Nikhil Siddharth
-
రామ్ చరణ్ నిర్మాణ సంస్థలో టాలీవుడ్ హీరో.. షూటింగ్ ప్రారంభం!
టాలీవుడ్ హీరో హీరో నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ' ది ఇండియా హౌస్'. ఈ సినిమాకు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సంస్థ వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.ఈ మూవీ షూటింగ్ను హంపిలోని విరూపాక్ష ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ శివుని ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను 1905లో జరిగిన పీరియాడిక్ కథాచిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝙏𝙝𝙚 𝙨𝙥𝙖𝙧𝙠 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙧𝙚𝙫𝙤𝙡𝙪𝙩𝙞𝙤𝙣 𝙞𝙨 𝙞𝙜𝙣𝙞𝙩𝙚𝙙 🔥#TheIndiaHouse commences on an auspicious note with a pooja ceremony at the Virupaksha Temple, Hampi with the blessings of Lord Shiva 🔱Stay tuned for more updates ❤️🔥#JaiMataDi #RevolutionIsBrewing pic.twitter.com/qZyTjqIP62— V Mega Pictures (@VMegaPictures_) July 1, 2024 -
టాలీవుడ్ యంగ్ హీరో సూపర్ హిట్ సిరీస్.. ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. బాలీవుడ్లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్ సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ - చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. Dr. Karthikeya In Search of a Brand new Adventure ... Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI — Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024 -
హీరో నిఖిల్ కుమారుడి నామకరణ వేడుక
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ తెగ సంతోషించాడు. ఏడాది క్రితం నాన్న చనిపోయాడని, ఆయనే మళ్లీ తన కొడుకుగా తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యాడు. కుమారుడిలోనే తండ్రిని చూసుకుని మురిసిపోయాడు. తాజాగా నిఖిల్ ఇంట అతడి తనయుడి బారసాల వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. నిఖిల్-పల్లవి దంపతులు తమ కుమారుడికి కొత్త బట్టలు వేసి తొట్లె(ఊయల)లో వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ దంపతులు బాబుకు ఏ పేరు పెట్టి ఉంటారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కాగా నిఖిల్ - పల్లవి 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. చదవండి: స్టేజీపై హీరోయిన్కు హారతి.. వామ్మో.. బానే ఎక్స్ట్రాలు కొడ్తున్నాడే! -
ప్రత్యేకంగా నీ బ్యాటింగ్ కోసమే వచ్చా బ్రో: విశ్వక్ సేన్
ఇటీవల సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మ్యాచులు హైదరాబాద్లో నిర్వహించారు. మార్చి 1,2,3 తేదీల్లో వరుసగా మ్యాచులతో టాలీవుడ్ స్టార్స్.. ఇతర సినీ ఇండస్ట్రీ టీమ్స్ కూడా సందడి చేశాయి. ఉప్పల్ స్డేడియం వేదికగా ఈ మ్యాచులు జరిగాయి. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మన తెలుగు వారియర్స్ టీమ్లో స్టార్ బ్యాటర్గా కొనసాగుతున్నారు. తాజాగా మన యంగ్ నిఖిల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విశ్వక్సేన్తో ఫన్నీగా సంభాషిస్తూ కనిపించారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి. ఇటీవల జరిగిన ఉప్పల్ మ్యాచ్లో యంగ్ హీరోలు నిఖిల్, విశ్వక్ సేన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిఖిల్ బ్యాటింగ్ చూసేందుకు స్టేడియానికి వచ్చానని విశ్వక్ సేన్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. 'నిఖిల్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు.. నేను ప్రత్యేకంగా నిఖిల్ బ్యాటింగ్ కోసమే వచ్చా. బ్యాటింగ్ టిప్స్ బాగా తెలుసు. ఇటీవలే రిజల్ట్ కూడా వచ్చింది' అంటూ విశ్వక్ సేన్ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్, విశ్వక్ సేన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. విశ్వక్ సేన్ నటించిన చిత్రం గామి ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. Thanks a lot bro , nice batting bro . 🤗❤️ https://t.co/sXv26lAY7d — VishwakSen (@VishwakSenActor) March 2, 2024 -
తండ్రైన యంగ్ హీరో నిఖిల్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. Our Unique Star ⭐️@actor_Nikhil and his wife #Pallavi are now blessed with a BABY BOY❤️ Warmest congratulations to the glowing couple on this delightful addition to their family 🤗✨#NikPal pic.twitter.com/ihRleHFUY8 — Team Nikhil Siddhartha Telangana ✊ (@TS_Team_Nikhil) February 21, 2024 -
భారత్-చైనా సంబంధాల ఇతివృత్తంతొ ‘చైనా పీస్’
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "చైనా పీస్". రిపబ్లిక్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ చిత్రం ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్ను లాంచ్ చేశారు. లిప్స్టిక్ , యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది. దేశభక్తి, భారతదేశం-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. -
Swayambhu: హనుమాన్ భక్తుడిగా నిఖిల్!
నిఖిల్ హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.‘స్వయంభూ’ సినిమా అప్డేట్ను షేర్ చేశారు నిఖిల్. ‘‘నాన్స్టాప్గా మా సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో నేను హనుమాన్ భక్తుడి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ జై శ్రీరామ్. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరిస్తున్నాం. దసరా లేదా దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్లో ఉన్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు నిఖిల్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. #Swayambhu shooting in full swing with key sequences being shot 💥💥@actor_Nikhil will be seen as a devotee of Lord Hanuman in the film ❤️🔥@iamsamyuktha_ @krishbharat20 @RaviBasrur @manojdft @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/rMyTKrghZJ — Kakinada Talkies (@Kkdtalkies) January 16, 2024 -
నిన్న అఖిల్...ఈ రోజు నిఖిల్...మీరు మారిపోయారయ్యా
-
ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
‘‘స్పై’కి నా కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. మా సినిమాని ఇంతగా ఆదరించి, నా కెరీర్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తూ మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇకపైనా మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని మాట ఇస్తున్నా’’ అని నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్ మాట్లాడుతూ–‘‘స్పై’కి ఇంత పెద్ద ఓపెనింగ్స్ (రూ. 11 కోట్ల 7లక్షలు) రావడం హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ సంతోషంగా ఉన్నారు’’ అన్నారు. ‘‘మాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు గ్యారీ బీహెచ్. -
నిఖిల్ని చూసి గర్వపడుతున్నా
‘‘స్పై థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు.. అది ఒక సవాల్. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. కానీ, ‘స్పై’ టీజర్, ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. అంతర్జాతీయ స్థాయి విలువలకు ఏ మాత్రం తగ్గలేదు. రాజశేఖర్, చరణ్ తేజ్ల ప్యాషన్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యామీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పై’. ఈడీ ఎంటర్టైన్ మెంట్స్పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాపీడేస్’ తో కెరీర్ మొదలుపెట్టి, ‘స్వామిరారా, కార్తికేయ’ తో ఓ ట్రెండ్ సెట్ చేసి, ‘కార్తికేయ 2’ తో బాక్సాఫీస్ని షేక్ చేశాడు.. తనని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ‘కార్తికేయ 2’ తో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశాడో.. ‘స్పై’ చిత్రంతో ఆ ట్రెండ్ దాటి తర్వాతి స్థాయికి వెళతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ–‘‘సుభాష్ చంద్రబోస్ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్న సినిమా ‘స్పై’. నాలుగురోజుల కిందట ఈ మూవీ ఫైనల్ కాపీ చూశాక ‘థ్యాంక్యూ గ్యారీ’ అన్నాను.. అంత బాగా ఈ మూవీ తీశాడు. ఇలాంటి సినిమా చేసినందుకు యూనిట్ అంతా గర్వపడుతున్నాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్తో ‘స్పై’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు కె.రాజశేఖర్ రెడ్డి. గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ–‘‘డాక్టర్ అయిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ, నా తల్లితండ్రులు ఒప్పుకుని, నన్నుప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘స్పై’ చాలా బాగా తీశావంటూ నిఖిల్గారు నన్ను హత్తుకోవడంతో సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’’ అన్నారు. ఈ వేడుకలో ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్, సంగీత దర్శకుడుశ్రీచరణ్ పాకాల, కెమెరామేన్ వంశీ పచ్చిపులుసు, యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, నటీనటులు సాన్య ఠాకూర్, ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు. -
ఈ వారం థియేటర్తో పాటు ఓటీటీల్లో చూడదగిన మూవీస్ ఇవే
‘ఆదిపురుష్’ విడుదలైన తర్వాత రెండు వారాల వరకు థియేటర్లో ప్రేక్షకులను రప్పించే సినిమాలు ఏవీ విడుదల కాలేదనే చెప్పవచ్చు. ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్ వల్ల కొన్ని సినిమాలను వాయిదా కూడా వేసుకున్నారు. అందువల్ల గత వారంలో పెద్ద చిత్రాలేవి విడుదల కాలేదు. దాదాపు అన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా సినీ ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ జూన్ 30న బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి కొనసాగనుంది. ఈ వారం థియేటర్లోనే కాకుండా ఓటీటీలోనూ వెబ్సిరీస్లతో పాటు పలు కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. నిఖిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'స్పై' జూన్ 29న గురువారం విడుదల కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీతో పాటు ఆయన జీవితానికి సంబంధించిన ఎప్పుడూ వినని అంశాలతో సినిమాను తెరకెక్కించారు. నిఖిల్ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో ఆర్యన్ రాజేశ్, ఐశ్వర్య మేనన్, సన్యా ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాజశేఖర్రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా 'వివాహభోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సామజ వరగమన'. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను హీరో చిరంజీవి విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. 2008లో 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్' అప్పట్లో పెద్ద హిట్గా నిలిచింది. తాజాగా దాదాపు 14ఏళ్ల తర్వాత అదే సీరిస్లో 'ఇండియానా జోన్స్' కొత్త చిత్రం జూన్ 30న థియేటర్లోకి రాబోతోంది. అడ్వెంచర్ సినీ ప్రియులకు ఈ సినిమా పండుగే అని చెప్పవచ్చు. ఈ వారం థియేటర్/ ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ ఇవే డిస్నీ+హాట్స్టార్ • వీకెండ్ ఫ్యామిలీ (వెబ్సిరీస్) జూన్ 28 • ది నైట్ మేనేజర్ (సిరీస్2) జూన్30 నెట్ ఫ్లిక్స్ • లస్ట్ స్టోరీస్ 2 (హిందీ) జూన్ 29 • అఫ్వా (హిందీ) జూన్30 అమెజాన్ ప్రైమ్ • జాక్ ర్యాన్ (వెబ్సిరీస్ 4) జూన్ 30 థియేటర్లో • నిఖిల్ 'స్పై' జూన్ 29 • 'ఇండియానా జోన్స్' జూన్ 29 • శ్రీ విష్ణు 'సామజ వరగమన' జూన్ 30 • 'లవ్ యూ రామ్' జూన్ 30 • పాయల్ రాజ్పుత్ 'మాయా పేటిక' జూన్ 30 ఆహా • అర్థమయ్యిందా అరుణ్కుమార్ (తెలుగు సిరీస్) జూన్ 30 -
నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమన్నారు: హీరో నిఖిల్
టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఫోన్ డేటాను సేకరించారు. అందులో అతడు ఓ హీరోయిన్తో పాటు అషూ రెడ్డి, సురేఖా వాణి, ఆమె కూతురితో కలిసి దిగిన ఫోటోలు, వారితో సంభాషణలు జరిపినట్లుగా వందలాది ఫోన్ కాల్స్ ఉన్నాయి. వీరితో పాటు బడాబాబులు కూడా ఆయన జాబితాలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై హీరో నిఖిల్ సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శనివారం హైదరాబాద్లో రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక శాఖ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన 'పరివర్తన' కార్యక్రమానికి నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది సిగరెట్ తాగమని ఆఫర్ చేశారు. మరికొందరైతే చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమని అడిగారు. కానీ ఒక్కసారి దానికి అలవాటు పడితే జీవితంలో మంచి రోజులు అనేవే ఉండదు. జీవితం సర్వనాశనమవుతుంది. అలాంటివాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల జీవితం ఎంతో అందమైనది. డ్రగ్స్ అంటే జీవితానికి చరమగీతం పాడటమే! అది దృష్టిలో పెట్టుకుని దానికి దూరంగా ఉండండి. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దు. త్వరలోనే రాష్ట్రం మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా మారాలని కోరుకుంటున్నా' అన్నాడు నిఖిల్. చదవండి: చైతూను మెచ్చుకోవాల్సిందే, సమంతలో ఆ క్వాలిటీ నచ్చుతుంది: శోభిత -
అవును, నిర్మాత నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం: నిఖిల్
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా బాలీవుడ్లోనూ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా లెవల్లో తన సినిమాలు రిలీజ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు స్వయంభు, ద ఇండియా హౌస్, స్పై వంటి క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్నాడు. గురువారం స్పై సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాతకు, నిఖిల్కు మధ్య గొడవలు అవుతున్నాయని కొంతకాలం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. జూన్ 29న స్పై రిలీజ్ చేయాలని నిర్మాత రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడే రిలీజ్ వద్దు, దేశం మొత్తం సినిమా ప్రమోషన్స్ చేద్దామని హీరో వాదించుకున్నారట. నిర్మాత ఎంతకూ అందుకు ఒప్పుకోకపోవడంతో నిఖిల్ అప్సెట్ అయ్యాడట. మరోవైపు ఆదిపురుష్ హవా తగ్గడంతో నిర్మాత మరోసారి స్పై రిలీజ్ డేట్ ప్రకటించాడు. చివరకు నిర్మాత దారిలోకే వచ్చిన నిఖిల్ ఆయన చెప్పిన డేట్కే కట్టుబడి ఉన్నాడు. తాజాగా నిఖిల్ ఈ గొడవపై స్పందిస్తూ.. 'అవును.. నిర్మాత, నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ అదంతా సినిమా కోసమే! ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. రూ.250 పెట్టి థియేటర్కు వచ్చే ప్రేక్షకులకు వినోదం పంచాలి. ఇది మంచి సినిమా. అందుకే ఇంకాస్త సమయం తీసుకుందామని కోరాను. అయితే క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ తగ్గిపోయినా మార్నింగ్షో తర్వాత ప్రేక్షకులు ఉండరు. అందుకే మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శకనిర్మాతలు నన్ను సంతృప్తి పరిచారు కాబట్టే ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చాను' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించాడు. చదవండి: పదేపదే అందంగా లేనని చెప్తుంటే: శోభిత ధూళిపాళ -
హీరో నిఖిల్ 'స్పై' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ కొత్త బ్యానర్.. ఆ యంగ్ హీరోతోనే తొలి సినిమా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ రెడ్డి ఇటీవలే వి మెగా పిక్చర్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్తవారికి ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ ప్రారంభించినట్లు వెల్లడించారు. తాజాగా ఈ బ్యానర్లో తొలి చిత్రాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా పాన్ ఇండియా మూవీని ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కార్తికేయ సిరీస్తో సూపర్ హట్స్ సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా.. 'ది ఇండియా హౌస్' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.లండన్లో స్వాతంత్య్రం రాకముందు ఏం జరిగిందనే నేపథ్యంలో ది ఇండియా హౌస్ను తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: కేఎల్ రాహుల్పై దారుణ ట్రోల్స్.. గట్టిగానే కౌంటరిచ్చిన అతియా శెట్టి!) On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film - THE INDIA HOUSE headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna! Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV — Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023 -
స్పైకి కథే హీరో
‘‘ఈ మధ్య ప్రేక్షకులు ఇష్టపడుతున్నది మంచి కథనే. హీరో, ఎంటర్టైన్మెంట్ ఎంత ఉన్నా కథ అనే సోల్ లేకపోతే బ్లాక్ బస్టర్ అవ్వదు. ‘స్పై’ మూవీకి కథే హీరో’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ – ‘‘సుభాష్ చంద్రబోస్గారి గురించి, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి, ఆ సంస్థ సేవల గురించి చాలామందికి తెలియదు. దేశానికి తెలియాల్సిన ఆ విషయాలతో పాటు వినోదాత్మకంగా ఈ మూవీ ఉంటుంది’’ అన్నారు. ‘కార్తికేయ 2’ తర్వాత ఓ పార్టీకి అనుకూలంగా మీరు ‘స్పై’ చేస్తున్నారనే ప్రచారంపై మీ స్పందన అని అడగ్గా – ‘‘కృష్ణుడంటే నాకు నమ్మకం. అందుకే ‘కార్తికేయ 2’ చేశాను. ఇప్పుడు ఓ భారతీయుడిగా ‘స్పై’ చేశాను. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు’’ అన్నారు నిఖిల్. ‘‘డైరెక్టర్గా నా తొలి సినిమా నిఖిల్తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు గ్యారీ బీహెచ్. ‘‘స్పై’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు’’ అన్నారు చరణ్ తేజ్ ఉప్పలపాటి. సంగీత దర్శకులు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, మాటల రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. -
కార్తికేయ 2 బ్లాక్బస్టర్.. హీరో నిఖిల్కు అరుదైన అవార్డు
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 తో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గా కూడా మంచి విజయం అందుకుంది. కార్తికేయ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 121 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఉత్తరాది, దక్షిణాదిలో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది కార్తికేయ. దీంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్గా మారాడు. కార్తికేయ-2 చిత్రం టీవీ ప్రీమియర్, OTT స్ట్రీమింగ్లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా అవార్డుల విభాగంలోనూ నిఖిల్ తన సత్తాను నిరూపించుకున్నాడు. తాజాగా కార్తికేయ చిత్రంతో, ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడం విశేషం. కార్తికేయ - 2 చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతో చందు మొండేటి కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతో పాటు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదే నని బలంగా చెప్పాడు. మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. కాగా నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ స్పైతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 5 భాషల్లో రూపొందుతుంది. -
ఆహాలో 18 పేజెస్, స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్.గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్తో పాటు మంచి వసూళ్లే వచ్చాయి. ఫీల్ గుడ్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అటు ఆహా, ఇటు నెట్ఫ్లిక్స్ రెండూ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! అయితే ముందుగా 18 పేజెస్ ఆహాలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మరింకెందుకాలస్యం.. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే శుక్రవారం ఫ్యామిలీతో కలిసి 18 పేజెస్ వీక్షించేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ కథ అందించగా ఆయన శిష్యుడు, కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ డైరెక్టర్గా వ్యవహరించాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. Mee intrigue ki therapadabothundhi😅 Suku"Mark" magic ki ready ga undandi!#18PagesOnAHA | Premieres Jan 27 #18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @idineshtej @NavinNooli @lightsmith83 @GA2Official @SukumarWritings @adityamusic pic.twitter.com/g33HqN6RCL — ahavideoin (@ahavideoIN) January 20, 2023 చదవండి:గర్భవతిగా పూజా.. స్విమ్మింగ్ పూల్లో ముద్దులాట అంబానీ ఇంట్లో ఫంక్షన్కు ఆ డ్రెస్లో వెళ్తావా? -
ఫీల్గుడ్ లవ్స్టోరీ ‘18 పేజెస్’ వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్తో దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో అదే జోరు కొనసాగుతోంది. ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్కు వచ్చి సినిమా చూస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు (వారం రోజులకు) రూ. 20 కోట్ల గ్రాస్ సాధించి విజయంతంగా ముందుకు సాగుతుంది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్గుడ్ లవ్స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందినిల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ -
ఆ సినిమాతో పోల్చడం సంతోషం
‘‘ఫీల్ గుడ్ సినిమా ఆడదు.. ప్రేమ కథలు ఇంటికి (ఓటీటీ) వచ్చినప్పుడు చూద్దాంలే’ అని ప్రేక్షకులు అను కుంటున్న తరుణంలో ‘సీతారామం’ వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లయిమాక్స్కి ఉన్న ఫీలింగ్ మా ‘18 పేజెస్’కి వచ్చిందని చాలామందిపోల్చి చెబుతుంటే సంతోషంగా ఉంది. మా సినిమా చూస్తే ఒక నవలను చదివిన అనుభూతి కలిగేలా దర్శకుడు మలిచాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్’. డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘మా సినిమా మొదటిరోజు వసూళ్ల కంటే మూడో రోజు ఎక్కువ ఉన్నాయి. ఈ చిత్రం విషయంలో మేం లాభాల్లో ఉన్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు ‘మాకు మేమే ప్రేమలో పడిన అనుభూతి వస్తోంది’ అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస’’ అన్నారు సూర్యప్రతాప్. ‘‘2022లో టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్లో మా ‘18 పేజెస్’ ఉంటుంది. కెరీర్ వైజ్గా నా జీవితంలో ఇది బెస్ట్ ఇయర్’’ అన్నారు నిఖిల్. ‘‘శతమానం భవతి’లో నేను చేసిన నిత్య ΄ాత్రకి ఎంత మంచి పేరొచ్చిందో ‘18 పేజెస్’లో నందిని ΄ాత్రకి కూడా అంతే పేరొచ్చింది’’ అన్నారు అనుపమ. ∙ నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, బన్నీ వాసు, సూర్యప్రతాప్ -
సక్సెస్ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ నేను మంచి కథలు, మంచి సినిమాల్లో నటించాను. కానీ నటనలో నాకు ఉన్న ప్రతిభకు సరైన పేరు రాలేదని ఫీలవుతుంటాను. అయితే ‘18 పేజెస్’ రిలీజ్ తర్వాత కేవలం ఈ సినిమా గురించే కాకుండా నా నటన గురించి కూడా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘18 పేజెస్’ చిత్రం ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడిన క్రేజీ లవ్స్టోరీ ఇది. 18 పేజెస్ ఆధారంగా నందినీతో సిద్ధు ఏ విధంగా ప్రేమలో పడతాడు? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే కథ. ఈ సినిమా క్లయిమాక్స్ని ఊహించలేకపోయాను. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం కూడా ఉంది. హిట్టయినా కాకపోయినా మేం ఓ మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ భావిస్తారనే గ్యారంటీ ఇవ్వగలను. ► థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లవ్స్టోరీ కాకుండా.. ఈ సినిమాలో వేరే అంశాలేమైనా? కొన్ని సామాజిక అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఎవరో ఒక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని అతను ఆమెపై యాసిడ్తో దాడి చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటివి వార్తల్లో చూస్తున్నాం. ఓ అమ్మాయికి ఎలాంటి గౌరవం దక్కాలి? ఆమె పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి? పెద్దల పట్ల యువత తీరు ఎలా ఉంటే బాగుంటుంది? అనే అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత బ్రేకప్ను కూడా పాజిటివ్గా తీసుకుంటారు. ► ఈ చిత్రంపై దర్శకుడు సుకుమార్ మార్క్ ఎంత? వంద శాతం ఆయన మార్క్ కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల క్యారక్టరైజేషన్స్, స్క్రీన్ప్లే డిఫరెంట్గా ఉన్న ఇలాంటి లవ్స్టోరీని నేనిప్పటివరకు చేయలేదు. ప్రతి సీన్ చాలెంజింగ్గా అనిపించింది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా? పాన్ ఇండియా హీరో అన్న ప్రతిసారీ నాకు ఒత్తిడే. నాకు తెలిసి సక్సెస్ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు. ► మీ తర్వాతి చిత్రాలు? నెక్ట్స్ ఇయర్ ఓ స్పై మూవీతో రాబోతున్నాను. దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కోసం పరిశోధన చేస్తున్నారు. నా ‘యువత’ సినిమా రిలీజైన ఐదు రోజులకు సుకుమార్గారు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆయనతో సినిమా ఎప్పుడో చెప్పలేను. ► మనతో పని చేసేవారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను కూడా పొగుడుతుంటారు. రియల్ పర్సన్స్ను కలిసినప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ద్వారా రియల్ పీపుల్ను కలిసే చాన్స్ నాకు లభించింది. సోషల్ మీడియాలో నాకో ఫేక్ ప్రొఫైల్ ఉంది. నెటిజన్ల కామెంట్స్ చదువుతూ నిజాలు తెలుసుకుంటుంటాను. నా సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయాలను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంటాను. ► అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఊహించని విధంగా హిట్స్ పడ్డాయి. అలాగే ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో ఆడియన్స్ దృష్టిలో పడ్డాను. ఇదంతా ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటాను. -
నిఖిల్ సిద్ధార్థ్ '18 పేజిస్' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
కార్తికేయ 2 ఫస్ట్ టైమ్ టీఆర్పీ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే! అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇటీవల బుల్లితెరలోనూ ప్రసారమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా జీ తెలుగులో ప్రసారం కాగా 7.88 రేటింగ్ అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో 'కార్తికేయ 2'కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన సూపర్నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చదవండి: హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది? ఓటీటీలో ల్యాండయిన జిన్నా మూవీ -
18 Pages: ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే..’ ఆకట్టుకుంటున్న క్లాసీ మెలోడీ
నిఖిల్ సిద్దార్థ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగేనా నన్నయ్య రాసిన కావ్యమాగితే, తిక్కన తీర్చేనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా .. అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు. -
18 పేజేస్ చివరి షెడ్యూల్లో పాల్గొన్న నిఖిల్.. ఫోటో వైరల్
నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే కార్తికేయ-2తో హిట్టు కొట్టిన ఈ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఇదే కాకుండా గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా ఆయన కథను అందించిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ 18 పేజెస్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి GA2 పిక్చర్స్పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభం కాగా, నిఖిల్ ఈ షూటింగులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. -
కార్తికేయ 2 హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్: పరుచూరి గోపాలకృష్ణ
కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రళయాన్నే సృష్టించింది. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 13న రిలీజైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాలోని బలాబలాలను విశ్లేషించాడు పరుచూరి గోపాలకృష్ణ. 'కష్టేఫలి అన్న సూత్రం నిఖిల్ విషయంలో నిరూపితమైంది. కార్తికేయ 2.. బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. చందూ మొండేటి... ఈ జానపద కథను సాంఘిక కథగా మలిచి రాసినట్లు అనిపించింది. కథను నమ్మితే ఆ కథ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు. సినిమాలో తల్లి సెంటిమెంట్ను వాడుకున్నారు. ఇద్దరు కమెడియన్స్ను, హీరోయిన్ను హీరో పక్కన పెట్టుకున్నాడు. సామాన్యంగా ఇలాంటి సినిమాల్లో ప్రేమ మిస్ అవుతుంది. తెలివిగా చందూ మొండేటిగారు ఏం చేశారంటే ప్రతి ఫ్రేములోనూ హీరో హీరోయిన్ ఉండేలా జాగ్రత్తగా రాసుకున్నారు. మధ్యలో హీరోయిన్.. హీరోకు ఝలక్ ఇచ్చి వెళ్లిపోయినట్లు చీట్ చేసినా మళ్లీ తిరిగొచ్చినట్లు చేశారు. క్లైమాక్స్లో హీరో పాముల మధ్యలో నడుచుకుంటూ వెళ్లి హంసను తీసుకువచ్చి మురళీకి తగిలించి కృష్ణుడి చేతిలో పెట్టేవరకు కూడా అద్భుతమైన స్క్రీన్ప్లే రాశారు చందు మొండేటి. నాలాగా చాలా సినిమాలు రాసిన కొద్దిమంది తప్ప మామూలు ప్రేక్షకులు దాన్ని క్యాచ్ చేయలేరు. చివర్లో కార్తికేయ 2కు సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. చందూ మొండేటి అత్యంత సాహసం చేశారు. అతడి కెరీర్లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఎవరికీ అమ్ముడుపోకుండా ప్రపంచానికి మంచి జరగాలనే కోరికతో దీన్ని ముగించారు. స్క్రీన్ప్లేలో ఎలాంటి దోషం లేదు. కావాలని కామెడీ సీన్స్ చొప్పించలేదు. కార్తికేయ 2ను కోట్లాది మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: నెట్ఫ్లిక్స్లో నాగార్జున ఘోస్ట్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జైలుకు వెళ్లే డిజాస్టర్ కంటెస్టెంట్ ఎవరంటే? -
అమ్మ కోసం అయినా ఆ సినిమా చేస్తా: నిఖిల్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ ఏడాది ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం రూ.130 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్లోనే కాకుండా ఓటీటీలోనూ ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్తికేయ 3పై నిఖిల్ స్పందించాడు. (చదవండి: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న బాలయ్య చిన్న కూతురు) తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ముందు కార్తికేయ సినిమా తీస్తున్నప్పుడు సీక్వెల్ అనుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 ఎప్పుడు తీస్తారు అని అడిగారు. అంటే ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకున్నారని అర్థమైంది. ఇప్పుడు కార్తికేయ 3 గురించి అడుగుతున్నారు. ఆ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఒకవేళ నేను కార్తికేయ 3 చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మ మాత్రం నన్ను వదలదు. అమ్మ కోసం అయినా ఆ సినిమా చేయాలి’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు విషయంపై మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వస్తే బాగుంటుంది. కానీ ప్రతి సినిమా ఆస్కార్ కోసం తీయరు. ఇది కేవలం సర్టిఫికేట్ కాదు. మాకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు అన్నింటికంటే ముఖ్యం. అవే గొప్పవి ’అన్నారు. -
ఓటీటీని షేక్ చేస్తున్న కార్తికేయ 2 మూవీ!
టాలీవుడ్లో రిలీజైన చిన్న చిత్రం కార్తికేయ 2 ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే! నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీలోనూ అత్యధిక వసూళ్లు సాధించి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదలై కొన్ని వారాలపాటు థియేటర్లలో జైత్రయాత్ర నడిపింది. అక్కడ కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లోకి అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన కార్తికేయ 2 ప్రస్తుతం ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 48 గంటల్లోనే 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో దుమ్మురేపుతున్న కార్తికేయ 2 విజృంభణను జీ5 అధికారికంగా ట్విటర్లో వెల్లడించింది. Did you hear this?? 100 Crore + streaming minutes in just 48 hours!! You love it❤️ We love youu!!❤️ Go WATCH #Karthikeya2OnZee5 again!https://t.co/gbvSmBkS5F@actor_Nikhil@anupamahere@Actorysr@harshachemudu@AnupamPKher#karthikeya2#ChoostuneUndipotaaru pic.twitter.com/HUdhjKKoVY — ZEE5 Telugu (@ZEE5Telugu) October 7, 2022 చదవండి: ఆ హీరోతో కలిసి పని చేస్తే ఇక అంతే సంగతులట! ఓటీటీలో అల్లూరి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
కార్తికేయ- 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లోనూ అత్యధిక వసూళ్లతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని అందుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ అందరి అంచనాలు తలకిందులుగా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా `కార్తికేయ 2` నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం జీ5 సంస్థ కార్తికేయ2 డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. -
కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్
కార్తికేయ-2 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న హీరో నిఖిల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా కంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. మొత్తం 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందీ చిత్రం. నార్త్ ఆడియెన్స్కు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కార్తికేయ-3 కోసం అప్పుడే అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది. తాజాఆగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలుపడతామని, అంతేకాకుండా కార్తికేయ-3ని 3Dలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. మరి ఈ సినిమా ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. -
'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్
ఎన్టీఆర్, రామ్చరణ్లు మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా ఆస్కార్కు నామినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ చివరకు నిరాశే మిగిలిందే. ఆర్ఆర్ఆర్ని ఆస్కార్కి నామినేట్ చేయకుండా చెల్లో షో అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్ చేశారు. దీనిపై హీరో నిఖిల్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవసరమా? నాకు ఆస్కార్పై వేరే అభిప్రాయం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆదరించారు. అదే సినిమాకు అతిపెద్ద విజయం అలాంటప్పుడు ఇంక ఆస్కార్ ఎందుకు? మనకు ఫిల్మ్ఫేర్, జాతీయ అవార్డులు ఇలా చాలానే ఉన్నాయి. నేనైతే ఆస్కార్కి అంత ప్రాధాన్యత ఇవ్వను. ఇటీవలె స్పెయిన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. అక్కడ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్గా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాను ఇంతలా ఆదరిస్తుంటే, ఇంక ఆస్కార్ అవసరం లేదని నా ఫీలింగ్ అని నిఖిల్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
Karthikeya 2: కేరళలో కార్తీకేయ-2 జోడి.. మలయాళంలోనూ గ్రాండ్ రిలీజ్..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని సాధించింది. బాలీవుడ్లో ఈ మూవీ కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను మళయాళంలోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా అఖిల్, అనుపమ కేరళలో సందడి చేశారు. తాజాగా ఈ జంట కొచ్చిన్లో నిర్వహించిన కార్యక్రమంలో సందడి చేసింది. ఈనెల 23న మలయాళంలో సినిమాను గ్రాండ్గా విడుదల చేయనున్నారు. (చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం) కలియుగ సృష్టి రహస్యాలను పొందుపరచిన కృష్ణుని కంకణాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే యువకుని కథతో దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కీలకమైన అతిథిపాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ ఈ మూవీలో నటించారు. ఈ చిత్రానికి నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ వ్యవహరించారు. -
ఆ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్.. స్పందించిన జీ5..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగష్టులో విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని అప్డేట్ల కోసం వెతుకున్నారు. అయితే ‘కార్తికేయ2’ను సైతం దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబరు మొదటివారం స్ట్రీమింగ్కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిన్న చిత్రంగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రూ.100 కోట్ల క్లబ్ను దాటేసింది. (చదవండి: మల్టీప్లెక్స్ల్లో 75 రూపాయలకే సినిమా హ్యపీగా చూసేయండి..) ఇక ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం సాధించిన మరో చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం కల్యాణ్రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కోసం ఓటీటీలో ఎప్పుడోస్తుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదలపై జీ5 స్పందించింది. ‘మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్మీడియా ఖాతాలను అనుసరించండి’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ప్రచారం చూస్తే కల్యాణ్రామ్ ‘బింబిసార’ సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘కార్తికేయ 2’ హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు: నిఖిల్
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ 2. భారీ అంచనాల మధ్య ఈ శనివారం(ఆగస్ట్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో విడుదలైన రోజు సాయంత్రమే చిత్రబృందం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. తమ సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టడం సంతోషంగా ఉందన్నారు. (చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ) ‘యూఎస్లో కార్తికేయ2కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ కొంచెం టెన్షన్గా ఫీలయ్యాను. తెలుగు ప్రేక్షకులు మా సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాను. కానీ మీడియా షో అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల హౌస్ఫుల్ అవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. నా సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. రేపు, ఎల్లుండి కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఇది ఇలానే కొనసాగుతుందని అనుకుంటున్నాను. చందు మంచి పాయింట్ని తీసుకొని సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్’అని అన్నాడు. నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, కార్తికేయ-2 విజయం నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విడుదలైన ప్రతిచోట్ల, ఓవర్సీస్లోనూ మంచి ఆదరణ పొందుతోందని తెలిపారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ.. దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతున్నారు. కార్తికేయ 2 సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు’ అన్నారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా మర్చిపోయాను. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. -
Karthikeya 2 Movie Review: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ
టైటిల్ : కార్తికేయ2 నటీనటులు : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనమ్, కేఎస్ శ్రీధర్, శ్రీనివాసరరెడ్డి నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: చందూ మొండేటి సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని విడుదల తేది: ఆగస్ట్ 13, 2022 వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘కార్తికేయ’. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే టీమ్తో ‘కార్తికేయ2’ తీశాడు. ఎన్నో అవంతరాల తర్వాత నేడు(ఆగస్ట్ 13) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో కార్తికేయ2 పై హైప్ క్రియేట్ అయింది. ఈ భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలికి ధరించిన కంకణం.. నేటి కలియుగంలోని ఎన్నో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆర్కియాలజిస్ట్ రావు తెలుసుకుంటాడు. ఆ కంకణం గురించి అశ్వేషిస్తున్న రావు హత్య చేయబడతాడు. అదే సమయంలో తల్లి (తులసి)తో కలిసి ద్వారక దర్శనానికి వచ్చిన డాక్టర్ కార్తిక్(నిఖిల్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆర్కియాలజిస్ట్ రావును కార్తిక్కే హత్య చేశాడని తప్పుడు కేసు నమోదు చేస్తారు. పోలీసు స్టేషన్లో ఉన్న కార్తిక్ని రావు రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. అసలు కార్తిక్ని ముగ్ఢ ఎందుకు తప్పించింది? ఆమె కార్తిక్తో చెప్పిన విషయం ఏంటి? శ్రీకృష్ణుడి కంకణం కనిపెట్టాలని కార్తిక్ ఎందుకు డిసైడ్ అవుతాడు? ఈ క్రమంలో కార్తిక్కు డాక్టర్ శాంతను (ఆదిత్యా మీనన్) నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? అధీరుల తెగకు చెందిన వ్యక్తులు కార్తిక్ని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరకు కార్తిక్ కంకణ రహస్యాన్ని కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. దర్శకుడు చందూ మొండేటి మొదటి నుంచి చెబుతున్నట్లుగా ‘కార్తికేయ’ చిత్రానికి, కార్తికేయ2 కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం హీరో, అతని తల్లి పాత్రలు అలా ప్రవర్తిస్తాయి. కార్తికేయలో మిస్టరీ, థ్రిల్లర్ అంశాలు ఉంటే.. ఇందులో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దైవం, సైన్స్ రెండింటిని కలిపి ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్లో మొత్తం సాదాసీదాగా సాగుతున్నప్పటికీ.. సెకండాఫ్పై మాత్రం క్యూరియాసిటీ పెంచుతుంది. అధీరుల వంశానికి చెందిన ఓ వ్యక్తి కార్తిక్పై దాడి చేయడం.. దానికి కారణం ఏంటో యానిమేషన్ ద్వారా చూపించడం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా తెరపై చూపించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ పరంగా చూస్తే కార్తికేయ2 చాలా సాదారనమైనది..కానీ కథనం మాత్రం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. కార్తికేయలో మాదిరి ఇందులో భయపడే సీన్స్ పెద్దగా ఉండవు. అలాగే హీరోని ఢీకొట్టేందుకు బలమైన విలన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు చప్పగా సాగాయనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విలన్, అధీరుల తెగకు చిక్కిన ప్రతీసారి హీరో సింపుల్గా తప్పించుకోవడం లేదా ఆ సీన్ని హడావిడిగా ముంగించి వేరే సీన్లోకి తీసుకెళ్లడంతో థ్రిల్ మూమెంట్స్ మిస్ అవుతారు. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి అనుపమ్ ఖేర్తో చెప్పించే డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫోకస్ అంతా కృష్ణతత్వం మీదే పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్ హంగుల కోసం సాంగ్స్, కామెడీని జోడించకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే... డాక్టర్ కార్తికేయ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రని అల్రెడీ కార్తికేయ చిత్రంలో పోషించిన అనుభవం ఉండటం అతనికి కలిసొచ్చింది. కార్తికేయ మాదిరే కార్తికేయ 2 కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇక ముగ్ధ పాత్రకి అనుపమ పరమేశ్వరన్ న్యాయం చేసింది. కార్తిక్ని కాపాడే రెండు సీన్స్ అనుపమా క్యారెక్టర్ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. గుర్తిండిపోయే పాత్ర చేశారు. శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్లో ఈలలు వేయిస్తాయి. కార్తిక్ మామగా శ్రీనివాస్రెడ్డి, ట్రాలీ డ్రైవర్గా వైవా హర్ష తమదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రెండూ బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఆమె రాసిన లెటర్ చదవగానే కన్నీళ్లు వచ్చాయి: నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్ ఈ సినిమా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్తో కలిసి నిఖిల్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో హోస్ట్ నిఖిల్కు సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని రివీల్ చేశాడు. నిఖిల్కు ఓ అమ్మాయి రాసిన లెటర్ గురించి హొస్ట్ ఆరా తీశారు. చదవండి: డైరెక్టర్ చెప్పాడు.. నిజంగానే కాలు విరగొట్టుకున్నా: హీరోయిన్ దీనికి నిఖిల్ స్పందిస్తూ.. ‘అవును అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న. అదే సమయంలో ఓ అమ్మాయి నాకు లెటర్ రాసింది. ఆ ఉత్తరం చదివి భావోద్వేగానికి గురయ్యా. ఆ లేఖ చదవడం పూర్తయ్యేసరికి కళ్లనుంచి నీళ్లోచ్చాయి. తన అభిమానానికి చూసి ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే నేనొక నార్మల్ హీరోని. చిన్నప్పటి నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్లను అభిమానిస్తూ పెరిగిన నేను ఈ స్థాయికి వచ్చాను. అటువంటి నాకు ఒక ఫ్యాన్ అభిమానిస్తూ లేఖ రాయడం ఆశ్చర్యంగా అనిపించింది. అది చదివేసరిగా నాకు కన్నీళ్లు ఆగలేదు’ అంటూ నిఖిల్ వివరణ ఇచ్చాడు. ఇక చివరగా కార్తికేయ 2లో తనకు నచ్చిన సీన్ క్లైమాక్స్ అని చెప్పాడు. శ్రీ కృష్ణుడు గురించి చెప్పే ఈ సీన్లో నాకు తెలియకుండానే లీనమైపోయా.. ఆ ప్రభావం తనపై పడటంతో తెలియకుండానే ఏడ్చేశానన్నాడు. సహాజంగా వచ్చిన ఈ సీన్ క్లైమాక్స్కు హైలెట్గా నిలుస్తుందని చెప్పాడు. -
ఆసక్తిని రేకెత్తిస్తున్న కార్తికేయ-2 ట్రైలర్.. మీరూ ఓ లుక్కేయండి
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2. అనుపమ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్ ఈ సినిమా. ఇప్పటికే కార్తికేయ-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. శ్రీకృష్ణుడి చరిత్రతో, ద్వారకా నగరి నేపథ్యంతో ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా ఉంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.. 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం'అనే డైలాగ్ హైలైట్గా నిలిచింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్కి అనుపమ డుమ్మా.. నిఖిల్ కామెంట్స్ వైరల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. గతంలో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్. ఆగస్ట్ 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ను వేగవంతం చేసింది చిత్రం. అయితే ఈ ప్రమోషన్లో ఎక్కడ చూసిన నిఖిల్ మాత్రమే కనిపిస్తున్నాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కనిపించడం లేదు. అయితే ఇప్పటికే దీనిపై అనుపమ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ రాత్రి, పగలు వరుసగా షూటింగ్స్తో బిజీగా ఉండటం వల్లే తాను కార్తీకేయ 2 ప్రమోషన్స్లో పాల్గొనడం లేదని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇదే ప్రశ్న నిఖిల్కు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎదురైంది. ఈ సందర్భంగా నిఖిల్, అనుపమపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కార్తీకేయ 2 ప్రమోషన్లో అనుపమ కనిపించడం లేదు.. ఎందుకని అడిగిన ప్రశ్నకు నిఖిల్ స్పందిస్తూ.. ‘అనుపమను చూస్తే ఒక్కొసారి ఆశ్చర్యం వేస్తుంది. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత తను ప్రమోషన్స్కు ఎందుకు రాదో తెలియదు. సెట్లో చాలా సరదాగా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్లాక మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వదు. కాల్స్కు సమాధానం ఉండదు. మళ్లీ మరుసటి రోజు సెట్కు రాగానే సరదాగా కలిసిపోతుంది. అసలు తను అర్థం కాదు. తనకి రెండు ముఖాలున్నాయి. రేపు ప్రమోషన్స్ ఉన్నాయని మెసేజ్ పెడితే చూడదు. కనీసం రిప్లై కూడా ఇవ్వదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిఖిల్ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. నిఖిల్ సమాధానం విన్న పలువురు అనుపమపై మండిపడుతూ ట్రోల్ చేస్తున్నారు. Reply ah ? pic.twitter.com/mVzhfuoqmX — CB (@G__0070) August 1, 2022 -
సినిమా రిలీజ్ కాదన్నారు.. వారం క్రితం ఏడ్చేశాను: నిఖిల్
Nikhil Says He Cried About Karthikeya 2 Movie Release Problems: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. 'హ్యాపీ డేస్' సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. ఇందులో నిఖిల్కు జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీ అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్రబృందం వినూత్నంగా కాంటెస్ట్లు కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కార్తికేయ 2' సినిమా విడుదల విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఒకానొక సమయంలో ఏడ్చాను అని తెలిపాడు నిఖిల్. ''ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను ఇటు అటు నెట్టేస్తారని అంటారు కదా.. అలానే మా సినిమాకు జరిగింది. నిజం చెప్పాలంటే ఒక ఐదు రోజుల క్రితం సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 అని ప్రకటించేటప్పుడు.. అది కూడా వద్దని చెప్పారు. చదవండి: నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీ కాంటెస్ట్.. గెలిస్తే రూ. 6 లక్షలు ప్రియుడితో బర్త్డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ అక్టోబర్కు వెళ్లిపోండి. నవంబర్కు వెళ్లిపోండి. ఇప్పుడు అప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు షోస్ దొరకవు. థియేటర్లు ఇవ్వము. అన్న స్టేజ్ వరకు వెళ్లింది. అప్పుడు నేను ఏడ్చాను. నేను నిజానికి చాలా స్ట్రాంగ్ పర్సన్ను. హ్యాపీ డేస్ సినిమా నుంచి ఇప్పటివరకు మూవీ విడుదల కాదు, థియేటర్లు దొరకవు అని ఎప్పుడు అనిపించలేదు. ఒక వారం క్రితం అయితే ఏడ్చేశాను. నువ్ ఎంత కష్టపడినా నీ సినిమా రిలీజ్ అవ్వదురా అని అన్నప్పుడు బాధేసింది. చివరికీ మా నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ సపోర్ట్తో పట్టుబట్టి ఆగస్టు 12కే వస్తున్నాం అని ప్రకటించాం'' అని నిఖిల్ పేర్కొన్నాడు. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ -
రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ను రిలీజ్ చేసిన హీరో నిఖిల్
ప్రియాంక డే టైటిల్ రోల్లో సాయి తేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీన. నవీన్ ఇరగాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను యంగ్ హీరో నిఖిల్ విడుదల చేశారు విడుదల చేశారు. ఈ పాటకు షారుక్ షేక్ ట్యూన్ను అందించగా.. ప్రసాద్ నల్ల అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. యంగ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘ఈ పాటను చూస్తుంటే.. కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జానర్లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి. టీజర్, ట్రైలర్ కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నేను కూడా ఈ సినిమా చూస్తాను. కొత్త వాళ్లను, కొత్త జానర్లను అందరూ ఎంకరేజ్ చేయాలి. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయి తేజకు శుభాకాంక్షలు’ అన్నారు. డైరెక్టర్ నవీన్ ఇరగాని మాట్లాడుతూ.. ‘మా సినిమా పాటను హీరో నిఖిల్ గారు రిలీజ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. మా లాంటి కొత్తవాళ్లకు నాని గారు, నిఖిల్ గారు, రవితేజ గారు ఇన్స్పిరేషన్గా ఉంటారు’ అన్నారు. నటుడు సాయి తేజ మాట్లాడుతూ.. ‘నిఖిల్ అన్న వచ్చి మా సాంగ్ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన ఈ పాటను రిలీజ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. నా బర్త్ డే సందర్భంగా ఈ పాటను ఆయన రిలీజ్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది’ అని అన్నారు. చదవండి: Jr NTR ధరించిన టీషర్ట్ అంత ఖరీదా? రవితేజకు భారీ షాక్! -
సీరియల్లో ప్రత్యక్షమైన నిఖిల్, మామూలు ప్రమోషన్ కాదుగా!
సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు హీరోలు. తాజాగా హీరో నిఖిల్ సీరియల్లో ప్రత్యక్షమయ్యాడు. కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్లో భాగంగా బుల్లితెరపై సందడి చేశాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ సీరియల్లో ఎంటరై సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం సీరియల్లో పెళ్లి తతంగం జరుగుతోంది. అయితే ఈ పెళ్లికి నిఖిల్ హాజరవ్వడమే కాకుండా ఓ చిన్న ఫైట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. పైగా కార్తికేయ 2 మూవీని గుర్తు చేసేలా సీరియల్ డైరెక్టర్ నిఖిల్ కనిపించే స్పెషల్ ఎపిసోడ్ను అదిరిపోయేలా ప్లాన్ చేశాడట. ఈ విషయాన్ని నిఖిలే స్వయంగా వెల్లడించాడు. 'సీరియల్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది. నన్ను చాలా బాగా చూసుకున్నారు. చాలా మంచి సీన్ రాశారు' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ సీరియల్ ప్రమోషన్ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! కాగా కార్తికేయ 2 ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కానుంది. అక్షర, ఆరవింద్ లకి, నిఖిల్ ఏ విధంగా హెల్ప్ చెయ్యనున్నాడు Thrilling episode మిస్ కాకండి Miss అవ్వకుండా చూడండి #RadhammaKuthuru #Zee5 లో ఎప్పుడైనా, ఎక్కడైనా!#RadhammaKuthuruOnZEE5#Gokul #Deepthi pic.twitter.com/reSAYvGyzt — ZEE5 Telugu (@ZEE5Telugu) July 23, 2022 చదవండి: డబ్బుంది కానీ సంతోషమే లేకుండా పోయింది: రజనీకాంత్ నేను మారిపోయా, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా.. -
కార్తికేయ 2 ట్రైలర్: ఆజ్యం మళ్లీ మొదలైంది..
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్గా వస్తోంది చిత్రం. సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అంటూ ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. ఈసారి డైరెక్టర్ శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. శాంతను.. 'ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను ఓ సమిధను మాత్రమే, ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది' అంటూ హీరోకు ఎలివేషన్ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్తో మరోసారి మెప్పించారు. ఈ సినిమాలో కార్తికేయగా నిఖిల్, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 3 Years of Blood Sweat and Much more… TRAILER OF #KARTHIKEYA2 is here…. Watch it and if u like it Please SHARE with ur friends and family …. #LordKrishna India’s Epic Mystical Adventure Zee Cinemalu YouTube - https://t.co/9fYA4X0cHm pic.twitter.com/x0DcBSrIqn — Nikhil Siddhartha (@actor_Nikhil) June 24, 2022 చదవండి: సదా నన్ను నడిపే మూవీ రివ్యూ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్, స్పందించిన వర్మ -
మంచులో కప్పేసిన డబ్బాలో నుంచి తుపాకీలు తీసిన నిఖిల్
‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’ వంటి సినిమాలకు ఎడిటర్గా పని చేసిన గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్పై. ఈ స్పై థ్రిల్లర్ మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఐశ్వర్యా మీనన్ కథానాయిక. సోమవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజయ్యాయి. ఇందులో మంచు కొండల్లో హీరో నిఖిల్ ఒంటరిగా నడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత మంచుతో కప్పేసిన ఓ బాక్స్ను తెరిచి అందులో ఉన్న తుపాకీలను బుల్లెట్లుతో సహా నింపుకుని సమరానికి రెడీ అయ్యాడు. మరి ఈ బుల్లెట్ల వర్షం ఎవరి మీదైనా కురిపించడానికా? తనను తాను కాపాడుకోవడానికా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శ్రీచరణ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.రాజశేఖర్రెడ్డి నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్గా పని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. చదవండి: మూడు రోజుల్లోనే రూ.150 కోట్లు సాధించిన విక్రమ్ కరణ్ జోహార్ బర్త్ డే: బాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా -
Karthikeya 2 Motion Poster: సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం..
యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ తెరకెక్కుతున్న తాజా చిత్రం కార్తికేయ2. 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘కార్తికేయ’కు సీక్వెల్ ఇది. చాలాకాలంగా నిర్మాణ దశలోనే ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకే రిలీజ్కు సిద్దమైంది. జులై 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కార్తికేయ2’ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ‘సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం’ అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. (చదవండి: సింగర్ కేకే మరణంపై అనుమానాలు!) ఓ రహస్యాన్ని చేధించేందుకు సముద్రంలో ప్రయాణిస్తున్న నిఖిల్, అనుపమ, శ్రీనివాసరెడ్డిలను ఈ పోస్టర్లో గమనించవచ్చు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఈ మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో నిఖిల్కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర పోషించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. -
హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం
Hero Nikhil Father Passed Away: యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం(ఏప్రిల్ 28) ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి అకాల మరణంతో నిఖిల్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. చదవండి: ‘ఆచార్య’లో సత్యదేవ్ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు నిఖిల్ తండ్రి మరణవార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. నిఖిల్ను పరామర్శిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే 'స్పై' టైటిట్తో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్స్తో ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళుతున్న నిఖిల్కు పితృవియోగం కలగడం అందరిని కలిచివేస్తోంది. -
నిఖిల్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్లుక్ వచ్చేసింది, బుల్లెట్ల మధ్యలో హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న 19వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. గూడఛారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమాకు స్పై అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ గన్ చేతపట్టుకుని బుల్లెట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. స్పై చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్గా పని చేస్తున్నారు. అలాగే మరో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. The sentinel is geared up for the Task!Unfolding & Presenting 𝐒𝐏𝐘🔥#SPY ATTACKING PAN INDIAN THEATRES this DASARA 2022😎స్పై - स्पाई - ஸ்பை - ಸ್ಪೈ - സ്പൈ@Ishmenon @Garrybh88 @AbhinavGomatam @tej_uppalapati @julian_amaru #EDEntertainments #KRajashekarreddy pic.twitter.com/MBRlUsb7it— Nikhil Siddhartha (@actor_Nikhil) April 17, 2022 చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? -
ప్రపోజ్ చేస్తే జోక్ చేశాడనుకున్నా: హీరో నిఖిల్ భార్య
యంగ్ హీరో నిఖిల్ ఏడాది క్రితం తన ప్రేయసి పల్లవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత లాక్డౌన్ 2020 డిసెంబర్లో నిఖిల్-పల్లవిల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిఖిల్-పల్లవిలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే పెళ్లి అనంతరం భార్యతో కలిసి ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు నిఖిల్. చదవండి: మా బ్రేకప్కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్ ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) వాలంటైన్స్ డే సందర్భంగా నిఖిల్ తన భార్య, డాక్టర్ పల్లవితో కలిసి తొలిసారి మీడియాకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఈ లవ్లీ కపుల్స్ సాక్షి టీవీతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ డాక్టర్-యాక్టర్ మధ్య అసలు ప్రేమ ఎలా మొదలైందో మీరు కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. -
హీరో నిఖిల్ ఆవేదన.. ఈ పరిస్థితుల నుంచి బయటపడేయాలని ట్వీట్
Actor Nikhil Feels Disappointed Over His Upcoming Movies Release Dates Postpone: కరోనా మహమ్మారి దాదాపు అన్ని పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సినిమా ఇండస్ట్రీపై కూడా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. ఇప్పటికే పలు సినిమాలు కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మహమ్మారి కెరీర్ను ఈ స్థాయిలో ప్రభావితం చేయడం చాలా బాధాకరం. 'అర్జున్ సురవరం సక్సెస్ తర్వాత నేను 4 సినిమాలకు సైన్చేశాను. వాటి రిజల్ట్పై చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ రిలీజ్ డేట్స్ అన్నీ మన చేతుల్లో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల నుంచి తర్వగా భయపడి, సినిమాలన్నీ అనుకున్న సమయానికి విడుదల చేసేలా ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నిఖిల్ షేర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. Very sad to c this Pandemic affect careers on this level.. After the succes of #ArjunSuravaram I signed 4 movies... 4 brilliant scripts that I am very confident about. But Release dates have all gone Haywire. Praying to God this all sorts out & we release the movies Perfectly — Nikhil Siddhartha (@actor_Nikhil) January 26, 2022 -
కన్నీళ్లు ఆగడం లేదు: హీరో నిఖిల్
Hero Nikhil Emotional Tweet About Janani Song From Rrr Movie: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘‘జననీ.. ప్రియ భారత జననీ..’చూసిన తర్వాత కన్నీళ్లు ఆగడం లేదని హీరో నిఖిల్ అన్నాడు. దేశభక్తిని చాటే విధంగా రూపొందిన జనని పాట తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. జనని సాంగ్ను ఇప్పటివరకు 20సార్లు చూశాను. చూసిన ప్రతీసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. దేశం మొత్తాన్ని ఎమోషనల్గా దగ్గరచేసే చిత్రమిది. కీరవాణి, రాజమౌళి ..మీరు మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని నా విన్నపం అని నిఖిల్ పేర్కొన్నాడు. ‘‘జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిదని, ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారని రాజమౌళి తెలిపిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్గా రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హల్చల్ :మెహ్రీన్ కవిత్వం..ప్రేమలో ఉన్నానంటున్న రకుల్
► ఏక్ బార్ అంటున్న దీప్తి సునయన ► చీర్స్ అంటున్న బుల్లితెర నటి అష్మిత ► అవి మాత్రం ఎవరికి కనిపించవుంటున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత ► పచ్చని పొదళ్ల మధ్యలో హీరోయిన్ సదా ► దీంతో ప్రేమలో ఉన్నానంటున్న రకుల్ ► క్యాజువల్ లుక్లో రాహుల్ సిప్లిగంజ్ ► కవిత్వం చెబుతున్న మెహ్రీన్ ► త్రోబ్యాక్ ఫోటో షేర్ చేసిన రాహుల్ ► మండే మోటివేషన్ అంటున్న శిల్పాశెట్టి View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Swetha (@swethapvs) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Satya Yamini (@satya.yamini) View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
కార్తికేయ-2 : హీరోయిన్ను రివీల్ చేశారు..
Karthikeya- 2 Heroine Revealed : నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం మంచి హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా ‘కార్తికేయ 2’ చేస్తున్నారు హీరో నిఖిల్, దర్శకుడు చందు. ఇందులో హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ను తీసుకున్నారు. సోమవారం ‘అనుపమ ఆన్ బోర్డ్’ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) చదవండి : పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్ పరిశ్రమకు చంద్రబాబు ఏం చేశారో? -
హీరో నిఖిల్ను సత్కరించిన సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: హీరో నిఖిల్ సిద్దార్థను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సత్కరించారు. కరోనా సెకండ్ వేవ్లో ఎంతోమందికి సహాయం చేసిన నిఖిల్పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా నిఖిల్కు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం సజ్జనార్ నిఖిల్తో సరదాగా కాసేపు ముచ్చటించారు. కాగా కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, మందులు సహా అవసరమైన వారికి నిఖిల్ చేయూత అందించారు. ఇదిలా ఉండగా నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. Honoured to be Felicitated & Recognised by the Commisioner of Police VC. Sajjanar Sir for COVID Related Work During the second wave and Interacting with the frontline Covid Police Warriors. #covid_19 #covid pic.twitter.com/DlQLZp0DLp — Nikhil Siddhartha (@actor_Nikhil) August 13, 2021 -
డబ్బింగ్ మొదలుపెట్టిన యంగ్ హీరో
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు హీరో నిఖిల్ డబ్బింగ్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. #18Pages Dubbing Starts off 😇 good to be back in the Studio... Movie Getting Ready 👍🏼 pic.twitter.com/2kd0UZFpES — Nikhil Siddhartha (@actor_Nikhil) August 11, 2021 -
అనుపమ అల్లరిని బయటపెట్టిన నిఖిల్, షూటింగ్ టైంలో అలా..
యంగ్ హీరో నిఖిల్, మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజెస్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నిఖిల్ బర్త్డే సందర్భంగా జూన్ 1న విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్లుక్ ఎంత ఫ్రెష్గా ఉందో అందరికి తెలిసిందే. నా పేరు నందిని అంటూ అనుపమ తన గురించి పరిచయం చేసుకోవడం, తన మనసులో ఉన్నది నిఖిల్ మొహంపై పేపర్ పెట్టి రాసిన ఫస్ట్లుక్ అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఈ ఫస్ట్లుక్ మేకింగ్ని బయటపెట్టాడు హీరో నిఖిల్. షూటింగ్ సమయంలో అనుపమ చేసిన అల్లరిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. యూనిట్ అంతా షూటింగ్ కోసం సీరియస్గా వర్క్ చేస్తుంటే.. అనుపమ మాత్రం సారంగదరియా పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియోని నిఖిల్ ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘నేను ఇంత వరకు చూసిన వారందరిలోనూ ఎంతో సంతోషంగా ఉండే వారిలో అనుపమ ది బెస్ట్’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక నిఖిల్ పోస్ట్పై అనుపమ స్పదించింది.మొత్తానికి ఆ విషయాన్ని నువ్ ఒప్పుకున్నావ్ అంటూ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్పై రాజమౌళి సంచలన నిర్ణయం! -
బెడ్ ఏమైనా బంగారంతో చేశారా?: నిఖిల్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్లు సమకూరుస్తూ, అవసరమైన ఔషధాలు అందిస్తూ, ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తూ ప్రాణదాతగా మారాడు. కానీ తానింత కష్టపడినా కళ్ల ముందే కొందరు పిట్టల్లా రాలిపోతుంటే తట్టుకోలేకపోయాడు. మరోవైపు ఆస్పత్రులు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రోగుల కుటుంబాల దగ్గర నుంచి అందినకాడికి దోచుకోవడం చూసి ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. "నా దృష్టికి వచ్చిన ఎన్నో ఆస్పత్రులు పేషెంట్లకు పది లక్షలకు పైగా బిల్లులు వేస్తున్నాయి. ఆ ఫీజు చెల్లించేందుకు మేము కొంతమంది బాధితులకు చేతనైనంత సాయం చేస్తున్నాం. కానీ చిన్నపాటి సర్జరీలకు కూడా ఎందుకింత ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారు? దీన్ని ఎవరు నియంత్రిస్తారు?' అని ఆవేదన చెందాడు. 'ఒక్కరోజు ఆస్పత్రి బెడ్ దొరకాలన్నా రూ.30 వేల దాకా వసూలు చేస్తున్నారు' అని ఓ నెటిజన్ ఫిర్యాదు చేయగా 'ఎందుకు? బెడ్ బంగారంతో తయారు చేశారా?' అని ఆస్పత్రి మీద సెటైర్లు వేశాడు హీరో నిఖిల్. Seeing a lot of Hospital Bills in Excess of 10 lakhs. Why r our local hospitals charging such huge amounts for Basic Operations? We wer helping with Paying a few Patients Bills nd realised tht the entire amount is going to ridiculously charging hospitals. Who is regulating them? — Nikhil Siddhartha (@actor_Nikhil) June 6, 2021 Enduku? bed bangaram to tayyar chesara? https://t.co/teouY1kYEO — Nikhil Siddhartha (@actor_Nikhil) June 6, 2021 చదవండి: మనల్ని ఎవరూ కాపాడలేరు: నిఖిల్ ఎమోషనల్ -
Nikhil Siddharth: హీరో కారుకు పోలీసుల చలాన్లు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని రెండు చలాన్లను విధించారు. అయితే నిబంధనల ఉల్లంఘన సమయంలో నిఖిల్ కారులో లేడని పోలీసులు తెలిపారు. కాగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే నిఖిల్ ప్రస్తుతం '18 పేజీస్' సినిమా చేస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నాడు. దీనితో పాటు నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. ఇది 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్గా రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా లాక్డౌన్ కాలంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిఖిల్.. తన భార్య పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు వైద్యపరమైన సలహాలు ఇస్తూ.. ఓ వాలంటీర్గా పనిచేస్తోందంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: 'కార్తికేయ 2' షూటింగ్కు సడన్ బ్రేక్! -
ప్రేమ సన్నివేశాల్లో నిఖిల్ ఎవరిని ఊహించుకుంటాడో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం '18 పేజీస్'తో పాటు 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. నేడు(జూన్1) అతడి బర్త్డేను పురస్కరించుకుని 18 పేజీస్ ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ కళ్లకు గంతలు కట్టి దాని మీద ప్రేమ వాక్యాలు రాస్తోంది. తన ఫీలింగ్ను మాటల్లో కన్నా అక్షరాల్లో చెప్తేనే బాగుంటందని అంటోంది. ఈ పోస్టర్ చూస్తేనే ఇదో పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్తో లవ్సీన్లలో నటించడంపై స్పందించాడు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్తో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు తన భార్య డాక్టర్ పల్లవిని ఊహించుకున్నట్లు తెలిపాడు. పెళ్లి తర్వాత లవ్ సీన్లలో నటించడం చాలా తేలికైందని చెప్పాడు. ఇన్నాళ్లూ తనను లవర్బాయ్గా అంగీకరిస్తారో లేదోనన్న భయంతో ఇంతకాలం పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా '18 పేజీస్' సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. 'కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తుండగా గోపీసుందర్ సంగీతం అందించారు. చదవండి: HBD Nikhil : ఆసక్తికరంగా18 pages ఫస్ట్ లుక్ పోస్టర్ మనల్ని ఎవరూ కాపాడలేరు: నిఖిల్ ఎమోషనల్ -
నిఖిల్ ఇంటికి ‘18 పేజెస్’స్పెషల్ గిఫ్ట్.. షాకైన యంగ్ హీరో
యంగ్ హీరో నిఖిల్ బర్త్డే నేడు (జూన్ 1). ఈ సందర్భంగా ఆయనకు ‘18 పేజెస్’స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమే ‘18 పేజెస్’. కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల్ బర్త్డే సందర్భంగా ఫస్ట్లుక్ విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా ఆయనకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. నిఖిల్ ఇంటికి ఓ పెద్ద కేకును, బొకే పంపించి బర్త్డే విషెస్ చెప్పింది. ‘18 పేజెస్’ఫస్ట్లుక్ పోస్టర్ ఉన్న ఆ కేకు చూసి నిఖిల్ షాకయ్యాడు. తనకు ఇంతమంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్, సుకుమార్, డైరెక్టర్ సూర్యప్రతాప్కి థ్యాంక్స్ చెప్పాడు. అలాగే తనకు పంపించిన కేకును కట్ చేయకుండా మెమోరీగా దాచుకున్నాడు. A small surprise to @actor_Nikhil from Team #18Pages 🎉 #HappyBirthdayNikhil 🥳 One more brand new poster coming your way! 🤩#AlluAravind @aryasukku @anupamahere @dirsuryapratap @GopiSundarOffl @NavinNooli #BunnyVas @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic pic.twitter.com/llvMYlWqQl — Geetha Arts (@GeethaArts) June 1, 2021 చదవండి: టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవంటున్న అనుపమ అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ మూవీపై కర్ణి సేనా ఆగ్రహం