TG Vishwa Prasad's Mother Geethanjali Passed Away - Sakshi
Sakshi News home page

ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇంట విషాదం

Published Fri, Jun 30 2023 7:08 PM | Last Updated on Fri, Jun 30 2023 7:51 PM

TG Vishwa Prasad Mother Geethanjali Passed Away - Sakshi

టీజీ విశ్వప్రసాద్

ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. విశ్వప్రసాద్‌ తల్లి  గీతాంజలి (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గీతాంజలి గారు చికిత్స పొందుతున్నారు.

కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం ఆమె తుది శ్వాస విడిచారు. గీతాంజలి గారికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్  పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement