Karthikeya
-
అబద్ధమేవ జయమే.. టైటిల్ వెరైటీగా ఉంది: కార్తికేయ
సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అబద్దమేవ జయతే’. కె. కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోని యంగ్ హీరో కార్తికేయ విడుదల చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతు.. టైటిల్ చాలా వెరైటీగా ఉందని అభినందిస్తూ చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విలేజ్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం లో ఒక ఇరవై ఏళ్ల క్రితం ఉన్న సెట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. వికాస్ చిక్బల్లాపూర్ కెమెరామెన్గా, షాడో ఎడిటర్గా పని చేస్తున్నారు.సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా గ్రామీణ వాతావరణంలోనే సినిమాను షూట్ చేశారు. చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. -
ఆసీస్ను చిత్తు చేసిన టీమిండియా
ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో మూడు వన్డేల సిరీస్లో భారత అండర్–19 జట్టు శుభారంభం చేసింది. పుదుచ్చేరి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అండర్-19 జట్టు 49.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. స్టీవెన్ హోగన్ (42), రిలీ కింగ్సెల్ (36) రాణించారు. యువ భారత బౌలర్లలో మహమ్మద్ ఇనాన్ 4, కేపీ కార్తికేయ రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన కార్తికేయ..అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని భారత యువ జట్టు 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో కేపీ కార్తికేయ (99 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ప్రదర్శన కనబరచగా.. అమాన్ (58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో పాటిర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక అటు బంతితో, ఇటు బ్యాట్తో సత్తాచాటిన టీమిండియా ఆల్రౌండర్ కేపీ కార్తికేయకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య సోమవారం(సెప్టెంబర్ 23) రెండో మ్యాచ్ జరగనుంది. -
Prince World 2024: మోడల్ కార్తికేయ
మోడల్ కార్తికేయనడకతోపాటే నాట్యం కూడా నేర్చుకున్నాడు కార్తికేయ. వినాయక చవితి స్టేజ్తో మొదలు పెట్టి అంతర్జాతీయ వేదికపై మెరిశాడీ మోడలింగ్ ప్రిన్స్. థాయ్లాండ్లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్ పోటీల్లో ‘ప్రిన్స్ వరల్డ్–2024’ టైటిల్ సొంతం చేసుకుని వైజాగ్కు తిరిగి వచ్చిన కార్తికేయ సక్సెస్ స్టోరీ ఇది.థాయ్లాండ్లో ‘ప్రిన్స్’కిరీటం..కార్తికేయ రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్–2, ఆంధ్రా ఫ్యాషన్ వీక్ పోటీలలో విజేతగా నిలిచాడు. కోళికోడ్ నగరంలో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో కూడా విజయం సాధించాడు. ప్రిన్స్ ఆఫ్ ఏపీ సబ్ టైటిల్ను గెలిచి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దీంతో ఇటీవల థాయ్లాండ్లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో పోటీలు నిర్వహించారు. దీనికి 11 దేశాల నుంచి 45 మంది చిన్నారులు పోటీ పడ్డారు. ఇందులో కార్తికేయ మనదేశానికి ప్రాతినిథ్యం వహించాడు. నాలుగవ తరగతి చదువుతున్న ఈ విశాఖపట్నం కుర్రాడు మోడలింగ్తోపాటు వ్యాఖ్యానం, నటన, కథలు చెప్పడం, యోగా ఇలా అనేక రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్తికేయ తండ్రి బి.జె.శ్రీనివాసరెడ్డి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆయన కథలు, కవితలు, వెబ్ పేజీలకు ఆర్టికల్స్ రాస్తుంటారు. వీటితోపాటు సేంద్రియ వ్యవసాయం, తేనెటీగల పెంపకం ఆయన ఆసక్తులు. కార్తికేయ తల్లి పావనీ లత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో ఇంజినీర్. చిత్రకారిణి కూడా. తల్లిదండ్రులిద్దరిలోనూ సృజనాత్మకత మెండుగా ఉండడం పిల్లల మీద మంచి ప్రభావం చూపించింది.రెండేళ్లకు బ్రేక్కార్తికేయ రెండేళ్ల వయసులో గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలలో తొలిసారిగా చేసిన డ్యాన్స్కు మంచి ప్రశంసలందాయి. ప్లే స్కూల్లో పిల్లలందరూ ఏడుస్తూ ఉంటే.. కార్తికేయ డ్యాన్సులతో ఆ పిల్లలను అలరించేవాడు. దీంతో తల్లిదండ్రులు మంచి డ్యాన్సర్ను చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మూడో ఏట కాలికి సర్జరీ అవడంతో ఏడాదిపాటు డ్యాన్స్కు దూరం కావల్సి వచ్చింది. గాయం తగ్గిన వెంటనే మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కాడు. పాశ్చాత్య నృత్యాన్ని అభ్యసించాడు. స్కూల్లో జరిగే కల్చరల్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు. అతడు ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం విమర్శకుల మన్ననలు పోందింది. రాగయుక్తంగా శ్లోకాలు, గీతాలు పాడి అందరి అభినందనలు అందుకున్నాడు. డ్యాన్స్లోనే కాకుండా తొలిసారిగా ఫ్యాషన్ షోలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. డ్యాన్సర్గా, మోడల్గా పలు రాష్ట్రాల్లో షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇద్దరూ ఆణిముత్యాలేతమ్ముడు కార్తికేయ రెడ్డి డ్యాన్స్, మోడలింగ్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అక్క హరి శ్రేయసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకుంది. 34 శ్లోకాల సమాహారమైన ‘శ్యామలదండకం’ వల్లించినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదైంది. అలాగే చిత్ర లేఖనం, పాటల పోటీలలో కూడా బహుమతులు గెలుచుకుంది. 2024లో ఉగాది ప్రతిభా పురస్కారం అందుకుంది.– దుక్క మురళీకృష్ణారెడ్డి, సాక్షి, విశాఖపట్నం -
ఓటీటీలో కార్తికేయ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ఎలాంటి అంచనాలు లేకుండా మే 31న ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, మొదటి ఆట నుంచి సినిమా బాగుందంటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.ప్రశాంత్ రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. బెట్టింగ్ మాఫియా చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చిన్న సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించగా తనికెళ్ల భరణి, రవిశంకర్, సుదర్శన్, కీరోల్స్ చేశారు. ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్పై ‘భజే వాయు వేగం’ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ అభిమానులకు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. You showered us with love in theaters 🫶🏻 here we are sending back the love straight to your home on June 28th @NetflixIndia 🤩#BhajeVaayuVegam pic.twitter.com/ghGf79KdNj— Kartikeya (@ActorKartikeya) June 24, 2024 -
నవీన్ చరిష్మాకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి. సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్ 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. -
'భజే వాయువేగం' సినిమా రివ్యూ
ఈ వేసవి అంతా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సరైన సినిమా పడలేదు. అలాంటిది ఈ వారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అందరి దృష్టి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పైనే ఉంది. కానీ యూవీ క్రియేషన్స్ తీసిన 'భజే వాయువేగం' కూడా ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)కథేంటి?వెంకట్ (కార్తికేయ) చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. అనాథగా మారిన ఇతడిని, తండ్రి స్నేహితుడు (తనికెళ్లి భరణి) దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్)లానే వెంకట్ని కూడా పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ.. ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు. అందులో గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు. దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? వెంకట్ తాను అనుకున్నది సాధించాడా? లేదా? ఇతడితో డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహిత్స్వ)కి సంబంధమేంటి? అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'భజే వాయు వేగం' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఊహించని విధంగా కెరీర్, వ్యక్తిగత, రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కుని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ. ఓవరాల్గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథ పరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే బాగుంది. పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్కి తగ్గ న్యాయం చేశాయి.ఫస్టాప్ విషయానికొస్తే.. పోలీస్ స్టేషన్లో హీరో అరెస్ట్ అయి ఉండే సీన్తో మూవీ మొదలైంది. ఆ తర్వాత ఏడాది వెనక్కి వెళ్లి.. హీరో గతమేంటి? అతడి చుట్టూ ఉండే వాతావరణం ఏంటనేది చూపించారు. స్టోరీ సెటప్ కోసం ఫస్టాప్ అంతా ఉపయోగించుకున్నారు. కానీ హీరోహీరోయిన్ లవ్ ట్రాక్ పరమ రొటీన్గా అనిపించింది. రెండు పాటలు ఓకే గానీ హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు. ఓ మాదిరిగా వెళ్తున్న మూవీ కాస్త ఇంటర్వెల్ వచ్చేసరికి ఆసక్తికరంగా మారింది. అక్కడి నుంచి చివరివరకు చాలా బాగా తీశారు. కానీ క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ముగించారు. అది కాస్త అసంతృప్తిగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ఎవరెలా చేశారు?'ఆర్ఎక్స్ 100'తో చాలా ఫేమ్ తెచ్చుకున్న కార్తికేయ.. ఆ తర్వాత మాత్రం సరైన హిట్ పడక ఎదురుచూపులు చూస్తున్నాడు. 'భజే వాయువేగం' అతడికి హిట్ ఇచ్చినట్లే! బాధ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు. హీరోయిన్ ఐశ్వర్య మేనన్ యాక్టింగ్ చేసేంత స్కోప్ ఈ మూవీలో దక్కలేదు. కాకపోతే ఈమె పాత్రని కూడా కథలో భాగం చేయడం కొంత ఉపశమనం. ఇక హీరోతో పాటు సరిసమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైనస్.. న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్లో బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. విలన్గా చేసిన రవిశంకర్ యధావిధిగా అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ ఉన్నప్పటికీ ఆయన తగ్గ సీన్స్ పడలేదు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు. తొలి మూవీనే కమర్షియల్గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 'భజే వాయువేగం'.. మరీ సూపర్గా కాకపోయినా మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
‘‘ఇప్పుడున్న నా ఇమేజ్కు సరైన మూవీ ‘భజే వాయు వేగం’. హీరో అంటే మనం ΄ోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఎంచుకునే మార్గాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావిస్తాను. అప్పుడే అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సామాజిక బాధ్యత ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది’’ అని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘లాక్ డౌన్ టైమ్లో ‘భజే వాయు వేగం’ కథ వినిపించాడు ప్రశాంత్ రెడ్డి. ఈ కథ వినగానే కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ టైపులో ఊహించుకున్నాను. ‘ఖైదీ’లో ఉన్నంత యాక్షన్ ఉండదు కానీ, హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. యూవీ క్రియేషన్స్లో సినిమా అనగానే మేకింగ్, ΄ోస్ట్ ్ర΄÷డక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయనే నమ్మకం వచ్చింది. ‘భజే వాయు వేగం’లో ఫస్టాఫ్లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు.సెకండాఫ్లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడనేది చూపించాం. ఈ సినిమా క్రెడిట్ వంద శాతం దర్శకుడిదే. హీరోగా చేస్తున్న టైమ్లో ‘గ్యాంగ్ లీడర్, వలిమై’ చిత్రాల్లో విలన్గా నటించినందుకు ఫీల్ అవడం లేదు. ఆ సినిమాల ద్వారా నాకు అమెరికాలో, తమిళ పరిశ్రమలో గుర్తింపు దక్కింది. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత తెలుగు, తమిళంలో విలన్గా చాన్స్ వచ్చినా పాత్రలు నచ్చక చేయలేదు. నా తర్వాతి సినిమాని కూడా ప్రశాంత్ రెడ్డితోనే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
అప్పుడే నటనపై ఆసక్తి పెంచుకున్నా: టాలీవుడ్ హీరోయిన్
యంగ్ హీరో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన చిత్రం "భజే వాయు వేగం". ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదేంటో తెలుసుకుందాం. ఐశ్వర్య మాట్లాడుతూ..' సినిమాలో ఇందు అనే బ్యూటీషియన్ క్యారెక్టర్ చేశా. ఇందులో ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించడానికే ఇష్టపడతా. స్పై సినిమా తర్వాత నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ సినిమాలో నా పాత్ర స్పై సినిమాలోని క్యారెక్టర్కు పూర్తి భిన్నంగా ఉంటుంది. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది.' అని అన్నారు. ఐశ్వర్య మాట్లాడుతూ..'తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న పట్టణం మాది. మధ్య తరగతి కుటుంబం. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్లో చదువుకుంటున్న కమర్షియల్ యాడ్స్లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడంతో చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ అయ్యాక నటన మీద ఫోకస్ చేశా. ఇప్పటివరకు తెచ్చుకున్న గుర్తింపు పట్ల గర్వంగా ఉంది. తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా. ఒక సినిమాకు సైన్ చేశా. తమిళంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నా' అని వెల్లడించింది. -
'భజే వాయు వేగం' ట్రైలర్ విడుదల
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్పై ‘భజే వాయు వేగం’ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.'బెదురులంక 2012' చిత్రం విజయం తర్వాత మరో విభిన్నమైన కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. తండ్రీ తనయుల బంధం చుట్టూ మలిచిన సన్నివేశాలు చిత్రానికి ప్రధానబలంగా ఉండనున్నాయి. ట్రైలర్లో కూడా ఆ ఎమోషన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమా మే 31న విడుదల కానుంది. -
భజే వాయు వేగం
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘భజే వాయు వేగం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్పై ‘భజే వాయు వేగం’ రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ను హీరో మహేశ్బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, అభినందనలు తెలిపారు. ‘‘ఫ్రెష్ కంటెంట్తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. -
ఫహాద్ ఫాజిల్ హీరోగా రెండు తెలుగు సినిమాలు!
మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన ఫహాద్ ఫాజిల్ రెండు తెలుగు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి ‘ఆక్సిజన్’ కాగా మరొకటి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ద్వారా ఫహాద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ లో నటిస్తున్న ఆయన హీరోగా రెండు తెలుగు చిత్రాల ప్రకటన వచ్చింది. మలయాళ హిట్ మూవీ ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి, హిట్ కొట్టిన కార్తికేయ (డైరెక్టర్ రాజమౌళి తనయుడు) ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆర్కా మీడియా వర్క్స్పై ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఈ సినిమాలను నిర్మించనున్నట్లు కార్తికేయ ప్రకటించారు. ‘ఆక్సిజన్’ చిత్రంతో సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీతో శశాంక్ ఏలేటి దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఈ రెండు సినిమాలకు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
'మీకు నంద్యాల తెలుసు కదా'.. అక్కడేదో ఊహించనిది జరుగుతోంది..!
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. ఈ సినిమాతో రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే రాయలసీమ నంద్యాల ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రధానంగా మదర్ సెంటిమెంట్తో పాటు సస్పెన్ష్ థ్రిల్లర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. నల్లమల ప్రాంతంలో జరిగే సస్పెన్ష్ సంఘటనలతో ట్రైలర్ చూపించారు. చివర్లో ‘ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా’ అని హీరో చెప్పే డైలాగ్.. ఇది కలియుగం అని కౌంటర్ చెప్పడం ఈ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాలీవుడ్ యంగ్ హీరో సూపర్ హిట్ సిరీస్.. ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 2014లో విడుదలైన కార్తికేయ మూవీతో సూపర్ హిట్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. బాలీవుడ్లోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. దీంతో నిఖిల్ ఈ సిరీస్లో మరో మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న కార్తికేయ-3 ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని నిఖిల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 'సరికొత్త అడ్వెంచర్ సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో మీ ముందుకు రానున్నాం' తాజాగా పోస్ట్ పెట్టారు. దీంతో నిఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ - చందు కాంబోలో మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ-2తో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కాగా.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రానున్న మూడో చిత్రంగా నిలవనుంది. 2014లో విడుదలైన కార్తికేయతో వీరి కాంబో తొలి విజయం అందుకుంది. కార్తికేయ- 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలు పోషించారు. కాగా.. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తండేల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. Dr. Karthikeya In Search of a Brand new Adventure ... Soon🔥 @chandoomondeti #Karthikeya3 #Karthikeya2 #cinema #adventure pic.twitter.com/xoNeD3F2KI — Nikhil Siddhartha (@actor_Nikhil) March 16, 2024 -
కలియుగం పట్టణంలో మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతోన్న ఈ చిత్రాన్ని నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం చూసుకున్నారు. ప్రస్తుతం మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ప్రారభించింంది చిత్రబృందం. ఈక్రమంలోనే ఈ చిత్రం నుంచి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. మదర్ సెంటిమెంట్, లవ్ సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చంద్రబోస్ రాసిన గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. కలియుగం పట్టణంలో టైటిల్ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. అజయ్ అరసాద అందించిన బాణీలు అందించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. -
ప్రేమలు చూసి నవ్వుతూనే ఉన్నాను: రాజమౌళి
‘‘సాధారణంగా నేను ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలను ఇష్టపడను. నాదంతా యాక్షన్, ఫైట్స్ స్టైల్. మలయాళ ‘ప్రేమలు’ సినిమా బాగుంది.. తెలుగులో రిలీజ్ చేస్తున్నాన ంటూ మా అబ్బాయి కార్తికేయ చెప్పడంతో.. ఏదో ఉత్సాహపడుతున్నాడులే అనుకున్నాను. సినిమాకి వెళ్లాక తొలి పదిహేను నిమిషాల తర్వాతి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. నస్లేన్ కె. గఫూర్, మమిత బైజు, శ్యామ్ మోహన్ , మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమలు’. మలయాళంలో హిట్గా నిలిచిన ఈ మూవీని ఎస్ఎస్ కార్తికేయ ఈ నెల 8న తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్మీట్కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ప్రేమలు’ మూవీకి డైలాగులను అద్భుతంగా రాశాడు ఆదిత్య. కొంచెం అసూయ, కొంచెం బాధతో ఈ మాటను ఒప్పుకోవాలి. మలయాళ నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ‘ప్రేమలు’లోని నటీనటులు అద్భుతంగా నటించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకులు అనిల్ రావిపూడి, అనుదీప్ కూడా మాట్లాడారు. -
ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. లంబోర్గిని కారు నడిపింది ప్రముఖ రియాల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ‘ఎక్స్’ ట్విటర్లో వీడియో పోస్ట్ గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కారు రిచ్ మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం కారు జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ వైపు కార్తీకేయ కారు నడిపినట్లు విచారణలో వెల్లడింది. ప్రస్తుతం కార్తికేయ దుబాయిలో ఉన్నట్లు సమాచారం. కార్తీకేయ మీద చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి.. కేసు నమోదు -
విదేశీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..!
దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వ కార్తికేయ. జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాలతో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో ఇండోనేషియన్ ప్రాజెక్ట్లో వీరిద్దరు క్రేజీ ఆఫర్ పట్టేశారు. ‘శూన్యం చాప్టర్ -1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మంగళవారం కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను, అజయ్ భూపతి లేదా నేను, పాయల్ ఎప్పుడు మళ్లీ సినిమా చేస్తామని అందరూ అడుగుతుంటే.. మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చాను. వారిద్దరి కాంబినేషన్లో ‘మంగళ వారం’ సినిమా చేస్తున్నట్లు వార్తలు చూసి, నన్ను వదిలేసి ఇద్దరూ సినిమా చేశారు అనుకున్నా (నవ్వుతూ). అజయ్ తన సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్ఎక్స్ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ‘మంగళవారం’లో చూపించాడు. 100 పర్సెంట్ అందరికంటే ఈ సినిమా కోసం నేనెక్కువ ఎదురు చూస్తున్నాను’’ అని హీరో కార్తికేయ అన్నారు. పాయల్ రాజ్పుత్, అజ్మల్ ఆమిర్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హీరో కార్తికేయ ట్రైలర్ని రిలీజ్ చేశారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ మంచి డార్క్ థ్రిల్లర్. ఇందులో మహిళలకు సంబంధించిన పాయింట్ని టచ్ చేశాం. కార్తికేయ, నా కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నకు (నిమ్మగడ్డ ప్రసాద్), నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా నిర్మించాలనే నా కల ‘మంగళవారం’తో నెరవేరింది’’ అన్నారు స్వాతీ రెడ్డి. ‘‘ఈ సినిమాతో నేను, స్వాతి నిర్మాతలుగా పరిచయమవడం గర్వంగా ఉంది’’ అన్నారు సురేష్ వర్మ. ‘‘నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ‘మంగళవారం’కి చాన్స్ ఇచ్చారు అజయ్గారు’’ అన్నారు పాయల్. -
రాజమౌళి వచ్చాక మా జీవితాలు మారిపోయాయి
-
సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానినికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. (ఇది చదవండి: పెళ్లి వార్తలపై త్రిష బోల్డ్ ట్వీట్) అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. 2012లో యుగాంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పల్లెటూరులో జరిగిన సంఘటనలే కథాంశంగా చూపించారు. 2012లో యుగాంతం అయిపోతుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. -
రాజమౌళి కి ఓపిక చాలా ఎక్కువ...!
-
చైల్డ్ ఆర్టిస్ట్ టూ హీరో.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కార్తికేయ!
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన నటుడు విశ్వ కార్తికేయ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ స్టార్స్ వద్ద చైల్డ్ ఆర్టిస్ట్గా పని చేశారు. బాలనటుడిగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అంతే తన నటనతో నంది, ఇతర అంతర్జాతీయ , ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు సొంతం చేసుకున్నాడు. (ఇది చదవండి: అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!) బాల్యనటుడిగానే కాదు.. జై సేన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వ కార్తికేయ. కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ అధినేతలు డా. కే. చంద్ర ఓబుల్ రెడ్డి, జీ మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆయూషి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సింగిల్ షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారు.ఈ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సందర్భంగా విశ్వ కార్తికేయ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో టీం అంతా కంగ్రాట్స్ తెలిపింది. (ఇది చదవండి: పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ?.. ఓ రేంజ్లో రతిక ఫైర్!) ఇవన్నీ ఇలా ఉంటే.. ఎన్త్ అవర్ (Nth Hour) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్తో విశ్వ కార్తికేయ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. యాక్షన్ అడ్వెంచర్గా రాబోతున్న ఈ మూవీ దర్శక నిర్మాణ బాధ్యతలను రాజు గుడిగుంట్ల తీసుకున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. -
సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది
‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు. ∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి -
సిక్కోలు థియేటర్లో కార్తికేయ సందడి, ఆ కొరత ఇన్నాళ్లకు తీరింది..!
బెదురులంక సినిమా యూనిట్ సిక్కోలులో సందడి చేసింది. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్కు వచ్చిన హీరో కార్తికేయ సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారన్నారు. గతంలో ఆర్ఎక్స్ 100 సినిమా ప్రమోషన్లో భాగంగా శ్రీకాకుళం వచ్చానని, ఇపుడు బెదురులంక సినిమా ప్రమోషన్లో భాగంగా ఇక్కడకు మళ్లీ వచ్చానని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బెదురులంక సినిమా షూటింగ్ జరిగిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా మంచి లొకేషన్లు ఉన్నాయని, అవకాశం వచ్చినపుడు ఇక్కడ కూడా తప్పకుండా షూటింగ్ చేస్తామన్నారు. మంచి కథలను ఒక్కొక్కటిగా ఎంచుకుని చిత్రాలు చేయడం జరుగుతుందన్నారు. అల్లు అర్జున్కు జాతీయస్థాయి అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో బెస్ట్ యాక్టర్ అవార్డు లేదనే కొరత ఉండేదని, అది ఇన్నాళ్లకు ఇలా తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యమహల్ యాజమాన్యం ధనంబాబు, నాగరాజు, మేనేజర్ నాగభూ షణం తదితరులు ఉన్నారు. చదవండి: పెళ్లైన హీరోలతో ప్రేమాయణం.. 48 ఏళ్ల వయసులోనూ సింగిల్గానే.. -
‘సిరివెన్నెల’ చివరి పాట మా సినిమాలో ఉండడం అదృష్టం: నిర్మాత
‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్చరణ్గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు. -
ఆయన నా బ్రెయిన్ని మార్చేశారు
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవీంద్ర బెనర్జీ ము΄్పానేని (బెన్నీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో క్లాక్స్ మాట్లాడుతూ– ‘‘భీమవరం దగ్గర భీమడోలు నా స్వస్థలం. నా అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. రామ్గోపాల్ వర్మ, సుధీర్ వర్మ, దేవ కట్టా గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. రామ్గోపాల్ వర్మగారు నా బ్రెయిన్ను మార్చేశారు. అప్పటివరకూ సినిమా అంటే సైన్స్ అని భావించిన నేను మూవీ అంటే ఓ ఆర్ట్ ఫార్మ్ అని అర్థం చేసుకున్నాను. రేపనేది లేదని తెలిస్తే మన గురించి సమాజం ఏమనుకుంటుందో అని మనం పట్టించుకోం. ఇలా చెప్పేలా హాలీవుడ్ ఫిల్మ్ ‘సెవెన్ సమురాయ్’లో ఓ డైలాగ్ ఉంది. అదే సమయంలో ‘యుగాంతం 2012’ సినిమా వచ్చింది. ఈ రెండు అంశాల ప్రేరణతో ‘బెదురులంక 2012’ కథ రాశాను. కార్తికేయకి కథ చెప్పగా ఓకే అన్నారు. అలాగే కథను సరిగ్గా అర్థం చేసుకున్న బెన్నీగారు కూడా స΄ోర్ట్ చేశారు. ఈ కథలో డ్రామా, హాస్యం, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి. మణిశర్మగారితో వర్క్ చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు. -
చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు జోడీగా 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి నటించిన సినిమా 'బెదురులంక 2012'. యుగాంతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగ విడుదల చేశారు. ఆగష్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన గత చిత్రం 'ఆర్ఎక్స్ 100' ట్రైలర్ని కూడా రామ్ చరణే రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర పేరు శివ అని, అది యాదృచ్ఛికంగా జరిగిందని కార్తికేయ తెలిపారు. ఈ సినిమాలో ఓ సన్నివేశం డిమాండ్ మేరకు శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు)గా డైలాగ్ చెప్పానన్నారు. ట్రైలర్ విడుదల అయ్యాక ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కార్తికేయ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని చాలామంది పలు రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అలా ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే చాలా బాధేస్తుందని కార్తికేయ అన్నారు. ఆయన నుంచి వచ్చిన ఏదైనా సినిమా నచ్చలేదు, బాగోలేదు అని అనడం వరకు ఓకేగానీ.. కొంతమంది పనికట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారు. అలాంటి వారిది చిన్న మనస్తత్వం అనిపిస్తుందని కార్తికేయ అన్నారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన చిరంజీవి.. అందుకే ఆయన మెగాస్టార్!) చిరంజీవినే కాదు అలా ఎవరినీ కూడా అనకూడదని ఆయన పేర్కొన్నారు. ఎవరమైనా కథ నచ్చే సినిమా తీస్తాం.. అనుకున్నంత స్థాయిలో అది ఆడకపోతే నేరమా అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి తన కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడ్డారు. జీవితంలో ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చిన్న విషయం మాత్రమే. ఇలాంటి వాటికి ఆయన ఏమాత్రం ఫీలవ్వకుండా తదుపరి సినిమాపై దృష్టిపెడతారని ఇదీ అందరికీ తెలుసని కార్తికేయ తన అభిప్రాయం తెలిపారు. -
కార్తికేయ, నేహా శెట్టి బెదురులంక 2012 మూవీ ఇంటర్వ్యూ
-
ఆత్మాభిమానం.. అహంభావం కాదు
‘‘2012 డిసెంబరు 21.. ప్రపంచం అంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు. కానీ ఎక్కడా ఏం జరగలా.. ఒక్క మా ఊర్లో తప్ప... (అజయ్ ఘోష్)’ అనే డైలాగ్తో మొదలవుతుంది ‘బెదురులంక 2012’ ట్రైలర్. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా రూపొందిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో రామ్చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కొత్త కాన్సెప్ట్లను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంటారు కార్తికేయ. ‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘నేను నమ్మనిది నేను చేయను.. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్.. ఈగో కాదు’ (ఆత్మాభిమానం.. అహంభావం కాదు) అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్స్ కూడా ట్రైలర్లో ఉన్నాయి ‘‘చిరంజీవిగారికి వీరాభిమాని అయిన కార్తికేయ ఈ సినిమాలో తన అభిమాన హీరో అసలు పేరు.. శివశంకర వరప్రసాద్ పాత్రలో నటించారు. యుగాంతం వస్తుందని ఆంధ్రప్రదేశ్లోని బెదురులంక గ్రామంలో కొందరు కేటుగాళ్లు ప్రజల్లో ఉన్న భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో ఎలా దోపిడీ చేశారు? వారికి శివశంకర వరప్రసాద్ ఏ విధంగా బుద్ధి చెప్పాడు? అన్నదే ఈ సినిమా కథ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
అందరొక్కటే..
‘లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడుకాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే..’ అంటూ మొదలవుతుంది ‘బెదురులంక 2012’ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు’ పాట. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. క్లాక్స్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకల్పనలో కిట్టూ విస్సాప్రగడ రాసిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. ‘‘ఓ ఊరి ప్రజలకు దేవుని మీద ఉన్న భక్తిని గమనించిన కొందరు మోసగాళ్లు ఎలా దోచుకుంటారనేది ఈ పాటలో చూపించాం’’ అన్నారు క్లాక్స్. -
చెప్పరా శివా...
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా, నువెవడివి సొల్లుడా శివా (చెప్పరా శివా)...’ అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చిన ఈ పా టని అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర పా డారు. -
గోదావరి నేపథ్యంలో 'బెదురులంక'.. రిలీజ్ డేట్ ఫిక్స్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘బెదురులంక 2012’. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు బెన్నీ ముప్పానేని. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మణిశర్మగారు అద్భుతమైన బాణీలు అందించారు. కార్తికేయ, నేహా జోడీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు క్లాక్స్. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, సమర్పణ: సి. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సహనిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల. -
ఇకపై భాగ్ సాలే సినిమా గుర్తొస్తుంది
‘‘భాగ్ సాలే ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేశ్ బాబుగారి పాట గుర్తుకొచ్చేది. ఇకపై భాగ్ సాలే అంటే ఈ సినిమా గుర్తొస్తుంది. శ్రీ సింహాకి ‘భాగ్ సాలే’ పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, నేహా సోలంకి, నందినీ రాయ్ హీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలకానుంది. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్ను కార్తికేయ విడుదల చేశారు. ‘‘క్రైమ్ కామెడీగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు అర్జున్ దాస్యన్. ‘‘ఇది హైదరాబాద్ బేస్డ్ మూవీ. మంచి ఇరానీ చాయ్లాంటి సినిమా’’ అన్నారు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి. ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే టక్కరి దొంగ పాత్ర చేశాను. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శ్రీ సింహా. -
ఆరోపణలకు చెక్, ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చుపై క్లారిటీ ఇచ్చిన కార్తికేయ
తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వచ్చిందంటే యావత్ భారతదేశం పొంగిపోయింది. కానీ కొందరు మాత్రం ఆస్కార్ క్యాంపెయిన్ కోసం కోట్లు గుమ్మరించారు, అవార్డును కొన్నారంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు విమర్శలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజమౌళి తనయుడు, ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ క్లారిటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాపై విదేశీయులు మక్కువ చూపించారు. అందుకే ఓటీటీలోకి వచ్చినప్పటికీ అమెరికాలో రిలీజ్ చేయాలనుకున్నాం. కేవలం ఒక రోజు 60 స్క్రీన్లలో ప్రదర్శిద్దామనుకున్నాం. ఒక రోజు కోసం అనుకుంటే నెల రోజులు గడిచిపోయింది. సినిమా చూశాక అందులో మీకు ఏం నచ్చింది? అని అక్కడి ప్రేక్షకులను అడిగాం. చరణ్ను తారక్ అన్న ఎత్తుకుని ఫైట్ చేసిన సన్నివేశం తెగ నచ్చిందన్నారు. పాటలు వస్తుంటే కూడా లేచి డ్యాన్స్ చేస్తున్నారు. వారికి మాత్రమే ఆహ్వానం కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, ప్రేమ్రక్షిత్, కాలభైరవలకు అకాడమీ ఆహ్వానం పంపింది. నామినీలకు, స్టేజీపై పర్ఫామ్ చేసేవాళ్లకు అకాడమీ కమిటీ ఆహ్వానిస్తుంది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందాలు టికెట్ కొనాల్సిందే! ఇందుకోసం నామినేషన్స్లో ఉన్నవాళ్లు కమిటీకి ఈమెయిల్ పంపుతారు. కీరవాణి, చంద్రబోస్ మాకోసం ఈమెయిల్ చేశారు. వాళ్లు అది చూసిన తర్వాత లింక్ పంపుతారు. దాని ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆ టికెట్లలో కూడా రకరకాల క్లాసులుంటాయి. లోయర్ లెవల్ సీట్ల కోసం ఒక్కొక్కటి 1500 డాలర్లు పెట్టి కొన్నాం. ఒక్కో టికెట్కు ఎంతంటే? టాప్లో కూర్చుని చూసేందుకు మా కుటుంబంలోని నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్లు తీసుకున్నాం. ఆస్కార్ కొనడమనేది పెద్ద జోక్. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూషన్ అది. అక్కడ ప్రతిదానికీ ఓ పద్ధతి ఉంటుంది. అయినా ఆడియన్స్ ప్రేమను కొనగలమా? స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనలేం కదా.. హాలీవుడ్ సినిమాలు ప్రచారం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మాకు అలాంటి ఆస్కారం లేదు. ప్రచారం కోసం రూ.5 కోట్లు బడ్జెట్ అనుకున్నాం. మొదటి ఫేజ్లో రూ.3 కోట్లు ఖర్చయ్యాయి. నామినేషన్స్ అయ్యాక ఆ సెకండ్ ఫేజ్లో మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తంగా రూ.8.5 కోట్లు ఖర్చయింది' అని చెప్పుకొచ్చాడు కార్తికేయ. -
ఆస్కార్తో తిరిగొచ్చిన RRR టీమ్, జై హింద్ అంటూ..
ఆర్ఆర్ఆర్ అనుకున్నది సాధించింది. తెలుగువారికి అందనంత ఎత్తులో ఉన్న ఆస్కార్ను అందిపుచ్చుకుంది. మహామహుల సమక్షంలో నాటు నాటు పాటకు కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సంతోషంలో చిత్రయూనిట్కు అమెరికాలో ఆస్కార్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్కు వచ్చేయగా తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ విజయదరహాసంతో నగరానికి చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్ అవార్డుతో రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అయితే మీడియాతో మాట్లాడకుండా జైహింద్.. అంటూ అక్కడి నుంచి రాజమౌళి వెళ్లిపోయాడు. చదవండి: తొలిసారి నెగెటివ్ రోల్లో ఒకరు, ఎమోషనల్ క్యారెక్టర్లో మరొకరు -
నాటునాటుకు ఆస్కార్.. అతడు లేకపోతే అవార్డు వచ్చేదే కాదు!
నాటు నాటు.. కేవలం రెండక్షరాల పదం.. ఏముంది ఆ పాటలో అంటారా? అక్కడికే వస్తున్నాం.. అమ్మచేతి పెరుగు ముద్దలో ఉన్నంత కమ్మదనం.. తండ్రి గంభీరం వెనక దాగి ఉన్న ప్రేమ.. పరీక్షలో ఫెయిలై అభాసుపాలైతే ఎలాగైనా క్లాస్ ఫస్ట్ రావాలన్న కసి.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న లక్ష్యం.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. డీజే పాటలు, అర్థం కాని సంగీతం, తెలుగు, ఇంగ్లీష్ కలగలిపిన లిరిక్స్.. ఇవే ట్రెండ్గా మారిన తరుణంలో మట్టిలో మాణిక్యాంలా వచ్చింది నాటు నాటు. అన్నింటినీ పక్కకు నెట్టి అందరి చెవుల్లో అమృతం పోస్తూ, మర్చిపోతున్న పల్లెదనాన్ని ముందుకు తెస్తూ అందరినీ కదిలించిందీ సాంగ్. కేవలం విని సంతోషించేలా కాదు అందరిచేత స్టెప్పులేయించింది. అదీ ఈ పాట గొప్పతనం.. ఈ పాట ఆస్కార్ వరకు వెళ్లడం అంత చిన్న విషయం కాదు. మరి దీని వెనక ఉన్నదెవరో తెలుసా? కార్తికేయ. ఈ విషయాన్నే కీరవాణి స్వయంగా ఆస్కార్ అందుకునే సమయంలో చెప్పాడు. అంత పెద్ద వేదికపై కార్తికేయకు థ్యాంక్స్ చెప్పడంతో అందరి దృష్టి అతడిపై పడింది. ఎవరీ కార్తికేయ? కార్తికేయ మరెవరో కాదు రమాకు మొదటి భర్త వల్ల కలిగిన సంతానమే కార్తికేయ. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కథ రచన మొదలు.. ఆస్కార్ గెలుపుదాకా అన్నింట్లో కార్తికేయ కృషి ఉంది. మార్కెటింగ్, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు, ఆస్కార్ పొందడానికి తగిన కార్యాచరణ మొత్తం ఆర్గనైజ్ చేసింది కార్తికేయ. ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా 'కార్తికేయ వెంటపడతాడు, కార్యశూరుడు' అంటూ మెచ్చుకున్నాడు. విమర్శలు, వివాదాల జోలికి పోకుండా తెర వెనుక సైలెంట్గా తన పని తాను చేసుకుపోతాడు. తెరపై మాత్రం రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తదితరులు కనిపిస్తారు. ఆస్కార్ గెలుపుతో చంద్రబోస్, కీరవాణికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ ఈ అవార్డు రావడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కాలభైరవే! తను లేకపోతే ఆ అవార్డే లేదు. కనీసం దాని ముంగిటకు కూడా రాకపోయేవారేమో! అందుకే కార్తికేయ కష్టాన్ని గుర్తించిన కీరవాణి అకాడమీ వేదిక మీద తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరుసకు కొడుకైనా కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయాడు. పాట రూపొందించడం ఒక ఎత్తయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. మన పాటకు ప్రపంచమే ఊగిపోవాలె అన్న రీతిలో ప్రమోషన్స్ చేశాడు. ఈ విషయంలో కార్తికేయను మెచ్చుకోవాల్సిందే! తనే కనక పట్టుబట్టి ఉండకపోతే ఆస్కార్ కల నిజం కాకపోయేదేమో! గతంలో మనకు ఆస్కార్ రాలేదా? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాటు నాటు పాటే! భారత్ గెలిచిన తొలి ఆస్కార్ ఇదే అన్నంత రీతిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో మనకు ఆస్కార్ రాలేదా? అంటే వచ్చాయి. భాను అథైయా(బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్), సత్యజిత్ రే, రసూల్ పూకుట్టి(బెస్ట్ సౌండ్ మిక్సింగ్), గుల్జర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్), ఏఆర్ రెహమాన్(బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్) వివిధ కేటగిరీల్లో అకాడమీ అవార్డులు అందుకున్నారు. మదర్ ఇండియా, లగాన్, సలాం బొంబాయి వంటి సినిమాలు ఆస్కార్కు నామినేట్ అయ్యాయి. కానీ ఏ సినిమా ఇప్పటివరకు ఆస్కార్ను గెలుచుకోలేదు. ఈసారి ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో ఆస్కార్కు పంపుతారనుకుంటే మొండిచేయి ఎదురైంది. భారత్ నుంచి గుజరాతీ సినిమా ఛెల్లో షోను పంపారు కానీ ఆదిలోనే దాన్ని తిరస్కరించడంతో సినీప్రియులు నిరాశచెందారు. ఆర్ఆర్ఆర్ను పంపి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
కార్తికేయ, నేహాశెట్టిల రొమాంటిక్ 'వెన్నెల్లో ఆడపిల్ల' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012". క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, గ్లింప్స్ ఆడియోన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు. వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ ఓ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను హారిక నారాయణ్, సుధాన్షు జేవీ ఆలపించారు. -
ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి – కార్తికేయ
‘‘నేను నటించిన గత సినిమాల్లో జరిగిన తప్పులు ‘బెదురులంక 2012’లో జరగకుండా చూసుకున్నా. ఈ సినిమాను సపో ర్ట్ చేసి, నాకు ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి.. థ్యాంక్యూ’’ అని హీరో కార్తికేయ అన్నారు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ని హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనే నమ్మకంతో ఈ మూవీ చేశా.. బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు బెన్నీ ముప్పనేని. ‘‘నాకు తొలి చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు క్లాక్స్. -
‘లెహరాయి’ పెద్ద హిట్ అవ్వాలి: కార్తికేయ
‘కొత్తగా వచ్చే సినిమాలు ఎంత హిట్ అయితే అంతమంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది. లెహరాయి చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని యంగ్ హీరో కార్తికేయ అన్నారు. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి. డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ వేణుగోపాల్ గారే. ఇది ఒక మంచి కథ. ఈ కథను పూరి జగన్నాధ్ తీసిన, త్రివిక్రమ్ తీసిన అందరికి నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ ఇది’ అని హీరో రంజిత్ అన్నారు. ‘ఈ సినిమాను చాలా మందికి చూపించాను. అందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఒక సినిమాకు కావాల్సిన అన్ని హంగులు లెహరాయిలో ఉన్నాయి. డిసెంబర్ 9న విడుదలయ్యే ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’అని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. -
పల్లెటూరి అమ్మాయిగా నేహాశెట్టి.. ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తికేయ నటిస్తున్న తాజాచిత్రం బెదురులంక. క్లాక్స్ దర్శకత్వం రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా డీజే టిల్లు భామ నేహాశెట్టి నటిస్తుంది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సోమవారం(నేడు)ఆమె బర్త్డే సందర్భంగా మేకర్స్ నేహాశెట్టి ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨ Introducing "Chitra" from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS — Kartikeya (@ActorKartikeya) December 5, 2022 -
Vadu Evadu: సస్పెన్స్.. థ్రిల్
‘‘వాడు ఎవడు’ టీజర్ చాలా బాగుంది. వాస్తవ ఘటనలతో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్తికేయ, అఖిలా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘వాడు ఎవడు’. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ క్రియేషన్స్పై ఎన్. శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఎన్. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సందేశం ఇస్తున్నాం. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు. ‘‘వైజాగ్లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది’’ అని ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించిన రాజేశ్వరి పాణిగ్రహి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ గండ్రకోటి, సంగీతం: ప్రమోద్ కుమార్, నేపథ్య సంగీతం: రాజేష్. -
గోద్రెజ్ ఇంటీరియో స్టోర్ను ప్రారంభించిన హీరో కార్తికేయ
-
కార్తీకేయతో జతకట్టిన ‘డీజే టిల్లు’ హీరోయిన్
Karthikeya and Neha Shetty Movie Launch: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ వంటి చిత్రాలు నిర్మించిన రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి.యువరాజ్ సమర్పిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజకార్యక్రమాన్ని జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్ ఇచ్చారు. ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు సానా బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ కెరీర్లో ఇదొక డిఫరెంట్ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నాం. దివంగత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు మా చిత్రంలో ఒక పాట రాశారు’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ కొత్తగా, విభిన్నంగా బతకాలని ఉంటుంది. కానీ, పరిస్థితుల ప్రభావంతో సాధారణంగా జీవిస్తారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టు జీవించే ఓ యువకుడి కథ ఇది’’ అని క్లాక్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. -
అర్థరాత్రి చార్మినార్లో సందడి చేసిన రాజమౌళి.. ఫోటోలు వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్ చార్మినార్లో సందడి చేశారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్ను సందర్శించాడు. సాధారణ వ్యక్తిలా వెళ్లి నైట్ నైట్ బజార్ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయ్యిండి కూడా ఇంత సింపుల్గా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా రంజాన్ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్లో షాపింగ్ హడావిడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఇటీవలె ఆర్ఆర్ఆర్తో బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న రాజమౌళి మహేశ్ బాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. -
యూవీ క్రియేషన్స్తో కార్తికేయ సినిమా.. పోస్టర్ రిలీజ్
‘‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి రాజశేఖర్. Super proud & excited to be associated with the Prestigious @UV_Creations banner 😇 Directed by @Dir_Prashant, #Kartikeya8 Title revealing soon 🏎️✨️ pic.twitter.com/SqKI2IOOyR — Kartikeya (@ActorKartikeya) April 8, 2022 -
'వలిమై' రన్టైం తగ్గించిన మేకర్స్.. ఎందుకంటే
వలిమై చిత్ర నిడివిని యూనిట్ కొంత మేరకు కుదించింది. వివరాలు.. అజిత్ కథానాయకుడిగా జీ సినిమాతో కలిసి బోనీ కపూ ర్ నిర్మించిన చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి నాయకిగా నటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గురువారం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. చిత్రంలో పోరాట దృశ్యాలు, బైక్ ఛేజింగ్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అజిత్ అభిమానులు భలే ఖుషీ అవుతున్నారు. అయితే చిత్ర నిడివి ఎక్కువైందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన యూనిట్ వెంటనే 14 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే చిత్ర నిర్మాత బోనీకపూర్ చెన్నైలో వలిమై చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లను విజిట్ చేస్తున్నారు. ఆయనపై అజిత్ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. -
‘వలిమై’మూవీ రివ్యూ
టైటిల్ :వలిమై నటీనటులు :అజిత్, కార్తికేయ, హ్యూమా ఖురేషీ తదితరులు నిర్మాణ సంస్థలు : బే వ్యూ ప్రాజెక్ట్స్, జి.స్టూడియోస్ నిర్మాత: బోనీ కపూర్ దర్శకత్వం :హెచ్.వినోద్ సంగీతం : యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ :నీరవ్ షా విడుదల తేది : ఫిబ్రవరి 24, 2022 దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు.. వరుసగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాయి.తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ గురువారం(ఫిబ్రవరి 24)ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘వలిమై’కథేటంటే వైజాగ్ కేంద్రంగా ‘సైతాన్ స్లేవ్స్’పైరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్(కార్తికేయ). ఆన్లైన్ వేదికగా జరిగే ఈ చట్ట విరుద్ద కార్యక్రమానికి నిరుద్యోగ యువతనే టార్గెట్గా చేసుకుంటాడు. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేసి, చైన్ స్నాచింగ్, హత్యలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడతాడు. వైజాగ్లో రోజు రోజుకి బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో.. వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్ కమిషనర్ అర్జున్(అజిత్). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతని ఫ్యామిలీని టార్గెట్ చేసిన నరేన్కు అర్జున్ ఎలా బుద్ది చెప్పాడు? చివరకు ఆన్లైన్ వేదిక ‘సైతాన్ స్లేవ్స్’ని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే ఏసీపీ అర్జున్ పాత్రలో అజిత్ ఒదిగిపోయాడు.స్వతగా అజిత్ మంచి బైక్ రేసర్ కావడంతో యాక్షన్స్ సీన్స్లో అద్భుతంగా నటించగలిగాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్లో అజిత్ అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రంతో కోలివుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. విలన్గా మెప్పించాడు. యాక్షన్స్ సీన్స్లో అజిత్కు గట్టి పోటీ ఇచ్చాడు. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెడ్ సోఫియా పాత్రలో హ్యుమా ఖురేషి జీవించేసింది. సినిమాలో తనది కీలక పాత్ర అనే చెప్పాలి. ఇక ఏసీపీ అర్జున్ తమ్ముడు బుజ్జిగా రాజ్ అయ్యప్ప తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... వలిమై పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం. డ్రగ్స్ సరఫరా, చైన్ స్నాచింగ్, హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ సాగుతోంది. ఆన్లైన్ వేదికగా నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ని, ఆ గ్యాంగ్ లీడర్ని పోలీసులు ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా కథ. రోటీన్ కథనే ఎంచుకున్న దర్శకుడు వినోద్.. అజిత్కి తగ్గట్లుగా భారీ యాక్షన్ సీన్స్ని, బైక్ రేసింగ్ నేపథ్యాన్ని తీసుకొని సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం అజిత్, కార్తికేయ మధ్య వచ్చే బైక్ ఛేజ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలే. యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే సినిమాలో కొత్తదనం లేకపోవడం, నిడివి ఎక్కువ ఉండడం మైనస్. సినిమా మొత్తం చేసింగ్ సీన్లే ఉంటాయి. మధ్య మధ్యలో మదర్ సెంటిమెంట్ చొప్పించే ప్రయత్నం చేసినా.. అది వర్కౌట్ కాలేదు. అంతేకాదు ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ బోరింగ్గా అనిపిస్తాయి. ఉన్నంతలో ఫస్టాఫ్ అంతో ఇంతో మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్ బోరింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా పాత సినిమాల మాదిరి ఉంటుంది. ఓ ఫ్యాక్టరీలో హీరో ఫ్యామిలీని విలన్ బంధించి ఉంచడం.. హీరో వచ్చి ఫైట్ చేసి వారిని విడిపించడం.. ఇలాంటి క్లైమాక్స్ సీన్స్ గతంలో చాలా సినిమాల్లో వచ్చాయి. ఎడిటింగ్ బాలేదు. పాటలు, నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఆ ఇద్దరూ చాలా ఫోకస్డ్గా ఉంటారు: బోనీ కపూర్
‘‘బాపూగారు దర్శకత్వం వహించిన ‘మన ఊరి పాండవులు’ సినిమాను హిందీలో ‘హమ్ హై పాంచ్’గా రీమేక్ చేశాను. ఈ రీమేక్తోనే నిర్మాతగా నా కెరీర్ ప్రారంభమైంది’’ అన్నారు బోనీ కపూర్. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వలిమై’. కీలక పాత్రలో హ్యూమా ఖురేషీ, విలన్గా కార్తికేయ నటించారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 24) విడుదలవుతోంది. తెలుగులో ఇనుమూరి గోపీచంద్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోనీ కపూర్ మాట్లాడుతూ – ‘‘అజిత్, వినోద్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. వీరి కాంబినేషన్లో మూడో సినిమా చేస్తున్నాను. కార్తికేయ ఆఫ్ స్క్రీన్లో కూల్గా ఉంటాడు కానీ ఆన్ స్క్రీన్పై షేర్లా యాక్ట్ చేస్తాడు. నా కుమార్తె జాన్వీ కపూర్ దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. తెలుగులో యాక్ట్ చేసేందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తోంది’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారి బ్యానర్ (శ్రీదేవి భర్త బోనీ కపూర్)లో యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తికేయ. -
Valimai Pre Release Event: వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
స్టార్ హీరో అజిత్పై బోనీ కపూర్ ప్రశంసలు
Boney Kapoor Praises Ajith Kumar For Valimai Film: నిర్మాతల ఇష్టమైన నటుడు అజిత్ అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అన్నారు. ఈయన జి.స్టూడెంట్స్ సంస్థతో కలిసి (అజిత్ కథానాయకుడిగా) నిర్మించిన చిత్రం వలిమై. హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో విడుదల కానుంది. ఇది కుటుంబ అనుబంధాలతో కూడిన యాక్షన్ చిత్రమని నిర్మాత బోనీ కపూర్ వెల్లడించారు. అజిత్ వినమ్రత కలిగిన నిబద్ధతతో కూడిన నటుడని కితాబు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆయన నిర్మాతల ఇష్టమైన నటుడని అన్నారు. ఈ చిత్రం తాము ఊహించిన విధంగా రూపొందడానికి అజిత్ సహకారమే కారణమన్నారు. దర్శకుడు హెచ్.వినోద్ శ్రమకు ప్రతిఫలం ఈ చిత్రం అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా తాము థియేటర్లోనే విడుదల చేయడానికి మొగ్గు చూపామన్నారు. -
కోలీవుడ్ స్టార్తో కార్తికేయ సినిమాపై కీలక అప్డేట్
Ajith, Karthikeyas Valimai Movie All Set To Release: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లెటెస్ట్ మూవీ 'వాలిమై'. హెచ్ వినోద్ దర్శకత్వంతో వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం అటూ కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు అజిత్ తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి4న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమాను తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ఒకే రోజున విడుదల చేయనున్నారు. -
ఆకట్టుకుంటున్న అజిత్ ‘వాలిమై’ మూవీ ట్రైలర్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం వాలిమై. హెచ్ వినోద్ దర్శకత్వంతో వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్గా కనిపించనున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత అజిత్ ఈ మూవీ ప్రకటించడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం అటూ కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు అజిత్ తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వదిలారు మేకర్స్. న్యూయర్ సందర్భంగా ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తూ వాలిమై ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. చదవండి: ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోన్న శ్యామ్ సింగరాయ్!, స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా పెంచుతోంది ఈ ట్రైలర్. ముఖ్యంగా అజిత్, కార్తికేయ బైక్ స్టంట్స్ ఫ్యాన్స్ చేత ఈళలు వేయించేలా ఉంది. ఇక యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు స్పెషల్ అట్రాక్షన్గా చెప్పకోవచ్చు. కాగా బోణీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హుమా కురేషి కీలక పాత్ర పోషిస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈమూవీ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీని డబ్ చేయనున్నారు. చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా? -
Rewind 2021: వాళ్లను కలిపింది.. వీళ్లను దూరం చేసింది
2021 కొందరిని ఒక ఇంటివారిని చేసింది. కొందరిని ఈ లోకానికి దూరం చేసింది. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటలు, హఠాన్మరణంతో షాక్కి గురి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. పెళ్లి సందడి 2021లో పెళ్లి సందడి కనిపించింది. హీరోలు కార్తికేయ, సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రణీత, సింగర్ సునీత వంటి సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. ♦ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యారు. నవంబరు 21న తన ప్రేయసి లోహితతో ఏడడుగులు వేశారు. వరంగల్ నిట్లో బీటెక్ చేస్తున్నప్పుడు తొలిసారి (2010) లోహితను కలిశారు కార్తికేయ. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ♦ ప్రముఖ దర్శక–నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న దీపిక మెడలో మూడు ముడులు వేశారు. అమెరికాలోని డల్లాలో రీసెర్చ్ సైంటిస్ట్గా చేస్తున్నారు దీపిక. సుమంత్, దీపికలది పెద్దలు కుదిర్చిన వివాహం. ♦ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ ప్రణీత కూడా ఈ ఏడాది అత్తారింటిలోకి అడుగుపెట్టారు. మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. బెంగళూరులో నితిన్ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ‘మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్’ అన్నారు ప్రణీత. ♦ ప్రముఖ గాయని సునీత ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనితో ఏడడుగులు వేశారు. జనవరి 9న వీరి పెళ్లి శంషాబాద్ సమీపంలోని రామాలయంలో జరిగింది. ♦ హాస్య నటి విద్యాల్లేఖా రామన్ పెళ్లి సెప్టెంబర్ 9న సంజయ్తో జరిగింది. ఫిట్నెస్, న్యూట్రషనిస్ట్ ఎక్స్పర్ట్గా చేస్తున్నారు సంజయ్. వీరిది ప్రేమ వివాహం. కాగా, పెళ్లి జరిగిన విషయాన్ని కొన్ని రోజులకు ‘మా పెళ్లయింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేశారు విద్యుల్లేఖా రామన్. ఇక సెలవు తెలుగు పరిశ్రమలో ఈ ఏడాది బోలెడు విషాదాలు నెలకొన్నాయి. కొందరు కరోనాతో, మరికొందరు అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి ‘ఇక సెలవు’ అంటూ షాకిచ్చారు. ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి నవంబర్ 30న ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నృత్యదర్శకులు శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ నవంబర్ 28న మృతి చెందారు. అదే విధంగా గాయకుడు జి. ఆనంద్ మే 7న, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్ మే 7న, రచయిత నంద్యాల రవి మే 14న, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ మే 10న, డైరెక్టర్ అక్కినేని వినయ్ కుమార్ మే 12న, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు వి. కాంచన్ బాబు వంటి వారిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ మే 12న, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ బీఏ రాజు మే 21న, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మే 26న, యువ నిర్మాత మహేశ్ కోనేరు అక్టోబర్ 12న గుండెపోటుతో మృతి చెందారు. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ సెప్టెంబరు 27న కిడ్నీ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. అదే విధంగా డైరెక్టర్ గిరిధర్ (శుభ ముహూర్తం) ఆగస్టు 2న, నటుడు రాజాబాబు అక్టోబర్ 25న అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. -
టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హంగామా
-
3 వేల కోసం ముగ్గురిని చంపాడు
నిజామాబాద్ అర్బన్: చిన్నప్పటి నుంచే నేర ప్రవృత్తి.. 16ఏళ్ల వయసులోనే హత్యాయత్నం చేసి మూడేళ్లు జైలుకెళ్లాడు.. బయటికొచ్చి రెండు నెలలైనా కాలేదు.. డబ్బుల కోసం దొంగతనాలు మొదలుపె ట్టాడు. రూ.3 వేల కోసం ముగ్గురిని కిరాతకం గాచంపేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ నెల 8న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులో ముగ్గురు హత్యకు గురికావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు గంధం శ్రీకాంత్ అలియాస్ మల్లేశ్ (19)ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను నిజామాబాద్ సీపీ కార్తికేయ మీడియాకు వెల్లడించారు. చిన్నప్పటి నుంచే నేరాలతో.. నవీపేట మండల కేంద్రానికి చెందిన గంధం శ్రీకాంత్ అలియాస్ మల్లేశ్కు చిన్న వయసు నుంచే నేర చరిత్ర ఉంది. నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుమార్లు దొంగతనాలు చేసి జువైనల్ హోంలో శిక్ష అనుభవించాడు. 2016లో నిజామాబాద్ హమాలీవాడిలోని సాయిబాబా ఆలయంలో హుండీని దొంగిలించేందుకు యత్నించాడు. అడ్డువచ్చిన వాచ్మన్పై దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనకు సంబంధించి మూడేళ్లు జైల్లో ఉన్న శ్రీకాంత్.. అక్టోబర్ 13న విడుదలయ్యాడు. అప్పటి నుంచి నిజామాబాద్లోని గాజుల్పేట్(కడ్డా) ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దొంగతనం కోసం వెళ్లి.. ఈ నెల 8న రాత్రి నిజామాబాద్లోని మిర్చి కాం పౌండ్లో మద్యం తాగిన శ్రీకాంత్.. డబ్బుల కోసం దొంగతనానికి పాల్పడేందుకు బస్సు ఎక్కి డిచ్పల్లికి వెళ్లాడు. అక్కడి ఓ గ్యారేజీలో పంజాబ్ చెందిన హర్పాల్సింగ్ (33), జోగిందర్సింగ్ (48), సంగా రెడ్డి జిల్లాకు చెందిన బానోత్ సునీల్ (22) నిద్రపోతుండటం చూశాడు. తొలుత గ్యారేజీ ఆవరణలో నిద్రిస్తున్న సునీల్ వద్ద డబ్బు, సెల్ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సునీల్ మేల్కొ నడంతో సుత్తితో తలపై కొట్టాడు. లోపల నిద్రిస్తున్న హర్పాల్సింగ్, జోగిందర్సింగ్లనూ తలపై సుత్తితో మోది చంపేశాడు. వారివద్ద ఉన్న సెల్ఫోన్లు, రూ.3 వేల నగదు తీసుకుని పరారయ్యాడు. ఒకేచోట జరిగిన ఈ ముగ్గురి దారుణహత్యలు కలకలం రేపాయి. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతోపాటు పాత నేరస్తులపై నిఘా పెట్టారు. ఈ క్రమం లో గాజుల్పేట్ ప్రాంతంలో తనిఖీలు చేసి.. శ్రీకాంత్ను పట్టుకున్నారు. అతడి గదిలో రక్తం మరకలు ఉన్న చొక్కాను, ఎత్తుకెళ్లిన మూడు సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్తికేయ దంపతులు
Actor Karthikeya Visits Tirupati With Wife And Family: హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం(నవంబర్26)న నూతన దంపతులిద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో కార్తికేయ దంపతులు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ అధికారులు సత్కరించారు. -
అట్టహాసంగా హీరో కార్తీకేయ వెడ్డింగ్ రిసెప్షన్, కళ్లు చెదిరె అరెంజ్మెంట్స్..
యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మూడు రోజులకు బుధవారం(నవంబర్ 24) రాత్రి వారి వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్గా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్నేహితులు, సన్నిహితులు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్కు తెలుగు సినీ ప్రముఖులతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా హజరయ్యారు. కళ్లు చెదిరే అరెంజ్మెంట్స్తో వీరి రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ఆది సాయికుమార్, రాహుల్ రవీంద్రన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది. వరంగల్ నీట్లో బీటెక్ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసిందట. 2012లో లోహితకు ప్రపోజ్ చేసిన కార్తీకేయ హీరో అయ్యాకే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడతానని చెప్పాడట. అలా హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికి కూడా కార్తీకేయ అంతే కష్టపడ్డాడు. ఫైనల్గా యూత్ హీరోగా నిలదొక్కుకుని పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమా విషయాలకొస్తే.. కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం తల అజిత్ ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు. -
హీరోనవుతా, నా పెళ్లికి చిరంజీవి వస్తారు.. విచిత్రంగా అదే జరిగింది: హీరో
యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు లొహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్ వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: షాకింగ్ లుక్లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. కాగా కార్తీకేయ మెగాస్టార్కు పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. ఓ మూవీ ఈవెంట్లో చిరు పాటకు డ్యాన్స్ చేసిన కార్తీకేయ అనంతరం మాట్లాడుతూ.. చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయన తనకే కాదు ఈ తరం హీరోలందరి స్ఫూర్తి అంటూ చెప్పకొచ్చాడు. అలాగే చిరంజీవి గారిని కలవడం తన చిరకాల కలగా ఉండేదని చెప్పాడు. ఈ నేపథ్యంంలో తన పెళ్లికి చిరంజీవి రావడంతో కార్తీకేయ సంబరంలో మునిగితేలుతున్నాడు. ఈ పెళ్లిలో నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న చిరు ఫొటోను షేర్ చేస్తూ తెగ మురిసిపోయాడు కార్తీకేయ. చదవండి: ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్, మన అగ్ర హీరోలందరితో జతకట్టింది, ఎవరో గుర్తు పట్టారా? ఈ సందర్భంగా కార్తీకేయ ఓ ఆసక్తిక సంఘటనను పంచుకున్నాడు. ‘చిన్నప్పుడు నేను తరచూ ఒక మాట అంటూ ఉండేవాడినట. నేను పెద్దయ్యాక హీరోను అవుతాను. నా పెళ్లికి చిరంజీవి కూడా వస్తారు అని అనేవాడినట. నేను అల అనడంతో మా నాన్నా నా అమాకపు మాటలకు మురిసిపోతూ సరే నాన్నా అంటూ నా భుజాలు తడుతుండేవారట. కానీ విధి ఎంత చిత్రమైనది.. నిజంగానే నేను హీరోనయ్యాను.. నా పెళ్లికి మెగాస్టార్ వచ్చారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని రోజు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆర్ఎక్స్ 100 మూవీతో హీరోగా పరిచమైన కార్తీకేయ ఆ తర్వాత గ్యాప్ లేకుండ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. View this post on Instagram A post shared by Kartikeya (@actorkartikeya) -
ప్రేయసి లోహితతో ఘనంగా నటుడు కార్తికేయ వివాహం
-
అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి ఫోటోలు
-
అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్
Karthikeya Marriage Photos: యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లొహితా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్ జరిగిన ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసిపోయింది. కార్తికేయ వరంగల్ లో ఎన్ఐటి విద్యార్థిగా ఉన్నప్పడు లొహితతో పరిచయం ఏర్పడింది. 2012లో ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికీ అంతే కష్టపడ్డాడు. ఫైనల్గా యూత్ హీరోగా నిలదొక్కుకున్నాక పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమా విషయాలకొస్తే.. కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం తల అజిత్ ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సల్మాన్ ఖాన్ను కలిసిన రాజమౌళి.. కొత్త సినిమా కోసమేనా ?
Director Rajamouli Met Salman Khan In Mumbai: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నవంబర్ 19న ముబైలోని ఫిల్మ్ సిటీలో కనిపించారు. వారిద్దరూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను కలుసుకున్నారు. వీరి సమావేశం కొన్ని గంటలపాటు సాగింది. అయితే ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్నట్లు గాసిప్ మొదలైంది. అయితే వారు ఏ విషయమై కలుసుక్నునారని అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలో ఈ సమావేశం గురించి అధికారికంగా వెల్లడిస్తారాని సమాచారం. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) పలు నివేదికల ప్రకారం రాజమౌళి, కార్తికేయ ముంబైలో సల్మాన్ ఖాన్ను కలిసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలే తండ్రి-కొడుకులు ఇద్దరూ నవ్వుతూ ఫోజిచ్చారు. అయితే వీరు కొత్త సినిమా కోసం చర్చించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ సినిమాను దర్శకత్వం చేసే అవకాశాన్ని కోల్పోయారు రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ హిందీ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సమావేశం తర్వాత రాజమౌళి, సల్మాన్ త్వరలో సినిమా చేయనున్నారా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి తన రాబోయే భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR) పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియాగా జనవరి 7, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఇటీవల మహేశ్ బాబు తెలిపారు. అయితే మహేశ్ బాబు చిత్రం తర్వాత రాజమౌళి, సల్మాన్ ఖాన్ను డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లికొడుకుగా ముస్తాబైన హీరో కార్తికేయ.. ఫోటోలు వైరల్
Hero Karthikeya Pellikoduku Function Photos Goes Viral: హీరో కార్తికేయ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. మరికొద్ది గంటల్లో ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను తన అర్ధాంగిగా మార్చుకోనున్నాడు. ఆగస్టులో గ్రాండ్గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ రేపు(నవంబర్21)న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహితను పెళ్లాడనున్నాడు.ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతుండగా..కార్తికేయ పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ పెళ్లి వేడుకకు ఆయన బంధుమిత్రులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్ఎక్స్100 సినిమాతో యూత్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ ఇటీవలె రాజా విక్రమార్క సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఆమె పంపిన మెసేజ్ వల్ల మా ఇంట్లో గొడవ జరిగింది : కార్తికేయ బ్రేకప్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చైతూ.. -
టాలీవుడ్ యంగ్ హీరో వెడ్డింగ్ కార్డ్ వైరల్!
Karthikeya- Lohitha Wedding Card: ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ దద్దరిల్లేలా చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఒక్క హిట్టుతో బోలెడన్ని అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడీ హీరో. అటు పర్సనల్ లైఫ్లోనూ హుషారు మీదున్నాడు కార్తికేయ. త్వరలోనే తను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను తన అర్ధాంగిగా మార్చుకోనున్నాడు. 'రాజా విక్రమార్క' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కాబోయే భార్య లోహితకు ప్రపోజ్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఎంతో గ్రాండ్గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్ చేశారట! ఈ నెల 21న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు హీరో తన ఇష్టసఖి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడట! ఈ మేరకు కార్తికేయ-లోహితల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వేడుకకు ఆయన బంధుమిత్రులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా కార్తికేయ లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు. 2010లో మొట్టమొదటిసారి లోహితను కలిసిన ఈ హీరో 2012లో ప్రపోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికీ అంతే కష్టపడ్డాడు. ఫైనల్గా యూత్ హీరోగా నిలదొక్కుకున్నాక పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లాడబోతున్నాడు. -
గరం గరం ముచ్చట్లు 13 November 2021
-
ఆమె పంపిన మెసేజ్ వల్ల మా ఇంట్లో గొడవ జరిగింది : కార్తికేయ
Karthikeya Reveals About His Love Story With Lohitha: ఆర్ఎక్స్100 సినిమాతో యూత్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో అతి త్వరలోనే బ్యాచ్లర్ లైఫ్కు గుడ్బై చెప్పబోతున్నాడు. ప్రేయసితో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నాడు. ఈ సందర్భంగా తన లవ్స్టోరీపై కార్తికేయ చెప్పిన విశేషాలు.. 'నిట్ వరంగల్లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. 2012లో ప్రపోజ్ చేశాను. సంవత్సరం తర్వాత ఒప్పుకుంది. బీటెక్ చదువుతున్న రోజుల్లో ఓసారి లోహిత నాకు పంపిన మెసేజ్ కారణంగా మా ఇంట్లో బాగా గొడవ జరిగింది. అప్పుడు ఫ్రాంక్ అని అబద్దం చెప్పి ఆ సమయంలో తప్పించుకున్నా. ఆ తర్వాత నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఈ మధ్యే మా ఇంట్లో తెలిసింది. మా ప్రేమ విషయం మూడు నెలల క్రితమే కుటుంబసభ్యులకు తెలిసిందే. లోహితను ప్రేమిస్తున్న విషయం తొలుత మా ఇంట్లోచెప్పా. ఆ తర్వాత ఆమె కుటుంబసభ్యులను ఒప్పించాం. మా మధ్య ఉన్న స్నేహం, ప్రేమ గురించి చాలా కాలంగా అందరికి తెలియడం వల్ల అర్థం చేసుకొని పెళ్లికి అంగీకరించారు. రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ వేడుకలో లోహితకు ప్రపోజ్ చేసి, సర్ప్రైజ్ ఇచ్చాను. ఇన్ని రోజుల నుంచి తనతో ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్గా ప్రపోజ్ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు. జీవితాంతం మా ఇద్దరికీ ఓ అందమైన అనుభూతిగా ఉంటుందని ఆ వేదిక మీద ప్రపోజ్ చేశాను'అని కార్తికేయ చెప్పుకొచ్చారు. -
వీవీఐటీలో హీరో కార్తికేయ సందడి
Raja Vikramarka Movie Team: శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై శ్రీసరిపల్లి నూతన దర్శకుడుగా పరిచయమవుతూ ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కధానాయకుడిగా తాన్యా రవిచందన కధానాయికగా నటిస్తున్న చిత్రం రాజా విక్రమార్క చిత్ర యూనిట్ వీవీఐటీలో సందడి చేసింది. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలను బుధవారం రాజా విక్రమార్క చిత్రయూనిట్ సందర్శించింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ అన్ని రకాల సాంకేతిక హంగులతో రూపొందించి అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీసరిపల్లి సినిమాని తెరకెక్కించారన్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర సంగీతానికి మంచి స్పందన లభించిందన్నారు. తన తొలి చిత్రం నుంచి ప్రచారంలో భాగంగా వీవీఐటీని సందర్శించడం పరిపాటిగా మారిందన్నారు. దర్శకుడు శ్రీసరిపల్లి మాట్లాడుతూ మంచికథతో ప్రేక్షకులకు పరిచయవ్వడం సంతోషంగా ఉందని, నవంబరు 12న విడుదల కానున్న రాజా విక్రమార్క చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్నారు. హీరో కార్తికేయ విద్యార్థులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, చిత్ర నిర్మాత రామారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
టైటిల్ చెప్పినప్పుడు ఆయన గుడ్ లక్ అన్నారు!: కార్తికేయ
‘‘నేనిప్పటికే యాక్షన్ సినిమాలు చేశాను కాబట్టి ఓ నమ్మకం వచ్చింది. కానీ, నేను కామెడీ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అనే క్యూరియాసిటీ ఉంది. నేను బయట చాలా సరదాగా ఉంటాను కాబట్టి ‘రాజా విక్రమార్క’లో కామెడీ చేయడం కష్టం అనిపించలేదు. ట్రైలర్ విడుదలయ్యాక నా కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు సంతోషపడ్డాను’’ అని కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు... శ్రీ సరిపల్లి చెప్పిన ‘రాజా విక్రమార్క’ కథ నచ్చింది.. తనతో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత నిజాయతీగా చేయగలడనే నమ్మకం వచ్చింది. కథను చెప్పినట్టే చక్కగా తెరకెక్కించారు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా పట్టుదలతో థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్న రామారెడ్డి, ఆదిరెడ్డిలకు థ్యాంక్స్. ∙ఈ చిత్రంలో యాక్షన్ కూడా స్టయిలిష్గా ఉంటుంది. ఎన్ఐఏ ఏజెంట్గా డ్రస్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. రెండున్నర గంటలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే చిత్రమిది. ∙ఒక రోజు శ్రీతో ‘రాజా విక్రమార్క’ టైటిల్ బావుంది.. పెట్టేద్దాం అన్నాను. ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు. టైటిల్ రిజిస్టర్ చేశాక చిరంజీవిగారికి పంపించాను. ఆయన ‘గుడ్ లక్’ అన్నారు. చిరంజీవిగారి మీద అభిమానంతో ఆయన సినిమా టైటిల్ పెట్టుకున్నాను. ∙ఇమేజ్, మార్కెట్ అంటూ భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లి కథలో బేసిక్ పాయింట్స్ మిస్ అవుతున్నాను. ఓ ప్రేక్షకుడిగా కథ వినాలని నిర్ణయించుకున్నా. నా ఫిజిక్ వల్లే ‘ఆర్ఎక్స్ 100’, ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చినట్లు ఆయా చిత్ర దర్శకులే చెప్పారు. బాడీ అలా మెయింటైన్ చేయడం కష్టమే.. అయితే అవకాశాలు వస్తున్నప్పుడు కష్టపడొచ్చు. ∙అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ‘వలిమై’లో విలన్గా చేస్తున్నాను. ఈ సినిమా కోసం కొంచెం తమిళ్ నేర్చుకున్నాను. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్లో ఒక సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత క్లాక్స్ అనే డైరెక్టర్తో ఓ సినిమా ఉంటుంది. శివలెంక కృష్ణప్రసాద్గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయింది. ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ వేడుకలో లోహితకు ప్రపోజ్ చేసి, సర్ప్రైజ్ ఇచ్చాను. ఇన్ని రోజుల నుంచి తనతో ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్గా ప్రపోజ్ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు. జీవితాంతం మా ఇద్దరికీ ఓ అందమైన అనుభూతిగా ఉంటుందని ఆ వేదిక మీద ప్రపోజ్ చేశాను. -
కాబోయే భార్యకు స్టేజ్పై ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ
Hero Karthikeya Proposed to His Fiance Lohitha Reddy: ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రాజా విక్రమార్క చిత్రంలో నటించాడు. శనివారం(నవంబర్7)న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో కార్తికేయ తన కాబోయే భార్యను అందరికి పరిచయం చేశాడు. ఈవెంట్లోనే భార్యకు లవ్ప్రపోజ్ చేశాడు. 'నేనే ముందు ప్రపోజ్ చేశా. నా లైఫ్లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ తన ప్రేమ కోసం పెట్టాను. అప్పుడే చెప్పా..హీరో అయ్యాక వచ్చి మీ ఇంట్లో అడుగుతానని. అదృష్టం. ఆ అమ్మాయినే నేను ఈనెల21న పెళ్లి చేసుకోబోతున్నాను. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్' అంటూ కాబోయే భార్యను పరిచయం చేశాడు. కాగా కొన్ని నెలల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. -
ఇకపై అలాంటి కథలే ఎంచుకుంటా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్గా పేరు వచ్చింది. కానీ, నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్ హిట్ మూవీ రాలేదు. ఇక నుంచి నన్ను ఇష్టపడేవారు గర్వపడేలా కథలు ఎంచుకుంటానని మాట ఇస్తున్నా’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ – ‘‘రాజా విక్రమార్క’ అనగానే చిరంజీవిగారు గుర్తొస్తారు. ఆయన అభిమానిగా ధైర్యం చేసి ఈ టైటిల్ పెట్టుకున్నాను. ‘రాజా విక్రమార్క’ సక్సెస్ అయితే శ్రీతో మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా సక్సెస్ నా కెరీర్కు ప్లస్ అవ్వడమే కాదు.. నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ నెల 21న లోహితతో నా పెళ్లి జరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజా విక్రమార్క’ ట్రైలర్ చూడగానే కార్తికేయను అభినందించాను. ఇండస్ట్రీలోకి వచ్చేవారికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ‘‘మూడు నెలల్లో ఈ సినిమా పూర్తి చేద్దామనుకున్నాం.. కరోనా వల్ల రెండేళ్లు పట్టింది’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘‘కార్తికేయ వల్లే ‘రాజా విక్రమార్క’ నిర్మించే అవకాశం మాకు వచ్చింది’’ అన్నారు టి. ఆదిరెడ్డి. ‘‘కార్తికేయతో నా ప్రయాణం మూడేళ్ల క్రితం మొదలైంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. ‘‘రాజా విక్రమార్క’ లో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాను’’ అన్నారు సాయికుమార్. ‘‘కార్తికేయలోని ఇన్నోసెన్స్ వల్ల ఎలాంటి పాత్ర అయినా చేయగలడు’’ అన్నారు హీరో సుధీర్ బాబు. ‘‘తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరూ మంచిగా మాట్లాడేది కార్తికేయ గురించే’’ అన్నారు హీరో విష్వక్ సేన్. ‘‘ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హీరో కిరణ్ అబ్బవరం, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, పాటల రచయితలు కృష్ణకాంత్, సనారే, నటులు సుధాకర్ కోమాకుల, హర్షవర్ధన్ , నవీన్, ఎడిటర్ జస్విన్ ప్రభు పాల్గొన్నారు. -
రాజా విక్రమార్క హీరోయిన్ తాన్య రవిచంద్రన్ ఫొటోలు..
-
‘రాజా విక్రమార్క’ హీరోయిన్ తన్యా గురించి ఈ విషయాలు తెలుసా!
Here Is About Raja Vikramarka Movie Heroine Tanya Ravichandran: యంగ్ హీరో కార్తీకేయన్ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీతోనే తమిళ నటి తన్యా రవిచంద్రన్ తెలుగు తెరకు పరియం అవుతోంది. 2016లో ‘బల్లె వెళ్ళయ్యతేవా’ అనే తమిళ చిత్రంతో తన్యా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు 5 సినిమాల్లో నటించిన తన్యా కథల ఎన్నికల్లో ఆచీతూచి అడుగులెస్తోంది. ఇప్పుడు ‘రాజా విక్రమార్క’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తన క్యూట్ క్యూట్ స్మైల్, ఆకర్షించే అందంతో కుర్రకారు మతి పోగోడుతోంది. సినిమా విడుదల కాకముందే తన్యా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు నెట్టంట సందడి చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే తన్యా ఎంతో క్రేజ్ను సంపాదించుకుంది. అయితే ఆమె సినీ కుటుంబ నేపథ్యం నుంచి పరిశ్రమలోకి వచ్చింది. ఆమె ఓ స్టార్ హీరోకు బంధువు. ఆయన ఎవరో కాదు తమిళ సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలు. ఆయన నట వారసురాలిగా ఆమె సినిమాల్లోకి వచ్చింది. కాగా ‘రాజా విక్రమార్క’ ప్రమోషన్స్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. సినిమా కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేదని, కానీ అమ్మానాన్నలు అప్పట్లోనే వద్దన్నారని చెప్పింది. ముందు చదువుపై దృష్టి పెట్టమని చెప్పారని, అయితే పీజీలో చేరిన తర్వాత దర్శకుడు మిస్కిన్ సర్ నుంచి అవకాశం వచ్చింది. కానీ తన పేరెంట్స్ ఒప్పుకోకపోయినప్పటికీ.. గొడవపడి ఒక్క సినిమా చేసి మళ్లీ చదువుకుంటానని ఒప్పించిందట. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో సినిమాలు చేశాక మళ్లీ పీజీ పూర్తి చేసినట్లు తెలిపింది. ఇక తాతయ్యా రవిచంద్రన్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన ఉండుంటే ఎంత సంతోషించేవారోనని, దురదృష్టవశాత్తూ తను కెమెరా ముందుకు రాకముందే ఆయన దూరమయ్యారంటూ భావోద్వేగానికి లోనయ్యింది. ఆయన పట్టుదల, క్రమశిక్షణే తన స్ఫూర్తి అని, ఇక తమిళ సినిమా, తెలుగు సినిమా వేర్వేరుగా ఏమీ అనిపించలేదంటూ తాన్యా చెప్పుకొచ్చింది. -
ఒక్క సినిమా అంటూ మూడు చేసేశా!
‘‘రాజా విక్రమార్క కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇందులో నా పాత్ర పేరు కాంతి. తను హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ చాలా సింపుల్గా ఉండే అమ్మాయి’’ అని తాన్యా రవిచంద్రన్ అన్నారు. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే ఆసక్తి. అయితే, మా పేరెంట్స్ ‘పీజీ పూర్తి చెయ్.. ఆ తర్వాతే సినిమాలు’ అన్నారు. అయితే పీజీ చేస్తున్న టైమ్లో చాన్స్ రావడంతో ఒక్క సినిమా చేస్తానని చెప్పాను. కానీ వరుసగా తమిళంలో మూడు సినిమాలు చేశాను. అవి పూర్తయ్యాక పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ – హెచ్ఆర్) పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. మా తాతయ్య (తమిళ హీరో రవిచంద్రన్) చాలా హార్డ్ వర్కింగ్.. ఆయనకు అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. ఆ మూడూ నేర్చుకున్నాను. నేను సినిమాల్లోకి వస్తా నని తెలియకముందే తాతయ్య మాకు దూరమయ్యారు. నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఐదు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
Raja Vikramarka: ఏజెంట్ విక్రమ్ రెడీ
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించారు. ఆదిరెడ్డి. టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘88’ రామారెడ్డి మాట్లాడుతూ – ‘‘యాక్షన్, కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కార్తికేయ లేకుండా ఈ సినిమాను ఊహించలేం. ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఆయన జీవించారు. శ్రీ సరిపల్లికి తొలి సినిమా అయినా బాగా తీశాడు’’ అన్నారు. శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘ఎన్ఐఏ ఏజెంట్ విక్రమ్ పాత్రలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారు. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ లుక్ బాగుంటుంది. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. -
సినిమా వాళ్లతో పెళ్లొద్దనుకున్నా!: కార్తికేయ భార్య
దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ, తన స్నేహితురాలు, సింగర్, జగపతి బాబు బంధువైన పూజను ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్ 28 జైపూర్ ప్యాలెస్లో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. వారి వివాహం జరిగి రెండేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా ఈ జంట సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారి ప్రేమ, పెళ్లి పరిచయం గురించి ఏం చెప్పారో వారి మాటల్లోనే విందాం రండి. కార్తికేయ మాట్లాడుతూ.. ఏడాది ఫ్రెండ్షిప్ తర్వాత పూజకు ప్రపోజ్ చేశా. కొన్ని నెలల తర్వాత ఓకే చేసింది. ఆమె పాట నాకు ఇష్టం.. కావాలన్నప్పుడల్లా నా కోసం పాడతుంది. ⇔ కాలేజ్ డేస్లో సొంత జీతం అనే కిక్ని ఎంజాయ్ చేయడం కోసం ఐస్క్రీమ్ పార్లర్లో పని చేశాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ప్రొడక్షన్ వర్క్ చూశా. ఇప్పుడు మార్కెటింగ్ చూస్తున్నాను. ⇔ నేను వింటర్ వెడ్డింగ్ కావాలనుకున్నాను. నాకు చలి ఇష్టం.. తనకు (పూజకి) కష్టం. జైపూర్ ప్యాలెస్లో డిసెంబరు 28 మా పెళ్లి ముహూర్తం రావడం లక్కీ. 15 ఏళ్లలో కోల్డెస్ట్ 10 డిగ్రీల చలిలో మా పెళ్లయింది. మ్యారేజ్ అంటే... సెక్యూరిటీ, అండర్స్టాండింగ్, ట్రస్ట్, లవ్. ⇔ చాలామంది నమ్మరు కానీ బాబా (రాజమౌళి).. టీ, కాఫీ పాలు సహా ఏమీ తాగరు. పెరుగన్నంలో మాత్రం తప్పకుండా స్వీట్ ఉండాల్సిందే. పెరుగు వేసుకుంటుండగానే స్వీట్ ఏది అని అడుగుతారు రాజమౌళి. రోడ్ ఎంత ఖాళీగా ఉన్నా చాలా స్లోగా డ్రైవ్ చేస్తారు. సినిమా వాళ్లతో పెళ్లొద్దనుకున్నా!: పూజ ⇔ చిన్నప్పటి నుంచీ సినిమా ఫీల్డ్ వాళ్లని పెళ్లి చేసుకోవద్దనుకున్నాను. అందుకే కార్తికేయ అడగ్గానే, ఆలోచించా. ఆ తర్వాత ఒప్పుకున్నా. తను ప్రతి విషయంలో నా వైపే ఉంటాడు. హైపర్ యాక్టివ్, ఓర్పుకి కేరాఫ్.. ప్రేమించిన వారి కోసం ఏమైనా సరే చేస్తాడు. ⇔ సంప్రదాయ సంగీతం నేర్చుకున్నాను. ప్రాక్టీస్ తప్పింది కాబట్టి మళ్లీ సాధన పెంచుకుని సినిమాలకి పాడతానేమో తెలియదు. కానీ నటించడం అంటే కష్టమే... కెమెరా ముందు నెర్వస్ అయిపోతా. మీకీ ఇంటర్వ్యూ ఇవ్వడానికే కష్టమైంది. ⇔ పెళ్లికి ముంతు.. తర్వాత కూడా చుట్టూ ఉన్న శక్తివంత మైన మహిళల నుంచి చాలా నేర్చుకుంటున్నాను. అమ్మ దగ్గర క్రమశిక్షణ, హార్డ్ వర్క్.. ఎవరిపైనా ఏ నెగటివ్ ఫీల్ ఉంచుకోకపోవడం అత్తయ్య (రమా రాజమౌళి) దగ్గర, పిల్లల్ని చూసుకోవడం ఎలా అనేది వల్లీ పిన్ని దగ్గర... ఇలా... ⇔ మా పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా రాజమౌళిగారు అలానే ఉన్నారు. పదేళ్ల తర్వాత కూడా ఆయనలో మార్పు చూడలేనేమో... ⇔ జగపతి బాబాయ్కి చిన్నప్పటి నుంచీ నన్ను అమ్మ దగ్గర నుంచి సేవ్ చేయడమే పని.. ⇔ ట్యాంగిల్ ఆర్ట్ అనే ఆర్ట్ ఫార్మ్ ఉంది. ఆర్డర్స్ మీద డ్రాయింగ్స్ చేస్తాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నైట్ షూట్స్ టైమ్లో అందరికీ ఐస్క్రీమ్స్ తెప్పించేదాన్ని. ఆ సినిమాలో నా భాగస్వామ్యం అంతే... (నవ్వుతూ) -
లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..
నిజామాబాద్ అర్బన్: దళిత విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. సామూహిక అత్యాచారం కేసు వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్కు చెందిన నవీన్కుమార్కు, బాధిత విద్యార్థినితో పరిచయం ఉంది. మంగళవారం నవీన్, మరో ఇద్దరు కలసి ఆమెను తీసుకుని నగర శివారుతోపాటు అంకాపూర్ తదితర ప్రాంతాల్లో తిరిగారు. అక్కడ ఆమెకు బిర్యాని తినిపించడంతోపాటు మభ్యపెట్టి మద్యం తాగించారు. అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మర మ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అక్కడే ఎదురుగా ఉన్న షాపింగ్మాల్ సెక్యూరిటీ గార్డ్ గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సెక్యూరిటీ గార్డు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి విద్యార్థినిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నవీన్తో పాటు గంజి చంద్రశేఖర్, తుమ్మ భానుప్రకాశ్, సిరిగాద చరణ్, షేక్ కరీం, పి.గంగాధర్ పాల్గొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ఐదుగురిని బుధవారం అరెస్టు చేయగా, ఒకరిని గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
Raja Vikramarka: ‘రాజాగారు బయటకొస్తే ప్రమాదమే..’
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ గుమ్మకొండ కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ‘88’ రామారెడ్డి నిర్మించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. మంగళవారం (సెప్టెంబరు 21)న కార్తికేయ బర్త్ డే. ఈ సందర్భంగా ‘రాజా విక్రమార్క’ థీమ్ సాంగ్ను విడుదల చేశారు. ‘‘రాజాగారు బయటకొస్తే ప్రమాదమే.. ప్రయాసతో పరారు అంతే...’’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, డేవిడ్ సైమన్ పాడారు. ‘‘సినిమాలో ఉన్న నాలుగు పాటలు వేటికవే విభిన్నం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సినిమాలో కార్తికేయ నటన హైలైట్గా ఉంటుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు ‘88’ రామారెడ్డి. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రధారులు. -
బ్యాచిలర్గా ఇదే నా చివరి చిత్రం : హీరో కార్తికేయ
‘‘ఇటీవల నిశ్చితార్థం (హైదరాబాద్కు చెందిన లోహితారెడ్డిని కార్తికేయ వివాహం చేసుకోనున్నారు) చేసుకున్నాను. బ్యాచిలర్గా నా చివరి చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి, జీవితంలో మరోస్థాయికి వెళితే బాగుంటుందని ఆశపడుతున్నాను. ‘రాజా విక్రమార్క’ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు కార్తికేయ. దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ హీరో హీరోయిన్లు. శ్రీ చిత్రమూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ను హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సినిమా టైటిల్ను పెట్టుకునే అదృష్టం ఈ చిత్రం ద్వారా కలిగింది. ఈ సినిమాను మేమే నిర్మించాలనుకున్నాం. ఫైనల్గా రామారెడ్డి, ఆదిరెడ్డిగారు నిర్మించారు’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో ‘రాజా విక్రమార్క’ ఉండాలి’’ అన్నారు సాయికుమార్. ‘‘ఈ సినిమాకు మూలస్తంభం కార్తికేయ’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు శ్రీ సరిపల్లి. చదవండి : ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఓ పండుగ : మంచు విష్ణు నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ -
ఆకట్టుకుంటున్న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ టీజర్
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. యాక్షన్ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీ సరిపల్లి దర్శకత్వ వహించారు. 88 రామారెడ్డి నిర్మాత. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాను టీజర్ మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ టీజర్ కార్తికేయ, తనికేళభరణి మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. టీజర్ విషయానికొస్తే.. కార్తికేయ ఇందులో ఎన్ఐఏ ఎజెంట్గా కనిపించాడు. కొత్తగా అపాయింట్ అయిన కార్తికేయ ఓ సీక్రెట్ మిషన్లో అనుకొకుండా నిందితుడిని కాల్చి చంపుతాడు. చదవండి: ‘మా’ ఎన్నికలు : అందుకే సుధీర్, అనసూయలను తీసుకున్నాం: ప్రకాశ్ రాజ్ దీనిపై తనిళకేళ భరణికి, కార్తికేయకు మధ్య జరిగే సంభాషణలు అలరిస్తున్నాయి. అలాగే చివర్లో ‘చిన్నప్పుడు కృష్ణ గారిని.. పెద్దయ్యాక టామ్ క్రూజ్ని చూసి ఆవేశపడి జాబ్లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు’ అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక కార్తికేయ పాత్రకి యాక్షన్తో పాటు కామెడీ టచ్ కూడా ఇచ్చినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కాగా రాజా విక్రమార్కలో కార్తికేయకు జోడిగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించింది. తనికెళ్ల భరణి ,సాయి కుమార్లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. చదవండి: 2 ఓటీటీ ప్లాట్ఫాంలోకి ‘తలైవి’ మూవీ, మేకర్స్ భారీ ఒప్పందం! -
నిట్ వరంగల్లో లోహితను కలిశాను: హీరో కార్తికేయ
Karthikeya Shares Photo With Fiance: ‘‘నిట్ వరంగల్లో 2010లో తొలిసారి లోహితను కలిశాను. అప్పటి నుంచి నేటి దాకా.. దశాబ్దకాలంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఇక ముందు కూడా అలాంటి మధుర క్షణాలే. నా ప్రాణ స్నేహితురాలితో నాకు నిశ్చితార్థం జరిగింది. తను నా జీవిత భాగస్వామి కాబోతోంది’’ అంటూ ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ అభిమానులతో శుభవార్తను పంచుకున్నాడు. బెస్ట్ఫ్రెండ్ లోహితతో త్వరలోనే తన వివాహం జరుగనుందని సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా తమ పాత, ప్రస్తుత ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లోహిత కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇక ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. గుణ 369, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో పలకరించాడు. నానీ గ్యాంగ్లీడర్ మూవీలో విలన్గా ఆకట్టుకున్న అతడు.. ప్రస్తుతం అజిత్ వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: Karthikeya Engagement: ఘనంగా కార్తికేయ నిశ్చితార్థం Feeling elated to announce my engagement with my best friend who now is my partner for life.. From 2010when i first met #Lohitha in nitwaranagal to now and many more such decades.. pic.twitter.com/xXYp7pcH4K — Kartikeya (@ActorKartikeya) August 23, 2021