Director Rajamouli Met Salman Khan In Mumbai, Reason In Telugu - Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్‌ను కలిసిన రాజమౌళి.. కొత్త సినిమా కోసమేనా ?

Nov 21 2021 10:11 AM | Updated on Nov 23 2021 10:48 AM

Director Rajamouli Met Salman Khan In Mumbai - Sakshi

Director Rajamouli Met Salman Khan In Mumbai: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ నవంబర్‌ 19న ముబైలోని ఫిల్మ్‌ సిటీలో కనిపించారు. వారిద్దరూ బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను కలుసుకున్నారు. వీరి సమావేశం కొన్ని గంటలపాటు సాగింది. అయితే ఈ నేపథ‍్యంలో సల్మాన్‌ ఖాన్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్నట్లు గాసిప్‌ మొదలైంది. అయితే వారు ఏ విషయమై కలుసుక్నునారని అధికారికంగా ధ్రువీకరించలేదు. త్వరలో ఈ సమావేశం గురించి అధికారికంగా వెల్లడిస్తారాని సమాచారం. 

పలు నివేదికల ప్రకారం రాజమౌళి, కార‍్తికేయ ముంబైలో సల్మాన్‌ ఖాన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలే తండ్రి-కొడుకులు ఇద్దరూ నవ్వుతూ ఫోజిచ్చారు. అయితే వీరు కొత్త సినిమా కోసం చర్చించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. సల్మాన్‌ ఖాన్‌ బజరంగీ భాయిజాన్‌ సినిమాను దర్శకత్వం చేసే అవకాశాన్ని కోల్పోయారు రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ హిందీ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. ఈ సమావేశం తర్వాత రాజమౌళి, సల్మాన్‌ త‍్వరలో సినిమా చేయనున్నారా ? అనే ప్రశ‍్నలు తలెత్తుతున్నాయి. 

ఎస్‌ఎస్‌ రాజమౌళి తన రాబోయే భారీ బడ్జెట్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్‌ ఇండియాగా జనవరి 7, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో కలిసి ఓ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఇటీవల మహేశ్‌ బాబు తెలిపారు. అయితే మహేశ్‌ బాబు చిత్రం తర్వాత రాజమౌళి, సల్మాన్‌ ఖాన్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement