల్విన్ మాట్లాడుతూ.. ఇది హార్రర్, కామెడీ జానర్లో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. అయితే ఇది గత చిత్రాల తరహాలో ఉండదన్నారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలిపారు. హాలీవుడ్ స్టైల్లో కొన్ని విషయాలను చెప్పామన్నారు. వినూత్న కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని హార్రర్తో కూడిన ఫాంటసీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందించినట్లు చెప్పారు. ఇందులోని క్యాష్బ్యాక్ సన్నివేశాలను బ్రహ్మాండంగా చిత్రీకరించినట్లు తెలిపారు. మంచి చిత్రాన్ని చేయాలనే భావనతో నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనుకావట్లేదని చెప్పారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పూర్తి అయిందని.. మరోపక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు సెల్విన్ రాజ్సేవియర్ తెలిపారు. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్లో సెక్షన్ 108 చిత్రంలో నటిస్తోంది భామ. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. -
ఫోన్ చేసి అడ్జస్ట్మెంట్కు ఓకేనా అని అడిగాడు: రెజీనా
చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్లో స్టార్డమ్ను అందుకోలేకపోయింది. అయితే టాలీవుడ్లో ఈమె యువ కథానాయకులతో జత కట్టి మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వెబ్సిరీస్ల పైన దృష్టి సారిస్తోంది. తాజాగ కోలీవుడ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. (ఇదీ చదవండ: ఏపీలో పవన్ పొలిటికల్ భవిష్యత్పై మంచు విష్ణు కామెంట్!) రెజీనా తన పదిహేడేళ్ల వయసులో వెండితెరకు పరిచయం అయింది. ఆ సమయంలో చాలా మంది నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. 'నా సినీ కెరియర్ ప్రారంభంలో అవకాశాల కోసం కొందరిని సంప్రదించాను. దాంతో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తానని అడ్జస్ట్మెంట్కి ఓకే చెబితే తర్వాత వెంటనే షూటింగ్ పని చూసుకోవచ్చన్నాడు. ఇది జరిగి ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు అయింది. నా వయసు అప్పుడు కేవలం 20 ఏళ్లు. అతని మాటల పట్ల నాకు సరైన అవగాహన లేదు. అడ్జస్ట్మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు. రెమ్యునరేషన్ విషయంలో అడుగుతున్నారేమోనని, సరే నా మేనేజర్ నీతో మాట్లాడతారని ఫోన్ కట్ చేశాను.' అని రెజీనా తెలిపింది. (ఇదీ చదవండి: టైగర్ కా హుకూం ఈ విషయం తెలుసా.. ? జైలర్ సక్సెస్ సీక్రెట్ ఇదే) తర్వాత మేనేజర్ ద్వారా అసలు విషయం తెలిసింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి వేరే రకమైన కోరిక కోరాడని ఆర్థమైంది. ఆ సంఘటన తర్వాత మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు. అయితే కొందరు నటీమణులు మాత్రం ఇలాంటి ఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని నిజం కావచ్చు, కొన్ని అబద్ధం కావచ్చు. కొంత మంది నటీమణులు ఫేమ్ కోసం అబద్ధాలు కూడా చెబుతారు. నిజం ఏమిటో వారికి మాత్రమే తెలుసు అని రెజీనా అన్నారు. ప్రస్తుతం రెజినీ వెబ్ సీరిస్లతో పాటు పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. -
మంచి, చెడూ రెండూ ఎదుర్కొన్నా!
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల తెలుగులో ఆచార్య చిత్రంలో చిరంజీవితో కలిసి ఒక పాటలో నటించి అలరించింది. ఇక తమిళం విషయానికొస్తే ఇక్కడ కేడి బిల్లా కిల్లాడి రంగా చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్ర విజయంతో వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. అలా మానగరం, శరవణన్ ఇరుక్క భయమే, సిల్క్ వార్ పట్టి సింగం, మిస్టర్ చంద్రమౌళి చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరీస్పై దృష్టి పెట్టింది. ఇప్పుడు వరుసగా వెబ్సీరీస్ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇటీవల ఈమె మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ పేర్కొంటూ నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్స్పర్మెంట్ వేదికగా మారిందని పేర్కొంది. కొత్త కొత్త పాత్రలు వస్తున్నాయని చాలా కథలు హీరోయిన్ ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్నాయని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్ నటీనటులకు వరప్రసాదంగా మారిందని పేర్కొంది. ఇక అభిమానులకు పసందైన విందు అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ట్రెండ్ వెండితెరకు కూడా పాకితే బాగుంటుందని అంది. మొత్తంగా చూసుకుంటే ఇది అందరికీ మంచి అవకాశం అని చెప్పింది. సినిమా రంగంలో పురుషాధిక్యం గురించి చాలామంది మాట్లాడుతున్నారని, అయితే ఆడ మగ మధ్య తారతమ్యం అన్ని రంగాల్లోనూ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా హీరోల కంటే హీరోయిన్లకు పారితోషికం చాలా తక్కువే ఉంటుందని చెప్పింది. సినిమా అనేది గ్లామర్ ప్రపంచం కావడంతో ఇక్కడ జరిగే విషయాలు అధికంగా చర్చించబడతాయని, అదే కార్పొరేట్ రంగాల్లో అయితే నోరు మెదపరని చెప్పింది. తాను సినిమా రంగంలోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని పేర్కొంది. చాలా మార్పులు జరుగుతున్నాయని అంది. తాను 12 ఏళ్ల సినీ పయనంలో చాలా అనుభవాలను చవిచూవానని అందులో కొన్ని మంచి కొన్ని చెడ్డవి ఉన్నాయని రెజీనా పేర్కొంది. -
బ్రేకప్ జరిగింది.. నాకు రిలేషన్షిప్స్ సెట్ కావు : సందీప్ కిషన్
హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఈ సందర్భంగా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి తాను రిలేషన్షిప్లో లేనని, అయితే గతంలో ప్రేమలో పడి ఎదురుదెబ్బలు తగిలాయని పేర్కొన్నాడు. 'నేను చాలా ఎమోషనల్ పర్సన్. నాకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటాను. నాలాంటి వ్యక్తికి రిలేషన్షిప్స్ చాలా డేంజరస్. అవి నాకు సెట్ కావని అర్థమైంది. గతేడాది బ్రేకప్ జరిగింది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటకు వస్తున్నా' అంటూ పేర్కొన్నాడు. కానీ గతంలో ఎవరితో లవ్లో ఉన్నాడన్న విషయం మాత్రం చెప్పలేదు. కాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాతో సందీప్ డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేశాడు. -
రెజీనాతో లవ్? స్పందించిన సందీప్ కిషన్
యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసాండ్రా లవ్లో ఉన్నారంటూ కోలీవుడ్లో ఓ వార్త వైరల్గా మారింది. ఇటీవల రెజీనా బర్త్డేను పురస్కరించుకుని సందీప్ కిషన్.. 'హ్యాపీ బర్త్డే పాప, ఐ లవ్ యూ.. ఎప్పుడూ నీకు మంచే జరగాలి' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి రెజీనాతో క్లోజ్గా ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసి వారిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని తమిళనాట ప్రచారం జోరందుకుంది. తాజాగా దీనిపై సందీప్ కిషన్ స్పందించాడు. 'మేమిద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్యామిలీ మెంబర్లాగా! తను పని మీద బాంబే వచ్చినప్పుడు మా సోదరి గదిలోనే ఉంటుంది. 12 సంవత్సరాలుగా మేం ఒకరికొకరం తెలుసు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే! సందీప్- రెజీనా ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రస్ట్ ఉండదు. వీళ్ల మధ్య ఏదో ఉంది అంటే సర్ప్రైజ్ అవుతారు. అందుకని చెన్నై మీడియా మాగురించి తెలియక అలా రాసేశారు' అని క్లారిటీ ఇచ్చాడు సందీప్ కిషన్. Happpyyyy Birthdayyyy Papa… Love you and Wishing you only the best of everything,always ♥️ Stay Happy..Stay Blessed ♥️@ReginaCassandra pic.twitter.com/pZGd9d5ibn — Sundeep MICHAEL-Feb 3rd Kishan (@sundeepkishan) December 13, 2022 చదవండి: కాపురాలు కూల్చడం మాకు రాదు: సీనియర్ నటి -
హీరోలు లేకపోయినా.. సినిమాను నడిపించిన హీరోయిన్స్
సినిమాలో గ్లామర్ కావాలి.. అందుకేగా హీరోయిన్... స్పెషల్ సాంగ్ అదిరిపోవాలి... ఉన్నారుగా హీరోయిన్లు.. స్పెషల్ సాంగ్ చేసే తారలు.. ‘ఫీమేల్ స్టార్స్’ అంటే.. ఇంతకు మించి పెద్దగా ఆలోచించరు. హీరోయిన్లు కూడా గ్లామరస్ క్యారెక్టర్స్కి సై అంటారు. అయితే గ్లామర్కి అతీతంగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. సవాల్గా తీసుకుని ఆ పాత్రలను చేస్తారు. రిస్కీ ఫైట్స్ చేయడానికి కూడా వెనకాడరు. 2022 ఇలాంటి పాత్రలను చాలానే చూపించింది. హీరోయినే హీరోగా వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురిం తెలుసుకుందాం. ‘మహానటి’ (2018) చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయిం, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్కి ఓ మంచి చాయిస్ అయ్యారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ఆమె ‘పెంగ్విన్ మిస్ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. ఇక ఈ ఏడాది ‘గుడ్లక్ సఖి’, ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్లక్ సఖి’ జనవరి 28న థియేటర్స్లో విడుదలకాగా, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కింన ‘సాని కాయిదమ్’ మే 6 నుంచి డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఎలా బంగారు పతకం సాధింంది? అన్నది ‘గుడ్లక్ సఖి’ కథ. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే ఓ కానిస్టేబుల్ ఆవేదన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చిన్ని’. ఇక ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన ప్రియమణి ఈ ఏడాది ‘భామాకలాపం’ చేశారు. అభిమన్యు దర్శకత్వంలో రపొందిన ఈ సినివ ఫిబ్రవరి 11 నుం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో పక్కింటి విషయాలపై ఆసక్తి చూపిస్తూ, ఓ కుకింగ్ యూట్యూబ్ చానెల్ను రన్ చేసే అనుపమ ఇరుకుల్లో పడుతుంది. ఓ వ్యక్తి హత్యకి సంబంధింన మిస్టరీ నుంచి తనను కాపాడుకునే అనుపమ పాత్రను ప్రియమణి చేశారు. మరోవైపు ఐదారేళ్లుగా బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినివలు చేస్తున్న తాప్సీ 2019లో వచ్చిన ‘గేమ్ ఓవర్’ తర్వాత తెలుగులో ఈ ఏడాది ‘మిషన్ ఇంపాజిబుల్’లో నటించారు. చైల్డ్ ట్రాఫికింగ్ (న్నారుల అక్రమ రవాణా) నేపథ్యంలో రపొందిన ఈ చిత్రానికి ఆర్ఎస్ స్వరప్ దర్శకుడు. చిన్నారులను చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బారి నుం రక్షించే శైలజ పాత్రను తనదైన శైలిలో చేసి, మెప్పించారు తాప్సీ. ఏప్రిల్ 1న ఈ త్రం విడుదలైంది. ఇంకోవైపు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటింన ‘బ్లడీ మేరీ’ త్రం ఏప్రిల్ 15 నుం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యమన్ ట్రాఫికింగ్ ముఠా నేరాలకు మర్డర్, రివెంజ్ అంశాల టచ్ ఇచ్చి ఈ సినివను తెరకెక్కించారు చందు మొండేటి. అనాథ నర్సు మేరీ పాత్రలో నటించారు నివేదా పేతురాజ్. ఇక ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ (1996) తర్వాత ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్కుమార్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివలో టైటిల్ రోల్ చేశారు సుమ. అడిగినవారికి సాయం చేస్తూ, శుభ కార్యాలప్పుడు గ్రామస్తులకు ఈడ్లు (చదివింపులు) ఇచ్చే మంచి మనసు ఉన్న మనిషి జయమ్మ. హఠాత్తుగా జయమ్మ భర్తకు గుండెపోటు వస్తుంది. కానీ ఆ సమయంలో గ్రామస్తులు జయమ్మకు సహాయం చేయకపోగా, కొందరు విమర్శిస్తారు. ఆ తర్వాత జయమ్మ ఏం చేసింది? కుటుంబాన్ని ఎలా చక్క దిద్దుకుంది? అన్నదే కథాంశం. మే 6న ఈ సినిమా రిలీజైంది. ఇంకోవైపు పదేళ్ల తర్వాత అంటే 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్గా ‘హ్యాపీ బర్త్డే’అని చెప్పుకోవచ్చు. రితేష్ రానా తెరకెక్కింన ఈ చిత్రం జూలై 8న రిలీజైంది. దేశంలో గన్ కల్చర్ను ప్రోత్సహించే విధంగా ఓ కేంద్రమంత్రి గన్ బిల్లు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫ్యాంటసీ జానర్లో సాగే ఈ చిత్రంలో గన్ కల్చర్కు, హ్యాపీ అనే అమ్మాయి బర్త్డేకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ప్రధానాంశం. ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా రీమేక్ అయిన చిత్రం ‘శాకినీ డాకినీ’. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్లో ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీర్ వర్మ తెరకెక్కించారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి, అక్రమాలకు పాల్పడే ఓ ముఠా ఆట కట్టించే ఇద్దరు ఉమెన్ ట్రైనీ పోలీసాఫీసర్ల సాహసాల ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మరోవైపు సమంత తన కెరీర్లో దాదాపు యాభై సినివలు చేస్తే, వాటిలో ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’... లాంటి లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఈ ఏడాది ‘యశోద’ చిత్రం చేరింది. సమంత టైటిల్ రోల్లో హరి–హరీష్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం నవంబరు 11న రిలీజైంది. సరోగసీ సాకుతో మహిళలపై అఫయిత్యాలకు పాల్పడే ఓ ముఠా గుట్టును పోలీస్ ఆఫీసర్ యశోద ఎలా బయటపెట్టింది? అనే నేపథ్యంలో ‘యశోద’ సినిమా సాగుతుంది. అలాగే సమంత టైటిల్ రోల్ చేసిన మరో చిత్రం ‘శాకుంతలం’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మైథలాజికల్ ఫిల్మ్కు గుణశేఖర్ దర్శకుడు. ఇక ఐదారేళ్లుగా ప్రతి ఏడాదీ నయనతార నటింన ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అయినా వీక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఆమె నటింన ‘ఓ2’ త్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్లో జూన్ 17 నుం స్ట్రీమింగ్ అవుతోంది. జీఎస్ విఘ్నేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథలో పార్వతిని ట్రాప్ చేస్తారు. సడన్గా అక్కడ ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఆ పరిస్థితుల నుంచి పార్వతి ఎలా బయటపడింది? తన కొడుకును ఎలా కాపాడుకోగలిగింది? అన్నదే కథ. అలాగే నయనతార నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కనెక్ట్’ ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇక అనుపమా పరమేశ్వరన్ నటింన తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. గంటా సతీష్ బాబు ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం ఈ 29 నుం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ‘కథనాయిక ప్రాధాన్యం’గా సాగే చిత్రాల్లోనూ, వెబ్ సిరీస్లోనూ నటించారు. ఈ ప్రాజెక్ట్స్లో కొన్ని సక్సెస్ కాగా, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే నటనపరంగా మాత్రం హీరోయిన్లు హిట్టే. -
హీరో సందీప్ కిషన్తో రెజీనా డేటింగ్? వైరల్గా మారిన పోస్ట్
తమిళసినిమా: ప్రస్తుతం వార్తల్లో ఉన్న నటి రెజీనా కసాండ్రా. ఈ చెన్నై అమ్మాయి బహుభాషా కథానాయికగా రాణిస్తోంది. తమిళంలో కండనాళ్ ముదల్ చిత్రంతో 2017లో కథానాయకిగా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న రెజీనా కేడి బిల్లా కిలాడి రంగ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత టాలీవుడ్కు పరిచయమైంది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ బ్యూటీ ఎక్కువ చిత్రాలు చేయడం, కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. అదేవిధంగా ఈ 32 ఏళ్ల అమ్మాయి ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాలర్గానే ఉంది. అయితే ఈ అమ్మడి ప్రేమ గురిం రకరకాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య ఒక టాలీవుడ్ యువ నటుడి ప్రేమలో గాఢంగా మునిగిపోయిందని ప్రచారం హోరెత్తింది. తాజాగా మరో యువ నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఆ సందర్భంగా నటుడు సందీప్ కిషన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఆయన ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు పాప. ఐ లవ్ యూ. ఎప్పుడూ నీకు మంచే జరగాలి అని ట్విట్టర్లో పేర్కొని నటి రెజీనాతో తను సన్నిహితంగా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి వార్తలపై నటి రెజీనా, సందీప్ కిషన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. Happpyyyy Birthdayyyy Papa… Love you and Wishing you only the best of everything,always ♥️ Stay Happy..Stay Blessed ♥️@ReginaCassandra pic.twitter.com/pZGd9d5ibn — Sundeep MICHAEL Kishan (@sundeepkishan) December 13, 2022 -
‘శాకిని డాకిని' మూవీ ట్విట్టర్ రివ్యూ
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని'.డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)విడుదలయ్యింది. యాక్షన్, డ్రామా, హాస్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. కొరియన్ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' రీమేక్ అయిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘శాకిని డాకిని' చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ రివ్యూ ఏంటో మీరే చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. కొన్ని సన్నివేశాల విషయంలో లాజిక్ మిస్ అయ్యిందని నెటిజన్లు పేర్కొన్నారు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకోలేక పోయారని,సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉండవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. #SaakiniDaakini Movie Review: ⭐⭐⅓ A Decent 1st Half & A Disappointing 2nd Half Comedy Worked in Parts, But if failed in making audience engaging - Runtime less than 2hrs A Below Par Watch #SaakiniDaakiniReview@i_nivethathomas @ReginaCassandra — Thyveiw (@Thyveiw) September 16, 2022 #SaakiniDaakini Ok Ok Sunday Show Confirm 🥲 — Chandra Sekhar ᥫ᭡ (@kvvcsr1432) September 16, 2022 Showtime @i_nivethathomas @ReginaCassandra starrer #SaakiniDaakini Playing with subs pic.twitter.com/8EyKPZnxGB — வன்மமொழிவர்மன் (@naveenversion2) September 16, 2022 -
‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం
‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న ఓ పెద్ద నేరం గురించి ఇండియాలో ఎవరూ మాట్లాడటం లేదు. మా ‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం కాబట్టి ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి’’ అని నిర్మాత సునీత తాటి అన్నారు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘గురు ఫిల్మ్స్పై నిర్మించిన 7వ చిత్రం ‘శాకిని డాకిని’. మహిళల సమస్యలపై మహిళలే మాట్లాడితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారని లీడ్ రోల్స్లో రెజీనా, నివేదలను తీసుకున్నాం. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. ఇదొక యూనివర్శల్ కథ.. అందరికీ నచ్చుతుంది. సుధీర్ వర్మ వేరే షూటింగ్లో ఉండటం వల్లే ‘శాకిని డాకిని’ ప్రమోషన్స్లో పాల్గొనలేదు.. నేటి నుంచి పాల్గొంటారు. సురేశ్ బాబుగారితో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. మన చిత్రాలు కొరియన్, జపాన్ భాషల్లో చాలా రీమేక్ అవుతున్నాయి. థియేటర్లో సినిమా చూసినప్పుడు అందరం నవ్వుతాం.. ఏడుస్తాం. అదే ఓటీటీలో అయితే ఇంట్లో పర్సనల్గా అనుభూతి పొందుతాం. థియేటర్ అనుభూతే వేరు. మా బ్యానర్లో మరో నాలుగు కొరియన్ సినిమాలు రీమేక్ చేయనున్నాం.. వాటిలో సమంతతో ఓ సినిమా ఉంటుంది. డైరెక్టర్ బాపుగారంటే నాకు ఇష్టం. ఆయనలాంటి మూవీస్తో పాటు, ‘అవతార్’ లాంటి ఫ్యాంటసీ సినిమాలు డైరెక్ట్ చేయాలనుంది.. చేస్తాను’’ అన్నారు. -
అది అప్పుడే ముగిసిపోయింది.. ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో..
చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్లో స్టార్డమ్ను అందుకోలేకపోయింది. అయితే టాలీవుడ్లో ఈమె యువ కథానాయకులతో జత కట్టి మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వెబ్సిరీస్ల పైన దృష్టి సారిస్తోంది. ఇటీవల తెలుగు ఆచార్య చిత్రంలో చిరంజీవి, రామ్చరన్లతో ఐటెం సాంగ్ చేసింది. కాగా ఈమె సినీ జీవితం సాఫీగానే సాగుతున్నా, వ్యక్తిగత జీవితం మాత్రం సంతృప్తిగా సాగటం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం ఈమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తాజాగా రెజీనా పెళ్లికి సిద్ధమవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనిపై స్పందించిన రెజీనా ఓ భేటీలో పేర్కొంటూ తన ప్రేమ 2020లోనే ముగిసిందని చెప్పింది. దాని నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టిందని చెప్పింది. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని తెలిపింది. ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై మాట్లాడటానికే తనకు ఇష్టం లేదని అంది. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తనకే తెలియదని అంది. ఎందుకంటే ఎదురువారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించడం అనే అంశాన్ని చిన్నతనంలోనే తన తల్లి తనకు నేర్పిందాని వెల్లడించింది. ఈనేపథ్యంలో జీవితంలో తోడు కావాలా? వద్దా? అన్ని విషయాలు కూడా ఇకపై ఆలోచించనని రెజీనా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంచలన నటి తమిళం, తెలుగు భాషల్లో తలా మూడు చిత్రాలు చేస్తూ బిజీగానే ఉంది. -
అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారు...? జర్నలిస్ట్పై రెజీనా ఫైర్
జర్నలిస్ట్పై హీరోయిన్ రెజీనా ఫైర్ అయింది. అందర్ని ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా? అమ్మాయిల్ని గొప్పగా చూపిస్తూ సినిమా తీస్తే మీరు ఏంటి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని సీరియస్ అయింది. వివరాల్లోకి వెళితే.. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్గా రూపొందిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. డి. సురేష్బాబు, సునీత తాటి, హ్యూన్యు థామస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. (చదవండి: ప్రతి వారం ఓ బాహుబలి రాదు) ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ విలేకరి.. ‘మేడమ్ మీరు ఈ చిత్రంలో ఓసీడీ ఉన్నట్లు నటించారు కదా? నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న రెజీనాను ఇబ్బందికి గురిచేసింది. ‘మీరు అందర్ని ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా? సినిమాలో మేము కేవలం నటిస్తామంతే. పాత్ర డిమాండ్ మేరకు మేము అలా చేస్తాం. అంత మాత్రాన నాకు ఓసీడీ ఉంటుందా? అమ్మాయిల్ని గొప్పగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాంటిది మీరు నా పాత్ర, ఓడీసీ గురించి అడుగుతారేంటి? అసలు ఓసీడీ అంటే ఏంటో మీకు తెలుసా? వ్యక్తిగతంగా నేను శుభ్రతను ఇష్టపడతాను . ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్డర్స్ నాకు లేవు. ఓడీసీ ఉన్న అమ్మాయి పాత్రలో నటించానంతే’ అని రెజీనా బదులిచ్చింది. అయితే సదరు విలేకరు మాత్రం తాను అడిగిన ఉద్దేశం వేరని వివరణ ఇచ్చాడు. ‘కరోనా తర్వాత అందరూ పరిశుభ్రత ఎక్కువగా పాటిస్తున్నారు కదా..మీరు కూడా అలానే ఉండడానికి ఇష్టపడతారా? అనేది నా ప్రశ్న ఉద్దేశం’అని చెప్పడంతో రెజీనా నవ్వుతూ.. ‘నేను పరిశుభ్రంగానే ఉంటాను..అందరూ అలానే ఉండాలి’అని బదులిచ్చారు. -
ప్రతివారం ఓ బాహుబలి రాదు
‘‘నా దృష్టిలో కథ అనేది ఓ ప్రయాణం. కానీ కొన్ని పరిమితుల కారణంగా కథారచయితలకు మనం ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వడం లేదని నాకనిపిస్తుంటుంది. అందుకే ఎక్కువగా కొరియన్ సినిమాలను రీమేక్ చేస్తున్నాం. అయినా కథలో సోల్ను తీసుకుని, మన నేటివిటికీ తగ్గట్లుగా మార్పులు చేయడం అనేది సులువైన పనేం కాదు. ‘శాకిని డాకిని’ సినిమాకు అక్షయ్ అనే కుర్రాడు స్క్రీన్ప్లే అందించాడు’’ అన్నారు సునీత తాటి. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్గా రూపొందిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. డి. సురేష్బాబు, సునీత తాటి, హ్యూన్యు థామస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఓ క్రైమ్ను ఎలా డీల్ చేశారు? అన్నదే ఈ సినిమా కథ. ‘మిడ్నైట్ రన్నర్స్’ చిత్రంలో హీరోలు నటించారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్స్ను పెట్టాం. ఇక మన దగ్గర కాస్త కథల కొరత ఉందని నా ఫీలింగ్. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లిన రాజమౌళిగారు ఉన్నారు. కానీ ప్రతి వారం ‘బాహుబలి’ లాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చే సినిమాలు థియేటర్స్కు రావు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రీమేక్ రైట్స్ కావాలని కొందరు ఫిల్మ్మేకర్స్ నన్ను సంప్రదించారు. ఈ విషయాన్ని రాజమౌళిగారి దృష్టికి తీసుకుని వెళ్లాను’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంలో దామిని అనే పాత్ర పోషించాను. ఈ సినిమా నా కెరీర్లో ఓ మైల్స్టోన్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రెజీనా. ‘‘ఈ చిత్రంలో షాలిని పాత్ర చేశాను. ఈ సినిమా చూసేందుకు థియేటర్కి వచ్చే ప్రేక్షకుల టికెట్ డబ్బులు వృథా కావనే నమ్మకం మాకుంది’’ అన్నారు నివేదా థామస్. చదవండి: (నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే) -
ఆకట్టుకుంటున్న ‘శాకిని-డాకిని’ టీజర్
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శాకిని డాకిని’. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్’కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: క్యూట్నెస్ ఓవర్లోడెడ్..మెరుపు తీగలా తయారైన హన్సిక!) టీజర్ ప్రకారం శాలిని(నివేదా థామస్) ఫుడ్ లవర్కాగా, దామిని(రెజీనా)కి ఓసీడీ సమస్యతో ఉంది. ఇద్దరు పోలీసు అకాడమీలో ట్రైనీలుగా జాయిన్ అవుతారు. శిక్షణా శిబిరంలో ఇద్దరు తక్కువ పనితీరు కనబరుస్తున్నారు. అంతేకాదు అనవసరమైన విషయాల్లో తగాదాలు పెట్టుకుంటున్నట్లు టీజర్లో చూపించారు. ఓ నేరస్థుడు ఒక అమ్మాయిని తలపై కొట్టినట్లుగా ప్రధాన కథ ను చూపించడం జరిగింది. ఈ అమ్మాయిలు తగిన సమయంలో తమ నైపుణ్యాలను ఎలా చూపిస్తారనే దాని గురించి టీజర్ ఉంది. టీజర్ను బట్టి చూస్తే, సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ సబ్జెక్ట్ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించాడు. ఈ చిత్రానికి రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, మైకీ మెక్క్లియరీ సంగీతం అందిస్తున్నారు. -
అనసూయ-రెజినా ‘ఫ్లాష్ బ్యాక్’ నుంచి ఆసక్తికర అప్డేట్
రెజీనా, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా కీ రోల్ పోషిస్తున్నాడు. డాన్ సాండీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్లో ఏఎన్ బలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇటీవలె షూటింగ్ను పూర్తి చేసుకున్న ఇప్పటి వరకు పోస్ట్ ప్రాడక్షన్ పనులతో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వదిలారు మేకర్స్. ‘ఫ్లాష్ బ్యాక్’ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సీజీ పనులు కూడా పూర్తవుతాయని మేకర్స్ తెలిపారు. చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ఇక అతిత్వరలోనే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తామని ఈ నేపథ్యంలో ముందుగా ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. ఇక తొందర్లోనే మూవీ విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని దర్శక-నిర్మాతలు చెప్పారు. కాగా తెలుగు తమిళంలో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. కాగా మేరకు దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో రెజినా ఆంగ్లో-ఇండియన్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతుంది’ అని తెలిపారు. శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు రాశారు. నందు తుర్లపాటి మాటలు అందించారు. -
దాని కోసం నేను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వచ్చింది: రెజీనా
‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్కు పరిచమైన బ్యూటీ రెజీనా కసాండ్రా. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా.. నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ సినిమాల్లో నటించింది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎవరు సినిమా తర్వాత రెజీనా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం వెండితెరపై ఆమె జోరు పెద్దగా కనిపించడం లేదు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న గాడ్సే.. ఎప్పుడు, ఎక్కడంటే! ఆడపదడప చిత్రాలు చేస్తూ కెరీర్ను ముందుకు వెళుతోంది ఆమె. తాజాగా ఆమె అన్యాస్ ట్యుటోరియల్ అనే వెబ్ సీరిస్లో నటించింది. ఇటీవల ఈ సిరీస్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రిలీజైంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాను గర్భవతిని అనే అబద్ధాం చెప్పాల్సివచ్చిందనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మిస్టీ దోయ్ అనే స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. స్వీట్ తిందామని రాత్రి సమయంలో షాప్ దగ్గరకు వెళ్లాను. అయితే అప్పుడే ఆ స్వీట్ షాప్ కట్టేస్తున్నారు. నేను ఆ షాప్ అతన్ని స్వీట్ కావాలని అడిగాను. అతను షాప్ కట్టేశామని చెప్పాడు. అప్పుడు నేను ప్రగ్నెంట్ అని, మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపిస్తుంది అని అతడికి చెప్పాను. దీంతో షాప్ తెరిచి ఆ స్వీట్ ఇచ్చాడు. ఇలా ఒక స్వీట్ కోసం ప్రగ్నెంట్ అని అబద్దం చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చింది రెజీనా. కాగా ఇటీవల ఆచార్య మూవీలో స్పెషల్ సాంగ్లో మెరిసిన రెజీనా ప్రస్తుతం ఆమె నేనేనా, శాకినీ ఢాకినీ సినిమాలు చేస్తోంది. -
అబ్బాయిలను కొట్టేదాన్ని: రెజీనా కసాండ్రా
హీరోయిన్ రెజీనా కసాండ్రా నటించిన తాజా వెబ్ సిరీస్ అన్యాస్ ట్యుటోరియల్. ఈ సిరీస్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పుడే స్కూల్లో యాంకరింగ్ చేసేదాన్ని అని రెజీనా తెలిపింది. అంతేకాదు, క్లాస్ లీడర్గా ఉన్నప్పుడైతే ఏకంగా అబ్బాయిలను కొట్టేదాన్నని పేర్కొంది. దీంతో చాలామంది తాను డామినేటింగ్ అని చెప్తారని, తన ఫిజిక్ చూసి కూడా అందరూ డామినేటింగ్ అనుకుంటున్నారని చెప్పుకొచ్చింది. ఆచార్య సినిమా విషయానికి వస్తే అందులో చిరంజీవిగారు ఈ వయసులో కూడా చాలా తొందరగా డ్యాన్స్ నేర్చుకున్నాడని, అది గొప్ప విషయమని తెలిపింది. ఇక తన విషయానికి వస్తే.. తనకు పాత్ర నచ్చితే అందుకోసం ఏదైనా చేస్తానంది. 2019లో కులుమనాలీలోని హోటల్లో ఐ మాస్క్ పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఎవరో నుదురిని తాకినట్లు అనిపించిందని, మాస్క్ తీసేసి చూస్తే అక్కడ ఎవరూ లేరంటూ తనకు భయం వేసిన సంఘటనను వివరించింది. కాగా కంద నాల్ ముదల్ అనే తమిళ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది రెజీనా. శివ మనసులో శ్రుతి(SMS) మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా.. నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నేనే నా, శాకినీ ఢాకినీ సినిమాలు చేస్తోంది. చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శ్రుతి? హీరోయిన్ క్లారిటీ జూలై రెండో వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్ల లిస్టు ఇదిగో! -
'ఆహా'లో భయపెట్టనున్న సైకలాజికల్ హర్రర్ వెబ్ సిరీస్
Regina Anyas Tutorial Web Series OTT Release Date Announced: 'బాహుబలి' చిత్ర నిర్మాణ సంస్థ 'అర్కా మీడియా వర్క్స్' తాజాగా వెబ్ సిరీస్ రంగంలోకి ప్రవేశించింది. ఈ సంస్థ తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన వెబ్ సిరీస్ 'అన్యాస్ ట్యుటోరియల్'. ఈ వెబ్ సిరీస్ ద్వారా పల్లవి గంగి రెడ్డి దర్శకురాలిగా పరిచయం అయ్యారు. హీరోయిన్ రెజీనా, నివేదిత సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ జులై 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయం గురించి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ఇది తమ తొలి తమిళ వెబ్ సిరీస్ అని, ఆహాతో కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దర్శకురాలు పల్లవి మాట్లాడుతూ తాను ఆహాలో పనిచేశానని, ఈ సంస్థ మంచి కథలనే ఇష్టపడుతుందన్నారు. ఈ వెబ్ సిరీస్ రెండు భాషల్లో రూపొందించడం వల్ల ఎక్కువ శ్రమించాల్సి వచ్చిందన్నారు. 'అన్యాస్ ట్యుటోరియల్' వంటి సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రావడం సంతోషకరం అని హీరోయిన్ రెజీనా పేర్కొంది. కాగా ఇటీవల విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలకు మంచి స్పందన లభిస్తోంది. (చదవండి: హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..) -
లేడీస్ స్పెషల్ సినిమాలపై హీరోయిన్ల కన్ను!
బస్సుల్లో లేడీస్ స్పెషల్ బస్సులుంటాయి.. గుడిలో లేడీస్ స్పెషల్ క్యూలుంటాయి.. లేడీస్ స్పెషల్ టికెట్ కౌంటర్లుంటాయి... మరి సినిమాల్లో... ఇక్కడా లేడీస్ స్పెషల్స్ ఉంటాయి. స్పెషల్గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి. ఈ సినిమాలను కథానాయికలు సవాల్గా తీసుకుంటారు. ఆ ‘లేడీస్ స్పెషల్’ సినిమాల గురించి తెలుసుకుందాం. ‘అనామిక’, ‘మాయ’, ‘డోర’... ఇలా ఇప్పటికే కెరీర్లో పలు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసి, ప్రేక్షకులను మెప్పించారు నయనతార. ప్రస్తుతం ఆమె చేస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘కనెక్ట్’. 2015లో నయనతార నాయికగా ‘మాయ’ సినిమాను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ ‘కనెక్ట్’కు దర్శకుడు. ఇది థ్రిల్లర్ జానర్ మూవీ. ఈ చిత్రానికి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మాతలు. ఇక 2007లో వచ్చిన ‘పరుత్తి వీరన్’లో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు సాధించిన హీరోయిన్ ప్రియమణి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై కూడా దృష్టి సారించారు. ఇటీవల హిట్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్’లో ఓ లీడ్ రోల్ చేసి అందర్నీ మెప్పించిన ప్రియమణి చేతిలో ప్రస్తుతం ‘సైనైడ్’, ‘కొటేషన్ గ్యాంగ్’ అనే రెండు ఉమెన్ సెంట్రిక్ ఫిలింస్ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ క్రైమ్ థ్రిల్లర్సే కావడం విశేషం. ‘సైనైడ్’ చిత్రానికి రాజేష్ టచ్రివర్ దర్శకుడు కాగా, ‘కొటేషన్ గ్యాంగ్’ చిత్రానికి వివేక్ దర్శకుడు. మరోవైపు ‘హ్యాపీ బర్త్డే’ అనే క్రైమ్ థ్రిల్లర్లో లావణ్యా త్రిపాఠి లీడ్ రోల్ చేస్తున్నారు. ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఇక యాభై సినిమాలు చేసిన అనుభవం ఉన్న సమంత ఒక్కసారిగా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’, ‘యశోద’, ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో శాంతరూబన్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్లోనూ సమంత భాగమయ్యారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉంది. హరి అండ్ హరీష్ ద్వయం తెరకెక్కిస్తున్న ‘యశోద’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, మిగతా చిత్రాల రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. ‘శాకుంతలం’ చిత్రం ఈ ఏడాది వెండి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు డీకే దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న తమిళ చిత్రం ‘కరుంగా ప్పియమ్’లో కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇక రెజీనా నటించిన మరో లేడీ ఓరియంటెడ్ సినిమా ‘శాకిని డాకిని’. ఇందులో నివేదా థామస్ మరో హీరోయిన్. సుధీర్వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే కీర్తీ సురేష్ గుర్తు రాకుండా ఉండరు. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’తో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్కు ఓ బెస్ట్ ఆప్షన్గా మారారు కీర్తి. ఈ చిత్రం తర్వాత కీర్తి ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేశారు. తాజాగా చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గుడ్లక్ సఖి’. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఇటు దాదాపు తొమ్మిది ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న హన్సిక చేతిలో మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. ‘మై నేమ్ శ్రుతి’, ‘105 మినిట్స్’, ‘రౌడీ బేబీ’.. హన్సిక చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఇవే. ఇంకోవైపు ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు చేయడానికి ముందు వరుసలో ఉండే సాయిపల్లవి ఇటీవల ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ చేశారు. ఈ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక వీరితోపాటు మరికొందరు హీరోయిన్స్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్తో సెట్స్లో బిజీగా ఉన్నారు. కెరీర్ మొత్తంలో ఏ హీరోయిన్కి అయినా గ్లామర్ క్యారెక్టర్స్కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అందుకే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు అవకాశం వస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఈ సినిమాలను ‘స్పెషల్’గా భావించి, హార్డ్ వర్క్ చేస్తారు. హిందీలో లేడీస్ స్పెషల్స్ బాలీవుడ్లోనూ లేడీ ఓరియంటెడ్ చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. బీ టౌన్ క్వీన్ కంగనా రనౌత్ చేతిలో ప్రస్తుతం మూడు (‘థాకడ్’, ‘ఎమర్జెన్సీ’, ‘తేజస్’) ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఉన్నాయి. అలాగే తాప్సీ చేతిలో ఐదు (శభాష్ మిథు’, దోబార’, లూప్ లపేట’, ‘బ్లర్’, ‘ఓ లడకీ హై కహాన్’) ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా ‘ద్రౌపది’లో దీపికా పదుకోన్, ‘గుంగూబాయి కతియావాడి’లో ఆలియా భట్, ‘జీ లే జరా’లో ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్, ‘ది లేడీ కిల్లర్’లో భూమీ ఫడ్నేకర్, ‘ఉమ’లో కాజల్ అగర్వాల్, ‘చత్రీవాలీ’లో రకుల్ప్రీత్ సింగ్, ‘గుడ్లక్ జెర్రీ’లో జాన్వీ కపూర్... ఇలా మరికొందరు హీరోయిన్స్ ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనా దృష్టి పెడుతున్నారు. -
క్లైమాక్స్ లేకుండా రిలీజైన రానా మూవీ, ప్రేక్షకుల అసహనం..
Rana Daggubati 1945 Movie Released Without Climax: స్టార్ హీరో రానా ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు సత్య శివ 2016లో తెరకెక్కించిన చిత్రం 1945. బ్రిటీష్ పాలన నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇందులో హీరోయిన్గా రెజీన నటించగా.. నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాహుబలి సినిమా సమయంలో రానా ఈ మూవీకి కమిట్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో షూటింగ్ చివరి దశలో ఉందనగా ఈ మూవీ నిర్మాత సి. కల్యాన్, దర్శకుడు సత్య శివ, రానాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రానా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో 90 శాతం పూర్తయిన షూటింగ్ ఆగిపోయింది. చదవండి: Sukumar: మణిరత్నం గారంటే అభిమానం, కానీ కలిసేందుకు వెళ్లిన నాతో సీరియస్గా.. ఇదిలా ఉంటే నాలుగేళ్ల తర్వాత ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్టుగానే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ ఈ మూవీని జనవరి 7న థియేటర్లో విడుదల చేశారు మేకర్స్. అయితే 1945 చూసిన వాళ్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు క్లైమాక్స్ లేదని, ఎడింగ్ కూడా సరిగా లేదు. సినిమా అంతా అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రుకటించిన వెంటనే రానా స్పందిస్తూ ట్వీట్ చేశాడు. చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్ ‘సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరగలేదు. అలాగే నిర్మాత నుంచి నాకు రావాల్సిన రెమ్యునరేషన్ అందలేదు. డబ్బుల కోసమే పూర్తికాని సినిమాను విడుదల చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు’ అంటూ రాసుకొచ్చాడు. ఇక రానా ట్వీట్ నిర్మాతలు రిప్లై ఇస్తూ.. ‘సినిమా పూర్తి అయ్యిందా లేదా అనేది దర్శకులది తుది నిర్ణయం’ అంటూ అనడంతో రానా ఒకే అన్నట్లుగా థంమ్స్ప్ ఎమోజీనితో స్పందించాడు. కాగా ఈ సినిమా సుభాశ్ చంద్రబోస్ జీవిత కథ, ఆయన మరణం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ మూవీ ఆన్లైన్ వెబ్సైట్లో లీకైంది. మూవీరూల్స్, తమిళరాక్స్ వంటి వెబ్సైట్లలోకి అందుబాటులో ఉంది. -
చిరు సరసన స్టెప్పులేసిన రెజీనా
-
షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా!
Anasuya Bharadwaj Shocking Look Goes Viral: ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న అనసూయ పొట్టిపొట్టి దస్తులు, చీరకట్టులు అందాల అరబోస్తూ ఏ రేంజ్లో గ్లామర్ ఒలకబోతుందో తెలిసిందే. ఇక సినిమాల్లో కూడా నటిగా రాణిస్తున్న అనసూయ పాత్ర నచ్చితే అది గ్లామరైన, డీగ్లామరైన సై అంటుంది. పాత్ర ప్రాధాన్యత ఉందంటే చాలు ఏ స్థాయిలో ఎక్స్పోజింగ్ ఇవ్వమన్న ఇస్తుంది.. లేదా గ్రామీణ మహిళగా ఎంతటి డీగ్లామర్కైన ఒకే చెబుతుంది. ఇలా విమర్శలు, ప్రశంసలు అందుకుంటూ అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నటిగా దూసుకుపోతోంది. చదవండి: బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ ఈ క్రమంలో ఆమె తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప. ఈ మూవీలో ద్రాక్షాయణిగా అనసూయ డిఫరెంట్ లుక్లో కనిపించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఆమెకు సంబంధించిన రెండు ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే అది చూసి అందరూ షాకయ్యారు. ఏంటి అనసూయ పుష్పలో ఈ రేంజ్ ఎక్స్పోజింగ్ ఇచ్చిందా?అని ముక్కున వేలెసుకుంటున్నారంతా. తీరా గమనించి చూడగా ఈ లుక్లో తేడా కనిపించింది. ఇవి ఎక్కడివని అని ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది. ఇది ఆమె తాజాగా నటిస్తున్న ‘ఫ్లాష్ బ్యాక్’ చిత్రం లోనిది. చదవండి: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో, ఇలా హింట్ ఇచ్చాడుగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా, నటి రెజీనా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ప్రభుదేవా, రెజీనా లుక్తో పాటు అనసూయకు సంబంధించిన లుక్ను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలో అనసూయకు సంబంధించిన మరో ఫొటో కూడా బయటకు వచ్చింది. ఈ రెండు ఫొటోలను కలిపి నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇందులో అనసూయ మత్తిచ్చే రేంజ్లో గ్లామర్ను ప్రదర్శించింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఫ్లాష్బ్యాక్ ఫస్ట్లుక్: అనసూయను చూశారా?
Flashback Movie First Look: ప్రభుదేవా, రెజినా, అనసూయల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫ్లాష్బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి రమేష్ పిళ్లై నిర్మిస్తున్నారు. డాన్ సాండీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల మూవీకి సంబంధించిన రెండు విభిన్న పోస్టర్లను విడుదల చేశారు. మొదటి దాంట్లో ప్రభుదేవా, రెజీనాల లవ్ ట్రాక్ చూపిస్తే. రెండో దాంట్లో అనసూయ తన లుక్తో ఆకట్టుకుంది. ఈ రెండు పోస్టర్లకు విశేషమైన స్పందన లభిస్తోంది. ‘ఈ చిత్రం యూత్ను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. అంతకు మించి కథను చెప్పే విధానం బాగుంటుంది. టైటిల్, ట్యాగ్ లైన్తోనే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాలో ప్రతీ సీన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెజీనా ఇందులో ఆంగ్లోఇండియన్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. అనసూయ పాత్ర సినిమాకు హైలెట్ కానుంది’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. శామ్ సీఎస్ అందిస్తున్న మ్యూజిక్ ప్రధాన బలం. చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు అందిస్తున్నారు. ద్విభాష చిత్రంగా రాబోతోన్న ‘ఫ్లాష్ బ్యాక్’కు తెలుగులో నందు తుర్లపాటి సంభాషణలు రచిస్తున్నారు. తమిళ డైలాగ్స్ను దర్శకుడే రాసుకున్నారు. నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
బ్రేకింగ్ న్యూస్తో వచ్చేస్తున్న హీరోయిన్ రెజీనా
Regina Cassandra: హీరోయిన్ రెజీనా కసాండ్ర 'బ్రేకింగ్ న్యూస్'తో ముందుకు రానుంది. సుబ్బరాజు, జె.డి. చక్రవర్తిలతో కలిసి రెజీనా నటించిన సినిమా ‘బ్రేకింగ్ న్యూస్’.సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమయ్యింది. తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం వరకు కొనసాగుతుంది. రా ఎంటర్ టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు. వైవిధ్యమైన కథనంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, ఈశ్వర్ ఎలుమహంతి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. -
డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్పై ట్రోలింగ్
Regina Cassandra Trolled For Promoting Whiskey: సాధారణంగా సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు యాడ్స్ చేస్తూ రెండు వైపులా సంపాదిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్లు చేసే ప్రమోషన్స్ వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఓ కంపెనీ అల్కహాల్ను ప్రమోట్ చేస్తూ చేతిలో మందు గ్లాసు పట్టుకొని స్టైల్గా ఫోజిచ్చిన రెజీనా ఇన్స్టా పోస్ట్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా అంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యపానం అనారోగ్యమని తెలిసినా డబ్బుల కోసం ఇలా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ఈ ఫోటో చూశాక మీ మీద గౌరవం పోయింది. ఇప్పుడే మిమ్మల్ని అన్ఫాలో అవుతున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇక ఇటీవలె పొగాకు బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నందుకు అమితాబ్పై విమర్శలు రావడంతో ఆ యాడ్ నుంచి ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) -
నన్ను ప్రేమించాల్సిందేనంటున్న ఆషురెడ్డి.. చెట్టెక్కిన రెజీనా
నేచురల్ స్టార్ నానితో సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకుంది సింగర్ మధు ప్రియ అవార్డు చేతపట్టి చెట్టు ఎక్కి నవ్వులు చిందిస్తుంది రెజీనా కూతురితో ఫోటోలను అభిమానులతో పంచుకుంది నటి, యాంకర్ హరితేజ ప్రతి రోజు ఒక అద్భుతం కోసం వెతకండి అంటున్న అమృత అయ్యర్ మనసుకి ఏది నచ్చితే అదే చేయండి అని చెబుతోంది ‘గద్దలకొండ గణేశ్’ ఫేం మృణాళిని రవి. అందమైన ఫోటోలు షేర్ చూస్తే కుర్రకారుల మతులు పొగొడుతోంది అమలాపాల్ నేను నిన్ను ప్రేమిస్తున్నా.. నువ్వు నన్ను ప్రేమించాల్సిందే అంటుంది ఆషు రెడ్డి View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Madhuppriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhuppriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
‘నేనే… నా?’ అంటూ భయపెట్టిస్తున్న రెజీనా
Regina Cassandra: వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి రెజీనా కసాండ్ర. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘నేనే… నా?’అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీగా రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తుంది. నిను వీడని నీడను నేనే వంటి హిట్ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. అలానే జాంబీరెడ్డితో సూపర్ హిట్ ను అందుకున్న రాజశేఖర్ వర్మ తన ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘నేనే…నా?’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను నిధి అగర్వాల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ లింగుసామి విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు పునరావృతమవుతున్నట్లు తెలుస్తోంది. రెజీనా 100 సంవత్సరాల క్రితం రాణి కాగా, ఆమె ప్రస్తుతం పురావస్తు శాస్త్రవేత్తగా, ఒక రహస్యమైన కేసును పరిష్కరించడానికి వచ్చినట్టు అర్థమౌతోంది. అడవిలో ఏకాంత ప్రదేశంలోకి ప్రవేశించే వ్యక్తులతో పాటు, రహస్యమైన కేసును పరిష్కరించడానికి కేటాయించిన వారు కూడా చంపబడుతున్నట్లు ట్రైలర్లో చూపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘నేనే నా..?! చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సైంటిస్టుగా రెజీనా.. త్వరలోనే ట్రైలర్
రెజీనా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘నేనే నా’. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో రాజ్శేఖర్ వర్మ నిర్మించారు. సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా కార్తీక్ రాజు మాట్లాడుతూ– ‘‘నేనే నా’ మిస్టరీ కథాంశంతో తెరకెక్కింది.ఎంటర్టైన్మెంట్, సూపర్ విజువల్స్తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపిస్తారు. రెజీనా ఏం పరిశోధిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సి.ఎస్, కెమెరా: గోకుల్ బెనోయ్. చదవండి : సినిమాలో ఆ షాట్ చాలా ప్రత్యేకం: హన్సిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకొచ్చాను.. అయితే -
సోషల్ హల్చల్: శ్రీముఖి చిందులు.. రెజీనా ఆటలు
లంగా ఓణి మెరిసిపోతున్న శ్రీముఖి.. హీందీ పాటలు అదిరే స్టెప్పులు ఏకాంతంగా రెచ్చిపోయి చిందులేసిన యాంకర్ విష్ణుప్రియ పెట్తో రెజీనా ఆటలు యోగా చేస్తోన్న తన ఫొటోని పంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్ బ్లూ సారీలో దర్శనమిచ్చి, ఓరచూపులు చూస్తూ కుర్రకారు మతులు పొగొడుతోంది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) -
‘మిడ్నైట్ రన్నర్స్’ గా రెజీనా, నివేదా థామస్
సౌత్ కొరియన్ హిట్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ (2017) తెలుగులో రీమేక్ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. సురేశ్బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్లు ‘మిడ్నైట్ రన్నర్స్’ తెలుగు రీమేక్ను నిర్మిస్తున్నారు. ‘‘ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా కోసం రెజీనా, నివేదా థామస్ తొలిసారిగా డిఫరెంట్ స్టంట్స్ చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇద్దరు కాబోయే పోలీసాఫీసర్లు కిడ్నాపర్ల ముఠాను ఎలా పట్టుకున్నారన్నదే ‘మిడ్నైట్ రన్నర్స్’ కథాంశం. -
బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన రెజీనా!..హీరో ఎవరంటే
రెజీనీ కసాండ్రా.. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ చెన్నై చిన్నది ఈ మధ్యకాలంలో రేసులో వెనకబడింది. వరుస ఫ్లాపులతో టాలీవుడ్లో సినిమాలు తగ్టించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్లో బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లో రెజీనాను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను ప్రస్తుతం హిందీలో వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగింది. ఇప్పటికే ఛత్రపతి రీమేక్ కోసం పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించినా వారు సున్నితంగా ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఆ మధ్య అనన్య పాండే హీరోయిన్గా ఫైనలైజ్ అయ్యిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇటీవలె హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. -
యాంకర్గా ఎంట్రీ.. హీరోయిన్గా సెటిల్.. ఆ తారలు ఎవరంటే..
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల్లో బతికేయాలని, రంగులేసుకుని రాణించాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే వారిలో చాలా తక్కువ మందికే ఆ కలలు నెరవేరతాయి. సాధారణంగా చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే స్టార్ హీరోయిన్ అయిపోతారు. హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం కొంతమంది యాంకర్స్కి దక్కింది. ఇండస్ట్రీలోకి యాంకర్గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్లుగా ఎదిగిన కొంతమంది తారల గురించి.. మెగా డాటర్ నిహారిక.. ఇండస్ట్రీకి యాంకర్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్గా మారిపోయింది. మొదట్లో ఆమె ఓ డ్యాన్స్ షోకి యాంకర్గా పనిచేసింది. అక్కడ ఆమె యాంకరింగ్కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వెబ్ సిరీస్ నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువై.. ‘ఒక మనసు’ మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ రెజీనా ఒకప్పుడు యాంకర్గా పని చేసిందన్న విషయం చాలా మందికి తెలియదు. హీరోయిన్గా ఎంట్రీ కంటే ముందు ఆమె ఓ చానల్లో ప్రసారమయ్యే క్విజ్ ప్రోగ్రామ్కి యాంకర్గా పనిచేంది. 16 ఏళ్ల వయసులోనే ‘కందనాల్ ముదల్(2005)’సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2012 లో శివ మనసులో శృతి (SMS)అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కలర్స్ స్వాతి... చిన్న వయసులోనే బుల్లితెరపై ‘కలర్స్’ప్రోగ్రామ్తో పాపులర్ అయింది.యాంకర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో బహుముఖ పాత్రలు పోషించి హీరోయిన్గా మారింది. 2008లో ఆమె హీరోయిన్గా నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం, తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాంకర్గా రాణిస్తోంది. ఎన్టీఆర్ ‘నాగ(2003)’సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన అనసూయ.. ఆ తర్వాత ఓ కామెడీ షో ద్వారా యాంకర్గా స్థిరపడింది. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే మధ్య మధ్యలో వెండితెరపై తళుక్కున మెరుస్తుంది ఈ హాట్ యాంకరమ్మ. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ‘కథనం' అనే సినిమాతో హీరోయిన్గా మరి తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ', రవితేజ ‘ఖిలాడి’లొ నటిస్తుంది. శ్రీముఖి కూడా యాంకర్గానే తన కెరీర్ని ప్రారంభించింది. ఇప్పటికి యాంకరింగ్ చేస్తూనే వస్తుంది మధ్యమధ్యలో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. 2015 లో చంద్రిక సినిమా తో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్.. ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్లలో ఈమె కూడా ఒకరు. 2007లో యాంకరింగ్లోకి అడుగుపెట్టి.. ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తోంది. అంతకంటే ముందు ఈ బ్యూటీ పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చింది. 2016 లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది. -
వచ్చే ఉగాదికి స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తా
‘‘స్ట్రయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు.. తప్పకుండా వచ్చే ఏడాది ఉగాదికి నా స్ట్రయిట్ తెలుగు సినిమా విడుదలవుతుంది’’ అన్నారు హీరో విశాల్. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విశాల్ చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర ముఖ్య పాత్రలో నటించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదారాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విశాల్ మాట్లాడుతూ– ‘‘డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఎంఎస్ ఆనందన్ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. నా తమ్ముడు యువన్ శంకర్ రాజా మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నా తమ్ముడు వరంగల్ శ్రీను సహా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ‘విశాల్ చక్ర’ తో తప్పకుండా జాక్ పాట్ కొడతారు’’ అన్నారు. ఎంఎస్ ఆనందన్ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది విశాల్గారే. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ప్రతి సీక్వెన్స్ చాలా ఎగ్జయిటింగ్గా ఉంటుంది. నాకు తెలుగు సినిమా అన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం.. సినిమాలు చూసే తెలుగు నేర్చుకున్నాను. దర్శకుడు రాజమౌళిగారు అరంటే చాలా ఇష్టం ’’అన్నారు. ‘మిస్ ఇండియా’ దర్శకుడు నరేంద్రనాథ్, పవన్తేజ్ కొణిదెల, మేఘన, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శోభన్ తరుపున నరసింహసాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమనియం. -
నేనేనా శూర్పణఖ!
రెజీనా పరిశోధనలో ఉన్నారు. ఈ పరిశోధన దేని గురించి అంటే? ప్రస్తుతానికి సస్పెన్స్. తాజా చిత్రం ‘నేనేనా’లో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘శూర్పణగై’ (శూర్పణఖ) అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. మరి.. సినిమాలో శూర్పణగై రెజీనానేనా? లేదా వేరే ఎవరైనానా అనేది తెలియాల్సి ఉంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారం ఆరంభమైంది. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పరిశోధన ఆసక్తికరమైన సంఘటనలకు దారి తీస్తుందట. ఆ తర్వాత నుంచి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే మలుపులతో సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. -
ముందస్తు రిటైర్మెంట్లా ఉంది
లాక్డౌన్ లైఫ్ ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది అంటున్నారు రెజీనా. కొన్ని నెలలుగా ఎటూ కదలకుండా తన అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు రెజీనా. ఈ లాక్డౌన్ గురించి రెజీనా మాట్లాడుతూ – ‘‘యాక్టర్గా బిజీ షెడ్యూల్ వల్ల పెట్ని పెంచుకోవాలనుకున్నా కుదర్లేదు. ఈ ఖాళీ సమయంలో ఓ కుక్కపిల్లను పెంచుకున్నాను. అలాగే మా అపార్ట్మెంట్ వాళ్లతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది. మా ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలతో చాలా ఎక్కవ సమయం గడిపాను. చాలా గేమ్స్ ఆడుకున్నాం. మా ఆపార్ట్మెంట్ లోపలే కలసి డిన్నర్ చేస్తుంటాం. సినిమాలు చూస్తుంటాం. లేట్ నైట్ కార్డ్స్ ఆడేవాళ్లం. నా పెట్ బెల్లాతో సాయంత్రాలు వాకింగ్కి వెళుతున్నాను. ఇవన్నీ నా రిటైర్మెంట్ తర్వాత జరుగుతాయనుకున్నాను. కానీ ఈ లాక్డౌన్ చిన్న వయసులోనే ముందస్తు రిటైర్మెంట్ ఫీలింగ్ను తెచ్చింది’’ అన్నారు. -
హీరోయిన్ రెజీనా కసండ్ర ఫోటోలు
-
జ్యోతిష్యం చెబుతా
చేతిని చూసి మీకు జరగబోయేదేంటో జోష్యం చెబుతాను అంటున్నారు రెజీనా. అనడమే కాదు.. జోష్యానికి సంబంధించిన విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటున్నారు. ఇదంతా తన తదుపరి సినిమాలోని పాత్రకు సంబంధించిన ప్రాక్టీస్ అని అర్థం చేసుకోవచ్చు. ‘ఎవరు’ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు రెజీనా. ఇటీవలే తమిళంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను అంగీకరించారు. ఇందులో అక్షర గౌడ మరో హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ సినిమాలో చూపించనున్నారట. ‘‘ఈ సినిమాలో నేను జ్యోతిష్కురాలి పాత్రలో కనిపిస్తాను. డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పాగానే బాగా కనెక్ట్ అయ్యాను’’ అని పేర్కొన్నారు రెజీనా. జనవరి 10 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. -
క్రిస్మస్ విషెస్ తెలిపిన టాలీవుడ్ స్టార్స్
సెలబ్రిటీలు ఏది చేసినా సెన్సేషనే.. అలాంటిది పండగ వచ్చిందంటే మన సెలబ్రిటీలు చేసే హంగామా మామూలుగా ఉండదు. పండగ సందర్భంగా పలువురు సినీనటులు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ పండగకు ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న ప్రేమను, అనుభూతిని ఆస్వాదించండి, నచ్చినవారితో కలిసి పండగను ఎంజాయ్ చేయండి. వీలైనన్ని జ్ఞాపకాలను కూడగట్టుకోండి’ అని టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి విషెస్ క్రిస్మస్తోపాటు నూతన సంవత్సర విషెస్ తెలిపాడు. హీరో రామ్చరణ్ కూడా తన తండ్రి చిరుతో కలిసి పండగ వేడుకల్లో పాల్గొన్నాడు. హీరోయిన్ సమంత ప్రత్యుష ఫౌండేషన్ పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. ‘ఎవరైతే తమ జీవితాల్లో వెలుగు కోసం ఎదురుచూస్తారో వారితో కలిసి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నప్పుడే ఆ పండగకు పూర్తి అర్థం ఉంటుంద’ని ఆమె పేర్కొంది. మరో నటి కేథరిన్ పిజ్జాతో క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంది. సాంటాక్లాజ్లా రెడీ అయిన హీరోయిన్ రెజీనా.. తనకు డిసెంబర్ నెల ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. తన పుట్టినరోజు(డిసెంబర్ 13), క్రిస్మస్, రానున్న కొత్తసంవత్సరం కోసం ప్రారంభమయ్యే వేడుకలు అన్నీ ఈ నెలలోనే జరుగుతాయని, అందుకే ఈ నెల తనకెంతో ఇష్టమని పేర్కొంది. అయితే ఈ సంవత్సరం ఎంతో బిజీగా ఉన్నా పండగ జరుపుకోవడం మాననంటోంది. ‘ఈ క్రిస్మస్ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎన్నో సంతోషాలను, ప్రేమను, అదృష్టాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని మంచు మనోజ్ విషెస్ తెలిపాడు. నిర్మాత, నటి మంచు లక్ష్మీ అభిమానులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి ఈ పండగను ఆస్వాదించండన్నారు. ఇక జూ. ఎన్టీఆర్, ఎనర్జిటిక్ స్టార్ రామ్, కాజల్ అగర్వాల్ పలువురు నటీనటులు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. -
తెలుగు సినీ మహోత్సవం
-
సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి
నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ కోసం ఎదురుచూసిన రెజీనాకు ‘ఎవరు’ రూపంలో మంచి విజయం లభించింది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలై.. మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన రెజీనా.. తనను కలుసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ‘హలో.. ఎవరు చిత్రానికి వస్తున్న స్పందన, చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. మీరంతా కలవాలని అడిగితే కాదనగలనా? ఇక్కడ మీకోసం చిన్న కంటెస్ట్ నిర్వహించబోతోన్న.. ఎవరు చిత్రంలో సమీర భర్త పేరు చెప్పండి.. 18వ తేదీన నాతో కాఫీ తాగేందుకు జాయిన్ అవ్వండి’ అంటూ ట్వీట్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం సమాధానం చెప్పండి..రెజీనాతో కాఫీ తాగే చాన్స్ కొట్టేయండి. Helloo... Thank you so much for the love and amazing response for #Evaru 🤗 You askpd to meet and how could I resist. Here's a small contest question. What's Sameera's husband's name in the movie #Evaru? Give the correct answer and join me for coffee on the 18th.♥️ pic.twitter.com/tYbC1F2TQ2 — ReginaCassandra (@ReginaCassandra) August 16, 2019 -
అభిమానులకు అడివి శేష్ రిక్వెస్ట్
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో అడివి శేష్ మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కట్టిపడేసే కథా కథనాలతో ఫ్యాన్స్కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన శేష్పై అభినందనల జల్లు కురుస్తోంది. అయితే కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో సినిమాలోని కీలక ట్విస్ట్లను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. (మూవీ రివ్యూ : ‘ఎవరు’) ఇంటర్వెల్, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లను సెల్ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ లీకులపై ఎవరు టీం స్పందించింది. ఓ వీడియో మెసేజ్ను రిలీజ్ చేసిన అడివి శేష్, నవీన్ చంద్ర, రెజీనాలు ట్విస్ట్లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయోద్దని రిక్వెస్ట్ చేశారు. తనకు ఘనవిజయాన్ని అందించిన అభిమానుకుల కృతజ్ఞతలు తెలియజేశారు. Team #Evaru is really enjoying the success of the film. We have a small request about SPOILERS!!! #EvaruRampage pic.twitter.com/KvRDf2kTx5 — Adivi Sesh (@AdiviSesh) August 15, 2019 -
భవిష్యత్ గురించి నో ఫికర్..!
భవిష్యత్ గురించి ఎలాంటి బాధ లేదంటోంది నటి రెజీనా. ఆరణాల చెన్నై బ్యూటీ అయిన ఈ అమ్మడు తమిళంతో పాటు తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఏ భాషలోనూ స్టార్ హీరోలతో నటించే అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఇదే ప్రశ్నను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెజీనా ముందుంచితే ఇలాంటి వాటి గురించి కారణాలేమిటో తనకూ తెలియలేదని బదులిచ్చింది. తాను నటించిన చిత్రాలన్నీ హిట్టేనని చెప్పింది. ఆ మధ్య తెలుగులో నటించిన ‘అ!’ చిత్రాన్ని జాతీయ అవార్డు వరించింది. దానికి మేకప్పే ముఖ్య అంశం అని, అందుకు తానూ ఒక కారణం అని చాలా మంది ప్రశంసించినట్లు తెలిపింది. ఆ చిత్రంలోని పాత్రకు మేకప్ కోసం తాను గంటల తరబడి సమయాన్ని కేటాయించినట్లు రెజీనా చెప్పింది. ఇంకో విషయం ఏమిటంటే కథల గురించి తానెప్పుడూ ఆలోచించనంది. అందులో తన పాత్రనే ముఖ్యంగా భావిస్తానని చెప్పింది. ఈ పాత్ర తనకు భవిష్యత్లో సహాయపడుతుందా అన్న దాని గురించి ఆలోచించనని చెప్పింది. ఇచ్చిన పాత్రలకు పూర్తిగా న్యాయం చేయడానికి శ్రమిస్తానని అంది. భవిష్యత్ గురించి చింతించనని రెజీనా పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్లో ‘కల్లపాట్’, ‘కసడ తపద’ చిత్రాల్లో నటిస్తోంది. రెజీనా నటించిన నిర్మాణం పూర్తి చేసుకున్న ‘నెంజం మరప్పదిలై’, ‘పార్టీ’ చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి. ఇక తెలుగులో నటించిన ‘ఎవరు’ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపైనా రెజీనా చాలా నమ్మకం పెట్టుకుంది. -
చనిపోయింది ‘ఎవరు’.. చంపింది ‘ఎవరు’
క్షణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్.. గూఢాచారి చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. డిఫెరెంట్ జానర్లో సినిమాలను చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోన్న అడివి శేష్.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. టైటిల్తో ఆసక్తిని పెంచిన చిత్రబృందం టీజర్తో మంచి అంచనాలను క్రియేట్చేసింది. తాజాగా నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ను పెంచేలా ఉంది. నవీన్ చంద్ర, రెజీనా పాత్రలు సినిమాలో కీ రోల్ పోషించినట్లు కనబడుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించగా.. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. -
అడవి శేష్ ‘ఎవరు’ రీమేకా?
క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మరో థ్రిల్లర్ మూవీ ఎవరు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట్ రామ్జీ దర్శకుడు. సైలెంట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. 2007లో హాలీవుడ్లో రిలీజ్ అయిన ది ఇన్విజిబుల్ గెస్ట్ కు ఎవరు రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సినిమాను బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తాప్సీల కాంబినేషన్లో బద్లా పేరుతో రీమేక్ చేశారు. అయితే హాలీవుడ్ ఓ మహిళ హత్య విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ను అరెస్ట్ చేస్తే, ఇండియన్ రీమేక్లలో మాత్రం ఓ వ్యక్తి హత్య విషయంలో ఆమె గర్ల్ఫ్రెండ్ను అరెస్ట్ చేసినట్టుగా మార్చారు. అయితే ‘ఎవరు’ సినిమా రీమేకా.. కాదా అన్న విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
థ్రిల్ చేసే ‘ఎవరు’
‘క్షణం, అమీ తుమీ, గూఢచారి’ వంటి వరుస విజయాల తర్వాత అడివి శేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎవరు’. వెంకట్ రామ్జీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రెజీనా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్15న విడుదల కానుంది. ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. ‘క్షణం’ వంటి హిట్ తర్వాత అడివి శేష్, పీవీపీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
ఎంగేజ్మెంటా? ఎప్పుడు జరిగింది?
‘‘ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తయితే ఇక రెజీనా కొత్త సినిమాలేవీ ఒప్పుకోరు’’... చెన్నైలో జరుగుతున్న ప్రచారం ఇది. ఎందుకు సినిమాలు చేయరంటే.. ఈ నెల 13న ఆమె ఎంగేజ్మెంట్ జరిగిందని అంటున్నారు. ఎవరితో? అంటే నో ఆన్సర్. అయితే రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని ఓ తమిళ వెబ్సైట్ పేర్కొంది. అవునా? అని రెజీనా సన్నిహితులను అడిగితే.. ఎంగేజ్మెంటా? ఎప్పుడు జరిగింది? అంటున్నారు. ‘‘ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అసలు రెజీనాకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి’’ అని కూడా స్పష్టం చేశారు. ఇక రెజీనా చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. పీవీపీ సంస్థ నిర్మించిన ‘ఎవరు’లో నటించారామె. ఆగస్ట్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే నూతన దర్శకుడు అర్జున్ సాయి తెరకెక్కిస్తున్న ‘ఉత్సవం’లో నటిస్తున్నారు. సెప్టెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. అటు తమిళంలో చేస్తున్న ‘కసడ తపర’ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇది కాకుండా ‘పార్టీ’ అనే సినిమా తుది దశలో ఉంది. అలాగే అరవింద్ స్వామితో చేస్తున్న ‘కల్లాపార్ట్’ చివరి షెడ్యూల్లో ఉంది. ఇలా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రెజీనా సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటారా? -
సగం పెళ్లి అయిపోయిందా?
సినిమా: నిశ్చితార్థం జరిగితే శాస్త్రం ప్రకారం సగం పెళ్లి అయినట్లేనంటారు. అలా నటి రెజీనాకు ఆ వేడుక జరిగిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో కథానాయకిగా నటిస్తున్న బ్యూటీ రెజీనా. నటిగా కొన్ని మంచి విజయాలనే తన ఖాతాలో వేసుకున్నా, ఎందుకనో స్టార్ హీరోయిన్ రేంజ్ని తెచ్చుకోలేకపోయింది. అయితే రెజీనాపై వదంతులు మాత్రం జోరుగానే సాగుతుండటం విశేషం. 26 ఏళ్ల ఈ బ్యూటీకి గత 13వ తేదీన వివాహ నిశ్చితార్థం అత్యంత రహస్యంగా జరిగిందనేది తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త. ప్రస్తుతం అవకాశాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలని రెజీనా నిర్ణయించుకున్నట్లు టాక్. దీంతో ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి త్వరలో పెళ్లి పీటలెక్కడానికి తొందర పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై రెజీనా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మౌనం అర్ధ అంగీకారంగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇదిలాఉండగా ఈ అమ్మడు ఒక టాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని ఇద్దరూ పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే యువ నటుడు సందీప్కిషన్తో మొదట్లో రెజీనా ప్రేమ కలాపాలు సాగించినట్లు వదంతులు ప్రచారం అయ్యాయి. ఆ మధ్య ఒక భేటీలో రెజీనా పేర్కొంటూ తన జీవితంలోకి ప్రేమ వచ్చి పోయిందని చెప్పింది. ఒకరినోకరం తొందరపడి దూరం అయ్యామేమోనని ఇప్పుడు అనిపిస్తోందని కూడా పేర్కొంది. ఆ తరువాత మొదటి ప్రేమికుడితో స్నేహం కొనసాగుతోందని రెజీనా చెప్పింది. ఇంతకీ రెజీనా పెళ్లి నిశ్చితార్థం విషయంలో నిజమెంత అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఎందుకంటే నటి శ్రియ లాంటి కొందరు చడీ చప్పుడు లేకుండా ఆ ముచ్చట జరుపుకుని తీరిగ్గా పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి పెళ్లి అయ్యిపోయిందోచ్ అంటున్నారు. నటి రెజీనా కూడా సడన్గా అలానే ప్రకటిస్తుందేమో చూడాలి. కోలీవుడ్లో ఈ బ్యూటీ నటించిన నెంజమం మరప్పదిల్లై, దర్శకుడు వెంకట్ ప్రభు నిర్మించిన పార్టీ చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు కాచుకున్నాయి. ఇకపోతే శింబుదేవన్ దర్శకత్వంలో వెంకట్ప్రభు నిర్మిస్తున్న కచడదపర అనే మరో చిత్రంలో నటించడానికి అంగీకరించింది. -
7(సెవెన్) మూవీ రివ్యూ
టైటిల్ : 7 (సెవెన్) జానర్ : థ్రిల్లర్ తారాగణం : హవీష్, రెహమాన్, రెజీనా, నందితా శ్వేతా, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, పూజితా పొన్నాడ, అదితి ఆర్య సంగీతం : చేతన్ భరద్వాజ్ దర్శకత్వం : నిజార్ షఫీ కథ, నిర్మాత : రమేష్ వర్మ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. సరైన కంటెంట్తో తెరకెక్కితే ఈ జానర్ సినిమాలు సీజన్తో సంబందం లేకుండ ఆడేస్తాయి. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత హవీష్ హీరోగా నటించేందుకు ఈ జానర్నే ఎంచుకున్నాడు. దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి స్వయంగా కథ అందించి నిజార్ షఫీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 7(సెవెన్) సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించిన 7 ఆడియన్స్ను మెప్పించిందా? కథ ; రమ్య( నందితా శ్వేతా) అనే అమ్మాయి తన భర్త కార్తీక్ రఘునాథ్ (హవీష్) కనిపించటం లేదంటూ కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు వస్తుంది. తన భర్తతో దిగిన ఫోటోలను స్టేషన్లో ఇస్తుంది. ఆమె కథ విన్న ఏసీపీ విజయ్ ప్రకాష్ (రెహమాన్) షాక్ అవుతాడు. రమ్యను మోసం చేసినట్టుగానే కార్తీక్ గతంలో జెన్నీ అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని మోసం చేశాడని తెలుస్తుంది. దీంతో ఏసీపీ ఈ రెండు కేసులను మిస్సింగ్ కేసులా కాకుండా కార్తీక్ వీళ్లను కావాలనే మోసం చేసి వెళ్లిపోయాడన్న అనుమానంతో చీటింగ్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అదే సమయంలో చెన్నైలోనూ మరో అమ్మాయి (అదితి ఆర్య)ని కార్తీక్ మోసం చేశాడని తెలుస్తుంది. ఎంత ప్రయత్నించినా కార్తీక్ ఆచూకి దొరక్క పోవటంతో కార్తీక్ కోసం పేపర్ యాడ్ ఇస్తారు. చివరకు కార్తీక్ను అరెస్ట్ చేస్తారు. అయితే కార్తీక్ మాత్రం తాను ఎవరినీ మోసం చేయలేదని, అసలు ఆ అమ్మాయిలు ఎవరో తనకు తెలియదని చెప్తాడు. కార్తీక్ చెప్పేది నిజమేనా..? మరి ఆ అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? వీరికి సరస్వతమ్మ (రెజీనా)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ కథలో విలన్ ఎవరు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; లాంగ్ గ్యాప్ తరువాత నటించిన హవీష్ ఇంట్రస్టింగ్ కథను ఎంచుకున్నాడు. అయితే కథకు తగ్గ స్థాయిలో వేరియేషన్స్ చూపించటంతో మాత్రం తడబడ్డాడనే చెప్పాలి. నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు హవీష్ ఇంకా కష్టపడాలి. హీరోయిన్లుగా కనిపించిన వారిలో కాస్త ఎక్కువ సేపు తెర మీద కనిపించిన పాత్ర రెజీనాదే. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా నటన ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో నందితా, అనీషా, త్రిదా, అదితి ఆర్యలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెహమాన్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. నటన పరంగానూ మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు పరవాలేదనిపించారు. విశ్లేషణ ; రమేష్ వర్మ ఇంట్రస్టింగ్ కథను తయారు చేసుకున్నా, స్క్రీన్ప్లే విషయంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కథనం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన స్థాయి గ్రిప్పింగ్గా అనిపించదు. ఇంట్రస్టింగ్గా కథను మొదలు పెట్టిన దర్శకుడు, లవ్ స్టోరిలను మాత్రం చాలా స్లోగా నడిపించాడు. అసలు కథను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ ను మాత్రం ఇంట్రస్టింగ్గా తెరకెక్కించాడు. కార్తీక్ పోలీసులకు దొరికిన తరువాత కథ వెంట వెంటనే మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతుంది. కానీ క్లైమాక్స్ విషయంలో మరోసారి తడబడ్డాడు నిజార్. దర్శకుడిగా తడబడినా సినిమాటోగ్రాఫర్గా మాత్రం నిజార్ షఫి ఫుల్ మార్క్స్ సాధించాడు. హీరోయిన్లను అందంగా చూపించటంతో పాటు ప్రతీ ఫ్రేమ్ను రిచ్గా కలర్ఫుల్గా చూపించటంలో సక్సెస్ అయ్యాడు. సినిమాకు మరో ఎసెట్ నేపథ్య సంగీతం. చేతన్ భరద్వాజ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ప్రతీ సీన్ను మరింత ఇంట్రస్టింగ్గా మార్చాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ; ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే కథనం ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
అడవి శేష్.. ‘ఎవరు’?
గూఢచారి సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు అడవి శేష్. హీరోగానే కాకుండా కథకుడిగానూ మెప్పించిన ఈ హీరో గూఢచారికి సీక్వెల్ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఇదే కాకుండా 2స్టేట్స్ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. తాజాగా ఈ హీరో మరో చిత్రాన్ని ప్రకటించాడు. అడివి శేష్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావల్సివస్తుంది. నేడు ఈ మూవీ పోస్టర్, టైటిల్ను ప్రకటించాడు. ‘ఎవరు’గా రాబోతోన్న ఈ చిత్రాన్ని పీవీపీ బ్యానర్లో తెరకెక్కిస్తుండగా.. వెంటక్ రామ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కానున్నట్లు ప్రకటించాడు. -
శింబుదేవన్ దర్శకత్వంలో అందాల భామలు
శింబుదేవన్ దర్శకత్వంలో ముగ్గురు అందాలభామలు నటించడానికి రెడీ అవుతున్నారు. శింబుదేవన్ అనగానే ఇంసైఅరసన్ 23ఆమ్ పులికేసి చిత్రమే టక్కున గుర్తుకు వస్తుంది. ఆ తరువాత కూడా ఆయన అరై ఎన్ 305 కడవుల్, ఇరుంబు కోట్టైటయిల్ మురట్టుసింగం, ఒరు కన్నియుమ్ 3 కలవాణిగళుమ్, పులి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తనకు మంచి పేరు తెచ్చి పెట్టిన ఇంసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేసి షూటింగ్ను కూడా ప్రారంభించారు. దర్శకుడు శంకర్ నిర్మించ తలపెట్టిన ఈ చిత్రానికి నటుడు వడివేలు, చిత్ర యూనిట్కు మధ్య విభేదాల కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దీనికి సంబంధించిన పంచాయతీ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. దీంతో దర్శకుడు శింబుదేవన్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. దీనికి కసడ తపర అనే పేరును నిర్ణయించారు. ఇందులో నటుడు సందీప్కిషన్, హరీశ్కల్యాణ్, శాంతను హీరోలుగా నటించనున్నారు. వారికి జంటగా నటి రెజీనా, ప్రియభవానీశంకర్, విజయలక్ష్మి నటించనున్నారు. ఇలా కుట్టి మల్టీస్టారర్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ప్రభు, ట్రైడెంట్ ఆర్ట్స్ రవీంద్రన్ కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్ర కథను దర్శకుడు ఆరు భాగాలుగా స్క్రీన్ ప్లేను రచించారట. దీంతో ఆరుగురు ఛాయాగ్రాహకులు, ఆరుగురు సంగీతదర్శకులు దీనికి పనిచేయనున్నారట. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. చిన్న గ్యాప్ తరువాత నటి రెజీనా కోలీవుడ్లో నటిస్తున్న చిత్రం ఇది. -
అందుకే లెస్బియన్గా నటించాను : రెజీనా
తమిళసినిమా: అలాంటి వారినీ అంగీకరించాలి అంటోంది నటి రెజీనా. కోలీవుడ్, టాలీవుడ్లో నటిగా ఒక టైమ్లో రాణించిన ఈ బ్యూటీకి ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తగ్గాయి. ఆ మధ్య నటించిన మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో విచ్చలవిడిగా అందాలను ఆరబోసినా, వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చందాన ఆ చిత్రం సక్సెస్ కాకపోవడం పైగా రెజీనా విమర్శలను మూటగట్టుకుంది. కాగా ఈ జాణ బాలీవుడ్లో సంచలన నటిగా మారింది. అక్కడ ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా చిత్రంలో నటించింది. ఇందులో నటి సోనం కపూర్ను ప్రేమించే లెస్బియన్గా నటించింది. గత నెలలో తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో లెస్బియన్గా నటించిన నటి రెజీనా ధైర్యానికి మెచ్చుకుంటున్న వాళ్లు కొంతమంది అయితే విమర్శించేవాళ్లూ అదే స్థాయిలో ఉండటం విశేషం. దీని గురించి మనసు విప్పిన రెజీనా సమాజానికి ఏం చెబుతుందో చూద్దాం. ఒక నటిగా ఎలాంటి పాత్రనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలి. నేను దక్షిణాది నటిగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు. హింది సినిమాల్లోనూ తన ప్రతిభను చాటుకోవాలనుకుంటున్నాను. అందుకే ఆ చిత్రంలో లెస్బియన్గా నటించడానికి కూడా వెనుకాడలేదు. నటిగా నేను ఎల్లలు అధిగమించాలని కోరుకుంటున్నాను. అయినా మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. కాలం మారుతోంది. లెస్బియన్ల జీవితాలను అంగీకరించాలి. ఎవరు ఎలా జీవించాలని కోరుకుంటే వారిని అలా జీవించనివ్వాలి. సుప్రీంకోర్టే హిజ్రాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాని గురించి చర్చ జరుగుతున్నా, సమాజంలోనూ మార్పు వస్తోంది. ఇదే విషయాన్ని నేను నటించిన హింది చిత్రంలో చర్చించాం అని నటి రెజీనా పేర్కొంది. ఏదేమైనా లెస్బియన్ పాత్రలో నటించి మరోసారి వార్తల్లోకెక్కిన ఈ బ్యూటీకి ఈ సారి అయినా అవకాశాలు వస్తాయా? అన్నది వేచి చూడాలి. -
అరవిందస్వామి, రెజీనాల ‘కల్లపార్ట్’
చార్మింగ్ నటుడు అరవిందస్వామి హీరోగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కల్లపార్ట్ చిత్రం బుధవారం ఉదయం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభమైంది. ఇంతకు ముందు విక్రమ్, తమన్నా జంటగా స్కెచ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మూవింగ్ ప్రేమ్ సంస్థ అధినేతలు ఎస్.పార్తీ, ఎస్ఎస్.వాసన్ నిర్మిస్తున్న తా జా చిత్రం ఈ కల్లపార్ట్. ఈ సినిమాలో అరవిందస్వామికి జంటగా రెజీనా నటిస్తోంది. ఎన్నమో నడక్కుదు, అచ్చమిండ్రి చిత్రాల ఫేమ్ రాజాపాండి దర్శకత్వం వహిస్తున్న మూవీలో ఆనందరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఏవీఎం స్టూడియోలో భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే భాగం చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. చెన్నైలోనే 40 రోజులు షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
యాక్టర్లు.. టీచర్ల అవతారం ఎత్తారు..
బంజారాహిల్స్: ‘నేను డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యాను’ అంటారు చాలామంది. అయితే ఇప్పుడు కొంతమంది యాక్టర్లు.. టీచర్ల అవతారం ఎత్తారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. 2014లో ఏర్పాటైన ‘టీచ్ ఫర్ ఛేంజ్’ స్వచ్ఛంద సంస్థ.. సర్కార్ స్కూళ్లలోని విద్యార్థుల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 200 ప్రభుత్వ పాఠశాలలను ఈ సంస్థ దత్తత తీసుకుంది. మొత్తం 600 మంది వలంటీర్లు వారానికోసారి ఆయా స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ఇంగ్లిష్లో రాయడం, చదవడం, మాట్లాడటం నేర్పిస్తారు. ఈ సంస్థను మరింత ప్రోత్సహించేందుకు కొందరు సినీ తారలు ముందుకొచ్చారు. వీలైన సమయంలో పాఠశాలలకు వెళ్లి గంటపాటు ఇంగ్లిష్ బోధిస్తున్నారు. రానా దగ్గుబాటి, రకుల్ప్రీత్ సింగ్, రెజీనా, ప్రణీత, అల్లు శిరీష్ తదితరులు ఈ సంస్థకు చేయూతనందిస్తున్నారు. వీరు ఆసక్తిగా పాఠాలు బోధిస్తుండడంతో పాటు విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, హిమాయత్నగర్, ఫిలింనగర్, సికింద్రాబాద్ తదితర సర్కారు బడుల్లో రెజీనా, ప్రణీత పాఠాలు బోధించారు. ఇదో సంతృప్తి.. పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ప్రతి నెలా రెండుసార్లు స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు క్లాస్ తీసుకుంటున్నాను. – రెజీనా టీచర్ వృత్తి ఎంతో గౌరవప్రదమైంది. నేను చదువుకునేరోజుల్లోటీచర్లను ఎంతో గౌరవించేదాన్ని.– రకుల్ప్రీత్ సింగ్