యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం! | Tollywood Anchor Rashmi Gautam Grand Father Passes Away, Emotional Post Goes Viral | Sakshi
Sakshi News home page

Rashmi Gautam: రష్మీ గౌతమ్ ఇంట్లో విషాదం.. యాంకర్ ఎమోషనల్ పోస్ట్!

Published Wed, Aug 21 2024 6:22 PM | Last Updated on Thu, Aug 22 2024 5:18 PM

Sad News In Tollywood anchor Rashmi Gautam Post Goes Viral

టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తాతయ్య  ఈనెల 17న అనారోగ్యంతో మరణించినట్లు ఆమె వెల్లడించింది.ఈ విషయాన్ని రష్మీ గౌతమ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మా తాత నిజమైన స్త్రీవాది అని.. చివరికీ మా బామ్మను స్వర్గంలో కలుసుకున్నారని ట్వీట్ చేసింది. గడిచిన ఏడాదిన్నరగా తన గురించే మాట్లాడేవారని రాసుకొచ్చింది. వారి ప్రేమ అలాంటిదని ఆమె తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.

కాగా.. తెలుగులో యాంకర్‌గా కెరీర్ ‍మొదలెట్టిన రష్మీ గౌతమ్‌ సినిమాల్లోనూ నటించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కేవలం యాంకర్‌గానే కాదు.. నటిగానూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. గుంటూరు టాకీస్, తను వచ్చేనంటా, అంతం, బొమ్మ బ్లాక్‌బస్టర్‌, అంతకుమించి లాంటి చిత్రాలతో మెప్పించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement