anchor
-
పండగరోజు అయోధ్య రాములవారిని దర్శించుకున్న లాస్య (ఫోటోలు)
-
ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్ సమాధానం ఇదే!
బుల్లితెరపై యాంకర్గా క్రేజ్ దక్కించుకున్న టాలీవుడ్ నటుడు ప్రదీప్ మాచిరాజు. పలు రియాలిటీ షోలకు యాంకర్గా పనిచేశారు. అలా యాంకరింగ్తో ఫేమస్ అయిన ప్రదీప్ పలు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆయనే హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో ఆడియన్స్ను పలకరించనున్నారు. ఈ సినిమకు నితిన్- భరత్ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రదీప్. ఇటీవలే ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్వరలోనే ఓ రాజకీయ నాయకురాలితో మీ పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పుకుండా పెళ్లి అయితే చేసుకుంటానని అన్నారు.తన పెళ్లి గురించి ప్రదీప్ మాట్లాడుతూ.. 'నా పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు. ముందు జీవితంలో సెటిల్ కావాలనుకున్నా. నాకు సొంతంగా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ముందు వాటిని సాధించడమే నా లక్ష్యం. అవీ ఆలస్యం కావడంతోనే మిగిలిన పనులు కూడా వాయిదా పడుతున్నాయి. అన్నీ కూడా సరైన టైమ్కే పూర్తి అవుతాయని నమ్ముతున్నా. రాజకీయ నాయకురాలితో తన పెళ్లి అని వస్తున్న వార్తలు నేనూ విన్నా.. అంతకుముందే రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి అన్నారు.. త్వరలో క్రికెటర్తో పెళ్లి అంటారేమో. అన్నీ సరదా కోసమే చేస్తున్న ప్రచారం' అంటూ నవ్వుతూ మాట్లాడారు. కాగా.. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న విడుదల కానుంది. -
ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్: హెచ్సీయూ వివాదంపై యాంకర్ రష్మీ
హెచ్సీయూ వివాదంపై టాలీవుడ్ సినీతారలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రేణూ దేశాయ్, రష్మిక మందన్నా, నాగ్ అశ్విన్, సమంత కూడా స్పందించారు. దాదాపు 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలానికి పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం స్పందించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది .యాంకర్ రష్మీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోను ఎలాంటి రాజకీయాల కోసం చేయటం లేదు. ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి విరుద్ధంగా పోస్ట్ చేయడం లేదు. హెచ్సీయూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఆన్ హెచ్సీయూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. నేను చాలా సౌకర్యంగా అపార్ట్మెంట్లో కూర్చుని పోస్ట్ చేస్తున్నాను. గతంలో ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు ఎన్ని చెట్లు తొలగించారో నాకు కూడా తెలుసు' అని అన్నారు. 'కానీ ప్రస్తుతం హెచ్సీయూలో జరుగుతున్న అభివృద్ధి వల్ల నెమళ్లు, వేల పక్షులు సఫర్ అవుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన వీడియో చూసిన తర్వాత పక్షులు, జంతువులను వారి ఇంటి నుంచి వాటిని తరిమేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రస్తుత వేసవికాలం అందులో పక్షులు, నెమళ్లు, జంతువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దయచేసి ఆ పశు, పక్షులను దృష్టిలో ఉంచుకుని పునరావాసం కల్పించండి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దయచేసి మీరు అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
రాష్ట్రపతి నిలయం సందర్శించిన యాంకర్ లాస్య మంజునాథ్ (ఫోటోలు)
-
బెట్టింగ్ యాప్ కేసు.. భారీగా డబ్బులు వచ్చాయన్న విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఈ కేసులో బిగ్బాస్ బ్యూటీ, యాంకర్ విష్ణుప్రియ ఇవాళ పోలీసుల విచారణకు హాజరైంది. తన లాయర్తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఈ విచారణలో విష్ణు ప్రియ పలు కీలక విషయాలను వెల్లడించింది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లు పోలీసుల ఎందుట అంగీకరించింది.అయితే తాను దాదాపు 15 రకాల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లు పోలీసులకు వివరించింది. అలా ఒక్కో యాప్నకు దాదాపు రూ.90 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ విచారణలో విష్ణుప్రియ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు.. ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు యూట్యూబర్లతో పాటు సినీతారలపై కూడా కేసులు నమోదయ్యాయి. విష్ణు ప్రియతో పాటు సుప్రీత, టేస్టీ తేజ మరో 11 మంది బుల్లితెర నటులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంటీ అంటావా? దమ్ముంటే పైకి రారా..: యాంకర్ అనసూయ సవాల్
తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం.. అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి పదే పదే అంటుంటాడు. అలాగే తెలుగు, ఇంగ్లీష్.. ఏదైనా కానీ నాకు నచ్చని ఏకైక పదం ఆంటీ అంటోంది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). ఏళ్ల తరబడి ఈ పదంపై ఉద్యమమే చేస్తోందీ యాంకర్. ఎవరు పడితే వారు ఆంటీ అంటే ఊరుకునేది లేదు.. అలా పిలవాలంటే నా బంధువులై ఉండాలి, లేదా చిన్నపిల్లలై ఉండాలని అప్పట్లోనే కుండ బద్ధలు కొట్టింది.హోలీ ఈవెంట్లోనూ 'ఆంటీ' పిలుపుకానీ జనాలు వింటేగా.. తనకు ఇష్టం లేదని చెప్తున్నా సరే పట్టించుకోకుండా సందు దొరికినప్పుడల్లా ఆంటీ అని ఏడిపిస్తున్నారు. శుక్రవారం (మార్చి 14న) హోలి సెలబ్రేషన్స్లో పాల్గొంది అనసూయ. హైదరాబాద్లోని ఓ హోలి ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా వెళ్లిన ఆమెను ఓ ఆకతాయి ఆంటీ అని పిలిచాడు. ఆ పిలుపు తన చెవిన పడటంతో అనసూయకు చిర్రెత్తిపోయింది.రెచ్చగొట్టకు..దమ్ముంటే స్టేజీపైకి రా అని సవాల్ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని ధమ్కీ ఇచ్చింది. ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్రూమ్కు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అటు అనసూయ తగ్గదు, ఇటు జనాలు మారరు అని కామెంట్లు చేస్తున్నారు.యాంకర్గా, నటిగా..అనసూయ.. యాంకర్గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఎన్నో యేళ్లుగా పలు టీవీ షోలలో యాంకర్గా, జడ్జిగా పని చేసింది. ఈ మధ్య బుల్లితెరను వదిలేసి వెండితెరపైనే ఎక్కువ బిజీ అయింది. క్షణం, రంగస్థలం, మీకు మాత్రమే చెప్తా, పుష్ప 1, పుష్ప 2, విమానం, ప్రేమ విమానం, రజాకార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. సూయ సూయ సూయ.., పైన పటారం లోన లొటారం, వా వా మేరే బావా వంటి స్పెషల్ సాంగ్స్లోనూ మెరిసింది. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా నుంచి రిలీజైన కొల్లగొట్టినాదిరో పాటలోనూ యాక్ట్ చేసింది.చదవండి: అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు -
పూత రేకులు, కోనసీమ అందాలు.. అద్భుత జ్ఞాపకాలంటోన్న యాంకర్ వింధ్య విశాఖ (ఫోటోలు)
-
పిల్లలతో అండమాన్ దీవిలో యాంకర్ లాస్య ఆటలు (ఫోటోలు)
-
అప్పుడే రెండేళ్లు అయిపోయాయా కన్నమ్మా.. లాస్య ఎమోషనల్ (ఫోటోలు)
-
గోవాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న యాంకర్ లాస్య మంజునాథ్ (ఫోటోలు)
-
మహా కుంభమేళాను వదిలిపెట్టని యాంకర్ సుమ! అక్కడ కూడా.. (ఫోటోలు)
-
అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
పెళ్లి రోజు కాలినడకన తిరుమలకు టాలీవుడ్ యాంకర్ లాస్య (ఫోటోలు)
-
ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాలో యాంకర్ లాస్య ఫ్యామిలీ (ఫోటోలు)
-
రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
-
రెడ్ డ్రెస్లో అరియానా.. అందాల ఆరబోతలో తగ్గేదే లే (ఫొటోలు)
-
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) క్షమాపణలు చెప్పారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో చేసిన కామెంట్స్పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు, శిరీష్పై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే రామ, లక్ష్మణుల పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో అది కాస్తా వివాదానికి దారితీసింది.అసలేం జరిగిందంటే..'నిర్మాతలు దిల్ రాజు(dil raju), శిరీష్ను పొగిడే క్రమంలో.. రామ, లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్(ఊహజనిత పాత్రలు) అని మనం విన్నాం.. కానీ సాక్షాత్తూ ఇప్పుడు నా కళ్లముందే కూర్చున్నారు.. వారిలో ఒకరు దిల్ రాజు అయితే.. మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది'.రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు రామాయణం తెలుసా? అని చాలామంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ..' రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్న క్షమిస్తారని వేడుకుంటున్నా.. జై శ్రీరామ్' అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పొంగల్ బరిలో సంక్రాంతికి వస్తున్నాం..వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ను హీరో మహేశ్బాబు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి, చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని నిజామాబాద్లో నిర్వహించారు. 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్ర కేవలం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie) జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు. "I will file a case if you don't apologise for this comments" @MukhiSree https://t.co/VbhguoJwqI— Siri Vennela Goud Palle (@VennelaPalle) January 8, 2025 View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
వెంకి మామతో ‘రాములమ్మ’ఫ్యామిలీ.. లంగా ఓణిలో మరింత అందంగా మెరిసిపోతున్న శ్రీముఖి (ఫోటోలు)
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రేణూ దేశాయ్, యాంకర్ రవి (ఫోటోలు)
-
ఇస్మార్ట్ జోడీ 3కి రంగం సిద్ధం: ఎవరెవరు పాల్గొంటున్నారంటే?
ప్రేమ అంటే ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు మూడో సీజన్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షోలో సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకు, అనురాగానికి కావాల్సినంత వినోదాన్ని జోడించనున్నారు.ఈ షోలో ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు పాల్గొంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు అంద ఉన్నారు.ఈ షో వినోదంతో అలరించడమే కాదు, ఆలోచింపచేస్తుంది. జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది. బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలిస్తుంది. స్టార్ మా లో ఈ శనివారం(డిసెంబర్ 21) రాత్రి 9 గంటలకు ఇస్మార్ట్ జోడి సీజన్ 3 ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. -
సుమ కనకాల తనయుడి కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
సోదరి పెళ్లిలో స్టెప్పులేసిన యాంకర్ రష్మి గౌతమ్ (ఫోటోలు)
-
జడలో మల్లెపూలు పెట్టి.. కళ్లు తిప్పుకోలేని అందంతో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
మెహందీ వేడుకలో యాంకర్ రష్మి.. ఫోటోలు వైరల్
-
ఇవి.. సహజసిద్ధ'మండి'!
బంజారాహిల్స్: రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే వనరులతో చేతితో తయారు చేసిన దుస్తులు, కళాకృతుల ప్రదర్శన ‘మండి’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ భవన్లో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను సినీ నటి, యాంకర్ ఝాన్సీ ప్రారంభించారు.దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఆకృతులు నగర మహిళలను ఆకట్టుకున్నాయి. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా వినియోగించిన సామాగ్రితోనే అల్లిన బుట్టలు, నేసిన దుస్తులు, తయారుచేసిన పర్ఫ్యూమ్లో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.ముఖ్యంగా ఎకోఫ్రెండ్లీ బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ మరో ఆకర్షణగా నిలిచింది. సెరామిక్ జ్యువెలరీ, జూట్ బ్యాగులు, కేరళ మురల్ ఆర్ట్, హ్యాండ్మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, రస్టిక్ సెరమిక్ పీసెస్, పామ్ లీఫ్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. పర్యావరాణానికి పెద్దపీట వేస్తూ హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఈ ఆకృతులను సదరు కళాకారులు ఒక వైపు ఆన్లైన్లో విక్రయిస్తూనే మరోవైపు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు.ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులకు హైదరాబాద్ బ్రాండ్గా మారిందని ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తెలిపారు. ప్రదర్శనలో సీసీటీ చైర్పర్సన్ అనురాధ బిష్ణోయ్ కూడా పాల్గొన్నారు.ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
sravanthi_chokarapu: స్వర్ణగౌరి పూజ.. మహాలక్ష్మిలా మెరిసిపోతున్న యాంకర్ స్రవంతి (ఫోటోలు)
-
Anchor Lasya: యాంకర్ లాస్య బర్త్ డే.. సందడి చేసిన బుల్లితెర తారలు (ఫోటోలు)
-
యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం!
టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి రష్మీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తాతయ్య ఈనెల 17న అనారోగ్యంతో మరణించినట్లు ఆమె వెల్లడించింది.ఈ విషయాన్ని రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మా తాత నిజమైన స్త్రీవాది అని.. చివరికీ మా బామ్మను స్వర్గంలో కలుసుకున్నారని ట్వీట్ చేసింది. గడిచిన ఏడాదిన్నరగా తన గురించే మాట్లాడేవారని రాసుకొచ్చింది. వారి ప్రేమ అలాంటిదని ఆమె తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.కాగా.. తెలుగులో యాంకర్గా కెరీర్ మొదలెట్టిన రష్మీ గౌతమ్ సినిమాల్లోనూ నటించింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కేవలం యాంకర్గానే కాదు.. నటిగానూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. గుంటూరు టాకీస్, తను వచ్చేనంటా, అంతం, బొమ్మ బ్లాక్బస్టర్, అంతకుమించి లాంటి చిత్రాలతో మెప్పించింది. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
Sreemukhi: చిట్టిగౌనులో యాంకర్ శ్రీముఖి.. ఎలా ఉందో చూశారా?
-
Vishnupriya Bhimeneni: కనువిందు చేసే అందం విష్ణు ప్రియ సొంతం (ఫోటోలు)
-
స్టన్నింగ్ లుక్స్ లో మెరిసిపోతున్న శ్రీముఖి (ఫొటోలు)
-
చిన్న పిల్లలతో లిప్ కిస్లా.. యాంకర్పై చిన్మయి ఫైర్!
టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. మహిళలకు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూనే..అవగాహన కలిగించే అంశాలను చెబుతుంటారు. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. మీటు ఉద్యమంలో భాగంగా వైరముత్తు లాంటి దిగ్గజ నటులపై ఆరోపణలు చేయడంతో కోలీవుడ్ ఆమెను బ్యాన్ చేసింది. అయినా కూడా చిన్మయి తన పోరాటం ఆపడం లేదు. ఇటీవల ప్రముఖ నటుడు విజయ్ జాన్ చేసే వికృతాలను బయటపెట్టిన చిన్మయి.. తాజాగా సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ పెట్టింది. టీవీ షోలో ఓ యాంకర్ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పిల్లల భవిష్యత్తుతో ఆటలా?ఓ టీవీ షోలో క ఫీమేల్ హోస్ట్.. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూశాను. ఆ సీన్ చూసి.. అక్కడి ఆడియెన్స్తో పాటు తల్లిదండ్రులు తెగ నవ్వుతున్నారు.. అంతేకాదు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి చేయడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. ఒక వేళ ఈ పిల్లాడికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ క్లాసులు చెబితే.. ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలియక అయోమయోగానికి గురవుతాడు.టీవీల్లో ప్రసారం అయ్యే ఇలాంటి షోలు చిన్నారుల భద్రతకు ఏ మాత్రం ఉపయోగపడవు. సమాజం కూడా వీటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. కానీ ఫన్ ఎప్పటికీ కాదు. దయచేసి అందరూ దీనని గుర్తుంచుకోండి’ అని చిన్మయి తన ఇన్స్టాలో రాసుకొచ్చింది. అయితే చిన్మయి ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసిందనే విషయం తెలియదుక కానీ.. గతంలో ఓ పిల్లల షోలో మాత్రం టాలీవుడ్కి చెందిన స్టార్ యాంకర్ అనసూయ ఓ పిల్లాడితో ఇలా లిప్ కిస్ చేయించుకుంది. అయితే ఆమెను ఉద్దేశించే చిన్మయి ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
నాలుగేళ్ల క్రితం నివాళి అర్పించా.. దయచేసి ఆమెను అవమానించొద్దు: అనసూయ కౌంటర్!
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లోనే ఉంటోంది.తాజాగా అనసూయ ఓ టీవీ షోలో అనసూయ ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన మరో ఆ వీడియోపై ట్రోలింగ్ చేశాడు. దీనిపై అనసూయ రియాక్ట్ అయింది. ఇకపై దేనికి స్పందించకూడని నిర్ణయించుకున్నాని ఆమె తెలిపారు. కానీ.. మహానటికి నివాళులర్పించిన తన వీడియోను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనసూయ ట్వీట్లో రాస్తూ. 'నేను దేనికీ స్పందించకూడదని నిర్ణయించుకున్నా. కానీ నాలుగేళ్ల క్రితం ఒక ఛానెల్లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించా. నా ప్రదర్శన పట్ల నాకు గౌరవంగా భావిస్తున్నా. కానీ మీరు ఇలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేయడం మంచిది కాదు. ఏదైనా నా గురించి గౌరవప్రదమైన విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇది మహానటి సావిత్రిమ్మకు నివాళిని ఉద్దేశించి ఇలా చేయడం అగౌరవంగా అనిపిస్తోంది. దయచేసి ఈ ఈవెంట్లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్ చేయమని సూచిస్తున్నా. కావాలంటే ఈ ప్రోగ్రామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కనీసం లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్ చేయకండి. ఎప్పటిలాగే నాపై విమర్శలు చేయాలనుకుంటే చేస్కోండి' అంటూ అతనికి చురకలు అంటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Hello Teju! Hope you are well!! I decided for my own peace not to react on anything mean.. but I have been seeing this particular bit of my performance giving a tribute to the Mahanati Savithramma for one of the festival events on a channel 4 years back.. using it in a very… https://t.co/u05s1L16oG— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 15, 2024 -
అనారోగ్యంతో ప్రముఖ యాంకర్ అపర్ణ మృతి
బనశంకరి: ప్రముఖ యాంకర్, నటి, బుల్లితెర కళాకారిణి అపర్ణ (58) గురువారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది కాలంగా ఆమె శ్వాసకోశక్యాన్సర్తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యుత్ శ్మఽశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అపర్ణ భర్త నాగరాజ్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు సీనియర్ నటుడు దొడ్డణ్ణ, రమేశ్భట్, రాఘవేంద్రరాజ్కుమార్, సుధారాణి, సుందర్రాజ్, తారా అనురాధ, చంద్రు, గిరిధర్ లోకేశ్, దర్శకుడు నారాయణ్, కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్జోషి, వాటాళ్ నాగరాజ్తో పాటు సాహితీవేత్తలు అపర్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కేంద్రమంత్రి హెచ్డీ.కుమారస్వామి, సినీ నటులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
అమ్మ బాబోయ్.. యాంకర్ రష్మీ అందాల అరాచకం చూశారా! (ఫోటోలు)
-
రేణుకాస్వామిని హీరోను చేయడం ఆపండి.. దర్శన్కు యాంకర్ సపోర్ట్
స్క్రీన్పై హీరోగా మెప్పించే దర్శన్ నిజ జీవితంలో మాత్రం కరడుగట్టిన విలన్గా మారాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడను వేధిస్తున్నాడన్న నెపంతో తన గ్యాంగ్తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి దారుణంగా చంపాడు. ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.ఒక్కసారి ఆ బంధంలో..ఈ కేసు విషయంలో అందరూ దర్శన్ను దుమ్మెత్తిపోస్తుండగా యాంకర్ హేమలత మాత్రం హీరోకు మద్దతుగా నిలబడింది. ఇక నా వల్ల కావడం లేదు. ఎవరు ఏమైనా అనుకోని.. ఒకరిపై మనం పెంచుకున్న ప్రేమకు, స్నేహానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఒక్కసారి స్నేహం అనే బంధంలో ఇరుక్కున్నాక దాని నుంచి బయటకు రాలేము. అప్పుడు, ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని వదిలేయాలని అనుకోము. ఆ గౌరవం అలాగే..జరిగిన ఘటన గురించి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మీ(దర్శన్) మీద ఉన్న ప్రేమ, గౌరవం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి రేణుకాస్వామిని హీరో చేయడం ఆపండి అని రాసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ పోస్టుకు దర్శన్తో కలిసి ఉన్న ఫోటోను జత చేసింది.చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా? -
Rashmi Gautam: క్లోజప్ స్టిల్స్.. రష్మి ఇలా ఉందేంటి? (ఫొటోలు)
-
Sreemukhi: రెక్కలు తొడిగిన ముద్దబంతిలా శ్రీముఖి స్టయిల్ (ఫోటోలు)
-
అలాంటివాటిని పట్టించుకోరు కానీ.. మాపై పడి ఏడుస్తారు: అనసూయ కౌంటర్
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీతో వేకేషన్ ట్రిప్కు వెళ్లిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లోనే ఉంటోంది.అయితే తాజాగా ఓ టీవీ షో మెరిశారు అనసూయ. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఏంటి నాన్సెన్స్ అనసూయ? ఏదైనా అంటే విక్టిమ్(బాధితురాలిగా) కార్డ్ ప్లే చేస్తారు? అంటూ కామెంట్ చేశాడు. అయితే దీనికి అనసూయ రియాక్ట్ అయింది. అసలు మీ అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? అలాగే మీ ఎమోజీ, మీ మైండ్ విషయంలో అంటూ అతనికి ఇచ్చిపడేసింది. కాగా.. టీవీ షో అనసూయతో పాటు కొరియోగ్రాఫర్ షర్ట్ విప్పుతూ కనిపించారు. దీనిపై నెటిజన్ కామెంట్ చేయడంతో తనదైన శైలిలో స్పందించింది.ఆ వీడియోపై మరో నెటిజన్ రాస్తూ..'నీకు నిజంగా అర్థం కావట్లేదా అండి. ఎలా ఉండే షో ఎలా అవుతుందో.. అందులో మీ పాత్ర మంచిగా ఉండాలి. కానీ బ్యాడ్ వైపు వెళ్తుంది. ఒక నటిగా మీరంటే ఇష్టమే..ఇలాంటి ప్రోగ్రామ్స్లో అలాంటివి చేయకుంటే మీకే మంచిది' అని కామెంట్ చేశాడు. దీనిపై కూడా అనసూయ స్పందించింది. అనసూయ రిప్లై ఇస్తూ..'సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా పరిస్థితులు, మారుతున్న కాలం, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా విశ్లేషించాల్సి ఉంటుంది. అయినా మీ ప్రతాపం అంతా చిన్నతెరపై కాదు.. పెద్ దతెరపై ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు వాటిని బ్లాక్బస్టర్ చేస్తారు.. అంతే కాదు షో మొత్తం చూడకుండానే జడ్డిమెంట్ ఇస్తారు. ఇది కేవలం ప్రోమో. స్టోరీ ముందు, వెనుక చాలా ఉంటుంది. అక్కడ అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి లిమిట్స్కే పరిమితం. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే. నేను చెప్పింది మీకు అర్థం అయిందనుకుంటా' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. Neeku nijangaa ardam kaatledaa andiElaa unde show elaa aithunnaai andulo mee paatra good lo undaali gaani bad ki velthundi andiWe really love you as a actor but ilaanti programs lo alaantivi cheyyakunte me better andi— Santosh (@Santosh54493715) June 23, 2024As someone belonging to the entertainment industry we explore certain things with the changing times and tastes of the audiences.. aina mee pratapam anta chinna tera ke parimitama andi.. pedda tera meeda yenno abhyantaramainavi ostunna meeru blockbusters chestaru.. also show anta…— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 23, 2024 -
నీలం దుస్తుల్లో మెరిసిపోతున్న యాంకర్ రష్మి గౌతమ్ (ఫొటోలు)
-
సెలబ్రిటీనే ఇలా చేస్తే ఎలా?.. మీకు రూల్స్ వర్తించవా?
సోషల్ మీడియా వచ్చాక రీల్స్ చేయడం ఓ పిచ్చి అలవాటుగా మారిపోయింది. ఎక్కడపడితే రీల్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మెట్రో, బస్సులు, రైళ్లు, రోడ్లను కూడా వదలడం లేదు. కొందరైతే రీల్స్ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రీల్స్ చేస్తున్నారు.అలాంటి లిస్ట్లో మన సెలబ్రిటీ, యాంకర్ సావిత్రి కూడా చేరిపోయింది. హైదరాబాద్లో ఓఆర్ఆర్పై రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తప్ప మనుషులకు నడవడానికి అవకాశం లేదు. ఓఆర్ఆర్పై దాదాపు 120 స్పీడుతో వాహనాలు వెళ్తుంటాయి. అప్పడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.మరి నిబంధనలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో రీల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆమెను చూసి.. మరికొందరు రీల్స్ చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి వారిని ఓఆర్ఆర్పై రీల్స్ చేయకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లేదంటే రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్ను రీల్స్కు అడ్డాగా మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆమెపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) -
'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్ నూతన షావోమీ 14 సీవీ మోడల్ను ఆవిష్కరించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్తో పాటు పలువురు ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!! -
నన్ను పట్టించుకోలేదు.. అవమానంతో కుంగిపోయా.. రోజూ ఏడ్చేదాన్ని!
కొంతమంది క్రికెట్ విశ్లేషకుల వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానంటోంది నటి, యాంకర్ మందిర బేడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2003 వరల్డ్ కప్ సమయంలో క్రికెట్ ఎక్స్పర్ట్తో కలిసి పని చేశాను. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే వారి ప్యానెల్లో అమ్మాయిలు ఉండేవారే కాదు. కొత్తగా ఒక అమ్మాయి వస్తుందంటే కూడా వాళ్లేమీ ఎగ్జయిట్ అవలేదు.నాకంత అవగాహన లేదునేను అడిగే ప్రశ్నలను కొన్నిసార్లు పట్టించుకునేవారే కాదు. క్రికెట్పై వారికున్నంత అవగాహన నాకు ఉండేది కాదు. నేను కాస్త పిచ్చి ప్రశ్నలడిగేదాన్ని. చాలామంది క్రికెట్ ప్రియులకు కూడా ఇలాంటి ప్రశ్నలే వారి బుర్రకు తట్టి ఉండొచ్చు. కాబట్టి ఇవి అడగడంలో తప్పేముందని అనుకునేదాన్ని. నా మనసుకు ఏది అడగాలనిపిస్తే అది మొహమాటం లేకుండా అడిగేదాన్ని. కొన్నిసార్లు లైవ్లోనే వాళ్లు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు కాదు. పట్టించుకోనట్లు ఉండేవారు. అవమానంతో తల దించుకున్నా..షో అయిపోయాక అవమాన భారంతో తల దించుకుని ఏడ్చేదాన్ని. అసలు ఏం చేయాలి? ఎలాంటి ప్రశ్నలు అడగాలి? అనేది ఎవరూ చెప్పలేదు, ఒక్కరూ సపోర్ట్గా నిలబడలేదు. వారం రోజులు భయపడుతూనే హోస్టింగ్ చేశాను. మధ్యమధ్యలో తడబడేదాన్ని. నాతో పాటు ఉండే మేల్ హోస్ట్ చక్కగా వారితో కలిసిపోయేవాడు. ఒక వారం తర్వాత ఛానల్ నిర్వాహకుల నుంచి పిలుపొచ్చింది. నన్ను తీసేస్తారేమో అనుకున్నాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేవాళ్లేమో షో అంతా బోరింగ్గా ఉంది.. కాస్త జోష్ తీసుకురా అని చెప్పారు. అప్పుడు నేను నా విధానాన్ని మార్చుకున్నాను. భయాన్ని వదిలేశాను. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తీరాలని గట్టిగా అడిగేదాన్ని. వారం రోజుల నరకం తర్వాత నేను మామూలయ్యాను. అందరితోనూ సరదాగా కలిసిపోయాను. ఒకసారి టైగర్ పఠౌడీ స్టూడియోకు వచ్చినప్పుడు.. అందరూ మాట్లాడుకుంటున్న మందిరా బేడి మీరే కదా అని అడిగాడు' అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. సినిమాల్లోనూ..కాగా మందిరా బేడి ఛాంపియన్స్ ట్రోఫీ (2004 & 2006)తో పాటు ఐపీఎల్ రెండో సీజన్కు, 2007 వరల్డ్ కప్కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. మందిర బేడీ.. యాంకర్గా, నటిగా ఫేమస్. ఈమె మన్మథ మూవీలో సైకియాట్రిస్ట్గా, సాహోలో కల్కిగా నటించింది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె స్మోక్, రోమిల్ అండ్ జుగల్, ఖుబూల్ హై 2, సిక్స్ వంటి వెబ్ సిరీస్లలో కనిపించింది.చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ -
సోషల్ మీడియాలో ట్రోల్స్.. బెదిరింపు కాల్స్.. యాంకర్ శ్యామల ఆవేదన!
తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టాలీవుడ్ యాంకర్ శ్యామల ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా జగనన్న వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. నాపై వస్తున్న ట్రోల్స్ను పట్టించుకోనని వెల్లడించారు.అయితే ఎవరినీ కూడా తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని శ్యామల తెలిపారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని అన్నారు. ఎవరి అభిమానం వారిదని.. తనకు పార్టీ అప్పగించిన పనిని మాత్రమే నిర్వర్తించానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ కోసం తనవంతుగా కష్టపడతానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి టాలీవుడ్ యాంకర్ శ్యామల శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు వైఎస్సార్సీపీ అప్పగించిన పనిని నిర్వర్తించానని శ్యామల పేర్కొన్నారు. -
ఫ్యామిలీతో ట్రిప్.. పొట్టి డ్రెస్లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)
-
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ తారలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఈ పార్టీకి తాము హాజరు కాలేదని హేమ, శ్రీకాంత్ వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యాంకర్ శ్యామలపై కొందరు అసత్య కథనాలు ప్రచారం చేశారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు.దీంతో తనపై వస్తున్న అసత్య వార్తలపై యాంకర్ శ్యామల గట్టిగానే స్పందించింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. ఇప్పటికే వారిపై పరువునష్టం దావా వేసినట్లు శ్యామల వెల్లడించింది. కావాలనే తనపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆమె మండిపడింది.అయితే యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందువల్లే రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని శ్యామల స్పష్టం చేసింది. -
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
ప్రముఖ యాంకర్, హీరోయిన్ స్వప్న చౌదరి అరుదైన ఘనత సాధించింది. పదేళ్లుగా యాంకరింగ్ రాణిస్తోన్న స్వప్న చౌదరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఈ సందర్భంగా ఆమెకు అవార్డ్ అందజేశారు. తనకి ఈ అవార్డ్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని స్వప్న చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లుగా యాంకరింగ్లో రాణిస్తూ దాదాపు 2500 పైగా ఈవెంట్స్లో పాల్గొన్నారు. అంతేకాకుండా నమస్తే సెట్ జీ , మిస్టరీ సినిమాల్లో హీరోయిన్గా నటించారు.బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొనడమే తన కోరికని స్వప్న చౌదరి అన్నారు.శబరి నిర్మాతకు అవార్డ్టాలీవుడ్ యువ నిర్మాత శబరి మహేంద్ర నాధ్ కు అరుదైన అవార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ను ఆయన సొంతం చేసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో శబరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఏకకాలంలో సుమారు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవరిస్తున్న సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డ్తో నా బాధ్యత మరింత పెరిగిందని శబరి మహేంద్ర నాధ్ అన్నారు. -
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మి గౌతమ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఇటీవల తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై ఆమె ట్వీట్ చేసింది. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టిచంపారు. అయితే పేరేంట్స్ తీరును రష్మి తప్పుపట్టింది. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందించారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మిక చెబుతోంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి రష్మి సైతం బదులిచ్చింది.రష్మి గౌతమ్ తన ట్వీట్లో రాస్తూ..' ఆ చిన్నారిని ఎందుకలా ఒంటరిగా వదిలేశారు. కుక్క దాడి చేస్తుంటే తల్లిదండ్రులు నిద్ర పోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించి వెయ్యి వీడియోలను షేర్ చేయగలను. అసలు పిల్లల జీవితాలను రిస్క్లో పెట్టింది ఎవరు? జంతువుల విషయానికొస్తే అన్నీ లాజిక్స్ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి.. మీరు మాత్రం ప్రశాంతతను పొందాలనుకుంటే అది జరిగే పని కాదని' రిప్లై ఇచ్చింది.అయితే దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ..' మీకు బుర్ర లేదని అర్థమైందండి.. ఈ మాట అంటున్నందుకు సారీ' అని రాసుకొచ్చాడు. దీనికి రష్మి బదులిస్తూ..'మీకు బుర్ర ఉంది కదా.. పిల్లలను కనడం మాత్రమే కాదు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి' అని సూచించింది. తల్లిదండ్రులు ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేయకుండా ఉండాలని రష్మి హితవు పలికింది. అలాగే బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతులకు యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని.. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపైనా కేసు పెట్టాలని రష్మి అన్నారు.I would have preferred responsible parents https://t.co/bgm2C3JRbJ— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 The article is about a toddler And yes in this day and age of child rapes and molesters Yes the child shud be 24* 7 monitored The chances of your child getting molested by a human is higher than getting bitten by an animal https://t.co/e0Qq8TK4m1— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 -
టాలీవుడ్లో టాప్ యాంకర్గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)
-
సీఎం జగన్ పై దాడి.. ఈనాడు తప్పుడు వార్త.. యాంకర్ హరి కౌంటర్
-
న్యూ ఇయర్ వేడుకల్లో యాంకర్ సుమ ఫ్యామిలీ!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ 25వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. తాజాగా ఈ జంట కేరళలో సందడి చేసింది. మలయాళ నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మలయాళ, తమిళ న్యూ ఇయర్గా భావించే విషును కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యాంకర్ సుమ కేరళలోని పాలక్కాడ్లో జన్మించారు. View this post on Instagram A post shared by suma kanakala (@suma_kanakala_f) View this post on Instagram A post shared by suma kanakala (@suma_kanakala_f) -
Sreemukhi: అందాల బొమ్మ.. రాములమ్మ!
-
ముద్దుగుమ్మ శ్రీముఖి ఉగాది ముస్తాబు (ఫోటోలు)
-
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
Ugadi 2024 : సుమ ‘ఘమ’ల పులిహోర!
దేశవ్యాప్తంగా శ్రీక్రోధి నామ ఉగాది వేడుకల సందడి నెలకొంది. తెలుగు ముంగిళ్లు మామిడి తోరణాలతో.. బంతి, చేమంతులపూల దండలతో ముస్తాబైనాయి. కొంగొత్త ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటూ తమ ఇష్టదైవాలకు మొక్కుకునే శుభ తరుణమిది. దీంతో దేవాలయ్యాన్నీ ముస్తాబైనాయి. ప్రత్యేకపూజలు ప్రార్థనలతో భక్తులు మునిగి తేలతారు. ఈ క్రమంలో పాపులర్ యాంకర్ సుమ ఒక వీడియోను షేర్ చేసింది. పండగంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రడీ చేస్తున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. గలగల మాట్లాడుతూ, సందర్భోచితంగా పంచ్లు వేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. దశాబ్దాలు తరబడి యాంకరింగ్ చేస్తున్నా బోర్ కొట్టని మాటల మూట సుమ. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Rashmi Gautam HD Photos: అలాంటి వ్యక్తితోనే నా పెళ్లి.. యాంకర్ రష్మి (ఫోటోలు)
-
దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత
హైదరాబాద్, సాక్షి: ‘‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..’’ అంటూ ఏళ్లపాటు అలరించిన ఆ గాత్రం మూగబోయింది. దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. రెండ్రోజుల కిందట గుండెపోటుతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. దూరదర్శన్లో తొలి తెలుగు న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్కు ఓ గుర్తింపు ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన శాంతి స్వరూప్.. 1978లోనే దూరదర్శన్లో చేరారు. అయితే యాంకరింగ్ చేసేందుకు ఆయన ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులిటెన్ వార్తల్ని చదివి వినిపించారాయన. టెలి ప్రాంప్టర్(ఎదురుగా స్క్రీన్ మీద చూసి..) లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరి తేరారు. అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు. దూరదర్శన్లో 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్ను తమ గురువుగా భావిస్తుంటారు. అయితే 24/7 పేరిట న్యూస్ రంగంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పుల్ని ఆయన స్వాగతించలేకపోయారు. వార్తలు చదవకండి.. వార్తలు చెప్పండి.. అని తర్వాతి తరం యాంకర్లకు సూచించారాయన. శాంతి స్వరూప్ సతీమణి రోజా రాణి కూడా న్యూస్ రీడర్. 1980లో వీళ్ల వివాహం జరగ్గా.. వీళ్లకు ఇద్దరు సంతానం విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో ‘క్రేజ్’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్లో లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తొలి తరం న్యూస్ రీడర్ గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ గారి మృతి బాధాకరం. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని హరీష్ రావు అన్నారు. -
Anchor Anasuya: ట్రెండీ లుక్లో అనసూయ.. చూపు తిప్పుకోలేరు (ఫోటోలు)
-
మాటల మూట, 'హాఫ్ సెంచరీ' కొట్టేసింది (ఫొటోలు)
-
యాంకర్ లాస్య రెండో కుమారుడి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఎన్నో త్యాగాలు.. ఏమీ లేని స్థాయి నుంచి.. తల్లి గురించి శ్రీముఖి ఎమోషనల్ (ఫోటోలు)
-
HYD: టీవీ ఛానల్ యాంకర్ను కిడ్నాప్ చేసిన యువతి
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్ను యువతి కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. యాంకర్ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగిన త్రిష్ణ అనే యువతి కిడ్నాప్కు పాల్పడింది. తనను వివాహం చేసుకోవాలని రూమ్లో బంధించింది. త్రిష్ణ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ను నడుపుతున్న త్రిష్ణ.. భారత్ మాట్రిమోన్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. ప్రణవ్ పేరుతో నకిలీ ఐడిని సైబర్ కేటుగాళ్లు క్రియేట్ చేయగా, నిజంగానే ప్రణవ్ ఐడి అనుకున్న త్రిష్ణ ఇష్టపడింది. ప్రణవ్పై మనసు పడ్డ ఆమె కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని భావించింది. చివరికి కథ అడ్డం తిరిగింది. త్రిష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్కు పంపించారు. ఐదు స్టార్టప్ కంపెనీలకు త్రిష్ణ ఎండిగా ఉంది. ఇదీ చదవండి: నిన్ను లవ్ చేస్తున్నా.. ఫ్యాకల్టీ నో చెప్పాడని.. ఎంత పనిచేసిందంటే.. -
జనసైనికులను నట్టేట ముంచుతున్న పవన్
-
మీ "కమ్మ” కళ్ళకు అవి కనబడవా
-
తల్లి వర్ధంతి.. యాంకర్ విష్ణుప్రియకు డైమండ్ గిఫ్ట్!
యూట్యూబ్ నుంచి వచ్చి బుల్లితెర సెలబ్రిటీగా మారింది యాంకర్ విష్ణుప్రియ. యాంకర్గా, నటిగా అలరించిన బ్యూటీ ఈ మధ్య షోలలో ఎక్కువగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్బాస్ మానస్తో కలిసి జరీ జరీ పంచెకట్టి అనే ప్రైవేట్ సాంగ్లో ఆడిపాడింది. యూట్యూబ్లో మార్మోగిపోయిన ఈ పాట ఏకంగా 61 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. సిల్వర్ స్క్రీన్పై హవా తగ్గించేసిన ఈ బ్యూటీ తరచూ తన ఫ్రెండ్స్తో కలిసి వెకేషన్కు చెక్కేస్తోంది. చెల్లి గిఫ్ట్.. అక్క ఫుల్ ఖుషీ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అప్పుడప్పుడూ యూట్యూబ్లోనూ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంది. తాజాగా తనకు చెల్లి డైమండ్ నగలు బహుమతిగా ఇచ్చిందోచ్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో విష్ణుప్రియ మాట్లాడుతూ.. 'ఒకరోజు నేను నా చెల్లి పావనిని ఇంటినుంచి తరిమేశాను. ఆమె ఈ రోజు ఏ స్థాయికి ఎదిగిందంటే తన సొంతకారులో ఏఎమ్బీకి తీసుకెళ్లి వజ్రాభరణాలు కొనిచ్చింది. అమ్మ మొదటి వర్ధంతి.. తను కష్టజీవి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నప్పటినుంచి తనకు నేను ఎటువంటి లగ్జరీలు ఇవ్వలేదు. తను మాత్రం నాకు ఈ రోజు డైమండ్ కొనిచ్చింది. ఇక్కడో విషయం చెప్పాలి. గతేడాది జనవరి 26న అమ్మ చనిపోయింది. అమ్మ వర్ధంతికి ఒకరోజు ముందు తన రూపంలో ఈ గిఫ్ట్స్ నాకు వచ్చాయనుకుంటాను' అని చెప్తూ సంతోషపడిపోయింది. చదవండి: 12 ఏళ్ల కష్టం.. పొలం పని చేసుకుందాం, వెళ్లిపోదామన్నా.. -
బిగ్బాస్కి ఎంపిక చేయిస్తామని మోసం
హైదరాబాద్: తనను బిగ్ బాస్–7లోకి పంపిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ అమ్మినేని స్వప్న అనే యాంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న యాంకర్గా, ఈవెంట్ ఆర్గనైజర్గా టాలీవుడ్లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లోకి కంటెస్టెంట్గా పంపిస్తానని మా టీవీలో ప్రొడక్షన్ ఇన్చార్జిగా పనిచేస్తున్న సత్య బిగ్బాస్ ఇన్చార్జి తమిలి రాజును పరిచయం చేశారు. బిగ్ బాస్ లోకి వెళ్లడానికి అందులో ఉపయోగించే దుస్తులు ప్రచారం కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తమిలి రాజు ఆమెకు సూచించారు. ఈ మేరకు గత ఏడాది జూన్ నుంచి దాదాపు రెండున్నర లక్షలు ఆమె అతనికి చెల్లించింది. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు ఆమెను నమ్మించాడు. ఇందుకు సంబంధించి తమిలి రాజు ఆమెకు ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో కొద్దిరోజుల క్రిందట స్వప్న వీడియో రూపొందించి సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఇదే సంఘటనపై శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్ 406, 420 కింద రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Anchor Swapna Chowdary: బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు -
Anchors Sankranti Celebrations Pics: బుల్లితెర యాంకర్లు సంబరాలు..ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు ఒక్క లుక్ వేయండి
-
స్టార్ హీరో ఈవెంట్లో అసభ్య ప్రవర్తన.. యాంకర్తో అలా!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్తో అసభ్య ప్రవర్తన బుధవారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్లో ఆమె అసభ్యకరంగా తాకాడు. అతని తీరుతో విసిగిపోయిన యాంకర్ అక్కడే దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ సైతం యాంకర్ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాలోనూ పోస్ట్ చేసింది. 😨😨 pic.twitter.com/JJljl7ntBc — Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024 -
యాంకర్ సుమ గొప్ప మనసు.. వారి కోసం ఆర్థిక సాయం!
టాలీవుడ్లో యాంకర్ సుమ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈవెంట్ ఏదైనా సరే సుమక్క లేకపోతే ఏదో కాస్తా తక్కువైనట్లు అనిపిస్తుంది. అంతలా తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే సుమ యాంకరింగ్తో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఫెస్టివల్ ఫర్ జాయ్ సంస్థ పేరుతో ఆమె సేవలందిస్తున్నారు. ఏదైనా పండుగ వచ్చిందంటే తన వంతు సహకారంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్కు రూ.5 లక్షల చెక్ను అందజేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్కు సాయం అందజేసినట్లు సుమ వెల్లడించారు. ఈ విషయంలో నాట్స్ సహకారం గొప్పదని సుమ తెలిపారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. బబుల్ గమ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. A heartfelt thank you to @follownatsworld for their generous 5 Lakh donation to the @FilmJournalists through @ItsSumaKanakala @FestivalsforJoy Special appreciation to #SreedharAppasani Garu, #ArunaGanti, #BapuNuthi , #PrashanthPinnamaneni & #RajAllada garu, #NATS Board of… pic.twitter.com/FJo1Bzzx57 — Telugu Film Journalists Association (@FilmJournalists) December 25, 2023 -
తిరుపతిలో షాపింగ్ మాల్ ప్రారంభించిన అనసూయ (ఫొటోలు)
-
కేవలం అది మాత్రమే మహిళకు శ్రీరామరక్ష: అనసూయ
టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. తనదైన నటనతో మరోసారి అభిమానులను కట్టిపడేసింది. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప సీక్వెల్ వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే రంగమ్మత్త తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహర్షి వాల్మీకి రచించిన రామాయణంలోని ఓ కొటేషన్ను షేర్ చేసింది. రామాయణంలోని యుద్ధకాండలో మహిళ గురించి శ్రీరాముడు చెప్పిన వాక్యాన్ని ట్వీట్లో ప్రస్తావించింది. 'ఇల్లు, దుస్తులు, ఇంటి గోడలు, తలుపులతో పాటు ఇంకా విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడగలవు. కానీ ఆమె క్యారెక్టర్ మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను రక్షిస్తుంది' అంటూ పోస్ట్ చేసింది. 😌 pic.twitter.com/P4s2t9jFBS — Anasuya Bharadwaj (@anusuyakhasba) December 19, 2023 -
క్రెడో బ్రాండ్స్ @ రూ. 266–280
మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్స్, 1,807 టచ్పాయింట్స్సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది. -
నా సపోర్ట్ ఆ పార్టీకే : జ్యోతక్క క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తెలంగాణ యాంకర్ శివజ్యోతి(జ్యోతక్క) యూ ట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె బీఆర్ఎస్కు ఎందుకు సపోర్ట్ చేస్తోందో వివరించింది. తాను ఎవరికి అమ్ముడు పోలేదని, తనకు నచ్చినది చెప్తున్నానని క్లారిటీ ఇచ్చింది. బీఆర్ఎస్కు మద్దతివ్వడాన్ని ఆమె అంశాల వారిగా వివరిస్తూ సమర్థించుకున్నారు. నువ్వెందుకు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నావని తిడుతున్న వారి కోసమే వీడియో పెడుతున్నానని తెలిపింది. ‘సర్కార్తో హ్యాపీగా ఉన్నామని దేశంలో తెలంగాణ రైతులు మాత్రమే చెబుతున్నారు. కరెంటు లేకపోతే అప్పట్లో పరిస్థితులు దారుణంగా ఉండె. అప్పులు కట్టలేనన్న రైతుల ఇండ్ల తలుపులు పీక్కుపోయిన ఘటనలున్నాయి. కరెంటే లేకపోతే ఫోన్ల చార్జింగ్లు ఎట్ల పెట్టుకునేటోళ్లం. యూ ట్యూబ్ల వీడియోలు ఇట్ల చూస్తుంటిమా. కళ్యాణలక్ష్మి ఇచ్చిందెవరు కేసీఆర్ సార్ కాదా. నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య ఎప్పుడు పరిష్కారమైంది. ఎవరు పరిష్కారం చేశారు’ అని జ్యోతక్క ప్రశ్నించారు. ‘పెద్దకొడుకు లెక్కముసలోల్లకు రూ.2016 పెన్షన్లు ఇచ్చింది కేసీఆర్ సార్ కాదా. ఉద్యోగాలివ్వాలని అడిగితే పెన్షన్ల గురించి ఎందుకు చెబుతున్నావని కొందరు అడుగుతున్నారు. అందరికీ ఉద్యోగాలు రావు కదా. ఉద్యోగాలు రాని వాళ్ల తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి. మార్పు రావాలి అని అంటున్న వాళ్లతో 60 ఏళ్లు వెనక్కి పోతాం. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుక్కుంటున్నరు. ముఖ్యమంత్రి పదవి కోసం కాదా వాళ్ల తాపత్రయం. వాళ్ల మోసాన్ని గమనించకుండా ఉద్యోగాల కోసం మార్పు కావాలనుకుంటే కరక్టేనా. దేశంలో అన్ని స్టేట్లలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది కేసీఆర్ సర్కారు కాదా’ అని జ్యోతక్క ప్రశ్నించారు. ‘కేసీఆర్ సారు రాజకీయాల్లో ఉన్నంత కాలం సారే సీఎం కావాలి. సార్ ఒక్క హ్యాట్రిక్ కాదు ఎన్నో హ్యాట్రిక్లు కొట్టాలి. మేమే ఇచ్చినం కదా అనేటోళ్లు ఎప్పుడిచ్చిండడ్రో ఆలోచించుకోవాలి. స్వాతంత్రం ఇచ్చిన బ్రిటీష్ వాళ్లు గొప్పోళ్లా సాధించుకున్న మనం గొప్పోళ్లమా. సార్ ఒక్క ఛాన్స్ కావాలని అడగలే సావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినందుకు, అభివృద్ధి చేసినందుకే నేను బీఆర్ఎస్ పార్టీ సైడున్న. నెగెటివ్ కామెంట్లు పెట్టినా, ట్రోల్ చేసినా సరే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి అని కోరతాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి’ అని జ్యోతక్క కోరారు. ఇదీచదవండి..మనమేమన్నా గొర్రెలమా..కాదని 30న చెప్పాలె -
మళ్లీ టంగ్ స్లిప్ అయిన సుమ.. ఈసారి అలా దొరికిపోయిందిగా!
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ను యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈవెంట్కు యాంకర్గా సుమ వ్యవహరించారు. తన మాటలు, కామెడీ ఆడియన్స్లో జోరు తెప్పించే యాంకర్ సుమ ఎంతో యాక్టివ్గా ఉంటోంది. అలాగే స్టేజీపై చాలా సందర్భాల్లో సుమ టంగ్ స్లిప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి యాంకర్ సుమ ఎలా దొరికిపోయిందో మీరు చూసేయండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదికపై ఉన్న రష్మికకు సుమ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంలోని ఓ సాంగ్ను పాడాలని కోరింది. అయితే మహేశ్, రష్మిక జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలోని 'అబ్బబ్బా అబ్బాయి ఎంత ముద్దుగున్నాడే'.. అనే సాంగ్లో 'హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్.. హీజ్ సో హ్యాండ్సమ్' అంటూ రష్మిక డ్యూయేట్ పాడుతుంది. ఈ సాంగ్ అప్పట్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే యాంకర్ సుమ మాత్రం సర్కారు వారిపాటలోని ఈ పాటను పాడమంటూ రష్మికను అడిగింది. అయితే దీనిపై నెటిజన్స్ సుమక్కను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పాట సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనిది కావడంతో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే హడావుడిలో సరిలేరు నీకెవ్వరు బదులుగా సర్కారు వారి పాట అనేసి దొరికిపోయింది. ఇటీవలే కన్నడ నటుడు రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సైడ్ బి ఇంటర్వ్యూలో సుమకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రక్షిత్ శెట్టి గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా ప్రశ్నలు వేసి దొరికిపోయింది సుమ. అయితే పెద్ద ఈవెంట్ కావడంతో అలా పొరపాటుగా అనేసి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
21 ఏళ్లకే విడాకులు.. డిప్రెషన్లోకి వెళ్లిపోయా: నటి
పైకి నవ్వుతూ ఉన్నంతమాత్రాన వారి జీవితాలు సంతోషంగా సాగిపోతున్నట్లు కాదు. కొందరు అంతులేని విషాదాన్ని, దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకుని బయటకు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. నలుగురినీ నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. తమిళ యాంకర్, నటి స్వర్ణమాల్య కూడా అదే కోవలోకి వస్తుంది. యుక్త వయసులోనే ఎన్నో కష్టాలను చూసిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. 21 ఏళ్లకే విడాకులు.. కారణం తెలీదు 'నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు యూత్ ఇన్నొవేషన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాను. అప్పుడు కొంత బెరుకు ఉండేది. నిజానికి నేను ఎప్పుడూ ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటాను. నాకు యుక్త వయసులోనే పెళ్లి చేశారు. కానీ అది ఎంతోకాలం నిలవలేదు. 21 ఏళ్లకే విడాకులు అయిపోయాయి. అప్పుడతడి వయసు 25. ఆ వయసులో మాకు ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది కూడా పెద్దగా తెలియదు. బహుశా అమెరికా లైఫ్స్టైల్ నాకు వంటపట్టలేదేమో! డిప్రెషన్, చచ్చిపోదామనుకున్నాను ఈ విడాకుల వల్ల నాకన్నా నా తల్లిదండ్రులు ఎక్కువ బాధపడ్డారు. చదువులపై ధ్యాస పెడితే ఈ బాధ నుంచి బయటపడొచ్చన్నారు. ఈ బ్రేకప్, కొట్లాటల వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాను. జీవితం అంటే ఇదేనా? ఎందుకు బతకాలి? అని విరక్తి చెందాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పరిస్థితి చూడలేక నా సోదరి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి రెండు నెలలు పట్టింది' అని చెప్పుకొచ్చింది. కాగా యాంకర్గా కెరీర్ ప్రారంభించిన స్వర్ణమాల్య తర్వాత నటిగానూ మారింది. మణిరత్నం దర్శకత్వం వహించిన అలైపుతే సినిమాలో ఓ పాత్రలో నటించింది. నటన, యాంకరింగ్.. రెండింటిలోనూ ఆరితేరిన ఆమె ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతోంది. నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: కొత్తింట్లో దీపావళి.. పేరెంట్స్కు ఖరీదైన గిఫ్ట్.. ఎంతైనా ఆమె మనసు బంగారం! -
పేరెంట్స్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి
ఆమె మాట్లాడితే థౌజండ్వాలా టపాసులు పేలినట్లు ఉంటాయి. అంత పెద్ద గొంతు మాత్రమే కాదు, అంతటి హుషారు, ఉత్సాహం కూడా ఆమె మాటల్లో ధ్వనిస్తుంటుంది. ఆ లేడీ యాంకరే శ్రీముఖి. నిజామాబాద్ ముద్దుబిడ్డ అయిన శ్రీముఖి బుల్లితెరపై టాప్ యాంకర్గా రాణిస్తోంది. ఆ మధ్య బిగ్బాస్ మూడో సీజన్లోనూ పాల్గొంది. ఇప్పటికీ స్టార్ యాంకర్గా సత్తా చాటుతున్న ఆమె దీపావళి పండగను నిజామాబాద్లో కొత్తింట్లో తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. వాళ్లకు స్వీట్లు.. వీరికి బంగారు బహుమతులు ముందుగా ఇంట్లో పూజ చేసుకున్నాక ఆ పూజకు వచ్చిన అతిథులంందరికీ స్వీట్లు పంచారు. ఆ తర్వాత పేరెంట్స్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. తండ్రి రామకృష్ణకు బంగారు చైన్ బహుమతిగా ఇవ్వగా తల్లి లతకు వజ్రాల ఆభరణాన్ని అందించింది. ఇది చూసి శ్రీముఖి తల్లి ఒక్కసారిగా షాకైంది. డైమండ్ నెక్లెస్.. చాలా బాగుంది అని మురిసిపోయింది. ఇలా వారికి ఊహించని బహుమతులిచ్చి పండక్కి తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకొచ్చింది శ్రీముఖి. జీవితాన్ని ప్రసాదించింది వీళ్లే 'ఒకప్పుడు మాది మధ్యతరగతి కుటుంబం. ఒకే గదిలో ఉంతా ఉండేవాళ్లం. ఆ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదిగి ఈ రోజు ఇంత పెద్ద ఇంట్లో దీపావళి పండగను జరుపుకోగలుగుతున్నామంటే అందుకు నా పేరెంట్సే కారణం. మాకు ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు వారికి మా తరపున ఈ చిన్న బహుమతి ఇచ్చాం అంటూ వారి కాళ్ల మీద పడి ఆశీర్వాదాలు తీసుకున్నారు శ్రీముఖి, ఆమె తమ్ముడు శుశ్రుత్. ఇది చూసిన జనాలు ఎంతైనా శ్రీముఖి మనసు బంగారం అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: 19 ఏళ్లకే పెళ్లి.. ఫేక్ స్మైల్.. రెండో పెళ్లి గురించి విమర్శలు.. ఎన్నో బాధలు.. ఎంతో ఏడ్చా: సింగర్ సునీత -
Anchor Suma Diwali Celebrations: యాంకర్ సుమ ఇంట్లో దీపావళి వేడుక (ఫొటోలు)
-
భర్తకు స్పెషల్గా విష్ చేసిన సుమ.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్లో యాంకర్ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెనే. ఏ ఈవెంట్ జరిగినా సరే తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేదికపై గలగల మాట్లాడే యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టింది కేరళ అయినా.. తెలుగబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలిగా మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా బుల్లితెరపై ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తన భర్త బర్త్ డే సందర్భంగా ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన భర్తకు పుట్టిన రోజు శుభాకాక్షంలు చెబుతూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుమ తన ఇన్స్టాలో రాస్తూ.. 'నా ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు లేకుండా నా వృత్తిని కొనసాగించడం కష్టం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ ప్రోత్సహించారు. లవ్ యూ రాజీవ్.' అంటూ లవ్ సింబల్ ఎమోజీలను పంచుకుంది. ఇది చూసిన ఆడియన్స్ సైతం రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల 'బబుల్గమ్' చిత్రంతో హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
అందువల్లే హీరోయిన్ ఛాన్స్ రాలేదు: అనసూయ
యాంకర్గా కెరీర్ మొదలు పెట్టి.. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తోన్న నటి అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ పూర్తిగా మారిపోయింది ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో అభిమానులను అలరించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన అనసూయ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పాటలో నటించకపోవడానికి గల కారణాన్ని వివరించారు. (ఇది చదవండి: స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..!) అనసూయ మాట్లాడుతూ.. 'అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అవకాశం వచ్చింది. అయితే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని తెలిసి నేను చేయనని చెప్పా. ఎందుకంటే గుంపులో నటించడం నాకు నచ్చదు. నాకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటా. అందుకే ఆ పాటకు నో చెప్పా. ఆ సమయంలో చాలా మంది నన్ను విమర్శించారు. నేను నో చెప్పడం తప్పు కాదు.. నా పద్ధతి సరైంది కాదేమో అని నాకనిపించింది. మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని అందుకే కొంచెం కఠినంగా చెప్పేశా. అప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్ జరిగింది. అందుకే త్రివిక్రమ్కు సారీ చెప్పా' అని అన్నారు. హీరోయిన్ ఛాన్స్ రాకపోవడంపై స్పందిస్తూ..'షూటింగ్స్లో నా పని అయిపోగానే వెళ్లిపోతా. సినిమా అయ్యాక పార్టీలకు దూరం. అందువల్లే హీరోయిన్ ఛాన్సులు కోల్పోయా. అలా అయితేనే అవకాశాలు వస్తాయంటే వాటిని నేను ప్రోత్సహించను. ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే.. నాకే ప్రాధాన్యత ఉండాలని కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు కాస్తా మార్పు వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా నటనతో గుర్తింపు వస్తుందనే నమ్మకం కలిగింది.'అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాకు పుట్టుకతోనే సమస్య ఉంది.. కానీ తెలియలేదు: రేణు దేశాయ్) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
Anchor Rampalli Manjusha: లేటెస్ట్ ఫోటోలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న యాంకర్ మంజూష (ఫొటోలు)
-
కొత్తింట్లో చేరిన బిగ్ బాస్ శివజ్యోతి.. వీడియో చూశారా?
తీన్మార్ వార్తలతో సావిత్రిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలంగాణ ముద్దుబిడ్డ శివజ్యోతి. బిగ్ బాస్ షోలో పాల్గొన్ని అందరి దృష్టని ఆకర్షించింది. వెంటితెరపై యాంకర్గానే పరిచయమైన శివజ్యోతి.. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్గా మరింత ఫేమస్ అయింది. బిగ్బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: తన ఇంటిని చూపించిన శివజ్యోతి.. ఆ బాధతో కంటతడి!) అయితే ప్రస్తుతం తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్తో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన చెందిన శివజ్యోతి.. గంగూలీ అలియాస్ గంగులుని ప్రేమ వివాహాం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని గతంలో ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తాజాగా తన ఛానెల్ ద్వారా గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. వీడియో చూస్తే గేటేడ్ కమ్యూనిటీలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో శివజ్యోతి ఫ్రెండ్స్, బుల్లితెర నటీనటులు, బంధువులు పాల్గొన్నారు. ఈ వేడుకలో శివజ్యోతి, గంగూలీ దంపతులు అతిథులందరికీ అద్భుతమైన వంటకాలతో స్వాగతం పలికారు. అయితే గతంలోనూ ఓ ఇంటిని కొనుగోలు చేసిన శివజ్యోతి కొన్ని రోజులకే అమ్మేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!) -
మరియం కురియన్ మరియు నయనతార
గ్లామర్ పాత్రలతో మెరిసిన నయనతార ‘గ్లామర్’కు మాత్రమే పరిమితం కాలేదు. ‘శ్రీరామరాజ్యం’ ‘అనామిక’ ‘గాడ్ఫాదర్’లాంటి సినిమాలతో నటిగా మెప్పించింది. ఫిమేల్ – సెంట్రిక్ ఫిల్మ్ అనగానే తన పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. ‘లేడీ అమితాబ్’గా పేరు తెచ్చుకుంది. సినిమా ఫీల్డ్కి రాక ముందు నయనతార మోడలింగ్, టీవీ షోలు చేసేది. ఒక టీవీలో ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ షో ‘చమయం’ చేసేది. నయనతార అసలు పేరు డయాన మరియం కురియన్. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన డయాన(నయన) కాలేజీ రోజుల్లోనే పార్ట్–టైమ్గా మోడలింగ్, టీవి యాంకరింగ్ చేసేది. ఆమె మోడలింగ్ స్కిల్స్ చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ ‘మనసినక్కరే’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో ‘గౌరి’ పాత్రలో నటించిన నయనతార నిన్నా మొన్నటి బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘జవాన్’లోని ‘నర్మదా రాయ్’ పాత్ర వరకు నటనలో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటూనే ఉంది. -
నంద్యాలలో జీవీ మాల్ ప్రారంభించిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
తాను వేసిన ఉచ్చులో..
లండన్: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ మెయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్ ఉచ్చులో దాని సబ్మెరైన్ చిక్కుకుందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందంటే.. ! ఈ సబ్మెరైన్ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్ చైన్ను డ్రాగన్ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు. సబ్మెరైన్లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న 55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్ కల్నల్ జీ యాంగ్పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్లు దీనిని తోసిపుచ్చాయి. జలంతర్గాముల్లో హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్నుంచి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. -
నా కెరీర్ ఖతమన్నారు, మౌనంగా భరించాను, తిరిగొస్తున్నా: మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. ఆయన నటించిన చివరి చిత్రం ఒక్కడు మిగిలాడు 2017లో వచ్చింది. తర్వాత వచ్చిన సినిమాల్లో అతిథిగా మెరిశాడే తప్ప హీరోగా ఒక్క మూవీలోనూ కనిపించలేదు. దీంతో ఆయన పనైపోయింది, సినిమాలకు గుడ్బై చెప్పేశాడని ప్రచారం జరిగింది. ఆ సమయంలో అహం బ్రహ్మాస్మి సినిమా ప్రకటించాడు. కానీ, ఆ మూవీ గురించి తర్వాత ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇటీవలే గుడ్న్యూస్.. అంటూ వాట్ ద ఫిష్ అనే సినిమా ప్రకటించాడు. మనం మనం బరంపురం అనేది సినిమా ట్యాగ్లైన్. సేమ్ టు సేమ్.. ఈ సినిమా గురించి కూడా మళ్లీ ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. ఈ తరుణంలో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు మనోజ్.. ఓ ఓటీటీ కోసం ర్యాంప్ ఆడిద్దాం అనే షో చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదల చేశారు. 'నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమ ప్రొఫెషన్గా మారింది. నన్ను ఒక నటుడిగానూ, హీరోగానూ చేసింది. రాకింగ్ స్టార్ అనే పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు.. ఇలా ఓ పండగలా జరిగిన నా లైఫ్లోకి సడన్గా ఓ సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయాడన్నారు, కెరీర్ ఖతమన్నారు, యాక్టింగ్ ఆపేశాడు.. ఇంక తిరిగి రాడన్నారు.. ఎనర్జీ స్టార్లో ఎనర్జీ తగ్గిందన్నారు.. విన్నాను, చూశాను, మౌనంగా భరించాను.. తిరిగిస్తున్నాను' అని ఈ ప్రోమోలో చెప్పుకొచ్చాడు మనోజ్. ప్రస్తుతం మనోజ్ కామెంట్స్ వైరల్గా మారాయి. Priyamiyna abhimanula kosam, Tirigosthunna koncham kothaga, Sarikothaga ramp adiyadaniki… YOUR ROCKING STAR IS BACK WITH A GAME SHOW!https://t.co/PPfTs4grcQ#RampAddidham #RockingStar #ComingSoon #ETVWin #PeopleMediaFactory@peoplemediafcy @etvwin @vishwaprasadtg… pic.twitter.com/4qBwN8nejB — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 22, 2023 చదవండి: మార్క్ ఆంటోని సక్సెస్.. 11 ఏళ్ల పోరాటం తర్వాత విశాల్కు సక్సెస్ -
పలు టీవీ ఛానళ్లపై ఇండియా కూటమి నిషేధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: తమపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్లు, షోలపై నిషేధం విధించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. తమపై విషం చిమ్ముతున్నవారి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నిన్న ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ భేటీలో ఈ మేరకు తీర్మానించింది. #WATCH | "There are some anchors who conduct provocative debates. We'll make a list of them and INDIA alliance partners will stop going to their shows.": AAP Rajya Sabha MP Raghav Chadha after meeting of INDIA alliance coordination committee.#AamAadmiParty #RaghavChadha… pic.twitter.com/GlGz2wEqXK — Free Press Journal (@fpjindia) September 13, 2023 నిన్న ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటిసారి సమావేశమైంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయి ఎన్నికల ప్రచారం, సీట్ల షేరింగ్పై చర్చించారు. అక్టోబర్లో మొదటి బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలు తమను పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేసింది. పైగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అలాంటి ఛానళ్లను, షోలను, యాంకర్లను ఇకపై నిషేధించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. BIG BREAKING: The INDIA alliance has prepared the list of TV anchors who propagate hatred. Next week the list will be published by all the opposition parties. -Aman Chopra -Amish Devgan -Arnab Goswami -Sushant Sinha -Chitra Tripathi -Deepak Chaurasia -Rubika Liyaquat These… — Amock (@Politics_2022_) September 13, 2023 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో కొన్ని మీడియా ఛానళ్లు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. తమకు వ్యతిరేకమైన అంశాలనే ప్రచారం చేసినట్లు తెలిపింది. జోడో యాత్రపై సోషల్ మీడియాలో విశేష స్పందన లభించినప్పటికీ ప్రధాన మీడియా పక్కకు పెట్టినట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఆరోపించారు. 'కొన్ని మీడియా సంస్థల ఎడిటర్లు భారత్ జోడో యాత్రను నిషేధించారు. లక్షల మంది పాల్గొన్నప్పటికీ తగినంత ప్రచారం కల్పించలేదు. పైగా వ్యతిరేకమైన వార్తలనే ప్రచారం చేశారు' అని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మండిపడ్డారు. 2019 మేలోనూ కొన్ని మీడియా ఛానళ్లపై కాంగ్రెస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టీవీ డిబేట్లకు కాంగ్రెస్ తమ ప్రతినిధులను పంపకూడదని సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా అప్పట్లో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: Sanatan Dharma Remark Controversy: సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన -
యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది?
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు చెందిన న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా అక్టోబర్ 2018లో ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఈ కేసులో సల్మా ప్రియుడు మధుర్ సాహు ఆమెను హత్య చేసి, అతని స్నేహితులతో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో ఇన్నాళ్లకు వెల్లడైంది. 2023, ఆగస్టు 22న సల్మా అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సల్మా సుల్తానా మాయమయ్యాక.. కోర్బా జిల్లాలోని కుస్ముండా నివాసి అయిన 18 ఏళ్ల సల్మా సుల్తానా ఒక కేబుల్ ఛానెల్లో యాంకర్గా పనిచేసేది. 10వ తరగతి పాసయ్యాక యాంకరింగ్ చేయడం మొదలుపెట్టింది. 2018, అక్టోబర్ 21న సల్మా సుల్తానా ఇంటి నుండి బయటకు వెళ్లింది. తరువాత మరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఎన్నాళ్లు వెదికినా సల్మా గురించిన ఎలాంటి సమాచారం వారికి దొరకలేదు. సల్మా తండ్రి మరణించాక.. సల్మా తండ్రి 2019, జనవరి 20న మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసమైనా సల్మా ఇంటికి తప్పకుండా వస్తుందని కుటుంబసభ్యులు ఆశించారు. కానీ అది జరగలేదు. అయితే ఆమె అదృశ్యంపై కుటుంబ సభ్యులు 2019 జనవరిలోనే స్థానిక కుస్ముండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిలో జిమ్ నిర్వాహకుడు, సల్మా ప్రియుడు మధుర్ సాహుపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ చొరవతో.. సల్మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మధుర్ సాహుతో సహా సల్మా పరిచయస్తులను విచారించారు. విచారణలో మధుర్ సాహు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు. సల్మా కేసుకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభ్యం కాకపోవడంతో కేసు మూలన పడింది. అయితే 2023 మార్చిలో కోర్బా సిటీ ఎస్పీ రాబిన్సన్ గుడియా సల్మా కేసుకు సంబంధించిన ఫైల్ను తనిఖీ చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదించిన అనంతరం తిరిగి విచారణకు ఆదేశించారు. ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు వివరాల రాబట్టడంలో సఫలమయ్యారు. ఒకరోజు తాగిన మత్తులో.. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి చేరుకోవడంతో మధుర్ సాహు తాను ఇకపై పోలీసుల చేతికి చిక్కే అవకాశం ఉండదని భావించాడు. ఒకరోజు తాగిన మత్తులో మధుర్ తన స్నేహితుని ముందు సల్మా హత్య గురించి వెల్లడించాడు. ఏదో లావాదేవీ విషయంలో మాధుర్కు అతని స్నేహితునికి మధ్య వివాదం జరిగింది. దీంతో మాధుర్ స్నేహితుడు.. సల్మా హత్య గురించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! సల్మా సుల్తానా రుణం చెల్లిస్తూ.. కాగా యూనియన్ బ్యాంక్ నుంచి సల్మా సుల్తానా రుణం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు బ్యాంకును సంప్రదించగా సల్మా రుణానికి సంబంధించిన ఈఎంఐని గంగాశ్రీ జిమ్ యజమాని మధుర్ సాహు చెల్లిస్తున్నట్లు తెలిసింది. సల్మా కనిపించకుండా పోయిన తర్వాత ఆమె ఈఎంఐని మధుర్ సాహు చెల్లిస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో మధుర్ సాహు పరారయ్యాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. సల్మా స్నేహితులు, సన్నిహితుల వాంగ్మూలాలను పోలీసులు మరోసారి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషుల వాంగ్మూలాలు వేర్వేరుగా ఉండటంతో వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా వారు నిజాన్ని బయటపెట్టారు. 2018, అక్టోబరు 21న సల్మా సుల్తానాను మధుర్ సాహు, అతని సహచరుడు కౌశల్ శ్రీవాస్ హత్య చేశారని వారు పోలీసులకు తెలిపారు. తరువాత సల్మా మృతదేహాన్ని కోర్బాలోని కొహాడియా వంతెన సమీపంలో ఖననం చేశారని వెల్లడించారు. అస్థిపంజరం కోసం తవ్వకాలు నిందితుడిని గుర్తించిన పోలీసులు కోర్టు అనుమతితో సల్మాను ఖననం చేసిన రోడ్డు ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. 2 రోజుల పాటు ఈ తవ్వకాలు సాగాయి. చివరికి 2023 ఆగస్టు 22న పోలీసులు ఒక షీట్లో చుట్టివుంచిన అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ఈ అస్థిపంజరం ఎవరిదనేది నిర్ధారించేందుకు దానిని డీఎస్ఏ పరీక్షలకు పంపారు. న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా మృతదేహాన్ని నిందితులు ఖననం చేసిన ప్రదేశంలో గతంలో హైవేను నిర్మించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన మధుర్ సాహు, కౌశల్ శ్రీవాస్, అతుల్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! -
మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది: అనసూయ ట్వీట్ వైరల్!
బుల్లితెర యాంకర్ నుంచి.. నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ మరోసారి హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే అనసూయ.. ఓ వీడియో షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. అందులో బోరున విలపిస్తూ కనిపించింది. దీంతో అనసూయకు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆరా తీశారు. తీరా సోషల్ మీడియా నెగెటివిటీ గురించే అని అంతా అనుకున్నారు. కానీ మరో వీడియో షేర్ చేసిన అనసూయ.. మీరేంటి ఇలా అర్థం చేసుకున్నారా? అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలో ఏడ్చింది నేను ఓ తీసుకున్న నిర్ణయం వల్లే కానీ.. సోషల్ మీడియా నెగెటివిటీపై ఏ మాత్రం కాదని అనసూయ వెల్లడించింది. అయితే తాజాగా మరో ట్వీట్ చేసిన అనసూయ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ సారి ముఖ్యంగా హేటర్స్ను ఉద్దేశిస్తూ ట్వీట్లో ప్రస్తావించింది. ద్వేషాన్ని ఎదుర్కొని తాను ధైర్యంగా ముందుకు సాగుతానని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అనసూయ ట్వీట్లో రాస్తూ..' మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటివ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి.. మీకు మీరు మంచి వాళ్లమని ఫీలవుతుంటారు. ఆ బాధపడిన వ్యక్తే స్ట్రాంగ్గా నిలబడితే మాత్రం తట్టుకోలేరు. ఇదే కదా కపటధోరణి అంటే. ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా నా జీవితంలో ముందుకెళ్తా. సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే.. నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్ పొందాలనుకుంటారు. బతికినంత కాలం చావాలనిపించేలా ట్రీట్ చేసి.. చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు.' అంటూ ట్వీట్లో ప్రస్తావించింది. ఆ తర్వాత కూడా వరుస ట్వీట్స్ చేసింది. 'ఏది ఏమైనా ఇప్పటికే నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా. హేటర్స్ను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరే నా బలం. శక్తి' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత మరో ట్వీట్లో.. 'ఐ యామ్ సారీ.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్తో పాటు సోషల్మీడియాలో మనం ఉండటానికి అసలు కారణం ఏమిటి? అటెన్షన్ పొందడం కోసం కాదా?’’ అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. #RiseAndShine ☀️ pic.twitter.com/osOFG9bmiu — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 20, 2023 Anyway.. I don’t want to indulge in these misunderstood immature responses .. just wanted to convey something right.. as it was misunderstood.. I clarified.. Hope you all have a good weekend .. much love always ❤️🤗 PS: Don’t blindly believe what ever you see.. please clarify 🙏🏻 — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 19, 2023 Also enti meeru attention attention ani papam.. manam ee platforms lo unnade attention kosam.. who are we kidding.. atleast I am transparent enough to agree.. meerenduku musugulo guddulaatalu?? Ofcourse I need attention on everything I want to convey.. 😄 — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 19, 2023 -
వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా?
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే యాంకర్ అనసూయ భరద్వాజ్ గుక్కపెట్టి ఏడ్చింది. తన బాధనంతా కన్నీళ్ల రూపంలో వ్యక్తపరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పైకి స్ట్రాంగ్ లేడీగా కనిపించే అనసూయ మనసులో ఇంత బాధ ఉందా? అసలేం జరిగింది? ఎందుకు ఇంతలా ఏడుస్తోంది? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటిది కాదని, ఐదు రోజుల క్రితంది అని పేర్కొంది అనసూయ. ఆ సమయంలో తన బాధను వ్యక్తీకరించిన క్షణాలను గుర్తుపెట్టుకునేందుకే ఈ వీడియో రికార్డు చేసినట్లు పేర్కొంది. సోషల్ మీడియా ఉన్నది దేనికి? అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో 'హలో అందరికీ.. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్ చూసి మీరందరూ ఎంతో గందరగోళానికి గురై ఉంటారు. ఇకపోతే నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి సమాచారాన్ని పంచుకునేందుకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్ అవడానికి, ఒకరి కోసం ఒకరం ఉన్నామని చెప్పడానికి, విజ్ఞానాన్ని పంచుకోవడానికి, జీవన విధానాలను, సాంప్రదాయాలను, సంతోషాలను షేర్ చేసుకునేందుకే సోషల్ మీడియా ఉంది. ఆశ్చర్యమేంటంటే.. నిజంగా అదే జరుగుతోందా? సంతోషాన్ని షేర్ చేసుకున్నా.. ఇప్పుడు బాధను.. ఈ పోస్ట్ ఎందుకు వేశానంటే.. నేను ఏ ఫోటోషూట్ చేసినా, సరదాగా ఫోటోలు తీసుకున్నా, డ్యాన్స్ చేసినా, నవ్వుకున్నా, కౌంటర్స్ ఇచ్చినా.. ఏం చేసినా మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే అవన్నీ నా జీవితంలో భాగమే.. నా జీవితంలో బాధాకరమైన క్షణాలు కూడా ఉన్నాయి. అప్పుడు నేను బలహీనమైపోయి, కుమిలిపోయి ఏడ్చాను. దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నా లైఫ్లో ఇటువంటి రోజులు కూడా ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకున్నాను. స్ట్రాంగ్గా ఉందామనుకున్నా.. కానీ.. మానవ జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. ఒక సెలబ్రిటీగా నేను ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నించాను. ఏవీ పట్టించుకోనక్కర్లేదని భావించాను. వీలైనంతవరకు స్ట్రాంగ్గా ఉండాలనే ప్రయత్నించాను. అలా ఉండటమే అసలైన బలం అనుకున్నాను, కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నా బాధను వ్యక్తపరచడమే నా అసలైన బలం. నా బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లనిచ్చి తిరిగి చిరునవ్వుతో లేచి నిలబడతాను. ప్రతిదానికీ సర్దుకుపోవడం అంత ఈజీ కాదు. దయచేసి అలా చేయొద్దు అందరినీ నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి సహృదయంతో మెదలండి. అవతలివాళ్లు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి వారిని ఇంకా బాధించవద్దు. కాస్త ఆలోచించండి. ఈ వీడియో ఐదు రోజుల క్రితానిది. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను' అని అనసూయ రాసుకొచ్చింది. కాగా అనసూయ ఇటీవల తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో భర్తతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంది. అయితే ఆమె ఏం చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ట్రోలర్స్. ఈ క్రమంలోనే తను చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: దెబ్బేసిన భోళా.. ఆగస్టు 22 కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్! ఎనీ సర్ప్రైజ్.. -
థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!
ప్రముఖ యాంకర్, బిగ్బాస్ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో యాంకర్ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించిన భామ.. ఆ తర్వాత మంజునాథ్ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్ గుడ్బై చెప్పిన లాస్య.. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనివ్వగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే యూట్యూబ్ చానల్ను రన్ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన లాస్య సోషల్ మీడియాలో ఎప్పుడు చురుక్కుగ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. (ఇది చదవండి: నీ భార్యగా గర్వపడుతున్నా.. భర్తపై యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్) తాజాగా లాస్య తన ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన భర్తతో కలిసి థియేటర్లో హంగామా చేసింది. ఈ జంట మరింత రొమాంటిక్గా అందరి ముందే రెచ్చిపోయారు. ఆమె భర్త మంజునాథ్ థియేటర్లోనే లాస్యకు మరోసారి ప్రపోజ్ చేస్తూ రచ్చ చేశారు. ఇదంతా సూర్య హీరోగా నటించిన సూర్య సన్ఆఫ్ కృష్ణన్ రీ-రిలీజ్ థియేటర్లో జరిగింది. ఆ చిత్రంలోని సీన్ను అనుకరిస్తూ లాస్య చేసిన హంగామా చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ ) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
Anasuya Bharadwaj : అమెరికాలో యాంకర్ అనసూయ అదిరిపోయే పోజులు (ఫొటోలు)
-
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
లోకేశ్ నిల్.. యాంకర్ ఫుల్
ఒంగోలు సబర్బన్: జయహో బీసీ సదస్సులో యాంకర్దే ప్రధాన పాత్రగా మారింది. గురువారం ఒంగోలు నగరంలో పాత గుంటూరు రోడ్డులోని ఏ1 ఫంక్షన్ హాల్లో ‘జయహో బీసీ’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీకి చెందిన బీసీ నాయకులు, బాధితులుగా చెప్పుకుంటున్న వారి కుటుంబ సభ్యులను పిలిపించారు. ఈ కార్యక్రమం మొత్తం యాంకర్ ఉదయభాను పాత్రే ఎక్కువైంది. దీంతో పరిస్థితి లోకేశ్ నిల్.. యాంకర్ ఫుల్ అన్న చందంగా తయారైంది. లోకేశ్ మాట్లాడుతూ ‘9 నెలలు ఆగండి.. వైఎస్సార్సీపీ నేతలను బజారులో తరిమితరిమి కొడదాం. టీడీపీ నాయకులను వేధించిన వైఎస్సార్సీపీ నాయకులను లోపలేసి శిక్ష పడేంత వరకూ పడుకోను..’ అంటూ శపథం చేశారు. గనుల శాఖను ఘన్నుల శాఖగా ఉచ్ఛరించిన లోకేశ్.. జీవోను జియో... అని అనడంతో సదస్సులో అందరూ ఒక్కరాసిగా నవ్వారు. జయహో బీసీ సదస్సులా కాకుండా ఇది టీడీపీ సర్వసభ్య సమావేశంలా సాగింది. -
కాలిఫోర్నియాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
టాటూ కనిపించేలా, ముక్కెర హైలైట్ అయ్యేలా అనసూయ పోజులు (ఫొటోలు)
-
సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!
యాంకర్ విష్ణు ప్రియ పరిచయం అక్కర్లేని పేరు. ఫోక్ సాంగ్స్ చేస్తూ యువతను అలరిస్తోంది. మానస్తో కలిసి స్టెప్పులు వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. బుల్లితెరపైనా ఈ ఇద్దరూ కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్తో అదరగొడుతున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఎప్పుడు వెకేషన్ అంటూ బీచ్లు తిరిగే విష్ణుప్రియ.. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాట పట్టింది. సమంతను ఫాలో అవుతూ ఆలయాలను సందరిస్తోంది. తాజాగా తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఈషా ఫౌండేషన్లో ఎక్కువగా కనిపించే విష్ణు ప్రియ.. ఇటీవలే నాసిక్ కూడా వెళ్లింది. తాజాగా వారణాసిలో కనిపించింది. (ఇది చదవండి: నా సినిమా వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారంటే: కాజల్ అగర్వాల్) యూపీలోని వారణాసికి వెళ్లిన విష్ణుప్రియ ప్రత్యేకంగా కనిపించింది. మెడలో దండ వేసుకుని పూర్తి సమంతను గుర్తుకు తెచ్చింది. ఇటీవలే సమంత ఇషా ఫౌండేషన్ నిర్వహించిన యోగా శిబిరంలో అచ్చం అలాగే కనిపించింది. అంతే కాకుండా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఫోటోలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం విష్ణుప్రియ బుల్లితెరకు దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది. రీసెంట్గా విష్ణు ప్రియ ఓ వెబ్ సిరీస్లో నటించింది. జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్గా చేసిన దయాలో విష్ణుప్రియ ఓ జర్నలిస్ట్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బాలీవుడ్లోనే కాదు, సౌత్లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి) -
మీరు ఇంత దారుణంగా ఉన్నారేంట్రా?.. అనసూయ ట్వీట్ వైరల్
బుల్లితెర యాంకర్గా, నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇటీవలే విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రంగస్థలం, పుష్ప సినిమాలతో మరింత ఫేమ్ తెచ్చుకున్న అనసూయ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది. ఇటీవలే తనను వివాదాల్లోకి లాగొద్దంటూ అనసూయ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) తాజాగా ట్వీట్లో రాస్తూ..'వావ్! నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తిని. నా పరిచయం ఉన్నా లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క చర్చ కూడా జరగడం లేదంటే.. మీ అందరికి నేను అంతలా కావాలి అబ్బాయిలు.. నాపైనే ఎక్కువగా మీరంతా ఆధారపడి ఉన్నారు.. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేక పోతున్నారు.' అంటూ ఎమోజీని జత చేసింది. ఇది చూసిన అభిమానులు మళ్లీ ఏమైందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు ట్వీట్స్ వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవలే ఓ హీరో కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేయగా.. దానిపై అభిప్రాయం వ్యక్తం చేసిన అనసూయకు.. ఆ హీరో ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. గతంలో హీరో విజయ్ దేవరకొండ తనను టార్గెట్ చేేశారని.. కావాలనే తనపై కొందరికి డబ్బులిచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్పై దారుణంగా ట్రోల్స్!) Wow! I really am very very important. Na prameyam unna lekunna.. naaku sambandham unna kekunna.. Naa peru ettakunda okka discussion kuda jaragadante..I must mean so so much to all you guys.. naa pai anta depend ayyi unnaru.. ne peru lekunda papam edi cheppaleka potunnaru.. hmm 🙂 — Anasuya Bharadwaj (@anusuyakhasba) July 14, 2023 -
హాలీవుడ్లో సమ్మె సైరన్.. 60 ఏళ్ల తర్వాత ఇలా..
ప్రపంచవ్యాప్త్తంగా సినిమా పరిశ్రమకు ‘పెద్దన్న’ అని హాలీవుడ్కి పేరు. భారీ బడ్జెట్ చిత్రాలతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సం΄ాదించుకుంది హాలీవుడ్. ఇప్పుడు ఆ హాలీవుడ్ నిరసనలతో భగభగమంటోంది. సమ్మె సైరన్ తప్ప యాక్షన్.. సౌండ్లాంటి షూటింగ్ లొకేషన్లో వినిపించే మాటలు వినిపించడంలేదు. నటీనటులు మేకప్ వేసుకోవడంలేదు.. రచయితలు కలం మూత తెరవడంలేదు. దాంతో షూటింగులు నిలిచిపోయాయి. కరోనా టైమ్లో వెలవెలబోయినట్లు స్టూడియోలు కళ తప్పాయి. ఇన్నాళ్లుగా సమ్మె చేస్తూ వచ్చిన రచయితల సంఘానికి నటీనటుల సంఘం మద్దతు తెలిపింది. ‘వేతనాలు పెంచండి... గౌరవించండి... సౌకర్యాలు సమకూర్చండి..’ అంటూ పలు నినాదాలతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం.. హాలీవుడ్ చిత్ర పరిశ్రమని డబుల్ స్ట్రయిక్ కుదిపేస్తోంది. ఓ వైపు కొన్నాళ్లుగా ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. తాజాగా ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెకు పిలుపునిచ్చింది. తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్న నిర్మాణ సంస్థలు తమకు కనీస వేతనాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో పదకొండు వారాలుగా రచయితలు సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ నటీనటులు సైతం రైటర్స్ సమ్మెలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణ సంస్థలు, ఓటీటీలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి సమ్మె ఆరంభమైంది. దీంతో షూటింగ్లు ఆగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథస్సు) హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కృత్రిమ మేథస్సుతో పని చేసే ఓ యాంకర్ని ఇటీవలే పరిచయం చేశారు. ఈ సెగ హాలీవుడ్కు బాగానే తాకింది. కృత్రిమ మేథస్సుతో ముప్పు పొంచి ఉందని, తమ భవిష్యత్తుకి భరోసా ఇవ్వడంతోపాటు జీతాలు పెంచాలని, సరైన పని నిబంధనలను కల్పించాలని ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ‘ఏ’ లిస్ట్ యాక్టర్స్తో సహా 1,60,000 మంది నటీనటులకు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్’ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రధాన నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ నిరవధిక సమ్మెకు దిగింది. ‘రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’, ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెతో ప్రస్తుతం కొనసాగుతున్న హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు, టీవీ షో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి నిష్క్రమణ... క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ఓపెన్ హైమర్’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా లండన్లో గురువారం ఈ సినిమా ప్రీమియర్ వేశారు. అయితే గురువారం అర్ధరాత్రి ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెప్రారంభం కావడంతో ‘ఓపెన్ హైమర్’ ప్రీమియర్ నుండి యాక్టర్స్ రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫీ, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్ వంటి స్టార్స్తో సహా పలువురు నటీనటులు వెళ్లిపోయినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. హాలీవుడ్ ప్రముఖ సంస్థలు ‘పారామౌంట్, వార్నర్ బ్రదర్స్, డిస్నీ, నెట్ ఫ్లిక్స్’ వంటి వాటి ప్రధాన కార్యాలయాల వద్ద శుక్రవారం ఉదయం పికెటింగ్ (సమ్మె)ప్రారంభించారని టాక్. ఎమ్మీ, ఆస్కార్ అవార్డ్ వాయిదా? హాలీవుడ్లో మొదటిసారి 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రచయితల సంఘం, నటీనటుల సంఘం కలిసి డబుల్ స్ట్రైక్ చేశాయి. అలానే 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె మూడు నెలలపాటలు జరిగింది. మళ్లీ 63 ఏళ్లకు ఇప్పుడు రచయితల, నటీనటుల సంఘం కలసి డబుల్ స్ట్రైక్ చేస్తుండటం విశేషం. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే పెద్ద చిత్రాల విడుదల వాయిదా పడే పరిస్థితి. అలాగే సెప్టెంబర్ 18న జరగనున్న ఎమ్మీ అవార్డ్స్, టెలివిజన్ వెర్షన్ ఆస్కార్ అవార్డులు కూడా నవంబర్ లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని హాలీవుడ్ మీడియాలోవార్తలొస్తున్నాయి. ∙ సమ్మె బాధాకరం ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెను స్టూడియోలకుప్రాతినిధ్యం వహిస్తున్న ‘అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్’ తప్పుబట్టింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సినిమాలు, టీవీ కార్యక్రమాలకు జీవం పోసే నటీనటులు లేకుండా స్టూడియోలు పని చేయవు. కాబట్టి సమ్మె అనేది ఆశించిన ఫలితం ఇవ్వదు. పరిశ్రమపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు దారి తీసే మార్గాన్ని యూనియన్ ఎంచుకోవడం బాధాకరం’’ అని పేర్కొంది. -
అందమే అసూయ పడేలా ఉంది.. ఇంతకీ ఎవరీ సౌందర్య!
బెంగళూరు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ప్రతి పరిశ్రమలోనూ అడుగుపెడుతూ తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా ఏఐ (కృతిమ మేధస్సు) మీడియా రంగంలోకి కూడా ప్రవేశించింది. ఇంతకుముందు ఉత్తర భారతదేశంలో, కృత్రిమ మేధస్సు సాంకేతికతతో రూపొందించిన 'లిసా' 'సనా' అనే ఇద్దరు వర్చువల్ న్యూస్ రీడర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఓ మీడియా సంస్థ వర్చువల్ న్యూస్ రీడర్ ప్రవేశపెట్టింది. హాయ్ నా పేరు సౌందర్య అంటూ ఆ రోబోట్ పాఠకులకు పరిచయం చేసుకుంది. అనంతరం తను మాట్లాడుతూ.. ‘ నాలో కొంతమంది సహచరులు (AI న్యూస్ ప్రజెంటర్లు) ఉత్తర భారతదేశంలోని కొన్ని ఛానెల్లలో వార్తలు అందిస్తున్నారు. నేను సౌందర్య, పవర్ టీవీ ద్వారా సౌత్ ఇండియా మొదటి రోబోటిక్ యాంకర్ అని తెలిపింది. ఈ ఛానెల్ ప్రస్తుతం రోబో న్యూస్ రీడర్తో వివిధ వార్తా కార్యక్రమాలతో కూడా ప్రయోగాలు చేస్తుంది. కేవలం వీళ్లే కాకుండా దేశంలోని కొన్ని ఇతర ఛానెల్లు కూడా తమ స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ ప్రెజెంటర్లతో ముందుకు వస్తున్నాయి. ఇటీవల, OTV అనే ఒడియా ఛానెల్ రాష్ట్రం మొదటి AI న్యూస్ ప్రెజెంటర్ లిసాను ప్రారంభించింది. ఇంగ్లీష్, ఒడియా రెండింటిలోనూ దోషరహిత వార్తలు చదువుతూ చాలా మందిని ఆకట్టుకున్న తర్వాత లిసా ఇంటర్నెట్ను వైరల్గా మారింది. ఇంకా ముందుకు వెళితే, న్యూయార్క్కు చెందిన ఓ మహిళ కృత్రిమ మేధస్సును ఉపయోగించి తనకు భర్తను సృష్టించుకుని, అతనితో సంభాషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరుతోంది. భారతదేశంలోని ప్రముఖ మ్యాగజైన్ కంపెనీలలో ఒకటైన ఇండియా టుడే గ్రూప్ తన వార్తా సంస్థ ఆజ్ తక్ కోసం ఒక కృత్రిమ మేధస్సుతో కూడిన మహిళను సృష్టించింది. 'సనా'గా పిలవబడే ఈ మహిళ గత మార్చిలో ప్రపంచానికి పరిచయమైంది. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా? -
Anchor Lasya: కడప దర్గాను దర్శించుకున్న యాంకర్ లాస్య (ఫొటోలు)
-
ప్రముఖ యాంకర్ కన్నుమూత! ఆ వ్యాధితో
చావు ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. గత కొన్నాళ్లలో పలువురు నటీనటులు ఇలానే గుండెపోటు, అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఇప్పుడు ఓ ప్రముఖ యాంకర్ కూడా అలానే మరణించింది. దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించిన యాంకర్ కమ్ హోస్ట్ శివానీ సేన్ సడన్గా చనిపోయింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు ఆమె హోస్టింగ్ చేసింది. ఆదివారం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న శివానీ సేన్.. ఓ వీడియోని రీట్వీట్ చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అంటే సోమవారం.. ఈమెకు ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత సమస్య వచ్చింది. దీంతో ప్రాణాలు విడిచింది. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈమెకు ఇప్పటికే పెళ్లి అయి, ఓ బాబు కూడా ఉన్నాడు. 2005లో తొలిసారి ఓ ఈవెంట్ కు హోస్టింగ్ చేసిన శివానీ.. ఆ తర్వాత మన దేశంతోపాటు ఇతర దేశాల్లోనూ పలు కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించింది. కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్ లు, గవర్నమెంట్ ఈవెంట్స్, మీడియా లాంచ్లు, కోటీశ్వరుల కుటుంబాల్లోని పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలు.. ఇలా కార్యక్రమం ఏదైనా తన యాంకరింగ్ తో అదరగొట్టేసేది. ఇప్పుడు ఇలా ఆమె సడన్ గా చనిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. We have an extremely shocking and sad news to share. One of our own, @mcshivanisen is no more.🥹🥹 You left too soon Shivani, leaving a huge void. Life is so unfair at times. May your noble soul rest in peace! Please pray for the peaceful passage of our dear Shivani’s soul! pic.twitter.com/uzYWC5jhCu — Team Saath Official🤝 (@TeamSaath) July 10, 2023 (ఇదీ చదవండి: అన్నతో గొడవ? తమ్ముడి సినిమాకి అనసూయ విషెస్!) -
అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత పెను మార్పులకు నాంది పలుకుతోంది. తాజాగా దేశంలోనే తొలిసారిగా "కృత్రిమ మహిళా" యాంకర్ రంగంలోకి వచ్చేసింది. ఒడిశా లోని ఒక మీడియా సంస్థ ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్ను పరిచయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.ఘొ ఒడిశాలోని ఓ టీవీ న్యూస్ ఛానల్ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ మహిళ న్యూస్ యాంకర్ లీసా యాంకరింగ్ను షురూ చేసింది. చీరకట్టుతో తెరపై అలవోకగా వార్తలు చదువుతున్న యాంకర్ను చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాయంతో లేడీ యాంకర్ను తలపించేలా వార్తలను చదవడం విశేషంగా నిలుస్తోంది. ఒడియాతో పాటు ఇంగ్లిష్లోనూ వార్తలు చదివేలా లీసాను ప్రోగ్రామ్ చేసినట్లు సంస్థ ఎండీ జాగి మంగత్ పాండా వెల్లడించారు. లీసాకు బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లిష్ వార్తలపైనే దృష్టి పెట్టామన్నారు. (గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) OTV’s AI news anchor Lisa has the capability to speak in multiple languages. She will seamlessly present news in Odia apart from English for OTV and its digital platforms.#AIAnchorLisa #Lisa #Odisha #OTVNews #OTVAnchorLisa pic.twitter.com/8Q0t3m6NEE — OTV (@otvnews) July 9, 2023 -
వీకెండ్ లో ఫుల్గా చిల్ అవుతోన్న యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
Anchor Udaya Bhanu : అమెరికాలో వెకేషన్లో ఉదయభాను.. ఇద్దరు కవల పిల్లలతో కలిసి! (ఫొటోలు)
-
Anchor Sreemukhi : శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్.. బోటులో ఏకంగా! (ఫొటోలు)
-
సెన్కో గోల్డ్ @ రూ. 301–317
కోల్కతా: జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 301–317 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ నేడు(4న) ప్రారంభమై గురువారం(6న) ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు సోమవారం(3న) షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 270 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 135 కోట్ల విలువైన షేర్లను కంపెనీలో ప్రస్తుత వాటాదారు సంస్థ సైఫ్ పార్ట్నర్స్ ఇండియా ఐవీ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం సైఫ్ పార్ట్నర్స్కు కంపెనీలో 19.23 శాతం వాటా ఉంది. దీనిలో 8–9 శాతం వాటాను ఆఫర్ చేయనున్నట్లు సెన్కో ఎండీ, సీఈవో సువంకర్ సేన్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 47 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 196 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. కంపెనీ 13 రాష్ట్రాలలో మొత్తం 140 షోరూములను నిర్వహిస్తోంది. ఎస్పీసీ లైఫ్ సైన్సెస్ రెడీ ఐపీవోకు సెబీ గ్రీన్సిగ్నల్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రెడియంట్స్ తయా రీ కంపెనీ ఎస్పీసీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. కంపెనీ ప్రాస్పెక్టస్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 89.39 లక్షల షేర్లను ప్రమోటర్ స్నేహల్ రాజీవ్భాయ్ పటేల్ విక్రయానికి ఉంచనున్నారు. మళ్లీ ఐపీవోకు అక్మే ఫిన్.. ప్రాస్పెక్టస్ దాఖలు నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అక్మే ఫిన్ట్రేడ్(ఇండియా) లిమిటెడ్ మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. కంపెనీ తొలుత ఫిబ్రవరి 16న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ను సెబీ ఏప్రిల్ 27న వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ తిరిగి తాజా ప్రాస్పెక్టస్ను సెబీకి అందించింది. -
Anchor Shyamala Latest Photos: స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
Anchor Sreemukhi : దోస్త్ పెళ్లిలో యాంకర్ శ్రీముఖి హంగామా (ఫోటోలు)
-
టాలీవుడ్ యాంకర్తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే జేడీ ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓషోలో యాంకర్ విష్ణుప్రియ జేడీ చక్రవర్తి అంటే తనకిష్టమని.. పెళ్లి చేసుకుంటానని చేసిన కామెంట్స్పై స్పందించారు. విష్ణుప్రియ అలా చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇంతకీ పెళ్లి వార్తలపై జేడీ ఏమన్నారో చూద్దాం. (ఇది చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!) జేడీ చక్రవర్తి మాట్లాడుతూ..'తమ మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ అది ప్రేమ కాదు. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి. మేమిద్దరం కలిసి ఇటీవలే ఓ సిరీస్లో నటించాం. ఆ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని చేశాం. ఆ సిరీస్ దర్శకుడు ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు సూచించాడు.' అని అన్నారు. ఆ తర్వాత జేడీ ఆమె నేను నటించిన చిత్రాల్లోని పాత్రలతో మాత్రమే ప్రేమలో పడ్డారని తెలిపారు. అంతే తప్ప నాతో కాదు.. మాది గురు శిష్యుల అనుబంధంమని అన్నారు. కాగా.. ఇటీవల ఓషోలో పాల్గొన్న విష్ణుప్రియ జేడీ చక్రవర్తి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఇటీవలే 'గంగులు' అనే సాంగ్తో అభిమానులను పలకరించింది విష్ణుప్రియ. ఈ సాంగ్లో బిగ్ బాస్ ఫేమ్ మానస్తో కలిసి తన డ్యాన్స్తో అదరగొట్టింది. (ఇది చదవండి: తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ) -
Anasuya Bharadwaj : బీచ్లో వైట్ కలర్ బికినీలో రచ్చ లేపుతున్న అనసూయ (ఫొటోలు)
-
యాంకర్ తో జేడీ పులిహోర
-
వీళ్లకు వీర‘తాళ్లు’ వేయాల్సిందే
భారీ ఓడలు సముద్రంలో లంగరు వేయాలన్నా.. ఆలయ వీధుల్లో రథాలు పరుగులు తీయాలన్నా.. ఆ ఊళ్లో తయారయ్యే భారీ తాళ్లు, పగ్గాలను వాడాల్సిందే. తాళ్ల తయారీలో యంత్రాలు రంగప్రవేశం చేసినా.. ఆ ఊరి కార్మికుల పనితనం ముందు దిగదుడుపే. నౌకల్లో ఉపయోగించే భారీ మోకులు.. తాళ్లు.. పగ్గాల తయారీకి వందల ఏళ్ల నుంచీ తాళ్లరేవు గ్రామం ప్రసిద్ధి చెందింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ–అమలాపురం మధ్య జాతీయ రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపు తాళ్లరేవు రాగానే టక్కున ఆగిపోతుంది. తాళ్లే కదా.. ఎక్కడైనా తయారవుతాయనుకుంటే పొరబడ్డట్టే. ఇక్కడ తయారయ్యే తాళ్లకు పెద్ద చరిత్రే ఉంది. పెద్ద, పెద్ద కర్మాగారాల్లో తయారయ్యే తాళ్లు ఇక్కడ చేతితో తయారుచేసే తాళ్ల ముందు నిలవలేవంటే ఆశ్చర్యమేస్తుంది. అత్యధిక నాణ్యత.. 50 శాతం తక్కువ ధరల్లో ఇక్కడ తాళ్లు లభిస్తాయి. పాత తాళ్లు కొత్తగా అలంకరించుకోవాలన్నా.. తక్కువ ధరకే అవి దొరకాలన్నా తాళ్లరేపు పేరును తలవాల్సిందే. సెకండ్ హ్యాండ్ (పాత తాళ్ల)ను రీ ప్రాసెసింగ్ చేసి కొత్తవిగా తయారు చేయడంలో చేయి తిరిగిన నైపుణ్యం అక్కడి వారి సొంతం. 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంతో.. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడున్న కోరంగి అభయారణ్య ప్రాంతం అప్పట్లో పట్టణంగా విరాజిల్లింది. అమెరికా, రష్యా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల నుంచి ఓడలు కోరంగి రేవు ద్వారానే ఎగుమతి, దిగుమతులు సాగించేవి. కోరంగి నుంచి కేంద్రపాలిత యానాం వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరానికి ఓడలు, పెద్దపెద్ద బోట్లు రాకపోకలు సాగించేవి. 2 వేల నుంచి 20 వేల టన్నుల సామర్థ్యం గల ఓడలు సైతం ఇక్కడకు వచ్చేవి. సుమారు 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంలో ఓడలు, ఓడరేవుతో సహా కొట్టుకుపోయాయి. అప్పట్లో వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. ఇంటి యజమానులు మృత్యువాత పడటంతో జీవనోపాధి కోసం ఇక్కడి మహిళలు కొబ్బరి, తాటి నారతో తాళ్లు తయారుచేసి విక్రయించడం ప్రారంభించారు. అలా మొదలైన తాళ్ల తయారీ తాళ్లరేవులో కుటీర పరిశ్రమగా మారింది. ప్రస్తుతం మహిళలు, పురుషులు సైతం తాళ్లను తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. తాళ్లరేవు ప్రాంతంలో కొబ్బరి, తాటి, నైలాన్, ప్లాస్టిక్ తాళ్లను తయారు చేస్తున్నారు. అర అంగుళం నుంచి అడుగున్నర మందంతో భారీ తాళ్లను సైతం ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓడలకు, ఫైబర్ బోట్లకు వినియోగించే తాళ్లు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. రథాలకు వినియోగించే పగ్గాలను సైతం ఇక్కడే తయారు చేస్తున్నారు. ఏటా 900 టన్నుల తాళ్ల ఎగుమతి ఏటా 900 టన్నుల వరకు తాళ్లు ఇక్కడ తయారవుతున్నాయి. తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు ఇక్కడి తాళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలు ప్రారంభించిన సందర్భంలో కోరంగిలో ఓడలు రాకపోకలకు వీలుగా ఓడ రేవును ఏర్పాటు చేయడమే తాళ్ల పరిశ్రమలు ఏర్పాటుకు దోహదం చేసింది. మేడిది.. పెమ్మాడి వంశీకులతో మొదలై.. తొలుత ఈస్ట్ ఇండియా వ్యాపారులతో పెనవేసుకున్న తాళ్ల బంధం కాస్తా వారసత్వ సంపదగా మారింది. తొలినాళ్లలో తాళ్లరేవుకు చెందిన మేడిది, పెమ్మాడి వంశీయులు తాళ్లు తయారుచేసే వారు. తాళ్ల తయారీ వంశపారంపర్యంగా మారి నాలుగు తరాలుగా నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఇక్కడ తయారయ్యే తాళ్లను టన్నుల కొద్దీ చెన్నై, కేరళ, ముంబై, కోల్కతా, గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓడలు, బోట్లలో వినియోగించిన అనంతరం వృథాగా వదిలేసే పగ్గాలను తక్కువ ధరకు తాళ్లరేవు గ్రామస్తులు వేలంలో కొనుగోలు చేస్తుంటారు. రాష్ట్రంలోని పలు పోర్టులతోపాటు ఇతర రాష్ట్రాల్లోని పోర్టులలో వేలం వేసే పాత తాళ్లను కొనుగోలు చేస్తుంటారు. వాటిని గ్రేడింగ్ చేసి.. శుద్ధిచేసి కొత్త తాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచీ.. బ్రిటిష్ కాలం నుంచి తాళ్లరేవు, కోరంగిలలో తాళ్లు తయారు చేస్తున్నాం. నాలుగు తరాలుగా తాళ్ల తయారీలో నిపుణులు ఇక్కడ ఉన్నారు. కోరంగిలో ఓడరేవు ఉండడంతో ఓడలు భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిషర్లు కోరంగిని వ్యాపార కేంద్రంగా ఎంచుకోవడంతో భారీ నౌకలు, బోట్లు, నావలను తాళ్లరేవులో తయారు చేసేవారు. అలా ఓడలకు అవసరమైన తాళ్లు, మేకులు తదితర పరిశ్రమలు అప్పట్లో కోరంగి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ తాళ్ల తయారీని కొనసాగుతోంది. – పెమ్మాడి కాశీ విశ్వనాథం, బోట్ల తయారీ యూనిట్ ప్రతినిధి ప్రత్యేక ప్రావీణ్యత ఉంది మా తాత ముత్తాతల నుంచి తాళ్లు తయారు చేస్తున్నాం. తాళ్ల తయారీయే వృత్తిగా కొనసాగుతోంది. రోజుకు రూ.300 నుంచి రూ.600 వరకు సంపాదిస్తాం. తాళ్ల తయారీకి సంబంధించి మాకు ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. మా దగ్గర తాడు తీసుకెళ్లిన వారు మళ్లీమళ్లీ కొనుగోలు చేస్తుంటారు. – మందపల్లి జ్యోతిబాబు, తాళ్ల తయారీ కార్మికుడు -
యాంకర్ నుంచి నిర్మాత ఆ తరువాత సినిమాల్లోకి న ప్రయాణం ఎలా కొనసాగింది అంటే..!
-
నేను చేసిన పూజలు, ఉపవాసాలు వృథా.. జబర్దస్త్ యాంకర్ వీడియో వైరల్
-
గ్లామర్తో మెరిసిపోతున్న తెలుగు అందం స్రవంతి చొక్కారపు (ఫొటోలు)
-
Anchor Manjusha : యాంకర్ మంజూష సోకుల విందు.. (ఫొటోలు)
-
ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై యాంకర్గా మెప్పించిన నిహారిక.. ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. అమ్మకు మేకప్ వేస్తూ ఆమె గొప్పదనం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) నిహారిక తన ఇన్స్టాలో రాస్తూ.. 'అమ్మ నా చిన్నప్పుడు నన్ను చాలా బాగా అలంకరించేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా. అమ్మ నన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. ఈ ప్రత్యేకమైన రోజు అమ్మ బయటికి వెళ్లేందుకు అమ్మను రెడీ చేస్తున్నా. ఇలా చేయడం నాకు ఎంతో ఇష్టం. ఈ ప్రపంచం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అమ్మ.' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. కాగా.. నిహారిక నటించిన వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. (ఇది చదవండి: బెడ్పై ఒకరు, మైండ్లో మరొకరు.. నిహారిక డైలాగ్పై ట్రోలింగ్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న విష్ణుప్రియ
యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈ భామ ఆ తర్వాత యాంకరింగ్తో క్రేజ్ సంపాదించుకుంది. సుడిగాలి సుధీర్తో చేసిన 'పోవే పోరా' షోతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్తో అలరిస్తుంది. రీసెంట్గా వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో హీరోయిన్గానూ మారింది. ఇక నెట్టింట ఆమె చేసే రచ్చ అంతాఇంత కాదు. తరచూ హాట్హాట్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సైతం ఫాలోవర్స్ను అలరిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడూ చలాకీగా ఉండే విష్ణుప్రియ జీవితంలో ఇటీవలె తీరని విషాదం చోటుచేసుకుంది. ఇటీవలె ఆమె తల్లి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మథర్స్డే సందర్భంగా నిర్వహించిన ఓ షోలో తన తల్లిని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది విష్ణుప్రియ. 'మళ్లీ జన్మంటూ ఉంటే నీ కూతురిగానే పుడతానమ్మా. ఐలవ్ యూ' అంటూ ఎమోషనల్ అయ్యింది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) -
నన్ను చాలామంది మోసం చేశారు : యాంకర్ ఝాన్సీ
యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుమ తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థాయిలో పేరు సంపాదించుకుంది ఝాన్సీ. ఒకప్పుడు స్టార్ యాంకర్గా బుల్లితెరపై ఎన్నో సక్సెస్ఫుల్ కార్యక్రమాలు హోస్ట్ చేసిన ఆమె సినిమాల్లోనూ మంచి క్రేజ్ను దక్కించుకుంది. ఈమధ్య బుల్లితెరపై ఈమె హడావిడి కాస్త తగ్గినా వెండితెరపై మాత్రం జోరు కొనసాగిస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్లో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి పంచుకుంది. ''నా గురించి కొత్తలో చాలామంది ఈమె ఫైర్ బ్రాండ్, పొగరు ఇలా.. అనుకునేవారు. కానీ నాతో కలిసి పనిచేసిన వారికి తెలుసు నేను ఏంటన్నది. నన్ను అర్ధం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు నాతో జర్నీ చేశారు. నచ్చని వాళ్లు 13 ఎపిసోడ్స్తోనే ఫుల్స్టాప్ పెట్టేశారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఓ డ్యాన్స్ షోకి 99కి ఎపిసోడ్స్ నేను యాంకర్గా చేస్తే 100వ ఎపిసోడ్కి నా స్థానంలో వేరేవాళ్లతో యాంకరింగ్ చేయించారు. దానికి కారణం ఏంటన్నది నాకు చెప్పరు. నేను అడగలేదు. నాకు రావలసిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. నన్ను ఎంతోమంది మోసం చేశారు. కానీ వాళ్లందరిని గుర్తు పెట్టుకొని కక్ష సాధించే పని నేను ఎప్పుడూ చేయలేదు. అది మంచితనమో, పిచ్చతనమో తెలియదు'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ. -
IPL 2023 : టాప్-10 మోస్ట్ బ్యూటీఫుల్ క్రికెట్ యాంకర్స్ (ఫొటోలు)
-
ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్
-
యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన భామ.. సుడిగాలి సుధీర్తో కలిసి ఓ షోకు యాంకర్గా బుల్లితెరపై రాణించింది. విష్ణుప్రియ పోవే పోరా షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. (ఇది చదవండి: ఫోక్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ) ఇటీవలే 'గంగులు' అనే సాంగ్తో అభిమానులను పలకరించింది. ఈ సాంగ్లో బిగ్ బాస్ ఫేమ్ మానస్తో కలిసి తన డ్యాన్స్తో అదరగొట్టింది. తాజాగా ఓ టీవీ షో పాల్గొన్న విష్ణుప్రియ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మీరు ఎవరైనా సెలబ్రిటీతో క్రష్లో ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించారు. విష్ణుప్రియ మాట్లాడుతూ.. 'ఇటీవలే జేడీ చక్రవర్తితో ప్రేమలో పడ్డా. ఓ వెబ్ సిరీస్ కోసం మంగళూరులో ఆయనతో జర్నీ చేశా. పది రోజులకే ఆయనపై మనసు పారేసుకున్నా. అయితే ఆయన వయసులో నాకంటే పెద్దవారు. ఆంటీ ఓకే చెబితే వాళ్లింటికి కోడలిగా వెళ్తా. జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నా' అంటూ తన మనసులో మాటను బయట పెట్టేసింది. మీ ప్రేమ పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా? అని మళ్లీ అడిగేసరికి.. 'నేనైతే నా మనసులో మాట చెప్పాను. ఆయన రెస్పాండ్ అవలేదు' అంటూ చెప్పుకొచ్చింది. కాగా జేడీ చక్రవర్తి.. నటి అనుకృతిని 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: -
యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
అలాంటి వారిని పూర్తిగా వదిలేయండి.. రష్మీ పోస్ట్ వైరల్
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్ యాంకర్ రాణిస్తున్న రష్మీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్లో ఉంటోంది. కామెడీ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలోనూ మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఇటీవలే తన ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే వేడుకలు చేసుకున్న రష్మీ తాజాగా తన ఫోటోలను ఇన్స్టాలో పంచుకుంది. అవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ( ఇది చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు) రష్మీ ఇన్స్టాలో రాస్తూ..'మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో వాటికే కట్టుబడి ఉండండి. మిమ్మల్ని విడిచి వెళ్లాలనుకునే వారిని వదిలేయండి. నా లైఫ్లో మరో ఏడాది గడిచిపోయింది. దానికి తగిన విలువనిచ్చేలా నా వంతు కృషి చేస్తున్నా. ఈ బర్త్డేను నాకు గుర్తుండేలా స్పెషల్గా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నా జీవితంలో మూడు ప్రధాన స్తంభాలు. అందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. స్నేహితుల సమక్షంలో ఏప్రిల్ 27న తన 35వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుపుకుంది బుల్లితెర యాంకరమ్మ. (ఇది చదవండి: నాగచైతన్య 'కస్టడీ' ట్రైలర్ డేట్ ఫిక్స్,ఎప్పుడంటే..) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
ఉదయ భాను కొత్తింటిని చూశారా?భలే రిచ్గా ఉందే!
బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా ఉదయ భానుది సెపరేట్ స్టైల్. ఒకప్పుడు స్టార్ యాంకర్గా రాణించిన ఉదయభాను బుల్లితెర శ్రీదేవిగా పాపులర్ అయ్యింది. అచ్చమైన తెలుగులో గలగలా మాట్లాడే ఉదయ భాను యాంకరింగ్కు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు.యాంకర్లలో ఎక్కువ పారితోషికం అందుకున్న యాంకర్గానూ ఉదయభానుకు పేరుంది. చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక హీరోయిన్కు ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. దీనికి తోడు తనదైన స్టైల్లో హోస్టింగ్ చేసే ఉదయభాను బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అలరించింది. అయితే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక మాత్రం కనుమరుగైపోయింది. ఈమధ్యే మళ్లీ యాంకర్గా రీఎంట్రీ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లు, షోలు చేస్తుంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కొత్త ఇంట్లోకి వెళ్లిన ఉదయభాను దీనికి సంబంధించిన హోంటూర్ వీడియోను పంచుకుంది. విశాలవంతమైన గదులతో రిచ్ లుక్లో ఇల్లు అదిరిపోయింది. ఇది చూసిన నెటిజన్లు ఉదయభానుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: భర్తను తలుచుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి -
యాంకర్ విష్ణుప్రియ.. ఇన్ని కష్టాలు పడిందా?
యాంకర్ విష్ణుప్రియ పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై ఓ టీవీ షోతో ఫేమ్ తెచ్చుకుంది. మొదట జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై సత్తా చాటింది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. 2016లో వచ్చిన 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్' మూవీతో పాటు 2020లో 'చెక్ మేట్'అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విష్ణుప్రియ అదరగొడుతోంది. ఇటీవల గంగులు అనే వీడియో సాంగ్లో మానస్తో కలిసి తన డ్యాన్స్తో కుర్రకారును ఊర్రూలూగించింది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. గతంలో కూడా వీరిద్దరూ జరీ జరీ పంచెకట్టి అనే సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: బాలీవుడ్లో ఆ రెండు సినిమాల్లో నుంచి నన్ను తీసేశారు: భూమిక) తొలి నాళ్లలో చాలా పద్ధతిగా కనిపించిన విష్ణుప్రియ ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. అయితే పైకి మాత్రం కాస్త బోల్డ్గా కనిపించే ప్రియ చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది. తాజాగా మై విలేజ్ షో వారితో కలిసి దావత్ చేసుకున్న విష్ణు ప్రియ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె జీవితంలో పడిన కష్టాలను వివరించింది. విష్ణుప్రియ 'తన అమ్మనాన్నలదీ చీరాల.. బాపట్ల. తాను పుట్టిందీ చెన్నై.మా అమ్మ హెయిర్ డ్రెస్సర్. శ్రియ, ఆర్తి అగర్వాల్కు హెయిర్ డ్రెస్సర్గా పనిచేసింది. మా అమ్మ టాలెంట్ ఉన్నా ఇలా ఎందుకు ఉండేదనిపించింది. ఆమె కోసమే కష్టపడి ఇక్కడ వరకు వచ్చా. 2015లో ఈ ఇండస్ట్రీలోకి వచ్చా. పోవే పోరా అనే షోతోనే బ్రేక్ వచ్చింది. పోవే పోరా, నంబర్ వన్ యారీ ఓకేసారి ఆఫర్స్ వచ్చాయి. అప్పట్లో సరిగా తిండి కూడా లేదని.. ఇప్పుడు కాస్తా డబ్బులు సంపాదించుకుని ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకుని తింటున్నా.' అంటూ తాను పడ్డ కష్టాలను వివరించింది. (ఇది చదవండి: తొలి సినిమా రిలీజ్కు ముందే సూపర్స్టార్తో పెళ్లి.. పిల్లలు పుట్టాక..) -
యాంకర్ ప్రశ్నకి ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్
-
అలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకెప్పుడొస్తుందో?: టాలీవుడ్ యాంకర్
యాంకర్ విష్ణుప్రియ.. బుల్లితెర ప్రేక్షక్షులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్స్ ఫిలింస్తో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత యాంకర్గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే ఇటీవలే 'గంగులు' అంటూ సాంగ్తో అభిమానులను పలకరించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. తరచుగా తన ఫొటోలు, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. అయితే తాజాగా విష్ణు ప్రియ తన ఇన్స్టాలో స్టోరీస్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఏప్రిల్ 14న బాలీవుడ్ కపుల్స్ ఆలియా భట్, రణ్బీర్ కపూర్ మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కారులో వెళ్తున్న ఆలియా భట్, రణ్బీర్ కపూర్ జంట ఫ్యాన్స్ను పలకరించారు. అందరూ చూస్తుండగానే ఆలియా.. తన భర్తకు ముద్దుపెట్టింది. ఈ వీడియో చూసిన విష్ణుప్రియ క్రేజీ కామెంట్స్ చేసింది. 'ఓ దేవుడా! ఇలా ముద్దు పెట్టుకునే అవకాశం నాకెప్పుడొస్తుంది' పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఫోక్ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన భామ.. సుడిగాలి సుధీర్తో కలిసి ఓ షోకు యాంకర్గా బుల్లితెరపై రాణించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్ హాట్హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా షేక్ చేస్తోంది. గతంలో మానస్తో కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన ముద్దుగుమ్మ మరోసారి సందడి చేసింది. బిగ్ బాస్ ఫేమ్ మానస్, విష్ణు ప్రియ కలిసి డ్యాన్స్ చేసిన ‘గంగులు’ అనే జానపద సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో అదరగొడుతోంది. ఈ పాటకు మానస్, విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్కు భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా.. జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి, ప్రముఖ నిర్మాత జయతి పాల్గొన్నారు. -
19 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి.. విడాకులకు రెడీ అయ్యా!: యాంకర్
ప్రముఖ యాంకర్, తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్, నటి అర్చన చందోక్ భర్తకు విడాకులిచ్చేందుకు సిద్ధమైంది. ఇరవై ఏళ్లుగా కలిసి జీవిస్తున్న భర్త వినీత్తో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం విడాకులు పత్రాలను కూడా సిద్ధం చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో తన మనసు మార్చుకుంది. ఈ విషయాన్ని తాజా షోలో వెల్లడిస్తూ బోరుమని ఏడ్చింది యాంకర్. 'మీ అందరికీ ఓ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక నెల రోజుల క్రితం నేను, నా భర్త విడిపోదామని ఓ నిర్ణయానికి వచ్చాం. పదే పదే భేదాభిప్రాయాలు వస్తుండటం, గొడవలవుతుండటంతో కలిసి ఉండటం జరగని పని అని విడాకులు తీసుకుందామని నిశ్చయించుకున్నాం. అందుకు సంబంధించిన విడాకుల పత్రాలను కూడా మేము రెడీ చేసుకున్నాం. కానీ మా కూతురు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడింది. మమ్మల్ని తిరిగి కలిపింది. పదిహేను రోజుల క్రితం వినీత్ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యాడని మెసేజ్ వచ్చింది. అప్పుడు నన్నెవరో చెంప మీద లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది. బిగ్బాస్ తర్వాత నామీద నెగెటివిటీ పెరిగింది. బాత్రూమ్ టూర్ వీడియో చేశాక నన్ను మరింత విమర్శించారు. ఇంతలో నా భర్త నాకు దూరమవుతున్నాడు. ఇవన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ సమయంలో జారా మాకు జ్ఞానోదయం చేసింది. మేమిద్దరం ఒకరిని విడిచిపెట్టి ఒకరం ఉండలేమని చెప్పింది. అప్పటిదాకా గొడవలతో కోపాన్ని పెంచుకున్న మా కళ్లల్లో ఒక్కసారిగా ప్రేమవర్షం కురిసింది. ఇప్పుడు నేను నా భర్తను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అర్చన ఇటీవలే శివకార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాలో నటించింది. ఇందులో యాంకర్ కూతురు జారా కూడా తళుక్కుమని మెరిసింది. కాగా అర్చన వినీత్ను 2004లో పెళ్లాడింది. వీరికి జారా అనే కుమార్తె జన్మించింది. -
Anchor Anasuya Photos: భర్త పిల్లలతో అనసూయ హోలీ సంబరాలు (ఫొటోలు)
-
Udaya Bhanu Photos: యాంకర్ ఉదయభాను కవలపిల్లలు ఇప్పుడెలా ఉన్నారో చూశారా? (ఫొటోలు)
-
డివ్జీ టార్క్ ఇష్యూ @ రూ. 560–590
న్యూఢిల్లీ: ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ మార్చి 1న ప్రారంభంకానుంది. 3న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 560–590గా నిర్ణయించింది. తద్వారా రూ. 412 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ నేడు(28న) ప్రారంభంకానుంది. ఐపీవోలో భాగంగా రూ. 180 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 39.34 లక్షల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, తయారీ సౌకర్యాల పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 25 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ లెవెల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్లు అందిస్తోంది. క్లయింట్ల జాబితాలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ తదితరాలున్నాయి. మార్చి 14న కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయ్యే వీలుంది. -
గ్రాండ్గా జబర్దస్త్ కమెడియన్స్ రాకేశ్, సుజాతల హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
రష్మీపై చేతబడి, యాసిడ్ దాడి బెదిరింపులు.. స్క్రీన్షాట్ వైరల్
అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యాంకర్ రష్మీ గౌతమ్ సైతం ఈ దాడిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే శునకాలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై నెటిజన్లు భగ్గుమన్నారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా? అని ఆమెను చెడామడా తిడుతున్నారు. అటు రష్మీ కూడా తనపై ట్రోలింగ్కు ధీటుగా సమాధానాలిస్తోంది. ఒక నెటిజన్ అయితే హద్దు మీరి మరీ ఆమెను తిట్టిపోశారు. 'నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్ అవుతాయా? నీ మీద యాసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు.. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు' అని నోటికొచ్చింది వాగారు. ఈ స్క్రీన్షాట్ రష్మీ షేర్ చేస్తూ.. 'ఈ అకౌంట్ అమ్మాయిదో, అబ్బాయిదో తెలియదు కానీ ఆ వ్యక్తి అప్పట్లో నా వయసు గురించి, పెళ్లి గురించి వాగాడు. ఇప్పుడేమో ఏకంగా నా మీదే చేతబడి చేస్తాడంట, నాపై యాసిడ్ పోస్తాడని బెదిరిస్తున్నాడు. మరి ఇన్నిమాటలు అన్నందుకు నీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. This acc sometime back had a problem with my age nd marriage now he /she wants to do black magic on me and pour acid on me Shud I be filing a complaint now ??? pic.twitter.com/a6SaQO6Tu4 — rashmi gautam (@rashmigautam27) February 25, 2023 చదవండి: నా బ్రదర్ ఎన్టీఆర్ అంటూ చరణ్ ట్వీట్ -
యాంకర్ స్రవంతి చొక్కారపుపై ఆర్. నారాయణమూర్తి సీరియస్
తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్లో డెబ్యూ ఇచ్చారు. .రిలీజ్కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే హిట్ టాక్ను సొంతం చేసుకుంది.విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. తాజాగా హైదరాబాద్లో మూవీ టీం సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. యాంకర్ స్రవంతి చొక్కారపుపై సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సార్ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టుల గురించి మాట్లాడిన ఆయన చివర్లో హైపర్ ఆది గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో మళ్లీ మైక్ తీసుకొని అతని గురించి మాట్లాడుతుండగా అది గమనించని యాంకర్.. స్టేజ్పై మరో గెస్ట్ను పిలిచింది. దీంతో కోప్పడిన ఆయన ‘ఏ పిల్లా ఆపు.. ఏ అమ్మాయ్ టైరో టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్’.. అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అమ్మా, నీ ప్రేమను ఎవరూ రీప్లేస్ చేయలేరు: విష్ణుప్రియ భావోద్వేగం
గత నెలలో తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది యాంకర్ విష్ణుప్రియ. అప్పటినుంచి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె తల్లి పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ మరోసారి భావోద్వేగానికిలోనైంది. ఫిబ్రవరి 15న తల్లి బర్త్డే కావడంతో ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. 'నీ ప్రేమ, ఎనర్జీని ఎవ్వరూ భర్తీ చేయలేరు. నా డార్లింగ్ ఏంజెల్ను ఇప్పటికీ, ఎప్పటికీ మిస్ అవుతాను. లవ్ యూ అమ్మ' అని తనపై ఉన్న ప్రేమను అక్షరాల రూపంలో వ్యక్తీకరించింది. ఇక వీడియోలో అమ్మతో గడిపిన సరదా క్షణాలను, జ్ఞాపకాలను పంచుకుంది. అలాగే తల్లి ఫోటోకు నమస్కరించిన ఫోటోను చూపించింది. వీడియో చివర్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను జత చేసింది. 'నా జీవితంలో ఒక్క మహారాణి మా అమ్మ మాత్రమే' అని చెప్పుకొచ్చింది. కాగా జనవరి 26న విష్ణుప్రియ తల్లి తుదిశ్వాస విడిచింది. మరోవైపు విష్ణుప్రియ స్నేహితురాలు, నటి రీతూ చౌదరి సైతం ఇటీవలే తన తండ్రిని కోల్పోగా ఇప్పటికీ ఆ బాధలో నుంచి తేరుకోలేకపోతోంది. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) చదవండి: రెండుసార్లు బ్రేకప్.. అది నాకు బ్లాక్ డే అంటున్న బ్యూటీ -
తల్లి కాబోతున్న యాంకర్ అశ్వినీ శర్మ, సీమంతం ఫొటోలు వైరల్
నటి, యాంకర్ అశ్వినీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసిన ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. పలు టీవీ షోలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర నటులను ఇంటర్య్వూ చేసి యాంకర్గా గుర్తింపు పొందింది ఆమె. ఆ తర్వాత ఛత్రపతి, కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యం, హీరో వంటి చిత్రాల్లో సహనటి పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం అశ్వినీ శర్మ నటనకు దూరమైన సంగతి తెలిసిందే. నటిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్బై చెప్పింది. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ప్రతీక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లాడి అమెరికాలో సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన అభిమానులతో గుడ్న్యూస్ పంచుకుంది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘త్వరలోనే శుభవార్త చెప్పేందుకు రెడీగా ఉన్నాం. మా ఫస్ట్ లిటిల్ బేబీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అంటూ బేబీ షవర్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అశ్వినీ బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో అశ్వినీకి పలువురు నటీనటులు, సినీ సెలబ్రిటీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య View this post on Instagram A post shared by ✨Ashwini sharma✨🧿 (@ashwinisharma_official) -
24 ఏళ్ల బంధం.. ఆన్లైన్లో ఇలా: సుమ కనకాల
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ ఎవరంటే మొదట వినిపించే పేరు సుమ. అంతలా ఫేమ్ సంపాదించుకుంది కేరళ అమ్మాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ సుమ మాత్రం లోకల్ అన్న విధంగా ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా సరే సుమ ఉందంటే ఆ రేంజే వేరు. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడడం, సమాయానుకూలంగా పంచ్లు వేయడంలో ఆమెకు ఆమె సాటి. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని హైదరాబాద్లోనే స్థిరపడిపోయింది. ఇక టాలీవుడ్లో రాజీవ్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. ఏ పాత్రలోనైనా మెప్పించడం ఆయనతే సొంతం. ఇక వీరిద్దరి ప్రేమ పెళ్లి సంగతులు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లయి వీరికి 24 ఏళ్లు పూర్తయింది. వివాహా వార్షికోత్సావాన్ని కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సుమ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెడుతున్నారు. సుమ షేర్ చేసిన ఆ వీడియో కాల్లో ఇద్దరు పాట పాడుతూ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటక్కడ.. పలుకిక్కడ అంటూ సుమ పాట పాడగా.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా' అంటూ రాజీవ్ కనకాల పాడుతూ వీడియో కాల్లో కనిపించారు. ఏదేమైనా సుమక్క యాంకరింగే కాదు.. ఇలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం
యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఆమె తల్లి కన్నుమూశారు. తన తల్లి మరణవార్తను సోషల్ మీడియాలో వెల్లడించింది విష్ణుప్రియ. 'నా ప్రియమైన అమ్మ.. ఈ రోజువరకు నువ్వు నావెంటే ఉన్నందుకు వేవేల కృతజ్ఞతలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత కూడా! నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. ప్రతిచోటా.. నా ప్రతి ఊపిరిలోనూ నువ్వే ఉంటావు. నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డావు. నా కోసం చేసిన త్యాగాలకు, నాపై కురిపించిన ప్రేమకు నీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. దీనికి తల్లితో కలిసున్న ఫోటోను జత చేసింది. కాగా విష్ణుప్రియ, జబర్దస్త్ రీతూ చౌదరి మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే! ఇటీవలే వీరిద్దరూ వెకేషన్కు వెళ్లి వచ్చారు. ఈ మధ్యే రీతూ చౌదరి తండ్రి మరణించగా తాజాగా విష్ణుప్రియ తల్లిని కోల్పోవడంతో ఇద్దరి ఇంట విషాదచాయలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) చదవండి: జమున కన్నుమూత కోలీవుడ్ విలన్తో ప్రేమలో నటి -
సాక్షి యాంకర్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
-
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ బుల్లితెర నటి
మరో బుల్లితెర నటికి కథానాయకి అదృష్టం వరించింది. టీవీ యాంకర్లు, సీరియల్ హీరో హీరోయిన్లు కావడం కొత్తేమి కాదు. ఇప్పుడు ప్రముఖ నటీనటులుగా రాణిస్తున్న శివ కార్తికేయన్, నటి ప్రియా భవాని శంకర్, వాణి భోజన్ వంటి వారు మొదట ప్లాట్ఫామ్ బుల్లితెరనే. అలా బుల్లితెరపై అనతి కాలంలోనే తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అర్చన. 2019లో ఆదిత్య చానల్లో యాంకర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత రాజా రాణి–2 సీరియల్ ద్వారా నటిగా పరిచయమయ్యారు. ఆ సీరియల్లో నటిగా తన సత్తా చాటుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత లవ్ ఇన్సూరెన్స్, ట్రూత్ ఆర్ డేర్ అనే షార్ట్ ఫిలిమ్స్లో నటించారు. ఆ తరువాత కల్యాణం వయసు వందురుచ్చి అనే వెబ్సిరీస్లో నటించి గుర్తింపు పొందారు. ఇటీవల సోనీ మ్యూజిక్ సంస్థ ధరన్కుమార్ సంగీతంలో రూపొందించిన తామా తుండు అనే వీడియో ఆల్బమ్లో అర్చన నటించారు. ఈ వీడియో వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందని అర్చన పేర్కొన్నారు. దీంతో సినిమా అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అరుల్నిధికి చెల్లెలుగా డీమాంటి కాలనీ –2 చిత్రంలో నటించే అవకాశం ఈ బ్యూటీని వరించింది. దీని గురించి అర్చన మాట్లాడుతూ.. తాను అచ్చ తమిళ అమ్మాయినని చెప్పారు. అందుకే దర్శకులు చెప్పే విషయాలను సులభంగా అర్థం చేసుకుని నటిస్తానని అన్నారు. మంచి నటిగా రాణించాలన్నదే తన కోరిక అన్నారు. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం తదితర భాషల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకుని ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. -
అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన యాంకర్ సుమ
యాంకర్ సుమ కనకాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. 15ఏళ్లుగా స్టార్ యాంకర్గా కొనసాగుతున్న సుమకు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా సుమ ఉండాల్సిందే అనేంతగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె పంచులు కామెడీ టైమింగ్కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది. యాంకరింగ్ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా సుమ లేని టెలివిజన్ అంటే కాస్త కష్టమేనంటున్నారు ఆమె ఫ్యాన్స్. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్..?
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? వధువు ఎవరంటే!
తెలుగు స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తనదైన యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇదిలా ఉంటే బులితెరపై ఎంతో క్రేజ్ను సొంతం చేసుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చదవండి: ఈ స్టార్ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే! అందుకే తరచూ పెళ్లి రూమర్స్తో వార్తల్లో నిలుస్తుంటాడు ప్రదీప్. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపై వచ్చాయి. అయితే గతంలో ఇప్పటికే పలుమార్లు ప్రదీప్ పెళ్లంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ప్రతిసారి ఖండించాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి పేరు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నవ్య.. ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ని, ఆ పరిచయమే స్నేహం, ప్రేమగా మారిందంటున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంలో ఇరుకుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఇరుకుంటుంబాలు చర్చించుకుంటున్నారట. త్వరలోనే ప్రదీప్ గుడ్న్యూస్ చెప్పబోతున్నాడని సన్నిహితవర్గాలంటున్నాయి. అయితే వీరి మతాలు కూడా వేరే అనేది విశ్వసనీయ సమాచారం. మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. నవ్య.. ప్రదీప్తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుందట. బిగ్బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
యాంకర్ వర్షిణి అందాల విందు (ఫొటోలు)
-
పెళ్లి చేసుకోబోతున్న బిగ్బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి.. వరుడు అతనే
బిగ్బాస్ సీజన్-6 కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నేహానే వెల్లడించింది. అంతేకాకుండా కాబోయే భర్త ఫోటోను కూడా ఆడియెన్స్కు రివీల్ చేసింది. యాంకర్గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. అయితే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్ చేసింది. ఇటీవలె బిగ్బాస్-6లో కూడా పాల్గొంది. ఇక ఈ షో ఎంట్రీ సమయంలో కూడా ‘బిగ్బాస్'కి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాళ్లకి చెప్పి వచ్చాను’ అని కూడా వెల్లడించింది. అప్పుడు చెప్పినట్లే బిగ్బాస్ జర్నీ అనంతరం నేహా పెళ్లి చేసుకోబోతుంది. తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అయిన అనిల్ అనే వ్యక్తినే అతి త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు నేహా తెలిపింది. View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) -
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "