టాలీవుడ్ యంగ్ హీరో సూపర్‌ హిట్‌ సిరీస్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్! | Nikhil Siddhartha Announced Karthikeya 3 Series - Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha: నిఖిల్- చందు మొండేటి కాంబో.. ముచ్చటగా మూడోసారి వచ్చేస్తోంది!

Published Sun, Mar 17 2024 3:51 PM | Last Updated on Sun, Mar 17 2024 3:56 PM

Tollywood Young Hero Nikhil Ready Announce karthikeya 3 Series - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్‌లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. 

ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్‌ సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్‌ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్‌ - చందు కాంబోలో మరో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్‌ వినిపిస్తోంది. 

కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్‌ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement