
సిరి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సిరిపురం రాజేష్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘కుట్ర’ (ద గేమ్ స్టార్స్ నౌ అనేది ట్యాగ్లైన్). ప్రీతి, గీతిక రతన్, ప్రియ దేశ్పాల్ హీరోయిన్లు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న గ్రాండ్గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ లో ప్రీ-రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ... 'సిరిపురం రాజేష్ అడ్వకేట్గా, వ్యాపారవేత్తగా, జర్నలిస్ట్గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడం గొప్ప విషయం. సినిమా చూశాము. అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. టియస్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ... 'ప్రస్తుతం సమాజంలో ప్రతి విషయంలో కుట్రలే జరుగుతున్నాయి. అలాంటి టైటిల్తో ఓ చక్కటి చిత్రాన్ని తెరకెక్కించిన రాజేష్కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి' అని పేర్కొన్నారు.
టియస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ అమరవాది లక్ష్మినారాయణ మాట్లాడుతూ... 'రాజేష్ తెలంగాణ ఉద్యమంలో ఎంతో జోరుగా పాల్గొన్నారు. అడ్వకేట్ గా కూడా మంచి పేరుంది. కరోనా టైమ్లో సిరిపురం రాజేష్ షార్ట్ ఫిలింస్ చేశారు. ఎప్పటికైనా సినిమా చేయాలని చెప్పేవాడు. కానీ ఇంత త్వరగా సినిమా చేసి దాన్ని రిలీజ్ చేస్తాడు అనుకోలేదు. ఈ సినిమా విడుదలై ఆయనకు మంచి పేరు, లాభాలు తేవాలి' అన్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు సిరిపురం రాజేష్ మాట్లాడుతూ... 'మంచిర్యాలలో 1985 నుంచి నేను జర్నలిస్ట్ గా పనిచేశాను. `కుట్ర` నా తొలి సినిమా. ఇద్దరి మిత్రుల మధ్య నడిచే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 23న దాదాపు 100 థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment