telugu movie
-
ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?
ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలున్నాయి. ప్రస్తుతానికైతే రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టులు చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' చేస్తాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2.. ఇలా చాలానే ఉన్నాయి.ఇవి సరిపోవంటూ ఈ మధ్యే 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మతోనూ ప్రభాస్ సినిమా ఒకటి ఓకే అయింది. దీని లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని టాక్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది. 'బక' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 2 తెలుగు సినిమాలు)టైటిల్ చూడగానే మీకు కూడా విచిత్రంగా ధ్వనించి ఉంటుంది. అయితే మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడుగా. అతడి కథనే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ప్రశాంత్ వర్మ రాశాడని, అందుకే సింపుల్ గా 'బక' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.ఇప్పటివరకు వచ్చిన పౌరాణిక, మైథలాజికల్ సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భిన్నంగా ఉంటుందని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్ బేస్డ్ చిత్రమని అంటున్నారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా అని టాక్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
అప్సర రాణి 'బ్లడ్ రోజస్' ఫస్ట్ లుక్ రిలీజ్
రంజిత్ రామ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్లడ్ రోజస్. ఎంజిఆర్ దర్శకుడు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో హరీష్ కె నిర్మాతగా వ్యవహరించారు. మహా శివరాత్రి సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ కథతో ఈ సినిమాని తీశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది.(ఇదీ చదవండి: 38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!) -
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారంలానే ఈసారి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో సందీప్ కిషన్-రావు రమేశ్ నటించిన 'మజాకా'.. కాస్త ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు తకిటి తదిమి తందాన, శబ్దం,అగాథియా తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ)మరోవైపు ఓటీటీల్లో 11 వరకు పలు సినిమాలు-వెబ్ సిరీసులు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో సుడాల్ సీజన్ 2, డబ్బా కార్టెల్, ఆశ్రమ్ తదితర వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏది రిలీజ్ కానుందంటే?\ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 24 - మార్చి 1)నెట్ఫ్లిక్స్డబ్బా కార్టెల్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28అమెజాన్ ప్రైమ్జిద్దీ గర్ల్స్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27హౌస్ ఆఫ్ డేవిడ్ (ఇంగ్లీష్ సిరీస్) ఫిబ్రవరి 27సుడల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 28సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 28హాట్స్టార్సూట్స్: లాస్ ఏంజిల్స్(ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 24బీటిల్ జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28లవ్ అండర్ కన్స్ట్రక్షన్ (మలయాళ సిరీస్) - ఫిబ్రవరి 28ది వాస్ప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28సైనా ప్లేస్వర్గం (మలయాళ మూవీ) - ఫిబ్రవరి 24ఎంఎక్స్ ప్లేయర్ఆశ్రమ్ 3 పార్ట్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 27(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి) -
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్...!
-
నా మౌనం బలహీనతకు సంకేతం కాదు: చాహల్ సతీమణి
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే, తాజాగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. విడాకుల నేపథ్యంపై ప్రచారం మొదలైన సందర్భం నుంచి ఆమెపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. వాటి వల్ల తాను చాలా వేదనకు గురౌతున్నట్లు ఆమె పేర్కొంది.'గత కొన్ని రోజులుగా నా కుటుంబంతో పాటు నేను కూడా చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నా కుటుంబంపై కొందరు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను కొందరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం. ఇలాంటి సమయంలో కూడా ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం చాలా అవసరం. నిజం తప్పకుండా గెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ సమర్థించుకోను' అని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: 'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్)2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘చాహల్’ (Yuzvendra Chahal) పేరును ధనశ్రీ తొలగించింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముంబయికి చెందిన దంత వైద్యురాలు అయిన ధనశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పోటీపడింది. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది. తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు. -
శృతి హాసన్ కాదు.. 'డెకాయిట్'లో మృణాల్
అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతుంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్ని మాత్రం ఎప్పడో ఓసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి హీరోయిన్గా శృతి హాసన్ని తీసేసి మృణాల్ ఠాకుర్ని ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్)2022లో 'మేజర్' సినిమా వచ్చింది. దీని తర్వాత అడివి శేష్ ఏ సినిమాలు చేస్తున్నాడో కనీసం చిన్న అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మధ్యలో 'గూఢచారి 2' గురించి చెప్పారు గానీ. అది ఏ స్టేజీలో ఉందనేది క్లారిటీ లేదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' అనే సినిమాను ప్రకటించిన శేష్.. శృతి హాసన్తో కనిపించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు.కట్ చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయింది. శృతి ప్లేసులోకి మృణాల్ వచ్చి చేరింది. మరి కావాలనే తప్పించారా? లేదా శృతి హాసన్ తప్పుకొందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ పోస్టర్తో పాటు 'అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు శేష్ కూడా ఈ పోస్టర్స్ షేర్ చేస్తూ.. 'అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే' అని క్యాప్షన్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అవును వదిలేసాను..కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh ✨Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024 -
ఓ తండ్రి తీర్పు.. ఆ రోజే విడుదల
వివ రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఏవికె ఫిలింస్ బ్యానర్పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్నాడు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డాక్టర్ కెవి రమణ చారి ఆశీస్సులతో విడుదలకు సిద్ధమవుతోంది.తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ పేరెంట్స్పై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. హీరో వివ రెడ్డి చేస్తున్న పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హీరోయిన్ మీనాక్షి 'అద్దె' గోల.. రూమర్సా? నిజమా?
ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండింగ్ హీరోయిన్ అంటే మీనాక్షి చౌదరినే. ఎందుకంటే గత మూడు నెలల్లో ఈమె చేసిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరొకటి యావరేజ్ అనిపించుకుంది. మరో రెండు ఫ్లాప్ అయ్యాయి. మూవీస్ రిజల్ట్ సంగతి పక్కనబెడితే ఈమె యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీకాదు మరో విషయమై మీనాక్షి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)తెలుగు సినిమాల్లో చాలావరకు ఉత్తరాది హీరోయిన్లే నటిస్తుంటారు. షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తే వీళ్ల కోసమని నిర్మాతలు పెట్టే ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో వరస అవకాశాలు అందుకుంటున్న మీనాక్షి.. రీసెంట్గానే హైదరాబాద్లో కొత్తగా ఓ ఫ్లాట్ కొనుక్కుందట. అయితే హైదరాబాద్లో షూటింగ్ జరిగినన్నీ రోజులు.. రోజుకు రూ.18 వేలు.. రెంట్లా డిమాండ్ చేస్తోందట.సొంతింట్లో ఉన్నాసరే నిర్మాతల దగ్గర నుంచి మీనాక్షి చౌదరి డబ్బులు డిమాండ్ చేస్తోందనే రూమర్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరోవైపు మీనాక్షి వరకు కొన్ని అవకాశాలు పక్కకెళ్లిపోతున్నాయట. త్వరలో 'విరూపాక్ష' దర్శకుడితో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా తొలుత మీనాక్షినే అనుకున్నారట. ఇప్పుడు ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ రెండు విషయాలకు సంబంధం ఏమైనా ఉందా? లేదే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది!(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు) -
రెండేళ్ల తర్వాత 'జాతిరత్నాలు' అనుదీప్ కొత్త సినిమా
'జాతిరత్నాలు' సినిమాతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్తో 'ప్రిన్స్' అనే మూవీ చేశాడు. ఇది అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. దీంతో అనుదీప్ మరో మూవీ చేయలేకపోయాడు. మధ్యలో 'మ్యాడ్', 'కల్కి' మూవీస్లో అతిథి పాత్రల్లో కనిపించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తన కొత్త మూవీని మొదలుపెట్టాడు.(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు)యంగ్ హీరో విశ్వక్ సేన్తో అనుదీప్ సినిమా చేయబోతున్నాడు. బుధవారం లాంఛనంగా పూజా కార్యక్రమం జరిగింది. 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా తీస్తున్న మూవీకి 'ఫంకీ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలవ్వాలి. కానీ పలువురు నిర్మాతల దగ్గరకు వెళ్లారు కానీ ఎక్కడా సెట్ కాలేదు. చివరగా సితార సంస్థ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు లాంఛనంగా మొదలైంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ ఉండే అవకాశముంది. ప్రస్తుతం విశ్వక్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
‘ఆహా’లో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల డబ్బింగ్ విషయంలో సౌలభ్యం బాగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే డబ్ చేసిన నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. అలా ఇప్పుడు హారర్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా చిత్రం?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కాదు.. అసలు కథ ముందుంది!)'7జీ బృందావన కాలనీ' సినిమా పేరు చెప్పగానే హీరోయిన్ సోనియా అగర్వాల్ గుర్తొస్తుంది. అయితే ఈ మూవీ తర్వాత కథానాయికగా ఏం సినిమాలు చేసిందో తెలీదు. సహాయ పాత్రల్లో అయితే అడపాదడపా కనిపిస్తోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా '7/జీ: ద డార్క్ స్టోరీ'. ఈ ఏడాది జూలైలో తమిళంలో రిలీజైంది.తమిళ వెర్షన్ ఆగస్టులో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ని నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు (డిసెంబరు 12) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. కథ పరంగా రొటీన్ హారర్ మూవీ లాంటిదే. ఓ ఇంట్లోకి ఫ్యామిలీ వస్తారు. అదే ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఇంతకీ ఎవరా దెయ్యం? ఏంటి సంగతి అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Switch to '7/G - The Dark Story' 👻 🏘⏰ Stay connected on this Thursday! pic.twitter.com/Fa3NruRrh4— ahavideoin (@ahavideoIN) December 10, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా వచ్చేసింది. కొన్నిరోజుల క్రితం కేవలం తమిళ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్లోకి రాగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు కూడా ఉంది. ఇంతకీ ఇదే సినిమా? తెలుగు వెర్షన్ ఎందులో ఉంది?'జైలర్' దర్శకుడు నెల్సన్ నిర్మించిన లేటెస్ట్ తమిళ సినిమా 'బ్లడీ బెగ్గర్'. కవిన్ హీరోగా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ.. తెలుగులో నవంబర్ 7న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. తొలుత దీని తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)ప్రస్తుతానికి మన దగ్గర తప్పితే మిగతా దేశాల్లో సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. మరికొన్ని రోజుల్లో భారత్లోనూ 'బ్లడీ బెగ్గర్' మూవీ తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయి.'బ్లడీ బెగ్గర్' విషయానికొస్తే.. కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). ఓ రోజు దినం భోజనాల కోసమని ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. తిరిగి ఇంటికి వెళ్లకుండా దొంగచాటుగా బంగ్లాలోకి దూరుతాడు. కాసేపు బాగానే ఎంజాయ్ చేస్తాడు కానీ ఊహించని విధంగా లోపల ఇరుక్కుపోతాడు. తర్వాత ఏమైంది? బంగ్లా ఓనర్స్ ఇతడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. కేవలం రెండే పాత్రలు ప్రధానంగా తీసిన ఈ చిత్రం.. పలు అంతర్జాతీయ చిత్రాత్సోవాల్లో 60కి పైగా అవార్డులు గెలుచుకోవడం విశేషం. థియేటర్లలో రిలీజైనప్పుడు మనోళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి చూసేయొచ్చు. ఇంతకీ ఇది ఏ సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?నటుడు అయిపోదామనే ఆలోచన, డబ్బే సర్వస్వం అనుకునే ఓ కుర్రాడు.. జీవితం విలువను, ఆనందాన్ని ఎలా తెలుసుకున్నాడు అనే పాయింట్తో తీసిన సినిమా 'నరుడు బ్రతుకు నటన'. తెలుగు సినిమానే కానీ మూవీ అంతా కేరళలోనే జరుగుతూ ఉంటుంది. సీన్లలో ఉంటే నేచురాలిటీ చూసి మలయాళ మూవీని భ్రమపడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక)శివ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న హీరోలుగా నటించిన ఈ సినిమాకు రిషికేశ్వర్ యోగి దర్శకుడు. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ హీరోయిన్లుగా చేశారు. అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాగా.. గురువారం (డిసెంబరు 6న) ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది.'నరుడు బ్రతుకు నటన' విషయానికొస్తే.. సినిమా నటుడు కావాలనేది సత్య(శివ రామచంద్రవరపు) డ్రీమ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అవకాశం రాదు. నటుడు కావాలంటే ముందుగా మనిషిగా మారాలని, ఎమోషన్స్ తెలుసుకోవాలని ఫ్రెండ్ తిట్టేసరికి ఒంటరిగా కేరళ వెళ్లిపోతాడు. డబ్బు కొద్దిరోజుల్లోనే అయిపోతుంది. ఫోన్ దొంగిలిస్తారు. సత్య చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి కష్ట సమయంలో సత్య జీవితంలోకి సల్మాన్ (నితిన్ ప్రసన్న) వస్తాడు. ఇంతకీ ఇతడెవరు? సల్మాన్ వల్ల సత్య.. జీవితం గురించి ఏం తెలుసుకున్నాడనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
పుష్ప 2 కళ్లచెదిరే కలెక్షన్స్... రష్మిక సెంటిమెంట్ వర్కౌట్ ...
-
టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!
టీమిండియా స్పిన్నర్ చాహల్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన బౌలింగ్, ఫన్ మూమెంట్స్తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటు ఐపీఎల్లోనూ చాలామంది స్టార్ క్రికెటర్లతో ఇతడికి మంచి బాండింగ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారబోతుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్లోనూ ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈమె తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. డ్యాన్స్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా డ్యాన్స్ కచ్చితంగా రావాల్సిన హీరోయిన్ పాత్ర ఉంది. దాని కోసమే ధనశ్రీని అడగ్గా.. ఆమె ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర జరిగినట్లు సమాచారం. ఏదేమైనా టీమిండియా క్రికెటర్ భార్య.. టాలీవుడ్లో హీరోయిన్ అంటే వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా!(ఇదీ చదవండి: మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ కొడుకు) -
తెలుగులో తొలి మూవీ ప్లాఫ్.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్
సాధారణంగా హీరోయిన్లు నటించిన సినిమాలు ప్లాఫ్ అయితే కొత్తగా అవకాశాలు రావడం తక్కువ. అలాంటిది 'మిస్టర్ బచ్చన్' బ్యూటీకి మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వస్తున్నాయి. భాగ్యశ్రీ.. తొలుత 'యారియన్ 2' అనే హిందీ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది. రవితేజ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోయింది. మూవీ డిజాస్టర్ అయినప్పటికీ.. భాగ్యశ్రీ డ్యాన్సులు, గ్లామర్కి మార్కులు పడ్డాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)ఇప్పుడదే గ్లామర్ మరికొన్ని అవకాశాలు తీసుకొస్తోంది. ఇప్పటికే దుల్కర్ 'కాంత' సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. తాజాగా రామ్ పోతినేని కొత్త మూవీలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ మహేశ్ బాబు.. రామ్-భాగ్యశ్రీ సినిమాని తీస్తున్నాడు. నవంబర్ 21న ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
రీసెంట్గా రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా.. మూడు రోజుల క్రితం ఒక ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్కి పెళ్లి సెట్)ఒకప్పుడు తెలుగులో హీరోగా చేసిన అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా ప్రస్తుతం కన్నడలో హీరో. ఇతడి లేటెస్ట్ మూవీ 'మార్టిన్'. దసరాకి కన్నడతో పాటు తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఘోరమైన కంటెంట్ వల్ల దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. వచ్చి వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియనంత వేగంగా మాయమైపోయింది.మొన్న శుక్రవారం ఈ సినిమాని ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు. థియేటర్లలో అంటే చూడలేకపోయారు గానీ ఓటీటీలో కాబట్టి తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తారేమో? విజువల్స్ పరంగా సినిమా రిచ్గా ఉన్నప్పటికీ 'కేజీఎఫ్'ని కాపీ కొట్టాలనుకోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)Experience the thrilling tale of Dhruva, where patriotism meets passion 🔥❤️! Watch #Martin now! 🎥👊 ▶️https://t.co/MviUsUzc3u pic.twitter.com/tgi24PYIdm— ahavideoin (@ahavideoIN) November 19, 2024 -
సుడిగాలి సుధీర్ ప్రయత్నం.. కట్ చేస్తే ప్రభాస్ సినిమాలో
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు. ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా చేస్తోంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమెకు ఇదే తొలి మూవీ. సినిమా లాంచింగ్ రోజే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు కమెడియన్ గెటప్ శీను ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.'జబర్దస్త్' ఫేమ్ సుడిగాలి సుధీర్.. తన కొత్త సినిమా 'G.O.A.T'లో ఇమాన్విని హీరోయిన్గా పెట్టాలని అనుకున్నారట. కాకపోతే ఎంత ప్రయత్నించినా సరే ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వదిలేశారట. ఈ విషయం గెటప్ శీను.. ఓ షోలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)సుడిగాలి సుధీర్ సినిమాలో ఛాన్స్ వద్దనుకున్న ఇమాన్వి.. ప్రభాస్-హను మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈమె షూటింగ్లో పాల్గొంది. ఓ పాట, కొన్ని సీన్సు షూట్ చేయగా.. ఇమాన్వి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని తెలుస్తోంది. ప్రభాస్-ఇమాన్వి కెమిస్ట్రీ కూడా సూపర్ అని లీక్ ఒకటి బయటకొచ్చింది.ఏదేమైనా సుడిగాలి సుధీర్ ప్రయత్నించాడు. ఒకవేళ ఓకే అనుకుంటే ఎందరో హీరోయిన్లలో ఒకరిగా మిగిలిపోయేది. ఇప్పుడు ప్రభాస్ మూవీ చేస్తోంది. ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం పాన్ ఇండియా స్టార్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
'ఈసారైనా?!' సినిమా రివ్యూ
విప్లవ్ అనే కుర్రాడు.. హీరో, డైరెక్టర్, నిర్మాత, మాటల రచయితగా చేసిన సినిమా 'ఈసారైనా!?'. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా (నవంబర్ 8న) థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?డిగ్రీ చేసిన రాజు (విప్లవ్).. నాలుగేళ్లుగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. అదే ఊరిలో ఉండే శిరీష(అశ్విని) గవర్నమెంట్ టీచర్గా చేస్తుంటుంది. విప్లవ్, శిరీషని ప్రేమిస్తుంటాడు. ఆమె తండ్రి మాత్రం గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెళ్లి చేస్తానని కండీషన్ పెడతాడు. మరి రాజు.. గవర్నమెంట్ జాబ్ కొట్టాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)ఎలా ఉందంటే?అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా తీశారు. రాజు-శిరీష పాత్రల మధ్య లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ యూత్కి కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్లో వచ్చే పాట బాగుంది. హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా క్యూట్ అండ్ స్వీట్గా తెరకెక్కించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు సాగదీతగా అనిపించాయి. అలానే తెలిసిన ముఖాలు కూడా లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు.ఎవరు ఎలా చేశారంటే?హీరో విప్లవ్ కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. అశ్విని చూడటానికి బాగుంది. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి పర్లేదనిపించాడు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే చాలా విభాగాలని దగ్గరుండి చూసుకున్న విప్లవ్ ఆకట్టుకున్నాడు. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫీ ఓకే. పచ్చని పల్లెటూరిలో ప్రశాంతంగా అనిపించే యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్) -
'రహస్యం ఇదం జగత్' మూవీ రివ్యూ
టైటిల్: రహస్యం ఇదం జగత్నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ తదితరులుదర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్సంగీతం: గ్యానీఎడిటర్: ఛోటా కే ప్రసాద్సినిమాటోగ్రఫీ: టైలర్ బ్లూమెల్నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతులవిడుదల తేదీ : 8 నవంబర్ 2024సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్కు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉంది. అలా ఈ జానర్లో వచ్చిన సినిమానే రహస్యం ఇదం జగత్. పురాణ ఇతిహాసాలను తెరపై చూపిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నించామంటున్నాడు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. మరి ఆయన ప్రయత్నం ఏమేరకు ఫలించిందో రివ్యూలో చూసేద్దాం..కథకథ మొత్తం అమెరికాలోనే జరుగుతుంది. ఇండియాలో ఉన్న తండ్రి చనిపోవడంతో తల్లి కోసం స్వదేశానికి తిరిగి వద్దామనుకుంటుంది అకీరా (స్రవంతి). ఈమె బాయ్ ఫ్రెండ్ అభి (రాకేష్) కూడా తనతోపాటు ఇండియా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. వెళ్లే ముందు స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటాడు. అలా అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడ వాళ్లు బుక్ చేసుకున్న హోటల్ క్లోజ్ అవడంతో ఓ ఖాళీ ఇంట్లో బస చేస్తారు. ఆ స్నేహితులలో సైంటిస్ట్ అయిన అరు మల్టీ యూనివర్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దీని గురించి మాట్లాడుకునే క్రమంలో అభి, విశ్వకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో విశ్వ ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అకీరా, కళ్యాణ్ లను చంపేస్తాడు. మరోవైపు మల్టీ యూనివర్స్కు వెళ్లే దారి ఆ ఊళ్ళోనే ఉందని తెలుసుకొని అభిని తీసుకొని వెళ్తుంది అరు. తీరా అక్కడికెళ్లాక ఆమెను ఎవరో చంపేస్తారు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే మల్టీ యూనివర్స్ ఉందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే!విశ్లేషణతక్కువ బడ్జెట్లో మంచి అవుట్ పుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ తెరకెక్కించిన సినిమానే రహస్యం ఇదం జగత్. ఈ సినిమాను అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు నిర్మించారు. హాలీవుడ్ చిత్రాల నుంచి ప్రేరణ పొంది తీసినట్లు ఉంటుంది. మన ప్రేక్షకులకు కనెక్ట్ అవడానికి పురాణాలను వాడుకున్నారు. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం.. కృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపించడం.. శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం వంటివి చూపించారు.సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. ఫ్రెండ్స్ ట్రిప్.. గొడవలు.. చంపుకోవడాలు.. ఇవన్నీ కాస్త సాగదీసినట్లుగానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు అభి స్నేహితులు చనిపోవడంతో.. వాళ్ళను కాపాడుకోవడానికి వామ్ హోల్ కి వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి కలుగుతుంది. సెకండాఫ్లో ఆ సస్పెన్స్ కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. రొటీన్ సినిమా కాకుండా.. కొత్త మూవీ చూసినట్లు అనిపించకమానదు.ఎవరెలా చేశారంటే?షార్ట్ ఫిలింస్లో నటించి మెప్పించిన రాకేష్ హీరోగా నటించాడు. వామ్ హోల్లోకి ట్రావెల్ చేసి వచ్చే వ్యక్తిగా బాగా నటించాడు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినా అందులో స్రవంతి తన యాక్టింగ్తో మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు చక్కగా సరిపోయింది. భార్గవ్ కామెడీతో నవ్వించేందుకు ప్రయత్నించాడు. కార్తీక్ విలన్గా బాగానే చేశాడు. అయితే వీళ్లంతా అమెరికాలోనే సెటిల్ అయినవాళ్లు కావడంతో మన ఆడియన్స్కు కొత్తముఖాలుగా అనిపిస్తారు. పైగా అమెరికన్ యాసలోనే మాట్లాడారు.టెక్నికల్ టీమ్సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికాలో ఉన్న మంచి మంచి లొకేషన్స్ వెతికి మరీ చూపించినట్లుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు ఏవీ అంతగా ఆకట్టుకోవు. డబ్బింగ్పై కాస్త ఫోకస్ చేయాల్సింది. డబ్బింగ్ను పట్టించుకోకపోవడమే ఈ సినిమాకు మైనస్. కొన్నిచోట్ల బీజీఎమ్ డైలాగులను డామినేట్ చేసింది. దర్శకుడికి తొలి చిత్రం కావడంతో అక్కడక్కడా కాస్త తడబడ్డట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
'జాతర' సినిమా రివ్యూ
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా 'జాతర'. దీయా రాజ్ హీరోయిన్. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. రగ్డ్, ఇంటెన్స్ డ్రామాతో చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో సినిమాని తీశారు. తాజాగా నవంబర్ 8న థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఆలయ పూజారి పాలేటి. అతని కొడుకు చలపతి (సతీష్ బాబు రాటకొండ) ఓ నాస్తికుడు. అదే ఊరికి చెందిన వెంకట లక్ష్మి (దీయ రాజ్)తో చలపతి ప్రేమలో ఉంటాడు. ఓరోజు పాలేటి కలలోకి గంగావతి గ్రామదేవతలు వచ్చి ఇక్కడే ఉండి గ్రామాన్ని దురాచారాల నుండి రక్షించమని కోరుతుంది. ఆ తర్వాత గ్రామం నుండి అదృశ్యమవుతుంది. గ్రామ దేవత అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచిపెట్టడం చెడు సంకేతం అని ప్రజలు నమ్ముతారు. మరోవైపు గంగిరెడ్డి (ఆర్కే నాయుడు) గ్రామ కార్యకలాపాలను చేపట్టడం, గ్రామ దేవతలను శాశ్వతంగా ఉండడానికి తన ఇంటికి ఆహ్వానించడం లాంటివి చేస్తాడు. ఇంతకీ గంగిరెడ్డి, పాలేటి కుటుంబానికి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)ఎలా ఉందంటే?పల్లెటూరి సంస్కృతి, ఊర్లో జాతరను తలపించేలా ఈ సినిమా ఉంటుంది. అందరినీ కట్టిపడేసేలా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఈ చిత్రాన్ని అందించడంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథను చెప్పడంలో పర్లేదనిపించాడు. సంగీతంతో పాటు సినిమాలో పల్లెటూరి అందాలని, దేవత సన్నివేశాలను బాగా చూపించారు.సినిమా నెమ్మదిగా మొదలైనప్పటికీ తక్కువ సమయంలో స్టోరీకి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా దేవత సన్నివేశాలు, బీజీఎం.. సినిమా మొత్తం ఆడియెన్స్ని వెంటాడతాయి. సినిమాలో చాలా సర్ప్రైజ్లు, ట్విస్ట్లు ఉన్నాయి. ప్రారంభంలో, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.ఎవరెలా చేశారు?సతీష్ బాబు.. నటుడు, రచయిత, దర్శకుడిగా తన ప్రతిభ చూపించారు. హీరోయిన్గా చేసిన దీయా రాజ్ పర్లేదనిపించింది. గంగిరెడ్డి పాత్రలో ఆర్కే నాయుడు సూట్ అయిపోయాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ) -
థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఎమ్4ఎమ్ సినిమా
థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్న మరో తెలుగు సినిమా ఎమ్4ఎమ్ (మోటివ్ ఫర్ మర్డర్). తెలుగుతో పాటు ఐదు భాషలలో దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల తీసిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒకే ఒక కిల్లర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ పోస్టర్ చూస్తుంటే ఈ కిల్లర్ పూర్తిగా డిఫరెంట్గా.. నా రూటు వేరు అన్నట్లు ఉంది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో సినిమా తీశామని.. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు అమెరికాలోనూ ప్రమోషన్స్ మొదలయ్యాయని చెప్పారు. వసంత్ అందించిన మ్యూజిక్, ఆనంద్ పవన్ చేసిన ఎడిటింగ్, సంతోష్ షానమోని కెమెరా పనితనం.. వంటి తమ టీమ్ వర్క్ హాలీవుడ్ రేంజ్లో వచ్చాయని ప్రశంసించారు. (ఇదీ చదవండి: హైదరాబాద్లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు) -
హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ బడ్జెట్స్
-
ఈ 'పెళ్లి పుస్తకం' మనోరంజకం
సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవన ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని, కుటుంబ విలువల్ని చాటి చెప్పే మనోరంజకమైన సకుటుంబ కథాచిత్రం 'పెళ్లి పుస్తకం'. రాజేంద్రప్రసాద్ హీరోగా దివ్యవాణి హీరోయిన్గా ప్రముఖ దర్శకులు బాపు తీర్చిదిద్దిన ఓ కుటుంబ కావ్యం. బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి, శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' 1991 ఏప్రిల్ 1న విడుదలై చరిత్ర సృష్టించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న కృష్ణమూర్తి అంటే రాజేంద్రప్రసాద్ ముంబైలోని ఓ సంస్థలో కళా దర్శకుడుగా పని చేస్తుంటాడు. ఇతని భార్య సత్యభామ అంటే దివ్యవాణి కేరళలో స్టెనోగ్రాఫర్గా పని చేస్తుంటుంది. అయితే... తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరిద్దరూ కలిసి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంటారు. అలా ఓ పెద్ద సంస్థలో చేరడం కోసం తాము అవివాహితులమని ఆ సంస్థ యజమాని గుమ్మడికి అబద్ధం చెబుతారు. అక్కడ చేరిన తర్వాత వీరు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రంలోని ప్రధానాంశం.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) కడుపుబ్బా నవ్వించిన రచనకంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ... అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్తో మాట్లాడుతుంటే... గుమ్మడి సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ... ఈ సినిమాకు కథను అందించిన రావి కొండలరావు బధిర వార్తలు చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ విషయానికొస్తే... గుమ్మడి బావమరిదిగా.. దివ్యవాణిపై మనసు పడి ఆ తర్వాత అక్కతో తన్నులు తినే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి.చప్పట్లు కొట్టించిన మాటలుసెకండ్ హీరోయిన్గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి అతని భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు... ఏడుపుచ్చినప్పుడు నవ్వేవాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తుంది... లాంటి డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఏ పెళ్లిలోనైనా ఆ పాటేపాటలైతే చెప్పనక్కరలేదు.. ఆరుద్ర చేతి నుంచి జాలు వారిన 'శ్రీరస్తూ శుభమస్తూ' పాట... అప్పటి వరకు తెలుగు లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా మోగినా వినిపించే 'సీతారాముల కళ్యాణం చూతమురా రండి' అంటూ సాగే పాటనే పక్కకు నెట్టేసింది. ఇప్పటికీ తెలుగువారి పెళ్లిళ్లలో ఈ పాటే వినిపిస్తుండడం విశేషం. మామ కేవీ మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన ‘అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనస్సులాయో...’, ‘కృష్ణం కలయ సఖి సుందరం...’, ‘పప్పు దప్పళం అన్నం నెయ్యి...’, ‘హాయి హాయి శ్రీరంగ సాయి...’, ‘సరికొత్త చీర ఊహించినాను...’ వంటి పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు... సంగీత ప్రియులను కూడా ఓలలాడించాయి. పెళ్లికి అర్థాన్నీ, పరమార్థాన్నీ సున్నితంగా, హృద్యంగా అందంగా, రొమాంటిక్గా, అన్నింటినీ మించి హాస్యరసభరితంగా చెప్పిన చిత్రం ఈ ‘పెళ్లి పుస్తకం’.– ఇంటూరు హరికృష్ణ -
'జ్యువెల్ థీఫ్' సినిమా సెన్సార్ పూర్తి
సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా నటించిన సినిమా 'జ్యువెల్ థీఫ్'. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే నవంబర్ 8న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. 10 నెలల తర్వాత
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలా నెలల తర్వాత కూడా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గతేడాది డిసెంబరు చివర్లో రిలీజైన ఓ తెలుగు మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. డబ్బు చుట్టూ తిరిగే ఆంథాలజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఇంతకీ దీని సంగతేంటంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో 'దేవర'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)డబ్బులున్న ఓ ఇనుప పెట్టె.. ఓ దొంగతో ఎనిమిది కథలు చెబుతుంది. మనిషి డబ్బు కోసం ఏమేం చేస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అనే కాన్సెప్ట్తో తీసిన చిత్రం 'కరెన్సీ నగర్'. గతేడాది డిసెంబరు 29న థియేటర్లలో రిలీజైంది. చిన్న మూవీ కావడం, పెద్దగా పేరున్న యాక్టర్స్ ఎవరూ లేరు. దీంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయినా నేరుగా స్ట్రీమింగ్ చేయకుండా ఈ చిన్న మూవీని కూడా అద్దె విధానంలో పెట్టడమేంటో అర్థం కాలేదు. ఏదైతేనేం ఓటీటీలోకి కొత్త తెలుగు మూవీ వచ్చేసింది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు.(ఇదీ చదవండి: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!) -
ఈ 18న థియేటర్లలో 'రివైండ్' మూవీ రిలీజ్
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'రివైండ్'. కళ్యాణ్ చక్రవర్తి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు.జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈనెల 18న ఈ సినిమాని సౌత్ ఇండియా మొత్తం లో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. -
'కాక్రోచ్'.. ఓ యాక్షన్ లవ్ స్టోరీ మూవీ
పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తీస్తున్న కొత్త సినిమా 'కాక్రోచ్'. విజయదశమి సందర్భంగా చిత్ర బృందం టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే వయలెంట్ యాక్షన్ ప్రేమ కథ అని అంటున్నారు. పాత కొత్త నటీనటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది.(ఇదీ చదవండి: హీరోగా 'బిగ్బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెబుతూ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం) -
హీరోగా 'బిగ్బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు
దసరా సందర్భంగా పలు చిన్న చిత్రాలు నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా చేస్తున్న మూవీ ఒకటి కాగా.. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు ప్రధాన పాత్ర పోషించిన మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.సీరియల్ నటుడిగా అందరికీ తెలిసిన అమర్దీప్.. గతేడాది బిగ్బాస్ షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఇప్పటికే ఓ మూవీ చేస్తుండగా.. ఇప్పుడు 'నా నిరీక్షణ' పేరుతో మరో చిత్రాన్ని మొదలుపెట్టాడు. దసరా సందర్భంగా ఇది ప్రారంభమైంది. లిషి గణేష్ కల్లపు హీరోయిన్ కాగా సాయి వర్మ దాట్ల దర్శకుడు. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)'ఎర్రచీర' రిలీజ్ ఎప్పుడంటే?నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్వి నటించిన కొత్త సినిమా 'ఎర్రచీర'. తల్లి సెంటిమెంట్ కథతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ డిసెంబరు 20న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సుమన్ బాబు దీనికి దర్శకుడు.'పెన్ డ్రైవ్' మూవీ షురూవిష్ణు వంశీ, రియా కపూర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా 'పెన్ డ్రైవ్'. ఎంఆర్ దీపక్ దర్శకుడు. కె.రామకృష్ణ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కుతోంది. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.(ఇదీ చదవండి: ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్బాస్ షూటింగ్ రద్దు)'ప్రేమలు' బ్యూటీ తెలుగు సినిమా'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు చేస్తున్న తొలి తెలుగు సినిమా 'డియర్ కృష్ణ'. దినేష్ బాబు దర్శకుడు. కొత్తోళ్లు అక్షయ్, ఐశ్వర్యతో మమిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడి నమ్మే ఓ భక్తుడి స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
7 నెలల తర్వాత ఓటీటీలోకి పూరీ తమ్ముడి సినిమా
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ స్ట్రీమింగ్కి రెడీ అయిపోయింది. అప్పుడెప్పుడో మార్చిలో థియేటర్లలో రిలీజైతే.. ఇన్నాళ్లకు డిజిటల్ మోక్షం కలిగిందనే చెప్పాలి. ఇంతకీ ఇది ఏ సినిమా? ఏ ఓటీటీలోకి రానుంది?స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్.. చాన్నాళ్లుగా నటిస్తున్నాడు. కానీ హిట్ కొట్టలేకపోతున్నారు. ఇతడి చేసిన చివరి మూవీ 'వెయ్ దరువెయ్'. మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్డ్రాప్ కథతో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ కోసం జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓటీటీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)దాదాపు ఏడు నెలల తర్వాత అంటే అక్టోబరు 11 నుంచి 'వెయ్ దరువెయ్' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ వీకెండ్ చూడటానికి ఓ తెలుగు సినిమా వచ్చేసిందనమాట.'వెయ్ దరువెయ్' కథ విషయానికొస్తే నకిలీ సర్టిఫికెట్స్తో ఉద్యోగాలు పొందాలని యువత ఎలా అడ్డదారులు తొక్కుతున్నారనే పాయింట్తో సినిమా తీశారు. సాయిరామ్ శంకర్, యశ్న, సునీల్, సత్యం రాజేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: 'బిగ్బాస్' గేమ్ కాదు ట్రామా?)Get ready for a thrilling ride! 🎢 #VeyDharuvey premieres on October 11th. 🎉🍿 @YashaShivakumar @ihebahp @dirnaveenreddy @actordevaraj @LyricsShyam pic.twitter.com/2RmkYzhUFl— ahavideoin (@ahavideoIN) October 8, 2024 -
'లవ్ రెడ్డి' మూవీ.. కైలాష్ ఖేర్ ఎమోషనల్ సాంగ్ రిలీజ్
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'లవ్ రెడ్డి'. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. స్మరన్ రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)ఈ సినిమాలోని 'ప్రాణం కన్నా..' అనే లిరికల్ పాటని తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ పాడిన ఈ హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. 'ప్రాణం కన్నా ప్రేమించినా..ఆ ప్రేమనే తెంచావుగా....' అంటూ ప్రేమికుడి బాధను వ్యక్తం చేస్తూ సాగుతుందీ పాట. 'ప్రాణం కన్నా..' పాటకు 'లవ్ రెడ్డి' మూవీలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?) -
5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ప్రస్తుతం 'దేవర' హవా నడుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ 20కి సినిమాలు/వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇదలా ఉండగానే మరో చిన్న సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కారుణ్య మరణం అనే కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు)'కేరింత' ఫేమ్ పార్వతీశం, 'జబర్దస్త్' నటి ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మెర్సీ కిల్లింగ్'. ఏప్రిల్లో థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం, బడ్జెట్ పరిమితుల వల్ల జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఆహా ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా తీసుకొచ్చేశారు.'మెర్సీ కిల్లింగ్' విషయానికొస్తే.. స్వేచ్ఛ (హారిక) అనాథ అమ్మాయి. తల్లిదండ్రులు ఎవరనేది తెలియక, చిన్నప్పటి నుంచి అవమానాలను ఎదుర్కొంటుంది. పెద్దయ్యాక తన పెరెంట్స్ ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు మహేశ్(పార్వతీశం), భారతి (ఐశ్వర్య) పరిచయమవుతారు. వీళ్లు స్వేచ్ఛకు ఎలాంటి సహాయం చేశారు? స్వేచ్ఛకు రామకృష్ణం రాజు(సాయి కుమార్)కు సంబంధమేంటి? చివరకు తల్లిదండ్రులని స్వేచ్ఛ కలిసిందా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)Uncover the truth! Watch the heart-wrenching tale of a fisherman's family, fighting for justice.▶️https://t.co/JDJ5cDG3Mj#MercyKilling #Justice #LoveStory pic.twitter.com/HJdMT2i3wp— ahavideoin (@ahavideoIN) September 28, 2024 -
గ్యాంగ్స్టర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా అక్టోబర్ 25న రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ పోస్టర్ను సాయి మాధవ్ బుర్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా టీజర్, ట్రైలర్ ఇంకా పోస్టర్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని విజయం వరించాలని కోరుకుంటున్నాను అన్నారు. నటుడు అభినవ్ జనక్ మాట్లాడుతూ.. రెండు గ్యాంగ్స్ మధ్య వార్ను డైరెక్టర్ చంద్రశేఖర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. ప్రతి సీన్ బాగుంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను అన్నాడు.హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ.. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను. దిల్ రాజు గారు ట్రైలర్ చూసి బాగుందన్నారు. మా సినిమా తేదీ ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన సాయి మాధవ్ బుర్రా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
'లగ్గం' ఫిక్స్ అయింది.. థియేటర్ రిలీజ్ ఎప్పుడంటే?
సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా 'లగ్గం'. రమేశ్ చెప్పాల దర్శకుడు. తెలంగాణ నేపథ్యంలో జరిగే స్టోరీతో తీశారు. రీసెంట్గా రిలీజ్ చేసిన పాటలు, టీజర్కి స్పందన బాగానే వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబరు 18న ప్రేక్షకులని ముందుకు రానుందని చెప్పారు.(ఇదీ చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా హీరోహీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతమందించారు.(ఇదీ చదవండి: ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్) -
హనుమాన్ కాన్సెప్ట్ స్టోరీతో తెలుగులో మరో సినిమా
నూతన నిర్మాణ సంస్థ విరభ్ స్టూడియోస్ సమర్పణలో రోహిత్ కొల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీస్తున్న సినిమా 'గదాధారి హనుమాన్'. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. తాజాగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే మూవీకి సంబంధించిన వివరాల్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే వాగ్వాదాలు)'గదాధారి హనుమాన్' సినిమాని ఆధ్యంతం అన్ని అంశాలతో ఓ డివైన్ టచ్ ఇచ్చి, చాలా అద్భుతంగా తీశామని.. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి 'కల్కి', 'హనుమాన్' లాంటి బ్లాక్ బస్టర్ చేస్తారనే నమ్మకంతో ఉన్నామని దర్శకుడు రోహిత్ కొల్లి చెప్పాడు. రవి, హర్షిత, బసవరాజు, రమేష్ పండిట్, నగేష్ మైయ్య, కళ్యాణ్ కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతునాయి. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?) -
శ్రీకాంత్ చేతుల మీదుగా 'వెంకటలక్ష్మితో' ఫస్ట్ లుక్ పోస్టర్
టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్పై ఆలేటి రాజేష్ నిర్మించిన సినిమా 'వెంకటలక్ష్మితో'. రామమూర్తి కొట్టాల దర్శకుడు. రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ని హీరో శ్రీకాంత్ శనివారం లాంచ్ చేశారు. సినిమా విజయం సాధించాలని కోరారు.షార్ట్ ఫిలింస్తో ఫేమస్ అయిన రఘు.. ఈ సినిమాతో అందరినీ ఆకట్టుకుంటాడని నమ్ముతున్నా. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇది కూడా ఓ కొత్త కంటెంట్తో రాబోతోందని అర్ధమవుతోందని శ్రీకాంత్ అన్నాడు. హీరో శ్రీకాంత్ మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ తరపున శ్రీకాంత్కి స్పెషల్ థాంక్స్ అని హీరో రఘు చెప్పుకొచ్చాడు. -
'సీతారాం చిత్రాలు' సినిమా రివ్యూ
తెలుగులో ఇప్పుడంతా కంటెంట్ ఉన్న సినిమాలదే హవా నడుస్తోంది. స్టార్ హీరోలు లేకపోయినా మూవీస్ సూపర్ హిట్ అవుతున్నాయి. అలా బోలెడన్ని చిన్న చిత్రాలు ప్రతివారం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'సీతారాం సిత్రాలు'. కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)కథేంటి? కర్నూలు దగ్గరల్లో టీ స్టాల్ నడిపే కుర్రాడు శివ (లక్ష్మణమూర్తి). మంచి మాటలని వాట్సప్లో పెడుతూ 'స్టేటస్ శివ'గా ఫేమస్ అవుతాడు. జీవితంలో సక్సెస్ అవ్వాలనేది గోల్. ఓసారి టీచర్గా పనిచేసే పార్వతి( భ్రమరాంబిక)తో ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఆమెతోనే పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి గ్రాండ్గా చేసుకోవాలని భారీగా అప్పు చేసి ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ ఊహించని విధంగా పెళ్లి ఆగిపోయి, అప్పులు మిగులుతాయి. ఇంతలో విలన్ ఎంట్రీ ఇస్తాడు. దాంతో శివ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఇది చిన్న సినిమానే గానీ ఎన్నో విషయాలను దర్శకుడు ఇందులో చూపించాడు. మనసుకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తే విజయం వరిస్తుందని... బంధువులు మాటలు చెప్పడానికే కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు పనికిరారనే జీవిత సత్యాన్ని చూపించారు. స్నేహితులు కూడా మనల్ని నమ్మించి ఎలా మోసం చేస్తారో చూపించే సీన్లు బాగున్నాయి. సీరియల్స్ మాయలో పడి ఆడవాళ్లు, ఇంట్లో వాళ్లని కూడా అందులోని పాత్రలుగా ఊహించుకోవడం ఎలా ఉంటుందో చూపించాడు.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)ఎంచుకున్న పాయింట్ని చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్లో కొన్ని సీన్స్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. ముఖ్య పాత్రల్లో తెలిసిన వాళ్లను తీసుకుని ఉంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది. ప్రస్తుతం యువత ప్రేమలో ఓడిపోతే కుంగిపోతున్నారు. అలాంటి వాళ్లు ఎలా సక్సెస్ అవ్వొచ్చో ఈ మూవీతో చూపించారు.హీరో లక్ష్మణ మూర్తి, హీరోయిన్ భ్రమరాంబిక తమ పాత్రలకు న్యాయం చేశారు. తల్లిగా చేసిన ఢిల్లీ రాజేశ్వరితో పాటు మిగిలిన నటీనటులు పర్లేదనిపించారు. దర్శకుడిగా చెప్పాలనుకున్న పాయింట్ని సూటిగా చెప్పాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. రుద్ర కిరణ్ సంగీతం వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ) -
'ఈసారైనా?!' మూవీ మొదటి పాటకు మంచి రెస్పాన్స్
'ఈ సారైనా' పేరుతో తీస్తున్న తెలుగు సినిమా నుంచి తొలి పాట కొన్నిరోజుల క్రితం రిలీజంది. రాకేందు మౌళి సాహిత్యం, అర్జున్ విజయ్ గానం ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ గీతానికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో విప్లవ్ హీరోగా నటించాడు. దర్శకుడు కూడా ఇతడే. ఓ అందమైన గ్రామీణ నేపధ్యంలో నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతుంటాడు. అలానే తన ప్రేమ వెతుక్కునే పనిలోనూ ఉంటాడు.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్)ఈ సినిమాకు తేజ్ సంగీతమందించగా, సంకీర్త్ కొండ నిర్మాతగా వ్యవహరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. జనాలను ఆకట్టుకునే టైటిల్తో "ఈసారైనా" ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిన్న చిత్రంగా దూసుకుపోతోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
ఓటీటీలోకి వచ్చేసిన టీనేజీ ప్రేమకథ సినిమా
తెలుగు సినిమాల్లో టీనేజీ ప్రేమకథలు బోలెడు. 'కొత్త బంగారు లోకం' నుంచి 'బేబి' వరకు చాలా మూవీస్ వచ్చాయి. ఈ తరహా స్టోరీతోనే వచ్చిన మరో మూవీ 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ప్రభాస్ 'కల్కి' థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం ముందు వచ్చింది. హడావుడిలో ఇదొకటుందనే ఎవరూ పట్టించుకోలేదు. ఓ మాదిరిగా పర్లేదనిపించింది. ఇప్పుడిది ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)ఆహా ఓటీటీలో ప్రస్తుతం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గతంలో వచ్చిన చాలా తెలుగు సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. సీన్లు కూడా అరె ఎక్కడో చూశామే అనిపించేలా ఉంటాయి. కాకపోతే చూస్తున్నంతసేపు ఎంటర్టైనింగ్గా ఉంటూనే టైమ్ పాస్ అయిపోతుంది.'ప్రభుత్వ జూనియర్ కళాశాల' విషయానికొస్తే.. 2004లో రాయలసీమలో పుంగనూరు అనే ఊరు. ఇంటర్ చదివే వాసు.. అదే కాలేజీలో చదువుతున్న కుమారితో ప్రేమలో పడతాడు. కానీ ఆమె గురించి కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతోనే గొడవ పడతాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఇంతకీ వాసుకి ఏం తెలిసింది? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ) View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
రాఖీ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ అవ్వొద్దు!
అన్నా చెల్లి, అక్కా తమ్ముళ్లు ఎంతో ప్రేమగా సెలబ్రేట్ చేసుకునే పండుగ రాఖీ. ప్రతి ఏడాది ఆగస్టులో వచ్చే ఈ పండగ నాడు సోదరీ సోదరమణులు తమ తోడబుట్టిన వాళ్లని కలుసుకుని రాఖీ కట్టుకుని రోజంతా హాయిగా ఉంటారు. ఇలాంటి టైంలో అక్కడికో ఇక్కడికో వెళ్లే బదులు ఇంట్లోనే కూర్చుని ఓ మంచి సినిమా చూసుకోవచ్చు. అలా అన్నచెల్లి అనే బంధాన్ని గుర్తుచేసేలా తెలుగులో బోలెడన్ని సినిమాలు వాటిలో 15 సినిమాలు మాత్రం స్పెషల్.(ఇదీ చదవండి: రాఖీ స్పెషల్: ఈ పాటలు స్టేటస్ పెట్టుకోండి..)ఈ రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా తెలుగులోనే రాఖీ, హిట్లర్, గోరింటాకు.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా యూట్యూబ్లోనే అందుబాటులో ఉండటం విశేషం. ఇంతకీ ఆ సినిమాలేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం.చిరంజీవి 'హిట్లర్'అర్జున్ 'పుట్టింటికి రా చెల్లి'బాలకృష్ణ 'ముద్దుల మావయ్య'మహేశ్ బాబు 'అర్జున్'జూ.ఎన్టీఆర్ 'రాఖీ'పవన్ కల్యాణ్ 'అన్నవరం'రాజశేఖర్ 'గోరింటాకు'ఎన్టీఆర్ 'రక్త సంబంధం'శోభన్ బాబు 'జీవన రాగం''చెల్లెలి కాపురం'వెంకటేశ్ 'గణేష్'అక్కినేని నాగేశ్వరరావు 'బంగారు గాజులు'జగపతిబాబు 'శివరామరాజు'కృష్ణ 'సంప్రదాయం'కృష్ణం రాజు 'పల్నాటి పౌరుషం'(ఇదీ చదవండి: ప్రభాస్ లేకుండా 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి) -
పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్
రీసెంట్గా రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన దానికి.. మూవీ వచ్చిన తర్వాత అసలు పొంతనే లేదు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. సినిమాలో కంటెంట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ భార్య ఈమెనే అని ఓ నటి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్' సినిమాతో బోలెడంత పేరు తెచ్చుకున్నారు. కాకపోతే దాన్ని కొనసాగించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పిదమే తాజాగా రిలీజైన 'మిస్టర్ బచ్చన్'. సరే దీని గురించి వదిలేస్తే గతంలో ఇదే రవితేజతో 'మిరపకాయ్' అనే మూవీ చేశారు. ఇందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పక్కన ఓ అమ్మాయి నటించింది. అయితే ఈమెనే హరీశ్ శంకర్ భార్యని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.తాజాగా ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ని అడగ్గా.. తన భార్య పేరు, ఆ అమ్మాయి పేరు స్నిగ్ద అని అందుకే చాలామంది పొరబడుతున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసుకుంటోందని అన్నాడు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉండగా హరీశ్ శంకర్.. రామ్తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. బచ్చన్ మూవీ ప్రమోషన్స్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?) -
ఆగస్టు 23న 'బ్రహ్మవరం' మూవీ రిలీజ్
డ్రీమ్జ్ & రీల్జ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించిన సినిమా 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించారు. ఈ ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ కానుంది. స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)కథే ఈ సినిమాకు మెయిన్ హీరో అని ప్రధాన పాత్రధారి కమ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్రవంతి బెల్లంకొండ చెప్పుకొచ్చింది. మా ప్రయత్నాలకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి) -
బిగ్బాస్ నోయల్ '14' సినిమా రివ్యూ
బిగ్బాస్ ఫేమ్ నోయల్ లేటెస్ట్ మూవీ '14'. ఇందులో ఇతడు డిటెక్టివ్ పాత్ర పోషించాడు. రామ్ రతన్ రెడ్డి, విషాక ధీమాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. పోసాని కూడా కీ రోల్ చేశారు. లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన మెట్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? టాక్ ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రతన్ (రామ్ రతన్ రెడ్డి).. ముఖ్యమంత్రి (పోసాని కృష్ణ మురళి) కుమారుడు. ఇతడిది జాలీ లైఫ్. నేహా (విషాక ధీమాన్) అనే డాక్టర్తో ప్రేమలో ఉంటాడు. ఉన్నట్టుండి ఓరోజు.. నేహా ఫ్లాట్లో వీళ్లిద్దరూ విగత జీవులుగా కనిపిస్తారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి పోలీసులు.. కేస్ మూసేస్తారు. జర్నలిస్ట్ సుబ్బు(శ్రీకాంత్ అయ్యంగార్) మాత్రం వీరిది ఆత్మహత్య కాదని, హత్య అని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇంతకీ సుబ్బు ఏం కనుక్కొన్నాడు. ఈ చావులో సీఎం పాత్ర ఏంటి? డిటెక్టివ్ నోయల్ ఈ కేస్ స్టడీలో ఎంత వరకూ ఉపయోగపడ్డాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)ఎలా ఉందంటే?మొదట్లో ఓ సాధారణ మర్డర్ మిస్టరీలాగ సినిమా ప్రారంభించారు. ఆ తరువాత ఇంట్రెస్టింగ్ మలుపులతో స్క్రీన్ ప్లే నడిపించారు. మధ్యలో యూత్ని ఎంటర్ టైన్ చేయడం కోసం రొమాంటిక్ సీన్స్ పెట్టారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ట్విస్టులతో ఆకట్టుకున్నారు. 14 ఏళ్ల యువకుల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? వారు టెక్నాలజీలో పడి ఎలాంటి వాటికి బానిస అవుతున్నారు? తల్లిదండ్రులు వారి పట్ల ప్రవర్తిస్తున్న తీరు తదితర విషయాలను ప్రీ క్లైమాక్స్ నుంచి బాగా చూపించి... తల్లిదండ్రులకు ఓ మెసేజ్ ఇచ్చారు. పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేయకూడదో... అలా చేయడం వల్ల వారు ఎలాంటి క్షణికావేశాలకు లోనవుతారనేది ఇందులో చూపించారు.ఎవరెలా చేశారు?నోయల్ డిటెక్టివ్గా... ప్రీ క్లైమాక్స్లో ఆకట్టుకుంటారు. లీడ్ రోల్స్ చేసిన రతన్, విషాక పర్లేదు. రొమాంటిక్స్ సీన్లలో బాగానే చేశారు. పోసాని కృష్ణ మురళి పాత్ర ఓకే. జబర్దస్త్ మహేష్ పాత్ర కాసేపు ఉన్నా... తన మార్క్ సంభాషణలతో ఆకట్టుకుంటారు. జర్నలిస్ట్ సుబ్బు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ రాసుకున్న కథ... కథనాలు చాలా బాగున్నాయి. రొమాంటిక్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ తీసినప్పటికీ.. చివర్లో ఓ మంచి మెసేజ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫ, సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉండాల్సింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) -
కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి హీరో.. ఫస్ట్ లుక్ లాంచ్
డిఫరెంట్ సినిమాలు తీస్తూ కొత్త దర్శకులు ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఓ సినిమానే 'ప్రణయ గోదారి'. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించగా, ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)పోస్టర్ చూస్తుంటే గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు కనిపిస్తున్నాయి. నది ఒడ్డున హీరో హీరోయిన్ సైకిల్పై ప్రయాణం చేయడం చూస్తుంటే వింటేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనిపిస్తోంది. మార్కండేయ సంగీతమందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.(ఇదీ చదవండి: 12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్) -
'లవ్ మాక్టైల్ 2' సినిమా రివ్యూ
2022లో కన్నడలో రిలీజై హిట్ కొట్టిన సినిమా 'లవ్ మాక్టైల్ 2'. హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా చేశాడు డార్లింగ్ కృష్ణ. అతడి భార్య మిలాన్ నాగరాజ్ హీరోయిన్. తాజాగా దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?'లవ్ మాక్టైల్'కి సినిమాకు ఇది సీక్వెల్. ఆది (డార్లింగ్ కృష్ణ) భార్య నిధి (మిలినా నాగరాజ్) చనిపోతుంది. ఎప్పుడూ తన భార్య ఆలోచనలతోనే ఉండే ఆది.. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం అరకు వెళ్తాడు. ఆ ప్రయాణంలో తన భార్య తనతోనే ఉందని ఊహించుకుంటూ ఉంటాడు. తనను ఇష్టపడే అమ్మాయిలు తన వెంట పడుతున్న వారిని పట్టించుకోడు. కానీ తన భార్య.. తనని ఊహించుకుంటున్న హీరోకి పెళ్లి చేయాలని చూస్తుంది. చివరికి హీరో ఇంకో పెళ్లి చేసుకున్నాడా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)ఎవరెలా చేశారంటే?'లవ్ మాక్టైల్' సినిమాతో హిట్ కొట్టిన డార్లింగ్ కృష్ణ తనే నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు. నిధి క్యారెక్టర్లో మిలాన నాగరాజ్ నటన చాలా బాగుంది. రచల్ డేవిడ్, నకుల అభయాన్కర్, అమృత అయ్యంగర్, సుస్మిత గౌడ, అభిలాష్ ఎవరి పాత్రకి వాళ్లు న్యాయం చేశారు. నకుల్ నకుల అభయాన్కర్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ పాటలు సినిమాకి హైలైట్. శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. మంచి కథ నేర్చుకుని దర్శకత్వ విలువలతో డార్లింగ్ కృష్ణ ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ ని తీసుకుని వచ్చారు.డార్లింగ్ కృష్ణ తీసుకున్న స్టోరీతో పాటు అతడి యాక్టింగ్ బాగుంది. మిలాన నాగరాజ్, అభిలాష్, రచల్ డేవిడ్ పాత్రలు కూడా స్టోరీకి తగ్గట్లు బాగున్నాయి. సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ సినిమాకి కీలకంగా నిలిచింది. అయితే ఫస్టాప్లో కొన్ని సాగదీతగా అనిపించిన సీన్స్, అలానే కొన్ని కామెడీ సీన్స్ మైనస్గా నిలిచాయి.(ఇదీ చదవండి: ‘హరోం హర’ మూవీ రివ్యూ) -
కాలేజీ ప్రేమకథతో 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'.. రిలీజ్ డేట్ ఫిక్స్
యువతని టార్గెట్ చేసి తెలుగు దర్శకులు ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా కాలేజీ బ్యాక్డ్రాప్ స్టోరీలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కథతో తీసిన సినిమా 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెరకెక్కించారు. తాజాగా దీని రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమాలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీని ఈనెల 21న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్లో ఆ హీరోయిన్ మకాం) -
'యావరేజ్ స్టూడెంట్ నాని' మోషన్ పోస్టర్ రిలీజ్
దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారి సక్సెస్ అందుకొంటున్నారు. 'మెరిసే మెరిసే' మూవీతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మెప్పించాడు. ఇప్పుడు ఇతడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. 'యావరేజ్ స్టూడెంట్ నాని' అనే చిత్రంతో హీరో, దర్శకుడు, నిర్మాతగా పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)యూత్ఫుల్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదివరకే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. శక్తి శ్రీ గోపాలన్ పాడిన పాట బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తుంటే, హీరోహీరోయిన్ల జోడి ఎంతో చూడముచ్చటగా అనిపించింది. ఈ సినిమాలో సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్లు హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతమందించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ కష్టాలతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' ట్రైలర్) View this post on Instagram A post shared by Sri Neelakanta Mahadeva Entertainments LLP (@snmmovies) -
హార్ట్ టచింగ్ సబ్జెక్ట్తో 'నాన్నంటే' సినిమా
మనసుని తాకే ఎమోషనల్ కంటెంట్తో తీసిన సినిమా 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించగా.. అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. వైఎస్కె, నిహరిక చౌదరి, వరేణ్య ఆగ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఫిలించాంబర్లో ప్రీమియర్ షో వేశారు. పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ నాన్న అంటే ఎంతో ఎమోషన్ ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారని అన్నారు. ఈ సినిమాలోని సందేశం యువతకి కనెక్ట్ అవుతుందని అన్నారు. (ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా బూతులు!)నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ.. 'నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలి. అతి త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని అన్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి) -
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు' అన్నారు పెద్దలు. 'ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి' అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి శరవేగంగా తాజాగా 'లగ్గం' టాకీ పార్ట్ పూర్తయింది.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు సంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను తీసినట్లు తెలుస్తోంది. చరణ్ అర్జున్ సంగీతమందించారు. 'బేబి' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ గురించి చెబుతారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ 'నింద' పోస్టర్
ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో స్టార్స్ ఉన్నారా లేదా అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. మంచి కథ ఉంటే చాలు థియేటర్, ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్ సినిమా తీశాడు. యదార్థ సంఘటనల ఆధారంగా 'నింద' చిత్రం రాబోతుంది. రాజేష్ జగన్నాథం దర్శక-నిర్మాతగా వ్యవహరించారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో రాబోతోన్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఊరి వాతావరణం, చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి, కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఈ సినిమాని ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు చూపించారు. వారంతా సినిమాను మెచ్చుకున్నారట. మంచి కాన్సెప్ట్తో చిత్రాన్ని తీశారని దర్శక నిర్మాతలని ప్రశంసించారట. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!) -
'సీతాకళ్యాణ వైభోగమే' టీజర్ రిలీజ్ చేసిన తెలంగాణ మంత్రి
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'సీతాకళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా.. రాచాల యుగంధర్ నిర్మించారు. ఏప్రిల్ 26న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అలా చిత్ర టీజర్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. (ఇదీ చదవండి: మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!) 'టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి' అని కోరుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించగా.. సహజమైన లొకేషన్లలో, ఎంతో సహజంగా సినిమాని తీసినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలు జోడించి తీసిన ఈ మూవీ కుటుంబ సమేతంగా చూసేలా ఉంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) -
హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్
చాలా ఏళ్ల నుంచి చాలా సినిమాల్లో పలు పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజా రవీంద్ర. ఇప్పుడు ఇతడు ప్రధాన పాత్రలో ఓ మూవీ చేశాడు. అదే 'సారంగదరియా'. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే నెలలో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?) టీజర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో శ్రీవిష్ణు.. మూవీ యూనిట్కి విషెస్ చెప్పారు. ఓ మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి.. తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!) -
'లక్ష్మీ కటాక్షం' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
ఇప్పటి వరుకు తెలుగులో చాలా తక్కువ సెటైరికల్ కాన్సెప్ట్ మూవీస్ వచ్చాయి. అందులోను పొలిటికల్ సెటైరికల్ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి 'లక్ష్మీ కటాక్షం' అనే చిత్రం నుంచి డైలాగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ డైలాగ్ పోస్టర్ లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు అనేలా చూపించారు. (ఇదీ చదవండి: 'రేసుగుర్రం' విలన్ సీక్రెట్ ఫ్యామిలీ.. ఎన్నికల టైంలో ఇరికించేశారు!) మహతి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ 'లక్ష్మీకటాక్షం' సినిమాకు సూర్య దర్శకుడు. శ్రీనివాసులరెడ్డి నిర్మించగా, అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించగా.. వినయ్, అరుణ్, దీప్తి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే సరదాగా ఉండే టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్రబృందం వెల్లడించింది. (ఇదీ చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి) -
సినిమాలో విలన్గా టీమిండియా స్టార్ క్రికెటర్.. టీజర్ రిలీజ్
టీమిండియా తరఫున పలు మ్యాచులాడి, ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్.. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసిన శ్రీశాంత్.. 'యమధీర' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మార్చి 23న తెలుగులో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర టీజర్ని తాజాగా రిలీజ్ చేశారు. చిత్ర విశేషాలని పంచుకున్నారు. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా?) కన్నడ హీరో కోమల్ కుమార్, భారత క్రికెటర్ శ్రీశాంత్ ప్రతినాయక పాత్రలో నటించిన సినిమా 'యమధీర'. వేదాల శ్రీనివాస్ నిర్మించారు. నాగబాబు, అలీ, సత్య ప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ని నటుడు-నిర్మాత అశోక్ కుమార్ లాంచ్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్గా మైదానంలో చూపే దూకుడుని ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉందన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
అవార్డ్ విన్నర్స్ పనిచేసిన చిన్న సినిమా రిలీజ్కి రెడీ
వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్స్పై వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఒక పథకం ప్రకారం'. సాయిరామ్ శంకర్, అషిమా నర్వాల్, శృతి సోదీలు హీరోహీరోయిన్లుగా నటించారు. పలు జాతీయ అంతర్జాతీయ అందుకున్న దర్శకుడు వినోద్ విజయ్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి) ఈ సందర్భంగా దర్శక నిర్మాత వినోద్ విజయన్ మాట్లాడుతూ.. 'ఈ థ్రిల్లర్ సినిమాలో సాయిరామ్ శంకర్ పవర్ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. అలానే ఈ సినిమా కోసం నాతో కలిసి ఏకంగా ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్ పనిచేశారు' అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మలయాళ మూవీస్.. వీటిలో అంతలా ఏముంది?) -
ఇకపై ఆ పని చేయను.. పక్కన బెట్టేస్తున్నా: హీరో ఆకాశ్
'ఆనందం' లాంటి సినిమాతో తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్.. ఆ తర్వాత కాలంలో సరైన మూవీస్ చేయకపోవడంతో అలా అలా టాలీవుడ్కి దూరమైపోయాడు. గత ఏడెనిమిదేళ్ల నుంచి తమిళంలో మాత్రమే చిత్రాలు చేస్తున్నాడు. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ పనిచేస్తున్నాడు. (ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎన్నికల్లో పోటీ?) అయితే చిన్న చిత్రాలకు థియేటర్ల దొరక్కపోవడంతో తనే సొంతంగా 'ఏ క్యూబ్ మూవీస్' అనే యాప్ లాంచ్ చేశాడు. తన సినిమాలతో పాటు పలు చిన్న చిత్రాల్ని ఇందులో రిలీజ్ చేస్తున్నాడు. జై ఆకాశ్.. గతేడాది 'జై విజయం' చిత్రంలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ఓటీటీలోనూ ఇది సక్సెస్ అయిన సందర్భంగా.. చిత్ర విజయోత్సవాన్ని స్థానిక వడపళనిలోని ఘనంగా నిర్వహించారు. తాను నటించిన 'అమైచర్ రిటర్న్', 'మామరం' వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయని జై ఆకాశ్ చెప్పాడు. ప్రస్తుతం హీరోగా నటించడానికి నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నటుడు జై ఆకాష్ క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
'రాధా మాధవం' సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
గ్రామీణ ప్రేమ కథతో తీసిన సినిమా 'రాధా మాధవం'. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలని అందించారు. (ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎంపీగా పోటీ?) 'రాధా మాధవం' పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా గత కొన్నిరోజుల క్రితం రిలీజ్ కాగా.. మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా సెన్సార్ పూర్తి కాగా.. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రమని ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే మార్చి 1న సినిమా థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తెలివిగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'దేవర') -
'డర్టీ ఫెలో' మూవీలోని పాట రిలీజ్ చేసిన 'బేబి' డైరెక్టర్
శ్రీమతి గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'డర్టీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించారు. జియస్ బాబు నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని మూవీ రిలీజ్కు రెడీ అయింది. (ఇదీ చదవండి: ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్) తాజాగా ఈ సినిమాలోని 'సందేవేళ' అంటూ సాగే పాటని 'బేబి' దర్శకుడు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. 'నా మిత్రుడు శాంతి చంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలోని సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు. త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని హీరో శాంతి చంద్ర చెప్పాడు. (ఇదీ చదవండి: నా మాజీ భార్య వేధిస్తుంది.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటుడు) -
92 ఏళ్ల తొలి తెలుగు టాకీ సినిమా.. బడ్జెట్ ఎంతో తెలుసా?
ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి సరిగ్గా 92 ఏళ్లు పూర్తయ్యాయి. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంతో 1931 అక్టోబర్ 31న తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ వచ్చింది. ఆ పైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఫిబ్రవరి 6న మొదటి పూర్తి తెలుగు టాకీ ఆవిర్భావ సంబురాలు జరుపుకుంటారు. గతంలో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్ జర్నలిస్టు డా.రెంటాల జయదేవ ఎన్నో యేళ్లు ఊరూరా తిరిగి, ఎంతో పరిశోధించి, సాక్ష్యాలు సేకరించి, ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో సెన్సారై, ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలై నట్లు ఆధారాలతో నిరూపించారు. ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు రిలీజై విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్ 2న మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలెస్’లో విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి. సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్లి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశారు. తొలి తమిళ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ఎం రెడ్డి కూడా తెలుగు వారే కావడం విశేషం. ఆ రోజుల్లో ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు.. దాదాపు 20 వేల రూపాయలు. ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి తొలి తెలుగు తెర ‘కథానాయిక’ గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర నిర్మాణానికి ప్రధాన కారకులు పూర్ణా మంగరాజు. ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్వాలిటీ పిక్చర్స్’ వ్యవస్థాపకుడు. ఈ చిత్ర గీత రచయిత ‘చందాల కేశవదాసు’. ఆ విధంగా తొలి పూర్తి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్ ప్రింట్ ఇప్పుడు లభ్యం కావడం లేదు. నిజానికి, టాకీలు రావడానికి చాలాకాలం ముందే మూకీల కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు వంటివారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కు కొని, అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే తన కుమారుడు ప్రకాశ్ని విదేశాలకు పంపి ప్రత్యేక సాంకేతిక శిక్షణనిప్పించి, సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య. ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమాలను సినిమా పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్ లాంటి సంస్థలు, పాలకులు నిర్వహించాలి. తెలుగు సినిమా ఆవిర్భావ రోజును ఒక ఉత్సవంగా నిర్వహించి... భావి తరాలకు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాత చిత్రాలు అన్నీ సేకరించి ఒక సినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇటువంటిది దేశంలో మహారాష్ట్రలోని పుణేలో మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తున్న వైజాగ్ ఫిలిం సొసైటీ ‘తెలుగు టాకీ సినిమా ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 6 నుండి 8 వరకు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా ఉచిత ఫిల్మ్ వర్క్షాప్ నిర్వహిస్తోంది. -
దిల్ రాజు చేతుల మీదుగా 'షరతులు వర్తిసాయి' టీజర్ రిలీజ్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు టీజర్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) 'బలగం' కంటే ఎక్కువగా తెలంగాణ నేటివ్తో సినిమా తీశారు. ఇదో మంచి మూవీ అవుతుందని ఆశిస్తున్నా. చిత్రబృందానికి అందరికీ ఆల్ ది బెస్ట్ అని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఒక సున్నితమైన కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చుతూ అందరికీ నచ్చేలా సినిమా తీశారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత కుమారస్వామి మరిన్ని మంచి మూవీస్ చేస్తాడు. త్వరలోనే 'షరతులు వర్తిస్తాయి' థియేటర్లలోకి వస్తుంది. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నానని హీరో చైతన్య రావు చెప్పారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్ఫ్రెండ్ సమాధానమిదే) -
తెలంగాణ పల్లె గొంతులో డిఫరెంట్ పెళ్లి పాట.. మీరు విన్నారా?
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన సినిమా 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి(అక్షర) దర్శకుడు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్, డాక్టర్ కృష్ణకాంత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే 'పన్నెండు గుంజల పందిర్ల కిందా' అని సాగే పెళ్లి పాటని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. తెలంగాణ పల్లెగొంతుతో ఉన్న ఈ సాంగ్, డిఫరెంట్గా ఉంటూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్) -
'బేబి' నిర్మాత నుంచి మరో సినిమా.. ఈసారీ అలాంటి ప్రేమకథే
రీసెంట్ టైంలో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ అంటే చాలామంది చెప్పే పేరు 'బేబి'. ప్రస్తుతం చాలామందికి తెలిసిన కథనే సినిమాగా తీస్తే బ్లాక్బస్టర్ హిట్ అయింది. నిర్మాతకు మూడు నాలుగు రెట్ల లాభాలు తీసుకొచ్చిందని టాక్. ఇప్పుడు ఆ నిర్మాత నుంచి మరో క్రేజీ లవ్ స్టోరీ మూవీ రాబోతుంది. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?) అయితే ఇది తెలుగు స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ ప్రేమకథ సినిమా. 'గుడ్ నైట్' చిత్రంతో గతేడాది హిట్ కొట్టిన మణికందన్.. ఇప్పుడు' ట్రూ లవర్'గా రాబోతున్నాడు. ఇందులో తెలుగమ్మాయి గౌరిప్రియ హీరోయిన్. తమిళంలో లవర్ పేరుతో తీసిన ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తెలుగులో ఫిబ్రవరి 9న రిలీజ్ కావొచ్చని అంటున్నారు. టీజర్ బట్టి చూస్తుంటే.. ఇంజినీరింగ్ చదివేటప్పుడు అమ్మాయి-అబ్బాయి ప్రేమలో పడతారు. కాకపోతే ఈ అబ్బాయి మరీ ఎక్కువగా ప్రేమించేయడంతో అసలు సమస్యలు మొదలవుతాయి. అమ్మాయి వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా సరే ఇతడు చిరాకుపడిపోతుంటాడు. కాస్త 'బేబి' పోలికలు కనిపిస్తున్న ఈ చిత్రాన్ని 'బేబి' ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు మారుతి కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇది మరో 'బేబి' అవుతుందా అనేది చూడాలి? (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) -
9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మరో డిఫరెంట్ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కేవలం ఒకే ఒక పాత్రతో తీసిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇన్నాళ్లకు డిజిటల్గా అందుబాటులోకి వచ్చేసింది. అయితే సమ్థింగ్ స్పెషల్ ఉండే మూవీస్ చూద్దామనుకునేవాళ్లు ఇది ట్రై చేయొచ్చు.ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్) హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నందిత శ్వేతా.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి తీసిన విభిన్న సినిమా 'రా రా పెనిమిటి'. సత్య వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.. మ్యూజిక్ అందించారు. గతేడాది ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత 'హంగామా ప్లే', 'గ్యాలక్సీ ఓటీటీ' అనే రెండు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లోకి ఈ సినిమా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లోనూ ఉన్నప్పటికీ.. మనం దేశంలో మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. కథ విషయానికొస్తే టైటిల్కి తగ్గట్లు.. ఓ భార్య తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరి చివరకు ఏమైంది? భర్త వచ్చాడా లేదా అనేది స్టోరీ. పలువురు ఆర్టిస్టుల వాయిస్ వినిపిస్తుంది. కానీ మూవీ మొత్తం నందితా శ్వేతా మాత్రమే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
Premalo Movie Review: 'ప్రేమలో' సినిమా రివ్యూ
చిత్రం: ప్రేమలో నిర్మాణ సంస్థ: డ్రీమ్ జోన్ పిక్చర్స్ నటీనటులు: చందు కోడూరి, చరిష్మా శ్రీకర్, శివాజీ రాజా తదితరులు దర్శకుడు: చందు కోడూరి నిర్మాత: రాజేష్ కోడూరి సంగీతం: సందీప్ కనుగుల ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్ చందు కోడూరి హీరోగా నటించి స్వీయదర్శకత్వంలో తీసిన సినిమా 'ప్రేమలో'. చరిష్మా శ్రీకర్ హీరోయిన్. ట్రైలర్తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో ఇప్పుడు చూద్దాం. 'ప్రేమలో' కథేంటి? రాజమండ్రిలో పుట్టి పెరిగిన రవి (చందూ కోడూరి) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. తండ్రి(శివాజీ రాజా) ఉన్నాసరే రవిని పట్టించుకోకుండా తాగుడికి బానిస అయిపోయింటాడు. మెడికల్ షాప్లో పనిచేసే రవి.. ఎప్పటికైనా ఓ మెడికల్ షాప్ పెట్టుకోవాలనేది మనోడి డ్రీమ్. అనుకోకుండా ప్రశాంతి(చరిష్మా)ని చూసి తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. మూగదైన ప్రశాంతి.. ఇష్టపడుతున్నానని రవి చెప్పేసరికి ఇతడిని ప్రేమిస్తుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ప్రశాంతి.. ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. రవి తనని రేప్ చేస్తున్న వీడియోనే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే ప్రాణంగా ప్రేమించిన రవి.. ఎందుకు ఆమెపై బలత్కారం చేశాడు? అసలేం జరిగింది? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?) ఎలా ఉందంటే? తెలుగులో లవ్ స్టోరీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. 'ప్రేమలో' సినిమా కూడా పేరుకు తగ్గట్లే మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. మొదలుపెట్టడమే ఓ వ్యక్తి మీద ఎటాక్ చేయడం చూపించి సినిమాని ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. అసలు ఏమైంది? ఎందుకు ఒక్కొక్కరిని హీరో ఎందుకు ఛేజ్ చేస్తున్నాడనే విషయం నెమ్మదిగా రివీల్ చేస్తూ కథలోకి తీసుకువెళ్లారు. ఫస్టాప్లో హీరో క్యారెక్టర్, స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.సెకండాఫ్లో అసలు కథేంటనేది రివీల్ చేశారు. నిజానికి ఇది కొత్త కథేం కాదు. రాజమండ్రి బ్యాక్ డ్రాప్లో పూర్తిస్థాయి గోదావరి యాసలో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళతాం అని డైలాగులు చెప్పే ప్రేమికులే ఉన్న ఈ రోజుల్లో.. ప్రేమించిన అమ్మాయి కోసం చావుకు కూడా వెనకాడకుండా ముందుకు వెళ్లేవారు ఉన్నారని ఒక సినిమాటిక్ టచ్ ఇచ్చి మరీ చెప్పారు. రొటీన్ కథ, ఊహకు అందేలా ఉన్న సీన్లు కొంత నిరాశ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరింత వర్కౌట్ చేస్తే బాగుండేది. క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) ఎవరెలా చేశారు? హీరో కమ్ డైరెక్టర్ చందు కోడూరి.. అయితే ఈయనలోని దర్శకుడిని నటుడు కొంత డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేక జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లే యువకుడి పాత్రలో చందు సరిగ్గా సరిపోయాడు. నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రశాంతి.. డైలాగ్స్ లేని పాత్రలో కళ్ళతోనే భావాలు పలికించి ఆకట్టుకుంది. శివాజీ రాజా చేసింది అతిథి పాత్ర లాంటిదే. కానీ ఉన్నంతవరకు ఎమోషన్స్ పండించాడు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ సరిగా సరిపోయింది. నిర్మాణ విలువలు స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ) -
హీరోగా తెలుగు కమెడియన్.. టైటిల్గా ఫేమస్ డైలాగ్
'ఈ నగరానికి ఏమైంది', 'మీకు మాత్రమే చెబుతా', 'సేవ్ టైగర్' సినిమాలతో కమెడియన్గా పాపులారిటీ సంపాందించిన అభినవ్ గోమటం.. ఇప్పుడు హీరో అయిపోయాడు. 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో అతడు చెప్పిన పాపులర్ డైలాగ్ పేరునే ఇప్పుడు టైటిల్ చేసేశారు. ఈ చిత్రంలో అభినవ్ కథానాయకుడు. 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే టైటిల్ నిర్ణయించడంతో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వైశాలి రాజ్ హీరోయిన్. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) తిరుపతి రావు ఇండ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. హాస్యనటుడు, సహాయ నటుడిగా ప్రశంసలు అందుకున్న అభినవ్లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారని చెప్పాడు. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తీస్తున్నట్లు పేర్కొన్నాడు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు. ఫిబ్రవరి చివర్లో సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) -
సమాజానికి స్ఫూర్తినిచ్చే 'కంచర్ల'.. త్వరలో రిలీజ్
సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్తో తీసిన చిత్రం 'కంచర్ల'. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుత రావు నిర్మించారు. తాజాగా టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. త్వరలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్లోనే) యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమర్షియల్ అంశాలను మేళవించి, ప్రేక్షకులను అలరింపజేసేలా చిత్రాన్ని మలచామని నిర్మాత అచ్యుత రావు చెప్పారు. రఘు కుంచె సంగీతమందించిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి గట్టిగా కనిపిస్తోంది. అందరూ పండగ హడావుడిలో బిజీగా ఉన్నారు. కొందరు మాత్రం ఏం చేయాలో తెలీక కొత్తగా తెలుగు సినిమాలు ఓటీటీల్లో ఏం రిలీజ్ అయ్యాయా అని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? సంక్రాంతి కానుకగా థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 'హను-మాన్' మూవీ విజేతగా నిలిచింది. మిగతా మూడు చిత్రాలతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితేనేం ఎవరికి ఏ చిత్రం అందుబాటులో దాన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్కి వెళ్లే ఓపిక లేని వాళ్లు మాత్రం ఓటీటీల వైపు చూస్తున్నారు. రీసెంట్గా 'డెవిల్' మూవీ ఓటీటీలోకి వచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) తాజాగా '#మాయలో' అనే తెలుగు మూవీ.. అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. డిసెంబరు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలియదు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాలో పెద్దగా పేరున్న యాక్టర్స్ ఎవరూ లేరు. అయితేనేం ఈ పండక్కి టైంపాస్ కావాలంటే కొత్తగా వచ్చిన ఈ సినిమాని వీలైతే చూసేయండి. ఇక '#మాయలో' కథ విషయానికొస్తే.. మాయ(జ్ఞానేశ్వరి)కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. దీంతో తన చిన్నప్పటి ఫ్రెండ్స్ క్రిష్(నరేశ్ అగస్త్య), సింధు (భావన)ని తన వివాహానికి పిలుస్తుంది. దీంతో వీళ్లిద్దరూ ఓ కారు అద్దెకు తీసుకుని రోడ్డు మార్గంలో వస్తుంటారు. మరి ఈ జర్నీలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ. (ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?) -
సూపర్స్టార్ కృష్ణ నటించిన చివరి మూవీ రిలీజ్కి రెడీ
సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' సినిమాతో మహేశ్ థియేటర్లలోకి వచ్చాడు. అయితే టాక్ విషయంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా కృష్ణ-మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ, ధనలక్ష్మి.. ఓ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. మహేశ్ సినిమాపై వస్తున్న మిక్స్డ్ టాక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్) "గుంటూరు కారం" సాధిస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ చూసి ఓర్వలేక.. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి అన్నారు. సినిమా బాగా లేకపోతే ఆ విషయాన్ని తమ హీరో కృష్ణ ముందుగా చెప్పేసేవారని, ఆ లక్షణం మహేష్లోనూ ఉందని చెప్పారు. కానీ ఫ్యాన్స్తోపాటు అందరూ ఆస్వాదిస్తున్న 'గుంటూరు కారం' గురించి ఘోరంగా మాట్లాడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్స్టార్ కృష్ణ గతేడాది మరణించారు. కాకపోతే ఆయన నటించిన చివరి చిత్రం "కృష్ణ విజయం" ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఇందులోనే 'గుంటూరు కారం' ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు చేశారు. మధుసూదన్ హవల్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ జరుగుతోంది. ఈ మూవీలో నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ సినిమా చైల్డ్ ఆర్టిస్.. ఎవరో కనిపెట్టారా?) -
సంక్రాంతి విన్నర్ ఎవరు...?
-
10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా
ఓటీటీలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు అటు థియేటర్లు, ఇటు టీవీల్లో మంచి రెస్పాన్స్ వచ్చేది. చిన్న చిత్రాలు ఆడితే థియేటర్లలో ఆడేవి. ఆ తర్వాత దాదాపు అందరూ వాటిని మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని వాటిని చూసేవాళ్లు కొందరు ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'సాచి' అనే సినిమా.. 2023 మార్చి 3న థియేటర్లలో రిలీజైంది. అయితే చిన్న సినిమా కావడంతో పాటు పెద్దగా పేరున్న నటులు లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. మహిళ సాధికారత అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) బార్బర్ షాప్ నడిపే తండ్రి.. అంతంత మాత్రంగా ఉండే సంపాదన.. ఇతడికి ముగ్గురు కూతుళ్లు. అంతా బాగానే ఉందనుకునే టైంలో బ్రెయిన్ ట్యూమర్ జబ్బు వస్తుంది. దీంతో ఇల్లు గడవడం కష్టమైపోతుంది. ఇలాంటి టైంలో కూతురే తండ్రి బాధ్యతలు అందుకుంటుంది. కటింగ్ షాప్ రన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. అయితే ఈ క్రమంలో అమ్మాయి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది అనే స్టోరీతో ఈ సినిమా తీశారు. స్టోరీ పరంగా మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ మరీ సాగదీసినట్లు ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్లా అనిపించింది. ఇందులో పెద్దగా పేరున్న నటులు కూడా ఎవరూ లేరు. ప్రస్తుతానికి భారత్లో తప్పితే మిగతా దేశాల్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రావొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్
సంక్రాంతికి దాదాపు నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏ సినిమాకు ఎప్పుడు వెళ్లాలా అని అందరూ ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరోవైపు పండగ సీజన్ని క్యాష్ పలు చిన్న సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. కాకపోతే థియేటర్లు దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఓటీటీల వైపు చూస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ తెలుగు సినిమా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్కి రెడీ అయిపోయింది. ఇంతకీ ఏంటా మూవీ? (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన అజయ్ కతుర్వర్.. బిగ్బాస్ ఓటీటీ షోతో కాస్తోకూస్తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ షోలో పాల్గొన్న తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. అలా చేసిన సినిమానే 'అజయ్ గాడు'. దాదాపు ఏడాదిన్నర క్రితమే అంతా రెడీ అయినప్పటికీ.. కారణం ఏంటో తెలీదు గానీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు ఈ సినిమాకు మోక్షం కలిగింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అజయ్, భానుశ్రీ, శ్వేత మెహతా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు టీమ్ ఏ దర్శకత్వం వహించాడు. చందన కొప్పిశెట్టితో కలిసి హీరో అజయ్ కతుర్వార్ స్వయంగా ఈ సినిమాని నిర్మించాడు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పండగపూట థియేటర్లకు వెళ్లే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చుని ఈ సినిమా ఫ్రీగా చూడొచ్చు. (ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఎలాండి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ.. అప్పుడు ప్రేక్షకులకు అనుకున్నంతగా రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఫ్రీగా టైమ్ ఉన్నప్పుడు చూసేయొచ్చు. ఇంతకీ ఏంటా సినిమా? అసలు కథేంటి? (ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!) సినిమా డీటైల్స్ అవే చిన్న సినిమాలు అయినా సరే కాన్సెప్ట్ పరంగా ప్రయోగాలు చేస్తుంటారు. అలా మహాభారతం నుంచి స్ఫూర్తిగా తీసిన తెలుగు సినిమా 'కృష్ణఘట్టం'. చైతన్యకృష్ణ, వెంకటకృష్ణ గోవడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. నవంబరు 3న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే కంటెంట్ సరిగా తీయకపోవడం వల్ల జనాలకు పెద్దగా ఎక్కలేదు. కథ ఎంపిక బాగున్నప్పటికీ.. దాన్ని డీల్ చేయడంలో దర్శక నిర్మాత సురేశ్ పల్ల తడబడ్డారు. స్టేజీ నాటకాలు వేసే ఓ బ్యాంక్ ఉద్యోగి, అల్లరిచిల్లరగా తిరిగే కుర్రాడు జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయనేదే ీ సినిమా కథ. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్ ఇక యాక్టింగ్ పరంగా నటీనటులు అందరూ బాగానే చేసిన 'కృష్ణఘట్టం' సినిమాలో నాటకాలు, దానికి సంబంధించిన స్టోరీ, సన్నివేశాల్ని చెప్పారు. అందువల్ల ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఇకపోతే నవంబరులో థియేటర్లలో రిలీజైన ఈచిత్రం.. దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. కొత్త సినిమా ఏమైనా చూడాలనిపిస్తే.. దీన్ని చూస్తూ వీకెండ్ని టైమ్పాస్ చేసేయండి. (ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?) -
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్బస్టర్గా నిలిచింది. అలాగే శౌర్యువ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్తో జోష్గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్లో కొత్త చాప్టర్ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
హీరోయిన్గా షారుక్ లేడీ ఫ్యాన్.. ఏకంగా ఆ తెలుగు సినిమాతో
ఆమె బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు వీరాభిమాని. తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అలా తమ అభిమానంతో 'జవాన్'తో చాలా చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ హీరోయిన్గా ఓ సినిమా చేసింది. ఇప్పుడది రిలీజ్ కానున్న నేపథ్యంలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) తమిళంలో సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న లీషా ఎక్లైర్స్.. తాజాగా తెలుగులో 'రైట్' అనే మూవీలో హీరోయిన్గా చేసింది. బిగ్బాస్ 2 ఫేమ్ కౌశల్ ఇందులో హీరోగా చేశాడు. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్పై ఉన్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది ఈ సందర్భంగా బ్యూటీ లీషా ఎక్లైర్స్ తన ఆనందాన్ని పంచుకుంది. షారుక్ అభిమాని అయిన తాను.. ఇప్పుడు హీరోయిన్గా సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) -
డిఫరెంట్ ప్రేమకథతో 'అగ్లీ స్టోరీ'.. గ్లింప్స్ రిలీజ్
లక్కీ మీడియా, రియా జియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'అగ్లీ స్టోరీ'. నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లు నటించారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. గ్లింప్స్ చివరలో హీరో నందు చెప్పిన.. ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ.. రియల్ లైఫ్లో ఉండదు అనే డైలాగ్ ఆసక్తి రేపుతోంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) అయితే ఈ గ్లింప్స్ మంచి స్పందన వస్తుండటంతో.. ముందు ముందు టీజర్, ట్రైలర్ మరియు సినిమాని మరింత కొత్తగా, ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నామని చెప్పారు. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
ఈ వారం థియేటర్లలోకి వచ్చేస్తున్న లవ్స్టోరీ 'సఖి'
వన్ మీడియా ఈటీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై నిర్మించిన సినిమా 'సఖి'. లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల, సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి , జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాతో జానీ బాషా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పార్థు రెడ్డి నిర్మించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'సఖి' సినిమా డిసెంబర్ 15న అంటే ఈ శుక్రవారం థియేటర్స్లోకి రానుంది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో ఈ చిత్రాన్ని తీశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమాగా ఉన్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
తొలి సినిమా సక్సెస్.. ప్రేక్షకులతో కేక్ కట్ చేసిన హీరో
శంకరాభరణం రాజ్యలక్ష్మి గారి అబ్బాయి రోహిత్ కృష్ణ హీరోగా నటించిన చిత్రం పల్లె గూటికి పండుగ వచ్చింది. కంచరాన తిరుమలరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా హీరో రోహిత్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి కేక్ కట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా మా అమ్మకు ధన్యవాదాలు.. ఈ కథ విన్నప్పుడు ఆ క్యారెక్టర్కు నేను సెట్ అవుతానని వర్కవుట్స్ చేశాను. స్పెషల్గా శ్రీకాకుళం భాష నేర్చుకున్నాను. టీం అందరం బాగా కష్టపడ్డాం, ఇష్టపడి వర్క్ చేయడం వల్ల ఈ రోజు ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తున్నారు. సుమన్, షియాజీ షిండే, సాయి కుమార్, రఘు బాబు, అన్నపూర్ణమ్మ.. ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్తో కలిసి స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్1 న విడుదలైన మా సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నాను. త్వరలో డైరెక్షన్ కూడా చేయబోతున్నాను. సింగపూర్లో సినిమాటోగ్రఫీ కోచింగ్, డైరెక్షన్ కోచింగ్ చేస్తున్నాను.ప్రేక్షకులు మా అమ్మను ఎలా ఆదరించారో, నన్ను కూడా అలానే ఆదరిస్తారని భావిస్తున్నాను' అన్నాడు. చదవండి: ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్స్లో.. వీళ్ల గొడవ మళ్లీ మొదలైంది! -
టాలీవుడ్లోకి మరో నిర్మాణ సంస్థ.. ఒకేసారి మూడు సినిమాలు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మరో కొత్త నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇస్తోంది. మూడు సినిమాలని ఒకేసారి తీస్తున్న ఈ సంస్థ.. మొదటిగా ఓ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయిపోయింది. ఆ సంస్థ పేరు బి.ఎమ్.క్రియేషన్స్. ఈ సంస్థ నుంచి వస్తున్న తొలి మూవీ పేరు 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'. రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా దీన్ని తీస్తున్నారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) -
ఈమె తెలుగు హీరోయిన్, ఆ విలన్తో ప్రేమ-త్వరలో పెళ్లి.. గుర్తుపట్టారా?
టాలీవుడ్లోకి ప్రతి ఏడాది వందలాది మంది హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. క్లిక్ అయితే స్టార్స్ అవుతారు. లేదంటే కొన్నాళ్ల పాటు మూవీస్ చేసేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైపోతుంటారు. ఈ భామ కూడా అలానే. కాకపోతే కొన్నేళ్లుగా హీరోయిన్గా చేసింది. ఇప్పుడేమో ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఓ విలన్తో ప్రేమలో పడింది. ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ విమలా రామన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు గెస్ చేసింది నిజమే. 2009లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ప్రారంభంలో హీరోయిన్గా చేసింది. కానీ గ్లామర్ బాగుందని మెచ్చుకున్నారు. కానీ హిట్స్ పడకపోయేసరికి ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో సైడ్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టింది. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) ఈ ఏడాది రిలీజైన 'అశ్విన్స్', 'గాండీవధారి అర్జున' లాంటి మూవీస్ చేసింది. 'రుద్రంగి' అనే సినిమాలు మంచి రోల్ చేసింది. కానీ బ్యాడ్ లక్. ఇవేవి విమలా రామన్కి పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాం. ఈమెది మన దేశం కాదు. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. 2004లో 'మిస్ ఇండియా ఆస్ట్రేలియా' విన్నర్ అయిన తర్వాత సినిమా ఛాన్సులు వచ్చాయి. అలా ఇక్కడే ఉండిపోయింది. ఈమె వ్యక్తిగత విషయానికొస్తే.. ఈమెకి ఇప్పుడు 41 ఏళ్లు. గ్లామర్ ఫీల్డ్లో ఉండటం, ఛాన్సులొస్తుండటం వల్ల పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ నటుడు వినయ్ రాయ్తో గత కొన్నాళ్లు ముందు ప్రేమలో పడింది. ఆ విషయం నేరుగా చెప్పలేదు గానీ ఇన్ స్టాలో అతడితో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో విమలా-వినయ్ రిలేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈమె చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి బహుశా ఈ ఏడాదిలోనే విమలా రామన్ పెళ్లి చేసేసుకోవచ్చేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) -
షూటింగ్ అంతా అమెరికాలోనే.. తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్
నంద కిషోర్, డి.టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'మయూఖి'. దీని ట్రైలర్ని నవంబర్ 20న అమెరికాలో విడుదల చేశారు. స్టోరీ విషయానికొస్తే.. మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్గా సాగిపోయే ఈ మూవీ షూటింగ్ అంతా అమెరికాలోనే జరిగింది. అమెరికాలో స్థిరపడ్డ 100 మందికి పైగా భారతీయులు, అమెరికన్ల నుంచి ఎంపిక చేసిన కొత్త యాక్టర్స్కి స్వయంగా శిక్షణ ఇచ్చి నితిన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఈ యాక్షన్, అడ్వెంచర్ మూవీ అమెరికాలో నిర్మించినా తెలుగువారి అభిరుచికి అనుగుణంగా ఉంటుందని చెప్పిన దర్శకుడు నితిన్ కుమార్ చెప్పాడు. ఎంతో శ్రమపడి డల్లాస్ పరిసరాల్లోని అద్భుతమైన లొకేషన్స్లో 'మయూఖి' తీసినట్లు పేర్కొన్నాడు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చేశాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో సాగిపోయే ఈ చిత్రంలో రెన్ని, శిరీష, బేబీ మైత్రి, బేబి మయూఖి ప్రధాన పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) -
తెలుగులో చేగువేరా బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవితం ఆధారంగా తెలుగులో తీస్తున్న సినిమా 'చే'. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నేచర్ ఆర్ట్స్ బ్యానర్పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్లో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. 'చే' మూవీ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడాయన క్రేజీ న్యూస్ బయటపెట్టాడు. అలానే ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: పదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!) క్యూబా తరువాత భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ త్వరలో కానుంది. డిసెంబర్ తొలివారం ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు హీరో కమ్ డైరెక్టర్ సభావత్ నాయక్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు!) -
అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమా రివ్యూ
టైటిల్: అనుకున్నవన్నీ జరగవు కొన్ని నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక, పోసాని కృష్ణ మురళి, బబ్లు మాయ్య, కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ దర్శకత్వం: జి.సందీప్ నిర్మాత: జి.సందీప్ సంగీతం: గిడియన్ కట్ట ఎడిటర్: కేసీబీ హరి విడుదల తేది: 3 నవంబర్, 2023 కరోనా తర్వాత సినీ ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా ఓటీటీలలో అన్ని రకాల సినిమాలను చూసేస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే తప్ప థియేటర్స్కి రావడం లేదు. అందుకే నూతన దర్శకులు కొత్త కాన్సెప్ట్తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే అనుకున్నవన్నీ జరగవు కొన్ని. జి.సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.. కథేంటంటే.. కార్తీక్(శ్రీరామ్ నిమ్మల)కి రూ.30 లక్షలు అవసరం ఉంటుంది. మనీకోసం కాల్ బాయ్గా మారాతాడు. మరోవైపు మధు(కలపాల మౌనిక) కూడా ఓ కారణంగా కాల్ గర్ల్ అవతారమెత్తుతుంది. అయితే ఈ ఇద్దరు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో వారిద్దరికి ఎదురైన సమస్యలు ఏంటి? ఫ్లాట్లో హత్య చేయబడిందెవరు? ఎవరు చేశారు? ఈ కథలో పొసాని కృష్ణ మురళీ, బబ్లూల పాత్రేంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. హీరోహీరోయిన్లు ఇద్దర్ని డిఫరెంట్ పాత్రలో చూపిస్తూ..ఆసక్తికరంగా కథనాన్ని కొనసాగించాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగినా.. అపార్ట్మెంట్లో జరిగిన హత్య తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేశారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ.. మంచి ట్విస్టుల కథ ముందుకు సాగుతుంది. అయితే ఫస్టాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ నవ్వించకపోవడమే కాకుండా..కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో పోసాని, బబ్లూల కామెడీ అదిరిపోతుంది. అపార్ట్మెంట్లో జరిగిన రెండు హత్యలకు పొసాని, బబ్లూలతో సంబంధం ఉండడం.. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే.. క్రైమ్ కామెడీ చిత్రమైనా..ఒక్క ఫైటూ ఉండదు, పాట ఉండదు. కేవలం కామెడీ సీన్స్తో అలా సాగిపోతుంది. ఫస్టాఫ్పై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఆసక్తిరంగా కథను రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. క్రైమ్ కామెడీ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్, మధు పాత్రకు శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక న్యాయం చేశారు. వీరిద్దరి మధ్య ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మౌనికకు ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించింది. చాలా కాలం తర్వాత పోసాని కృష్ణమురళి మంచి పాత్ర లభించింది. కాంట్రాక్టు కిల్లర్గా ఆయన నటన నవ్వులు పూయిస్తుంది.బబ్లు పాత్ర సినిమాకు ప్లస్ అయింది. కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాకొస్తే.. గిడియన్ కట్ట అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ఎడిటర్ కె సి బి హరి పనితీరు పర్వాలేదు.ఫస్టాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చదవండి: ఓ పక్క ట్రోలింగ్.. మరోపక్క ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమా -
Drohi The Criminal: ద్రోహి సినిమా రివ్యూ
టైటిల్: ద్రోహి నటీనటులు: సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్, మజిలీ శివ, మహేష్ విట్ట, డెబ్బి. దర్శకుడు: విజయ్ దాస్ పెందుర్తి సంగీతం : అనంత నారాయణ ఏ. జి నిర్మాణం: ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా సంయుక్తంగా. నిర్మాతలు: రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి విడుదల తేదీ: 3 నవంబర్, 2023 కథేంటంటే.. హీరో సందీప్ (అజయ్) ఒక బిజినెస్మెన్. తన ఇద్దరి స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. కానీ తనకు వ్యాపారం అస్సలు కలిసి రాదు. చేసే ప్రతి బిజినెస్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. వ్యాపారంలో నష్టపోతున్నప్పటికీ తన భార్య హీరోయిన్ దీప్తి వర్మ (చంద్రిక) అతడికి సపోర్టుగా ఉంటుంది. రెండేళ్లుగా సక్సెస్ లేకపోవడం వల్ల అజయ్ ఫుల్ ప్రెషర్లో ఉంటాడు. అలా సాగిపోతున్న తన జీవితంలో అనుకోని సంఘటన జరిగి చంద్రిక చనిపోతుంది. దీప్తి హత్య కేసులో తనని సస్పెక్ట్ గా అరెస్టు చేస్తారు. ఆ కేసు నుంచి హీరో ఎలా బయట పడ్డాడు? అనేది ఈ సినిమా కథ. విశ్లేషణ దర్శకుడు కథను ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. షకలక శంకర్లో ఒక కొత్త నటుడిని చూపించారు. ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ చేసిన హీరోయిన్ డెబ్బి ఇంతకుముందు చేసిన పాత్రకు భిన్నంగా సాఫ్ట్ క్యారెక్టర్లో కనిపించారు. సంగీతం పర్వాలేదు. హీరో సందీప్ యాక్టింగ్ బాగుంది. హీరో ఫ్రెండ్స్గా మహేశ్ విట్టా, నీరోజ్ పుచ్చ పాత్రలు ఆకట్టుకున్నాయి. చిన్న సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా తీశారు. షకలక శంకర్ పాత్ర, నటన అద్భుతంగా ఉన్నాయి. హీరో సందీప్కు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ అనుభవం ఉన్నట్లుగా నటించాడు. మహేష్ విట్ట నటన చాలా బావుంది. చాందిని, మజిలీ శివ, దీప్తి వర్మ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో బోరింగ్గా అనిపిస్తుంది. చదవండి: తెలుగింటి కోడలు కాబోతున్న సీతారామం హీరోయిన్.. ఇదిగో క్లారిటీ! -
ఓ తండ్రి తీర్పు సినిమా ట్రైలర్ లాంచ్
-
'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!
ఆంధ్రప్రదేశ్లో ఇంకాస్త టైం ఉంది కానీ తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైపోయింది. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించేశారు. కొన్నిరోజుల్లో నామినేషన్స్, ఎన్నికలు, కౌంటింగ్ అని హడావుడి మాములుగా ఉండదు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ కమెడియన్ తన కొత్త మూవీ టైటిల్ ప్రకటించాడు. కాకపోతే దానికి 'కేసీఆర్' అని పేరు పెట్టడం ఆసక్తికరంగా మారిపోయింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) ఈ సినిమా సంగతేంటి? మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత కొన్నాళ్లకు 'జబర్దస్త్' కామెడీ షోలోకి వచ్చాడు. అలా కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత రాకింగ్ రాకేశ్ అయ్యాడు. మొన్నీ మధ్య హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ఆ చిత్రానికే 'కేసీఆర్' అనే టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. టైటిల్ మాత్రమేనా? అయితే ఈ సినిమా పోస్టర్లో కేసీఆర్ ఫేస్ రివీల్ చేయలేదు. కానీ లుక్ చూస్తుంటే ఆయనదే అనిపిస్తుంది. అలానే కేసీఆర్ అంటే 'కేశవ్ చంద్ర రమావత్' అని తెలుస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ అనిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి రాజకీయాలతో సంబంధం ఉందా? లేదంటే హైప్ కోసమే ఆ పేరు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో అమర్కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
నేను ఏం సమాజ సేవ చేయట్లేదు కదా..!
-
తెలుగు అమ్మాయిని ఇక్కడ వారు పట్టించుకోరు
-
'మధురపూడి గ్రామం అనే నేను' ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ బాబీ
శివ కంఠమనేని హీరోగా చేస్తున్న సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. కళ్యాణ్ రామ్ 'కత్తి' ఫేమ్ మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్యాథలిన్ గౌడ హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే పాటలు, టీజర్కి అలరిస్తుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఈ తెలుగు సినిమా!) చాలారోజుల తర్వాత డైరెక్టర్ మల్లి ఓ మంచి సినిమా చేశారు. ట్రైలర్ చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక ఊరిలో జరిగే కథ. రా అండ్ రప్టిక్గా ఉంటూనే ఎమోషన్స్తో నిండి ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని డైరెక్టర్ బాబీ.. ట్రైలర్ని లాంచ్ చేసిన తర్వాత చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) -
ఇవాల్టి ట్రెండ్కు కావాల్సిన సినిమా రాక్షస కావ్యం, రిలీజ్ ఎప్పుడంటే?
అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం” సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్లో మరింత క్వాలిటీ కోసమే చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు. రిలీజ్కు ముందే రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మ పాట, విలన్స్ ఆంథెమ్ పాటలు బాగా హిట్ అయ్యాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు “రాక్షస కావ్యం” ఇవాల్టి ట్రెండ్కు కావాల్సిన సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు. చదవండి: ఆస్తినంతా ఇచ్చేశాను.. సెంటు భూమి లేదు.. లక్షల పారితోషికం అందుకునే రవళి వెండితెరకు ఎందుకు దూరమైందో చెప్పిన హీరోయిన్ తల్లి -
కొత్త సినిమా.. హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆమెనే!
ఎస్ఆర్పీ ప్రొడక్షన్స్ బ్యానర్పై తీస్తున్న మొదటి సినిమా 'మేడమ్ చీఫ్ మినిస్టర్’. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో శనివారం ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు హీరోయిన్గా నటిస్తూ.. దర్శకనిర్మాణం చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!) ఈ సినిమా పూజా కార్యక్రమానికి తెలంగాణ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5 భాషల్లో తీస్తున్న ఈ సినిమా సక్సెస్ఫుల్ కావాలని అన్నారు. నటి-దర్శకనిర్మాత రేవతి మాట్లాడుతూ.. సినిమా సమాజంపై అత్యంత ప్రభావం చూపించే మీడియా. అందుకే 'మేడమ్ చీఫ్ మినిస్టర్' ప్రారంభించా. టైటిల్ చూసి ఇదేదో పొలిటికల్ సినిమా అనుకోవద్దని, పబ్లిక్ మూవీ అని ఆమె చెప్పారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) -
'ఊరికి ఆత్మ ఉంటే?'.. డిఫరెంట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
మనుషులకి ఆత్మలు ఉన్నట్టే.. ఓ ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. శివ కంఠమనేని హీరోగా నటించారు. మల్లి దర్శకుడు. మణిశర్మ సంగీతమందించారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. (ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్కి రెండు కార్లు గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్) ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే అక్టోబరు 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలు, చీరాల బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. రాజమండ్రి, మచిలీపట్నం,హైదరాబాద్లోని పలు అందమైన, ఆసక్తికరమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపామని దర్శకుడు చెప్పాడు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?) -
దసరా సినిమాలు ఇవే..!
-
తెలుగు హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు..!
-
తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో ఆయనే!
తొంభై మూడేళ్ల వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని అలరించిన ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో,నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. తెలుగు సినీరంగంలో అక్కినేని ‘ఎక్కని ఎత్తుల్లేవు. వెళ్లలేని దూరాల్లేవు.’ జనన మరణాల మధ్య రెప్పపాటు జీవితకాలంలో, మన చూపు తిప్పుకోకుండా మన నలరించిన ఎందరో మహానుభావుల్లో ప్రముఖులు... తెలుగు సినిమా ఎవర్గ్రీన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. నాటక రంగం నుంచి నటరాజు వరప్రసాదమైన ‘అభినయ’ కళ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించి, తొంభై మూడు సంవత్సరాల వయసు వరకూ నిరవధికంగా నటిస్తూ సినీ ప్రేమికుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని అలరించి, తెలుగు హృదయాలలో చిరంజీవిగా కొలువై ఉన్న నటనావతంసుడీయన. పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వంటివి అక్కినేనిని అలంకరించి తమ గౌరవాలను ఇనుమడింప చేసుకున్నాయి. తన కళని తర్వాత తరాలకి కూడా వారసత్వంగా అందించి అక్కినేని నాగార్జున వంటి సూపర్ స్టార్ని, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వంటి స్టార్లని తయారు చేసి ‘అక్కినేని’ జయభేరి తరతరాలుగా నినదించేలా చేయడం సామాన్యమైన విషయం కాదు. 1950 నుంచి 60ల మధ్యలోనే ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే దర్శక, నిర్మాతలు హైదరాబాద్కి వచ్చి తీయా’లని నిర్దేశించ గలిగిన ‘ఖలేజా’ ఉన్న ఏకైక తెలుగు సూపర్ స్టార్ అక్కినేని. 1970ల మధ్య గుండెకి ఆపరేషన్ జరిగినా నటనలో, నాట్యంలో ఉత్సాహం మరింత పెరిగిందే కానీ, ఇసుమంతైనా తగ్గకపోవడం ఆయన మానసిక స్థైర్యానికి మచ్చుతునక. అదే ‘గుండె ధైర్యం’తో తన తొంభై ఏళ్ల వయసులో ప్రెస్ మీట్ పెట్టి తనకు క్యాన్సర్ సోకిందనీ, మరెంతో కాలం బతకననీ చెప్పగలగడం స్ఫూర్తి దాయకం. పై మూడు సంఘటనలూ, వయసు మారిందే గానీ, ఆయన వన్నె ఏ మాత్రం తగ్గ లేదని నిరూపించాయి. ‘ఆడపిల్లలకి చదువులెందుకు? పెళ్లిళ్లు చేసి ఓ అయ్య చేతిలో పెట్టి పంపెయ్యక’ అనే పాత కాలపు భావజాలం సమాజంలో అధికంగా ఉన్న రోజుల్లో ‘చదువుకున్న అమ్మాయిలు’ అనే టైటిల్తో స్త్రీలకు విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపేలా చిత్రం చేయడం ఆయన ప్రోగ్రెసిన్ థాట్ ప్రాసెస్కి తార్కాణం. ఈనాటి ‘వుమెన్ ఎంపవర్మెంట్’ ట్రెండ్కి బీజం వేసిన సాంఘిక కార్యకర్తల్లో అక్కినేని కూడా ఒకరు. విగ్గు, మేకప్పు లేకుండా ఇంట్లోంచి కాలు కూడా బైటికి కదపలేని కళాకారులకి ఆయన ‘సీతారామయ్య గారి మనవరాలు’ మారుతున్న సినిమా మేకింగ్ విలువలకి ఒక గొప్ప పాఠం. స్టార్ హీరోగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న రోజుల్లో ‘సుడిగుండాలు’ వంటి చిన్న పిల్లల మానసిక సమస్య మీద చిత్రాన్ని నిర్మించి, నటించడం ఆయన సామాజిక బాధ్యతకి, ప్రభావవంతమైన ఆలోచనా పరిణతికి నిదర్శనం. దసరా బుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, ఆత్మగౌరవం, అగ్నిపుత్రుడు, సూత్ర ధారులు, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు, దేవదాసు, మాంగల్యబలం, విప్రనారాయణ, సువర్ణ సుందరి, కీలుగుర్రం... ఇలా ఏ జోనర్లో చూసినా తెలుగు సినిమా కీర్తి కిరీటంలో అక్కినేని పాదుకొచ్చిన కలికి తురాళ్లు కనిపిస్తాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి మల్టీ స్టారర్లతో తెలుగు సినిమా మార్కెట్ పరిధిని ఇతోధికంగా పెంచడం కూడా ఆయన చేసిన కృషిలో ఒక భాగం. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పడం, చలన చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించడం... కొన్ని లక్షలమంది కళాకారుల కలలని సాకారం చేయడానికి ఆయన ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి. ‘‘అక్షరం నేర్చుకోలేదని బాధ ఉంది’’ అని చెప్తూనే, నిరంతర విద్యార్థిగా తెలుగు, తమిళ, హిందీ, ఉర్దూ్ద, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడడం, రాయడం, నేర్చుకుని, ‘అక్కినేని ఆలోచనలు (అ, ఆలు)’ వంటి వచన కవితా సంపుటిని ప్రచురించడం ఆయనలోని క్రమశిక్షణకి, విద్యారంగం పట్ల గౌరవానికి దర్పణం. ముళ్లపూడి వెంకటరమణ గారన్నట్లు–అక్కినేని నాగేశ్వరరావు / ఎక్కని ఎత్తుల్లేవు / వెళ్లలేని దూరాల్లేవు. ఆయన కీర్తి, ప్రభావం, ప్రతిభ ప్రయాణించే కాలంలో మన జీవిత కాలం ఒక చిన్న మజిలీ మాత్రమే. ఆయనే శాశ్వతం. శతమానం భవతి. అక్కినేని అభిమానులకి ఆయన శత సంవత్సర జయంతి శుభాకాంక్షలు. వి.ఎన్. ఆదిత్య వ్యాసకర్త ప్రముఖ సినీ దర్శకుడు (నేటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం) -
ప్రేక్షకులని 'అష్టదిగ్బంధనం' చేసే కాన్సెప్టే ఈ సినిమా!
ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ సమర్పణలో బాబా పి.ఆర్. దర్శకత్వంలో మనోజ్కుమార్ అగర్వాల్ నిర్మించిన చిత్రం 'అష్టదిగ్బంధనం'. సూర్య, విషిక జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ని ఇటీవలే రిలీజ్ చేశారు. ఈనెల 22న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. (ఇదీ చదవండి: రతిక వెన్నుపోటు.. గిలగిలా కొట్టేసుకున్న ప్రిన్స్ యవర్) అష్టదిగ్బంధనం.. చాలా పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమాలో దాన్ని జస్టిఫై చేసేలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నాం. టైటిల్కు తగ్గట్టుగానే ఇందులోని ప్రతి క్యారెక్టర్ అవతలి వారిని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంటుంది. ఇలా పలువురు వ్యక్తుల స్వార్ధంతో కూడిన జీవితాలకు సంబంధించినదే ఈ కథ అని దర్శకుడు బాబా పిఆర్ చెప్పుకొచ్చారు. యాక్షన్, థ్రిలర్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ మూవీ కనెక్ట్ అవుతుందన్నారు. ఇవాళ చిన్న సినిమాలు విడుదల కావడమే కష్టమైపోయింది. మీరు ఏ ధైర్యంతో ఇంత బడ్జెట్ పెట్టారనే ప్రశ్నకు బదులిచ్చిన నిర్మాత మనోజ్ కుమార్.. కేవలం కథ మీద నమ్మకమే తనని ముందుకు నడిపిందని అన్నారు. సినిమాను సినిమాగా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చెబుతూ, దర్శకుడు సినిమా బాగా తీశారని అన్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) -
'లవ్ మౌళి' తొలి పాట.. ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా?
యువనటుడు నవదీప్ చాలా రోజులు తర్వాత చేస్తున్న సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం, ఒక బైక్, ట్రావెలర్గా కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా నుండి 'ద ఏoథమ్ ఆఫ్ లవ్ మౌళి' సాంగ్ని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: 'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?) "అందాలు చదివే కళ్లకైనా.. కందాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండె కైనా.. ప్రేమన్న తీరం ఇదేనా.." అని సాగే పాటలో నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నవదీప్ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గోవింద వసంత కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. అనిల్ కృష్ణన్ పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. మేఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్లో షూటింగ్ జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్గా ఈ చిత్రం నిలిచింది. అలాగే థాయ్ కుడెం బ్రిడ్జి షూట్ చేశారు. తాటికొండ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!) -
అలాంటి ప్రేమ కోరుకునే అమ్మాయి కథే ఈ సినిమా
మధ్యప్రదేశ్ లో ఓ అమ్మాయి జీవితంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో తీసిన సినిమా 'ప్యారీ'. పలు సూపర్హిట్ హిందీ సీరియల్స్, వీడియో ఆల్బమ్స్తో గుర్తింపు తెచ్చుకున్న డాలి తోమర్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై కల్పన తోమర్-అమిత్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు. రహమాన్ అలి - రాజారామ్ పాటిదార్ సహ నిర్మాతలు. (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం.. తెలుగు, హిందీ భాషల్లో అక్టోబరు 27న థియేటర్లలోకి రానుంది. సినిమాగా తీయడానికి ముందే పుస్తక రూపంలో వెలువడి లక్షలాది పాఠకుల మనసులు దోచుకున్న "ప్యారీ" రచయిత రజనీష్ దూబే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు లక్ష్మణ్ పాత్రను పోషించడం విశేషం. ఆర్.పి.సోనితో కలిసి ఈ చిత్రానికి సంగీత సారథ్యం సైతం వహించారు. కొన్ని కాలాలపాటు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా.. చూసేకొద్దీ చూడాలనిపించేలా ఈ మూవీలో సాంగ్స్ ఉన్నాయట. స్వేచ్ఛ, స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే ఓ అమ్మాయి మనసును ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తూ తీసిన 'ప్యారీ'.. ఇప్పటివరకు భారతీయ తెరపై రూపొందిన అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని దర్శకుడు రజనీష్ దూబే చెప్పారు. (ఇదీ చదవండి: బాబు అరెస్ట్.. లైట్ తీసుకుంటున్న ఎన్టీఆర్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) -
కొత్త వాళ్లతో ఆ దర్శకుడి పీరియాడికల్ సినిమా
తెలుగు దర్శకుడు పాలిక్ తీస్తున్న కొత్త సినిమా.. ఫిలింనంగర్ దైవ సన్నిధానంలో సోమవారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్.. ముహూర్తపు న్నివేశానికి క్లాప్ కొట్టారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అంద చేయగా దర్శకుడు, నటుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) ఇదొక పీరియాడికల్ ఫిలిం. ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ఉంటాయని నిర్మాతల్లో ఒకరైన భోగి సుధాకర్ చెప్పుకొచ్చారు. హీరోహీరోయిన్గా చేయబోతున్న ప్రమోద్, మోహన సిద్ధి, శ్రీమన్ మాట్లాడుతూ.. ఈ కథ చాలా బాగుంటుంది. అందుకే ఏడాది నుంచి వెయిట్ చేస్తున్నామని అన్నారు. ఇది 1960-1980 మధ్య తెలంగాణలో జరిగిన యథార్థ కథ ఆధారంగా తీయబోయే పీరియాడిక్ మూవీ. ఇందులో బాహుబలి ప్రభాకర్ దొర పాత్రలో నటిస్తున్నారు అని దర్శకుడు పాలిక్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే) -
స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథే 'రుద్రంకోట'
అనిల్ ఆర్క కండవల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రుద్రంకోట’. నటి జయలలిత ఓ కీలక పాత్రలో నటించి, చిత్ర సమర్పకురాలిగా వ్యవహరించారు. రాము కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విభీష, రియా హీరోయిన్లు. ఏఆర్కే విజువల్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాని ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ– ‘‘స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది.భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటిగారు మా చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిమల్ల సంజీవ్, సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్. -
ఫీల్ గుడ్ మూవీ 'ఏందిరా ఈ పంచాయితీ' ఫస్ట్ లుక్
డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్గా టైటిల్.. ఇదే ఈ తరం ప్రేక్షకలోకం మెచ్చే సినిమా. స్టార్ హీరో హీరోయిన్స్ సంగతి పక్కనబెట్టి రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఓటేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ ప్రేమిస్తున్నారు. అయితే నేటితరం ప్రేక్షకుల టేస్ట్కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే 'ఏందిరా ఈ పంచాయితీ'. (ఇదీ చదవండి: ఆ రూమర్స్పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. గంగాధర.టీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊర్లోని వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను వదిలారు. ఇలా టైటిల్ పోస్టర్తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎట్రాక్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. -
'సగిలేటి కథ' ట్రైలర్.. అలాంటి కాన్సెప్ట్తో
హీరో నవదీప్ సమర్పణలో రవితేజ మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. ఆయనే ఎడిటింగ్, సినిమాటోగ్రాఫర్ కూడా. ఈ మూవీని అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సమర్పకుడు హీరో నవదీప్ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి.సుమంత్ నాయుడు విచ్చేశారు. డ్యాషింగ్ డైరెక్టర్ 'రామ్ గోపాల్ వర్మ' ఈ చిత్ర బృందానికి వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కోడి అహంకారంతో కూడిన ఫన్నీ స్కిట్తో ఈవెంట్ ప్రారంభమైంది. రుచికరమైన చికెన్ తినడానికి తహతహలాడే ఒక పాత్ర దురాశ చుట్టూ తిరిగే కథ. మూవీ ఇంతకంటే రంజిపజేసే విధంగా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పాటు సెప్టెంబర్లో మూవీ థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. (ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?) -
కుట్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
సిరి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సిరిపురం రాజేష్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘కుట్ర’ (ద గేమ్ స్టార్స్ నౌ అనేది ట్యాగ్లైన్). ప్రీతి, గీతిక రతన్, ప్రియ దేశ్పాల్ హీరోయిన్లు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న గ్రాండ్గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ లో ప్రీ-రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ... 'సిరిపురం రాజేష్ అడ్వకేట్గా, వ్యాపారవేత్తగా, జర్నలిస్ట్గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడం గొప్ప విషయం. సినిమా చూశాము. అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. టియస్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ... 'ప్రస్తుతం సమాజంలో ప్రతి విషయంలో కుట్రలే జరుగుతున్నాయి. అలాంటి టైటిల్తో ఓ చక్కటి చిత్రాన్ని తెరకెక్కించిన రాజేష్కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి' అని పేర్కొన్నారు. టియస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ అమరవాది లక్ష్మినారాయణ మాట్లాడుతూ... 'రాజేష్ తెలంగాణ ఉద్యమంలో ఎంతో జోరుగా పాల్గొన్నారు. అడ్వకేట్ గా కూడా మంచి పేరుంది. కరోనా టైమ్లో సిరిపురం రాజేష్ షార్ట్ ఫిలింస్ చేశారు. ఎప్పటికైనా సినిమా చేయాలని చెప్పేవాడు. కానీ ఇంత త్వరగా సినిమా చేసి దాన్ని రిలీజ్ చేస్తాడు అనుకోలేదు. ఈ సినిమా విడుదలై ఆయనకు మంచి పేరు, లాభాలు తేవాలి' అన్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు సిరిపురం రాజేష్ మాట్లాడుతూ... 'మంచిర్యాలలో 1985 నుంచి నేను జర్నలిస్ట్ గా పనిచేశాను. `కుట్ర` నా తొలి సినిమా. ఇద్దరి మిత్రుల మధ్య నడిచే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 23న దాదాపు 100 థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. -
యంగ్ హీరో బర్త్డే, స్పెషల్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరోలు మంచి దూకుడు మీదున్నారు. కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే దినేష్ తేజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'అలా నిన్ను చేరి' అంటూ ఇది వరకు దినేష్ తేజ్ సినిమా అప్డేట్లను సోషల్ మీడియాలో వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు (మే 26) దినేష్ తేజ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇది మాస్ సాంగ్లో స్టిల్ అని తెలుస్తోంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో రాబోతున్న ‘అలా నిన్ను చేరి’ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో దినేష్ తేజ్ సరసన హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా.. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అన్ని పాటలు రాయడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించనున్నారు. చదవండి: యాచకులకు వడ్డించిన బిచ్చగాడు హీరో -
హసీనా రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రియాంక డే టైటిల్ రోల్లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీనా. ఈ సినిమాకు తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు. ఈ మూవీని మే 19న రిలీజ్ చేస్తున్నారు. హసీనా మూవీ పోస్టర్ ని ప్రకాష్ రాజ్, పాటను నిఖిల్, టీజర్ను అడివి శేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా యంగ్ హీరోలు హసీనా సినిమా కోసం ముందుకు రావడం, ప్రమోషన్స్లో పాల్గొనడంతో సినిమాపై ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాను మే 19న థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్గా, రామ కందా కెమెరామెన్గా, షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి తేజ గంజి లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. -
మ్యూజిక్ లవర్స్ ని రాక్ చేస్తున్న ఖుషి మూవీ ఫస్ట్ సింగల్
-
4 రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేష్.. క్షీణించిన ఆరోగ్యం
-
ధృవ-2లో ఏజెంట్ !
-
ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురబ్బాయిల మధ్య సాగే కథ!
రోషన్. జెడ్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్.టి, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం అరంగేట్రం. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి.కె నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుకలో శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ మూవీ అరంగేట్రం. సైకో, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో పాటు మంచి ప్రేమకథ ఉంటుంది. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మధ్య ప్రధానంగా సాగే సినిమా ఇది అన్నారు. మా అరంగేట్రం చాలా బాగా వచ్చింది అన్నారు మహేశ్వరి. మంచి కాన్సెప్ట్తో ఈ సినిమా నిర్మించాం అన్నారు సహనిర్మాత విజయలక్ష్మి. -
దిల్ రాజు, ఎన్టీఆర్ తో ఆ నెక్స్ట్ లెవెల్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటె..
-
సీక్వెల్ కు జై కొడుతున్న స్టార్ హీరోలు..
-
లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కొడుతున్నాం
-
రిపోర్టర్స్ ముక్కు సూటి ప్రశ్నలకు అఖిల్ స్మార్ట్ ఆన్సర్స్
-
మెంటల్ గా, ఫిసికల్ గా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది...
-
పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది.. రవిబాబు షాకింగ్ కామెంట్స్
-
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
గ్రామస్తులు వద్దన్నా గుడి వద్ద షూటింగ్ చేసాం
-
అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ సినిమాలకు డైలాగ్స్ రాసా..
-
ఫ్యూచర్ లో రిపీట్ కాబోతున్న అరవింద సమేత కాంబో...?
-
వాల్తేరు చిట్టిబాబు
-
ఉగ్రం మూవీ టీమ్ తో యాంకర్ సుమ చిట్ చాట్...
-
బెల్లంకొండను కాల్చినోడు సైకో కాదా ?
-
సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలే.. ఇప్పుడదే మూవీ హౌస్ఫుల్!
చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే! తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ తీసిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి నటీనటులుగా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. 'చిన్న సినిమా అయినా కథలో మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన ఈ రాజ్ కహాని సినిమాను మనమందరం ప్రోత్సహించి బిగ్ హిట్ చెయ్యాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఇంకా మంచి చిత్రాలు తీస్తారు' అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమా తీశాడు. కరీంనగర్ లోని తిరుమల థియేటర్ లో వరుసగా ఏడవ రోజు కూడా హౌస్ ఫుల్గా రన్ అవ్వడం చాలా మంచి విషయం. ఇలాగే వీరు ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ.. 'మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నేను నా చిన్నప్పుడు సినిమా చూడడానికే ఎంతో ఇబ్బంది పడేవాన్ని. గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది నిర్మాతలకు ఈ కథ వినిపించా. ఎవరూ తీయడానికి ముందుకు రాలేదు. చివరకు నేనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తో సినిమా స్టార్ట్ చేశాము. కానీ కొంత కాలానికి కరోనా రావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించాం. మా సినిమాను పెద్దలకు ప్రివ్యూ వేయడంతో సినిమా చాలా బాగుందని అనడంతో ఎంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాను విడుదల చేసే స్థోమత లేకున్నా ఓన్ గా సినిమా రిలీజ్ చేశాము' అన్నారు. -
యూత్ఫుల్ ఎంటర్టైనర్
మాన్యం కృష్ణ, అర్చన జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ని హీరో ఆకాశ్ పూరి విడుదల చేసి, ‘‘సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిళలకు కనెక్ట్ అయ్యే అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ తెలిపింది. -
డప్పుకొట్టి చెప్పుకోనా...
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ‘డప్పుకొట్టి చెప్పుకోనా..’ అనే పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ పా టకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పా డారు. ‘‘ఇందులో శివ డిటెక్టివ్గా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పా కాల, విజయ్ బుల్గానిన్, కెమెరా: గౌతమ్ జి. -
సినిమానే మనల్ని ఎంచుకుంటుంది
‘‘మంచి చిత్రం ఎంచుకున్నామంటూ చాలా మంది అంటారు. కానీ, సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాళ్లనే ఆ సినిమా ఎంపిక చేసుకుంటుంది.. అంతేకానీ, సినిమాను మనం సెలెక్ట్ చేసుకోం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్ జంటగా శివ నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఎన్నో మంచి సినిమాలు తీసిన శివ నాగేశ్వరావుగారు ఇప్పుడు ‘దోచేవారెవరురా’ వంటి మంచి కథతో వస్తున్నారు. ట్రైలర్, పాటలు బాగున్నాయి.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. కుటుంబమంతా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘దోచేవారెవరురా’లో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు బొడ్డు కోటేశ్వర రావు. -
తల్లితండ్రులు.. పిల్లలకు సందేశం
సాత్విక్ వర్మ, జాక్ రాబిన్సన్, మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ హీరో హీరోయిన్లుగా ముత్తు యం. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చిక్లెట్స్’. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసన్ గురు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ట్రైలర్ని హీరో రామ్ కార్తీక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చిక్లెట్స్’ ట్రైలర్ చాలా బాగుంది. పిల్లలకు, పేరెంట్స్కి మంచి సందేశం ఇచ్చేలా తెరకెక్కిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి’’ అన్నారు. ముత్తు యం. మాట్లాడుతూ– ‘‘1990 జనరేషన్కి చెందిన పేరెంట్స్కు, 20కె జనరేషన్ పిల్లలకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణని ఈ సినిమాలో చూపించాం. ఇందులో లవ్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘తల్లితండ్రులు, పిల్లలకు మధ్య ఉన్న అన్ని భావోద్వేగాలు మా సినిమాలో ఉన్నాయి’’ అన్నారు శ్రీనివాసన్ గురు. లైన్ప్రొ డ్యూసర్ డానియల్, దర్శకుడు శివమ్ మాట్లాడారు. -
వినోదం.. సందేశం
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వంలో ఎమ్. నాగ మునెయ్య నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘‘ఓ బర్నింగ్ ప్రాబ్లమ్కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఇది. వినోదంతో పాటు సందేశం కూడా ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సహనిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్ – నందిపాటి శ్రీధర్ రెడ్డి. -
రామ్చరణ్ ప్రెజెంట్స్....
మంగళవారం రామ్చరణ్ అమెరికా వెళ్లారు. ఎందుకంటే... హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్చరణ్ ఓ ప్రెజెంటర్గా ఉన్నారు. కాలిఫోర్నియాలో ని బెవర్లీ హిల్స్ వేదికగా ఈ నెల 24న సిక్త్ హెచ్సీఏ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు రామ్చరణ్ అక్కడకు ఓ ప్రెజెంటర్గా వెళ్లారు. ఇక ఈ అవార్డుల జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం)కు నాలుగు (బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్) నామినేషన్స్ దక్కాయి. మరి.. అవార్డ్స్ వస్తాయా? అనేది చూడాలి. -
పోస్టర్ బాగుంది – నాగార్జున
‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకునేలా బాగుంది. ఈ సినిమా హిట్ అయి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు అక్కినేని నాగార్జున. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో తేజ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక–నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: వాసు. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయనిర్మల మనవడు
దివంగత ప్రముఖ నటి–దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ (నరేశ్ కజిన్ రాజ్కుమార్ కొడుకు) హీరోగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వంలో బీఎన్ రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలు. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అతిథిగాపాల్గొన్న దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ ప్రామిసింగ్గా వుంది. కొత్త కాన్సెప్ట్తో సినిమాని రూపొందించారనిపిస్తోంది’’ అన్నారు. ‘‘మా అల్లుడు శరణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ, విజయ నిర్మలగార్ల ఆశీస్సులు ఉంటాయి’’ అన్నారు నరేష్. ‘‘ఈ చిత్రంలో బలమైన పాత్ర చేశాను’’ అన్నారు శరణ్. ‘‘ఆత్మాభిమానం వున్న ఓ అబ్బాయి కథ ఇది’’ అన్నారు శశిధర్. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు బీఎన్ రావు. -
వైవిధ్యమైన టైటిల్తో తనిశ్ కొత్త సినిమా
నటుడు, బిగ్బాస్ ఫేం తనిశ్ హీరోగా వేద ఎంటర్ప్రైజెస్ బ్యానర్ ఓ చిత్రం రూపొందుతోంది. లవ్స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం టైటిల్ను వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు కేసీపీడి(కొంచ చూసి ప్రేమించు డూడ్) అనే సరికొత్త టైటిల్ను ఖరారు చేశారు. గౌతమ్ మన్నవ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వేద ఎంటర్ప్రైజెస్ పతాకంపై గోదావరి రెస్టారెంట్ దుబాయ్ సహా నిర్మాణంలో కార్తిక్ రెడ్డి , వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్ను రిలీజ్ చేసన అనంతరం మేకర్స్ మాట్లాడుతూ.. అ ఈ సినిమా షూటింగ్ని మార్చిలో ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈఏడాది వేసవికే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రజెంట్ జనరేషన్లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నామన్నారు. -
ఫిబ్రవరి 3న ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ మూవీ రిలీజ్
నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న చిత్రం ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’. ఇందులో ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డిలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రాన్ని వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్గానూ పని చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిత్రయూనిట్ పంచుకన్న విశేషాలు ఇవే. డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ.. 'నాకు ఎంతో మంచి టీం దొరికింది. వారి వల్లే సినిమాను ఎంతో బాగా తీయగలిగాను. నాలుగు నెలల పాటుగా నాతోనే ఉంది. మ్యాగీ, దీక్షిత్లు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వినయ్ లేటుగా వచ్చాడు. ఈ ముగ్గురూ కలిసి సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. మా ఊరోడు సినిమా తీస్తున్నాడని, మాకు ఊరు ఊరంతా సాయం చేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎంతో సాయం చేసింది. నా ఇద్దరు హీరోలు, హీరోయిన్లకు థాంక్స్. ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పడ్డాం. మణిశర్మ గారి వద్దకు వెళ్లాక ఆ సమస్య తీరిపోయింది. నాలుగు పాటలు నాలుగు రోజుల్లోనే ఇచ్చారు. లిరిక్స్ ఇచ్చిన వెంటనే పాటలు వచ్చేశాయి. కాసర్ల శ్యామ్ లేకపోతే మాకు మణిశర్మ గారు దొరికేవారు కాదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. హీరోయిన్ పాత్రను రాసినప్పుడే తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలని అనుకున్నాం. తెలంగాణ యాసలో మాట్లాడే అమ్మాయి అయితేనే బాగుంటుందని జయెత్రిని తీసుకున్నాం. మా సినిమా ఫిబ్రవరి 2న యూఎస్లో విడుదలవుతోంది. ఫిబ్రవరి 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. థియేటర్లో ఈ సినిమాను చూడండి' అని అన్నారు. అనంతరం మెలోడి బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అంతా అయిపోయిన తరువాత నాకు ఒక విషయం అర్థమైంది. దర్శకుడు కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు. మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఓ సాథియా మోషన్ పోస్టర్
ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ ఓ సాథియా. ఈ సినిమా నిర్మాత, డైరెక్టర్ మహిళలు కావటం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్పై చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. జి జాంబీ అనే చిత్రంతో ఇప్పటికే హీరో పరిచయం అయిన ఆర్యన్ గౌర్కు ఇది రెండవ సినిమా. ఇటీవల ఈ మూవీ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ను ప్రముఖ లెజెండరి రైటర్, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్కు యూట్యూబ్లో మంచి స్పందన అభిస్తోంది. మోషన్ పోస్టర్ వన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ప్యూర్ లవ్స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకు విన్ను సంగీతం అందించారు. ఈ మోషన్ పోస్టర్కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ నుంచి రెండోపోస్టర్ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. It's 1Million + Views for our First look Motion poster..Thanks for the immense response #osaathiya #motionposter@AryanGowra @IMishtii pic.twitter.com/uVahXwzYCK — Thanvika Jashwika Creations (@tjcreations123) January 9, 2023 -
భూతద్ధం భాస్కర్ నారాయణ రిలీజ్ డేట్ వచ్చేసింది!
శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం భూతద్దం భాస్కర్. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్లపై స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 31న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీనికి కూడా చిన్న మోషన్ పోస్టర్తో డేట్ ఎనౌన్స్ చేస్తారు. ఈ చిత్రంలో తర్వాత జరగబోయే సన్నివేశాలను ముందుగా ఊహించడం చాలా కష్టంగా ఉంటుందని, ఆరేంజ్లో దర్శకుడి స్క్రీన్ప్లే వుంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చదవండి: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ నాటు నాటు.. ఆ పాటేంది? ఆ యాసేంది? నటి ఘాటు రిప్లై -
ఎఫ్ఎమ్ 2 డబుల్ మస్తీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్
గుల్లు దాదా, తబర్, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ". షాన్స్ ఫిలిమ్స్ బ్యానర్పై మహమ్మద్ మైను ఖాన్ డైరెక్షన్లో మహమ్మద్ షాహిద్ అలీ సిద్ధిక్ నిర్మించారు. ఒలి మహమ్మద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఈ సినిమా జనవరి 6న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మహమ్మద్ షాహిద్ అలీ సిద్ధిక్ మాట్లాడుతూ.. 'నూతన సంవత్సరం కానుకగా రిలీజ్ అయిన మా ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. హైదరాబాదీ సినిమాగా అన్ని ఏరియాల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మేం ఊహించని స్పందన లభించింది. హీరోహీరోయిన్ల నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ధన్య వాదములు' అన్నారు. చదవండి: వాల్తేరు వీరయ్య ట్రైలర్, చిరుకు మాస్ మహారాజ వార్నింగ్ -
దోస్తాన్ మూవీ రివ్యూ
టైటిల్: దోస్తాన్ దర్శక, నిర్మాత : సూర్యనారాయణ అక్కమ్మగారు బ్యానర్ : శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ మ్యూజిక్ : ఏలెందర్ మహావీర్ డీఓపి : వెంకటేష్ కర్రి, రవి కుమార్ ఎడిటర్ : ప్రదీప్ చంద్ర ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్ అసిస్టెంట్ డైరెక్టర్ : కౌసిక్ కాయల సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దోస్తాన్. సూర్య నారాయణ అక్కమ్మగారు దర్శకత్వం చేస్తూనే నిర్మాణ బాధ్యతలను చూసుకున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 6న రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి. కథ వైజాగ్ సిటీలో భాయ్ (చంద్రసే గౌడ) అనే వ్యక్తి డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ వంటి అక్రమ బిజినెస్లు చేస్తూ చలామణి అవుతుంటాడు. అతను గతంలో చెట్టు కింద పాలిస్తున్న ఓ నిస్సహాయరాలైన తల్లిని సామూహిక అత్యాచారం చేసి చంపేస్తాడు. అక్కడే ఉన్న మరో అనాధ జై (కార్తికేయ)కు ఆ చంటి బిడ్డ ఏడుపు వినిపించి చూడగా అక్కడ ఆ పిల్లాడి తల్లి చనిపోయి ఉంటుంది.. తనలాగే అనాధగా ఉన్న పిల్లాడిని చేరదీస్తాడు. ఏడుస్తున్న పిల్లాడి పాలకోసం వీధిలో ఆడుక్కంటున్న జైను చూసి మెకానిక్ షెడ్ ఓనర్ అయిన బాబా (రమణ మహర్షి ) చేరదీసి షెడ్లో మెకానిక్ పని నేర్చుకోమని చెపుతాడు. అలాగే పెద్దోడికి జై( కార్తికేయ ), చిన్నోడికి రామ్ (సిద్ స్వరూప్) అని నామకారణం చేస్తాడు. వీరు పెద్దయిన తరువాత ఆ పెద్దాయన చనిపోవడంతో జైను చదువుకోమని చెప్పి రామ్ మెకానిక్గా మారతాడు. ఈ క్రమంలో జైకు నిత్య (ప్రియ వల్లబి) పరిచయం అవగా, రామ్ (సిద్ స్వరూప్)కు రియా (ఇందు ప్రియ) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇలా వీరి లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి మళ్ళీ భాయ్ ప్రవేశిస్తాడు. ఆ భాయ్ వల్ల జై, రామ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరికి భాయ్పై వీరిద్దరూ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నారు? అనేది తెలుసుకోవాలంటే "దోస్తాన్" చూడాల్సిందే! నటీ నటుల పనితీరు జై, రామ్ పాత్రలలో నటించిన కార్తికేయ, సిద్ స్వరూప్లు కొత్త వారైనా బాగా నటించారు. నిత్య, రియా పాత్రలలో నటించిన ఇందు ప్రియ, ప్రియ వల్లబి ఇద్దరూ గ్లామర్స్ లుక్స్తో ఆకట్టుకున్నారు. బాయ్ పాత్రలో నటించిన చంద్రసే గౌడ నెగటివ్ షేడ్ పాత్రలో జీవించాడు. మిగతావారందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ అంశాలను సెలెక్ట్ చేసుకొని లవ్, ఎమోషన్స్ జోడించి ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా తెరకెక్కించారు దర్శకుడు సూర్యనారాయణ అక్కమ్మ. అన్నతమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా చూపించాడు. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేసిన వెంకటేష్ కర్రి, రవికుమార్ కెమెరామెన్ పర్వాలేదనిపించింది. ఏలెందర్ మహావీర్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ప్రదీప్ చంద్ర ఇంకాస్త షార్ప్గా ఎడిట్ చేసుంటే బాగుండేది. చదవండి: కొడుకుతో వంట చేయిస్తున్న అల్లు స్నేహ -
త్రివిక్రమ్ సినిమాల్లో నటించా, ఇప్పుడు హీరోగా: బాబు
బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'రివేంజ్'. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'రివెంజ్ దర్శకుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. మద్రాస్ నుంచి ఇద్దరి జర్నీ ప్రారంభమైంది. తను మంచి రైటర్, దర్శకుడు. సినిమానే ప్రాణంగా బ్రతికే వ్యక్తి. ఈ సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. దర్శకుడు, హీరో కమ్ ప్రొడ్యూసర్ ఇద్దరూ కూడా సినిమా అంటే ఎంతో ప్యాషన్, డెడికేషన్ ఉన్న వ్యక్తులు' అన్నారు. హీరో, నిర్మాత బాబు పెదపూడి మాట్లాడుతూ.. 'అబ్రాడ్లో ఉంటూనే త్రివిక్రమ్ గారి `అతడు`, దశరథ్ గారి `శ్రీ` సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేశాను. ఇంకా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ నాకున్న బిజీ వల్ల చేయలేకపోయాను. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిత్రం దర్శకుడు శ్రీనివాస్ గారితో పరిచయం ఏర్పడింది. ఒక మంచి నటుడిగా నన్ను పరిచయం చేయడానికి నాకోసం చాలా పాత్రలు రాశారు. తన డెడికేషన్ నచ్చి ఈ సినిమా తనకిచ్చాను. అద్భుతంగా తీశారు. మనం అమితంగా ఇష్టపడే వాళ్లకు ఏమైనా జరిగితే మనం ఎలా మారిపోతాం అనేది సినిమా' అన్నారు. దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. '30 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటున్నా. విజయ్ భాస్కర్, వంశీ గార్ల వంటి ప్రముఖ దర్శకుల వద్ద పని చేశాను. పొదరిల్లు, ఐపిసి సెక్షన్ రెండు సినిమాలు డైరక్ట్ చేశాను. ఇది నా మూడో సినిమా' అన్నారు. చదవండి: లాభాలు తేవడం చేతకాదు కానీ కోట్లకు కోట్లు కావాలి: నిర్మాత దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిన సన్నీ -
హెబ్బా పటేల్ 'అలా నిన్ను చేరి' మోషన్ పోస్టర్ వచ్చేసింది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అలా నిన్ను చేరి. హుషారు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా షురూ చేసి నూతన సంవత్సర కానుకగా అలా నిన్ను చేరి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టైటిల్ లోగో పోస్టర్ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఓ పక్క పల్లెటూరు, మరోపక్క మెట్రో సిటీ.. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ హీరోని బ్యాక్ నుంచి చూపించారు. పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు.. అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేదే సినిమా కథ అని తెలుస్తోంది. ‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనంద్ అందిస్తుండగా.. ఆండ్రూ కెమెరామెన్గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా విఠల్, ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. చదవండి: ఎయిట్ ప్యాక్తో దర్శనమిచ్చిన హృతిక్ రోషన్, ఫోటోలు వైరల్ సంపూర్ణేశ్కు రూ.25 లక్షలు ఫైన్, తారక్ ఏం చేశారంటే? -
మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న 'ముత్తయ్య'
కె.సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ముత్తయ్య". ఈ చిత్రాన్ని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు బ్యానర్లపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, వ్రిందా ప్రసాద్ నిర్మించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. గతంలో యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం. ఈ ఏడాది మే 9న లండన్లో రిచ్ మిక్స్లో ప్రీమియర్ అయ్యింది. తాజాగా కోల్కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ భారతీయ చిత్రంగా అవార్డు అందుకుంది. కాంపిటేషన్ ఆన్ ది ఇండియన్ లాంగ్వేజ్ ఫిలింస్ కేటగిరీలో ఈ పురస్కారం దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై దర్శక నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత కేదార్ సెలగం శెట్టి మాట్లాడుతూ.. 'కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(కేఐఎఫ్ఎఫ్)లో మా ముత్తయ్య సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ దక్కడం గర్వంగా ఉంది. మా సినిమా మరింత మందికి స్ఫూర్తి పంచుతుందని ఆశిస్తున్నాం' అన్నారు. నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ... 'కేఐఎఫ్ఎఫ్ చిత్రోత్సవాల్లో మా సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో ఓ మంచి చిత్రాన్ని చూశామనే సంతృప్తి కనిపించింది. ముత్తయ్యలోని కథా కథనాలే ప్రపంచవ్యాప్తంగా చిత్రోత్సవాల్లో ఆదరణ పొందేందుకు కారణంగా నిలుస్తున్నాయి' అన్నారు. దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ...'ఈ సినిమా తెరకెక్కించే ముందు ఇదొక కలగా ఉండేది. ఇప్పుడు ఊహించనన్ని ఆశ్చర్యాలను తీసుకొస్తోంది. ముత్తయ్య సినిమా మాకెంతో పేరు, గౌరవాన్ని అందిస్తోంది. ఒక దర్శకుడిగా ఇలాంటి గుర్తింపు దక్కడం మంచి సినిమాలు రూపొందించాలనే ఉత్సాహాన్ని పెంచుతోంది' అన్నారు. చదవండి: ఆ డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు సీరియల్ నటి ఆత్మహత్య.. చివరి పోస్ట్ వైరల్ -
నా సినిమాకు ఎక్కువ డబ్బులు రావాలనుకోవడం లేదు: డైరెక్టర్
కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జాన్సే. అంకిత్, తన్వి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు చిత్ర విశేషాలు, తన ఆలోచనలను పంచుకున్నారు. ► జాన్ సే.. క్రైమ్ థ్రిల్లర్ స్టొరీ అయినా మంచి లవ్ స్టొరీ ఉంది. జాన్ సే అనేది ప్రేమను రిఫ్లెక్ట్ చేసే హిందీ టైటిల్ లాగా జాన్ Say(చెప్తుంది) అనేది ఇంకోలాగా సౌండింగ్ ఉంటుంది. ► నేను అనుకునే కథలను, ఆలోచనలను సినిమా రూపంలో చెప్పాలనే ఆసక్తే నన్ను దర్శకుడిని చేసింది. ఈ జాన్ సే లైన్ను తొమ్మిది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఆరు నెలల క్రితం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి తెలివి, ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ కలిపి ఉండే అమ్మాయి ఈ సొసైటీని ఎలా ఫేస్ చేస్తుంది? అనేది మెయిన్ లైన్. ►నాకు చిత్ర పరిశ్రమ తో ఎలాంటి సంబంధం లేకపోయినా కథను నమ్ముకుని సినిమా తీస్తున్నాను. కానీ పోను పోను ఇది ఒక పెద్ద సముద్రమంత ప్రాసెస్ అని అర్థమవుతోంది. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్లలేం అని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఈ సముద్రాన్ని ఈదుతున్నాను. ► పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలంటే ఇష్టం. దర్శకుడిగా నాకూ సొంత మార్క్ ఉండాలనుకుంటాను. ► ఈ సినిమాకి కథే ప్రధాన బలం. ఆడియెన్స్ కి నచ్చేలా ఉంటుంది. వాళ్ళను థియేటర్కు రప్పించడానికి మంచి ప్రమోషన్స్ ప్లాన్ చేశాము. వన్స్ థియేటర్కు వచ్చాక సినిమాతో వాళ్ళని ఆకట్టుకుంటామనే నమ్మకం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒక రెండు నెలల్లో రిలీజ్ ఉంటుంది. ► నేను రూ.10 కోట్ల బడ్జెట్ అనుకున్నాను. అనుకున్న దానికంటే తక్కువలోనే పూర్తి చేయగలిగాను. ఇక షూటింగ్లో సమస్యల విషయానికి వస్తే ఆర్టిస్ట్స్ డేట్స్ అడ్జెస్ట్ అవకపోవడం, ఒక రెస్టారెంట్ సీన్ కోసం టైం లిమిట్ ఉండడం లాంటి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఎదురవలేదు. ► ఇందులో సీనియర్ యాక్టర్స్ తనికెళ్ళ భరణి, సూర్య, అజయ్, బెనర్జీ, అంజలి లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. ► నా జర్నీలో మా కెమెరామన్ మోహన్ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆయన చివరి వరకు ఉండి అన్నీ చూసుకున్నారు. ప్రొడ్యూసర్ రఘు కూడా బాగా సపోర్ట్ చేశారు. ► నేను డబ్బులు ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడం లేదు. నేను ఈ సినిమాకి పెట్టిన డబ్బు వచ్చేస్తే మరో సినిమా మొదలు పెట్టేస్తాను. ► జాన్ సే టైటిల్ చివర ఉన్న త్రీ డాట్స్ ముగ్గురు వ్యక్తుల జీవితాల్ని ఇండికేట్ చేస్తాయి. అందులో ఇద్దరి పాత్రలను త్వరలో పరిచయం చేస్తాను. మూడో పాత్ర మాత్రం సస్పెన్స్. సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే! చదవండి: తల్లి గొంతు విని శ్రీసత్య ఎమోషనల్ -
టొరెంటోలో ఘనంగా ప్రారంభమైన తెలుగు చిత్రం
6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో సూర్య బెజవాడ నిర్మాతగా తెరకెక్కుతున్న ఓ సినిమా రీసెంట్గా టొరెంటో తెలుగు ప్రేక్షకల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరెంటో అపూర్వ శ్రీవాస్థవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్కు దర్శకత్వం వహించిన వరుణ్ కోరుకొండ తొలిసారి ఫీచర్ ఫిలింను డైరెక్ట్ చేయబోతున్నారు. తన చిత్రాల తరహాలోనే థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతొంది. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిషోర్లో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలో కనిపంచనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ కొరుకొండ మాట్లాడుతూ.. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను, టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్లను విడుదల చేస్తామని చెప్పారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర నిర్మాత సూర్య బెజవాడ పేర్కొన్నారు. -
ధర్మః టైటిల్కు తగ్గట్లే సినిమా ఉంటుంది!
ఆకాశవాణి ప్రభు, ప్రమీలారాణి, ఈషాన్, తుల్యజ్యోతి, యువరాజ్, వినోద్, వీరేంద్రగిద్ద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ధర్మః. విజయ్ కుమార్ యల్కోటి దర్శకత్వం వహించగా పి.యస్ ఆర్ ప్రొడక్షన్స్, యం.ఆర్.ఆర్ క్రియేషన్స్, వై.పి.బి.ఆర్ ఆర్ట్స్ పతాకంపై ప్రశాంత్కుమార్ పరిగెల, సతీష్కుమార్ చిప్పగిరి సంయుక్తంగా నిర్మించారు. రంగురాజేందర్, శ్రీధర్ సహ నిర్మాతలుగా, నవీన్ ప్రవీణ్, నరేందర్, అనంత్ రెడ్డి గంది లైన్ ప్రొడ్యూసర్స్గా వ్యవహరించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'తప్పు చేసిన వాడిని శిక్షించడమే "ధర్మః" చిత్ర కథాంశం. స్లం, రగ్డ్ & క్రైమ్ అండ్ మెసేజ్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. టైటిల్కు తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది' అన్నారు. హీరో ఆకాశవాణి ప్రభు మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సూరి అనే పాత్ర చేశాను. దర్శక, నిర్మాతలు మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఙతలు' అన్నారు. చదవండి: ట్రోల్స్, మీమ్స్ ఎంజాయ్ చేస్తా: మంచు లక్ష్మి -
కొత్త సినిమా లాంఛ్, గెస్టులుగా సుద్దాల అశోక్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్
సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. చదవండి: బికినీలో నిహారిక, ఫొటోలు వైరల్ రేవంత్కు శ్రీహాన్ వెన్నుపోటు పొడిచాడా? -
హీరోగా సక్సెస్ అవుతున్న ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్!
ఇండస్ట్రీకి ఎందరో వస్తుంటారు, పోతుంటారు.. కానీ కొందరినే విజయం వరిస్తుంది. అలాంటి విజయమే ఇప్పుడు శ్రీరామ్ నిమ్మలని వరించింది. హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీరామ్ నిమ్మలకు సినిమా అంటే పిచ్చి. హీరో ప్రభాస్కు వీరాభిమాని. తన సినిమాలు చూసి సినిమా మీద పిచ్చి ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఎన్నో ఇబ్బందులను దాటుకుని మరెన్నో ప్రయత్నాలు చేయగా 2020 లో 'ఉత్తర' చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. సినిమా విడుదలై శ్రీరామ్ నిమ్మలకి మంచి పేరు తెచ్చి పెట్టింది. తర్వాత అతడు హీరోగా నటించిన సాఫ్టువేర్ బ్లూస్, రుద్రవీణ చిత్రాలు విడుదల అయ్యాయి. రుద్రవీణ చిత్రం శ్రీరామ్కి మాస్ హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్లో విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పుడు 'మది' అనే చిత్రం నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. మూడు విభిన్న చిత్రాలు, మూడు విభిన్న పాత్రలు. సాఫ్ట్ వేర్ బ్లూస్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా, రుద్రవీణలో కమర్షియల్ ఊర మాస్ పాత్ర చేశాడు. ఇప్పుడు మది చిత్రంలో టీనేజ్ కుర్రాడు నుంచి పరిపక్వత చెందిన వ్యక్తిగా ఒక బలమైన పాత్ర చేస్తున్నాడు. ఇకపోతే 'తురుమ్ ఖానులు' అనే సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. మరొక చిత్రం "అనుకున్నవన్నీ జరగవు కొన్ని" పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. చదవండి: డ్రగ్స్ నిషా.. రెండు రోజులు లేవకపోవడంతో అందరూ టెన్షన్ నా సత్య గురించి పిచ్చిపిచ్చిగా రాస్తే ఊరుకునేదే లేదు: సత్య తండ్రి -
ఫస్ట్ సినిమాలోనే హీరోగా చేశా: నివాస్ శిష్టు
నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటించిన చిత్రం రహస్య, శివ శ్రీ మీగడ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌతమి నిర్మించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర హీరో నివాస్ శిష్టు మీడియాతో మాట్లాడుతూ.. 'మాది వైజాగ్ దగ్గర పాలకొండ, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. నాకు యాక్టింగ్ చేయాలనే డ్రీమ్ ఉన్నా సరైన వేదిక దొరకలేదు.. నా చదువు పూర్తయ్యాక నా ఫ్రెండ్ సాయంతో కెనడా వెళ్లి అక్కడ సెటిల్ అయిన నాకు కరోనా టైమ్లో "రహస్య" కథ నా దగ్గరకు వచ్చింది. ఇది నా మొదటి చిత్రం ఇక్కడ చాలా మంది నటులు ఉన్నా ఇలాంటి మంచి సినిమాలో హీరోగా విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారిగా నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నేను నటనలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. టీం అంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో నాకు నటన ఈజీ అయ్యింది' అన్నాడు నివాస్ శిష్టు. చదవండి: ఫోన్ కొనిచ్చేందుకు నాన్న అప్పు చేశాడు: నేహా చౌదరి ఇద్దరు మాజీ ప్రియులతో సుష్మితా సేన్ పార్టీ -
దాదాపు 100పైగా థియేటర్లోకి ‘రామ్ మోహన్ కంచుకొమ్మల’ చిత్రం
రామ్ మోహన్ కంచుకొమ్మల దర్శకుడిగా పరిచమవుతున్న చిత్రం ‘రామ్ మోహన్ కంచుకొమ్మల’. ముకుంద మూవీస్ పతాకంపై సి.కల్పన నిర్మిస్తున్న వైవిధ్యభరిత మహిళా ప్రధాన చిత్రమిది. ఇందులో రామ్ కంచుకొమ్మల లీడ్ రోల్ పోషిస్తున్నారు. దివ్వకీర్తి, గరిమాసింగ్, నైనిక వరాలబాబు, సంతోష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ మోహన్ కంచుకొమ్మల మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో వారిలో స్ఫూర్తి నింపేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగిల్ కట్ చెప్పకుండా మా సినిమా ‘ఎ’ సర్టికెట్తో సెన్సార్ పూర్తయ్యింది. ఈనెల 16న సుమారు 100 థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దేవీప్రియ, రిషిత, మైత్రి, మహేశ్వరి, ఆపిల్ బాబు, త్రిమూర్తులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్-లలిత్ కిరణ్- రాము అద్దంకిలు సంగీతం అందించారు. -
విడుదలకు సిద్ధమైన ‘ఏమైపోతానే’ మూవీ
అమర్లతు, చాందిని పౌర్ణమి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఏమైపోతానే. ఇటీవల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. సురేశ్ కుమార్ కుసిరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో విజయ్ రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ల్లో దర్శకుడు, నిర్మాత సురేశ్ కుసిరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రేమకథా సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను. పాటలకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ప్రీమియర్ షో కి వచ్చిన రెస్పాన్స్ కూడా మర్చిపోలేనిది. ఆరోజు అందరి స్పందన నాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఈ సినిమా లో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో నటించిన, పనిచేసిన అందరు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు. జులై 1న ఈ చిత్రం అందరి ముందుకు రాబోతుంది’ అన్నారు. -
సాప్ట్వేర్ బ్లూస్ అంటే లక్షల్లో శాలరీలు, అమ్మాయిలు, పబ్బులు కాదు
శ్రీరాం, భావన, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కేయస్ రాజు, బస్వరాజ్ ముఖ్య తారలుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘సాఫ్ట్వేర్ బ్లూస్’. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా రిలీజ్ ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. ‘‘సాప్ట్వేర్ బ్లూస్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు లక్షలలో శాలరీలు, అమ్మాయిలు... పబ్బులు కాదు ..’ అనే డైలాగ్తో ఉన్న ఈ ట్రైలర్ చాలా హిలేరియస్గా ఉంది. సాఫ్ట్వేర్ జాబ్లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు, వారి జీవితాల గురించి ఉమాశంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు క్రిష్. ‘‘సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో అవుట్ అండ్ అవుట్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వీకే రాజు. చదవండి: తన సినిమాకు తనే పాట రాసిన డైరెక్టర్.. అదిరిపోయిందిగా! -
విరాటపర్వం రోజే రిలీజవుతున్న మొనగాడు
కీలుగుర్రం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఆకుల వంశీ, పావని, దేవ్ గిల్, ఛత్రపతి శేఖర్ మొదలగువారు నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం మొనగాడు. వంశీ ఆకుల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత వంశీ ఆకుల మాట్లాడుతూ..."లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా మొనగాడు చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని కార్యక్రమలు పూర్తి చేసుకుని ఈ నెల 17న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. ఇందులో దేవ్ గిల్, ఛత్రపతి పాత్రలు చాలా పవర్ ఫుల్గా ఉంటాయి. నాలుగు ఫైట్స్, రెండు పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం"` అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ః ఉదయ్ భాస్కర్; సంగీతంః ర్యాప్ రాక్ షకీల్; ఎడిటర్ః బొంతాల నాగేశ్వరరెడ్డి. కాగా జూన్ 17న విరాటపర్వం, గాడ్సే సినిమాలు సైతం విడుదలవుతున్నాయి. మరి మొనగాడు ఆ సినిమాల నుంచి ఎదురయ్యే పోటీని ఎలా తట్టుకుంటుందో చూడాలి! చదవండి: కేరింత నటి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ లేటెస్ట్ ట్రెండ్.. స్టేజ్పై స్టార్ హీరోల స్టెప్పులు -
హీరోగా రాబోతున్న డైరెక్టర్ కుమారుడు తేజ్
తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 2. ఈ మూవీ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగ చైతన్య హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్ట్ ఏ.సి.యస్ కిరణ్ అందించారు. దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ.. మేము పిలవగానే వచ్చిన హీరో నాగ చైతన్య కు, సి కళ్యాణ్, సముద్ర గార్లకు, నాకు ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ కథ ఉంటుంది. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ చేసుకుని జులై ఫస్ట్ నుంచి అరకులో మిగిలిన షూటింగ్ జరుపుకుని సెప్టెంబర్లో షూటింగ్ పూర్తి చేసుకొని అదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు. చిత్ర హీరో తేజ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్యాషన్. మా నాన్న గారు నన్ను ఫోర్స్ చేయలేదు. నాకు ఏది ఇష్టమో అది చేయమన్నారు. నాకు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాకు కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని నేర్చుకొని నా ఇంట్రెస్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నేను చేస్తున్న ఈ మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. చదవండి: బిగ్బాస్ ఆరో సీజన్లోకి హర్ష సాయి? సినిమాల్లోకి రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత -
రావణలంక ఫేమ్ క్రిష్ లవ్వాట
‘రావణలంక’ ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరోగా, మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటించనున్న చిత్రం ‘లవ్వాట’. ఆర్.కె. గాంధీ దర్శకుడు. నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ఎన్. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్ నిర్మించనున్నారు. టైటిల్ కాంటెస్ట్లో విజేతగా నిలిచిన మానే రామారావు ‘లవ్వాట’ టైటిల్ లోగోని విడుదల చేశారు. ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ– ‘‘నా తొలి, మలి సినిమాలు ‘ప్రేమభిక్ష, రుద్రాక్షపురం’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి. మూడో చిత్రం ‘లవ్వాట’ టైటిల్ లాంచ్ జరుపుకోవడం ఆనందంగా ఉంది. ప్రేమ పట్ల నేటి తరం ధృక్పథం ఎలా ఉందో వినోదాత్మకంగా ‘లవ్వాట’లో చెప్పనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందిస్తాం’’ అన్నారు. ‘‘జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్. నాగేంద్ర, సంగీతం: జీకే. చదవండి: సీక్రెట్ స్మోకింగ్పై స్పందించిన బిందుమాధవి కుంభకర్ణుడిలా పడుకుంది చాలు, ముందు అప్డేట్ ఇవ్వు