Salman Khan
-
సినిమా, సినిమాకి తగ్గుతున్న సల్మాన్ ఖాన్ క్రేజ్
-
సికందర్ సాంగ్.. రష్మిక డ్యాన్స్తో అదరగొట్టేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రంజాన్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.సికందర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ను విడుదల చేశారు. జోహ్ర జబీన్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్లో రష్మిక మందన్నా, సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సాజిద్నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్- 3లో కనిపించారు. -
Atlee: ఐకాన్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ కోసం
-
సల్మాన్, శివకార్తికేయన్ పై మురుగదాస్ భారీ ఆశలు...
-
సల్మాన్ 'సికందర్' టీజర్ చూశారా?
-
సల్మాన్ ఖాన్ యాక్షన్ చిత్రం.. టీజర్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సికందర్'. ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ సరసన పుష్ప భామ రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ గతేడాది సింగం ఎగైన్, బేబీ జాన్ చిత్రాల్లోనూ కనిపించారు. అయితే అంతకుముందు 2023లో టైగర్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు సల్మాన్ ఖాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ విఫలం కావడంతో సికందర్పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈద్ కానుకగా మార్చి 28న థియేటర్లలోకి రానుంది. Jo dilon par karta hai raj woh aaj kehlata hai Sikandarhttps://t.co/Bn5NdtKN2z #SajidNadiadwala’s #Sikandar Directed by @ARMurugadoss @iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru…— Salman Khan (@BeingSalmanKhan) February 27, 2025 -
హాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్లో స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్(Salman Khan), సంజయ్ దత్(Sanjay Dutt) హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. లూయిస్ మచిన్, ఎవా బియాంకో, పౌలా లుస్సీ ప్రధాన పాత్రల్లో రోడ్రిగో గెర్రెరో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్ డాగ్స్’. 2021లో అర్జెంటీనాలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది. సల్మాన్, సంజయ్లపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ వీడియో క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్గా మారాయి. సల్మాన్ ఖాకీ చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్ వేషంలో ఉండగా... సంజయ్ సూటు ధరించి ఉన్నారు.మిడిల్ ఈస్ట్లో జరిగే అమెరికన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందట. మిడిల్ ఈస్ట్లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సినిమాలకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకుని ఈ రీమేక్లో నటింపజేస్తున్నారట హాలీవుడ్ మేకర్స్. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను అధికారికంగా వెల్లడించలేదు. -
హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో.. ఆటో డ్రైవర్గా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోముఖ్య పాత్ర కోసం సల్లూ భాయ్ను సంప్రదించగా ఆయన పచ్చజెండా ఊపారట! ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.దుబాయ్లో షూటింగ్!ఇందుకోసం సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే దుబాయ్ పయనమయ్యాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, సంజయ్ దత్లకు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుపుతున్నారంటూ కొన్ని వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్గా మారాయి. అందులో సల్మాన్ ఆటో డ్రైవర్ వేషంలో ఉన్నాడు. ఆటో దగ్గర సల్మాన్ నిల్చోగా అతడి పక్కనే సంజయ్ దత్ సూటూబూటు వేసుకుని ఠీవీగా కనిపిస్తున్నాడు. సల్మాన్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సినిమాకాగా సల్మాన్ ఖాన్ చివరగా టైగర్ 3 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సికందర్ మూవీ చేస్తున్నాడు. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రంజాన్ పండగకు విడుదల కానుంది. Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥... #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025MEGASTAR SALMAN KHAN in Saudi Arabia today #Sikandar #SalmanKhan pic.twitter.com/pUVl8WMvoc— Lokendra Kumar (@rasafi24365) February 19, 2025చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్గా డేట్ చెప్పేసిన కంగనా -
సికందర్ సర్ప్రైజ్ సిద్ధం
సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’(Sikandar). రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. కాగా మంగళవారం (ఫిబ్రవరి 18) సాజిద్ బర్త్ డే సందర్భంగా ‘సికందర్’ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 27న ఈ చిత్రానికి సంబందించి, ఓ సర్ప్రైజ్ కూడా ఉందని పేర్కొన్నారు. ఆ రోజు ఈ సినిమా టీజర్ లేదా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉండొచ్చని టాక్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో ఉన్నారని సమాచారం.ఓ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారని, ఈ మూవీ కోసమే ఆయన సౌదీ వెళ్లారని, అలాగే సల్మాన్ ఖాన్తో పాటు సంజయ్ దత్ కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. -
బాలీవుడ్ కు తిరిగొస్తున్న కిక్కోడు
-
'సల్మాన్, షారూఖ్ నన్ను చూసి నవ్వారు'.. హీరోయిన్ కామెంట్స్
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్ను సింగిల్ టేక్లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్కు గుడ్బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది. -
సల్మాన్ ‘వివాహ్’కి పనికిరాడన్న దర్శకనిర్మాత
ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన సల్మాన్(Salman Khan) తొలి సినిమా ఏది? అని అడిగితే వెంటనే ఠక్కున మైనే ప్యార్ కియా అని చెప్పేస్తారు. కానీ చాలా మందికి తెలీని విషయం బీవీ హోతో ఐసీ (భార్య అంటే ఇలా ఉండాలి) అనే సినిమా సల్మాన్ తొలిసినిమా. 1988లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ సహాయనటుడి పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత చేసిన మైనే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్ అవడంతో తొలి సినిమా తెరమరుగైపోయింది.. సల్లూభాయ్కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది.భార్య అంటే ఇలా ఉండాలి అనే అర్ధం వచ్చేలా టైటిల్తో తొలిసినిమా ఎలాగైతే సల్మాన్ కెరీర్లో అస్పష్టం ఉండిపోయిందో...సల్మాన్ వివాహం కూడా అలాగే ఉండిపోయింది. అదలా ఉంచితే... బాలీవుడ్లో అత్యంత ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్ఖాన్కి దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానుల్ని అందించిన తొలి సినిమా మైనే ప్యార్ కియా కాగా దానికి దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya). హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై వంటి సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్గా మారారు. పై చిత్రాలతో పాటు ప్రేమ్ రతన్ ధన్పాయో కూడా సల్మాన్ఖాన్తోనే రూపొందించారీ కుటుంబ చిత్రాలకు పేరొందిన ఈ దర్శకుడు. సల్మాన్తో అత్యధిక హిట్స్ తీశాడు. అలాగే ఆయన త్వరలో తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్తో మరో చిత్రంలో మళ్లీ చేయబోతున్నాడు, అయితే కెరీర్ ప్రారంభం నుంచీ వరుసగా సల్మాన్తో చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ప్రేమ్ రతన్ ధన్పాయోకి ముందు వివాహ్(Vivah) పేరిట ఒక సినిమాని రూపొందించినప్పుడు ఆ సినిమాలో షాహిద్ కపూర్ని హీరోగా ఎంచుకున్నారు.సల్మాన్ ఖాన్ తో త్వరలో మరో చిత్రంలో మళ్లీ జతకట్టబోతున్న సూరజ్ బర్జాత్యా... వివాహ్ సినిమా కు హీరో ఎంపిక విషయంలో సల్మాన్ని దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయంపై బాలీవుడ్లో అప్పట్లో చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో సూరజ్ బర్జాత్యా ఇటీవల ఆ విషయం గురించి మాట్లాడాడు.‘‘ అప్పట్లో మీరట్కు చెందిన ఒక టైలర్, కాలిన గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త గురించి చెప్పి, మా నాన్న నాకు ఆ వార్తాపత్రిక కటింగ్ను చూపించారు. ప్రేమ మానవత్వం ఆధారంగా సినిమాను రూపొందించాలని అనుకున్నాం. ఆ సినిమా కథ కొత్తగా కనపడే ఒక అమాయకుడికి నప్పుతుంది. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి నప్పే సరైన హీరో కాదు. అందుకే షాహిద్ ను ఎంచుకున్నా’’ అంటూ చెప్పారు సూరజ్ బర్జాత్యా. మొత్తానికి ఇంత కాలమైనా ప్రేమలు, అనుబంధాలకు దగ్గరగా అదే సమయంలో వివాహానికి దూరంగా ఉంంటూ వివాహ వ్యవస్థలో ఒదగలేకపోతున్న సల్మాన్... వివాహ్ అనే సినిమా లో పాత్రలో సైతం నప్పకపోవడం... విచిత్రం. -
‘సల్మాన్ అవమానించాడు’.. స్పందించిన అక్షయ్ కుమార్
'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలే వివాదంపై అక్షయ్ కుమార్(Akshay Kumar) స్పందించాడు. సల్మాన్ ఖాన్ తనను అవమానించారనే వార్తలను కొట్టిపాడేశాడు. తనకున్న కమిట్మెంట్ల కారణంగానే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి బయటకు వచ్చానని.. అంతకు మించి అక్కడ ఏమి జరగలేదని చెప్పి రెండు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా వార్కి పుల్స్టాఫ్ పెట్టేశాడు.అసలేం జరిగింది?గత ఆదివారం(జనవరి 19) హిందీ బిగ్బాస్ 18వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలేకి అతిథులుగా అక్షయ్ కుమార్, వీర్ సహారియాలను పిలిచారు.షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు వెళ్లారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆలస్యంగా సెట్కి వచ్చాడు. దాదాపు గంట పాటు సెట్లోనే వేచి చూసిన అక్షయ్.. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ వెళ్లిపోయిన కాసేపటికి సల్మాన్ సెట్కి వచ్చాడు. దీంతో అక్షయ్ కుమార్ను సల్మాన్ ఖాన్ అవమానించాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అంతేకాదు అక్షయ్ అసహనంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. బిగ్బాస్ నిర్వాహకులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటూ పుకార్లు వచ్చాయి.వాస్తవం ఎంటంటే..?సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తాజాగా అక్షయ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకున్న కమిట్మెంట్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు.సల్మాన్ సెట్కు ఆలస్యంగా వచ్చిన విషయం వాస్తవమే. కానీ ఆయన ఆలస్యంగా రావడం వల్లే నేను వెళ్లిపోలేదు. నా సినిమా షూటింగ్కు టైమ్ కావడంతో ఫినాలే షూట్ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్తో మాట్లాడాను. నేను వచ్చేసినా మా చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్బాస్ సెట్లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు’ అని అక్షయ్ అన్నారు.బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు? బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో 18 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక 18వ సీజన్ విన్నర్((Bigg Boss 18 winner) గా నటుడు కరణ్ వీర్ మోహ్రా నిలిచాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్ టాప్ 6లో చోటు సంపాదించుకున్నారు. -
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్కు, ఈవెంట్స్కు, ప్రమోషన్స్కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
బాలీవుడ్లో దూసుకెళ్తున్నా రష్మిక.. 2025లో మూడు సినిమాలు!
హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) కెరీర్లో రానున్న తొలి హారర్ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్ మూవీ ‘వంజ్య’తో హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. తొలి షెడ్యూల్ను ముంబైలో జరిపారు. సెకండ్ షెడ్యూల్ను గతేడాది డిసెంబరు చివరి వారంలో ఢిల్లీలో ప్రారంభించారు. న్యూ ఇయర్ బ్రేక్ తీసుకుని, మళ్లీ ఈ వారంలో ‘థామా’ చిత్రీకరణను ప్రారంభిస్తున్నారు. ‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేశారు ఆయుష్మాన్ ఖురానా. అలాగే న్యూ ఇయర్ వేడుకలను పూర్తి చేసుకున్న రష్మికా మందన్నా కూడా ఢిల్లీలో జరిగే ‘థామా’ షెడ్యూల్లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పాల్గొననున్నారని బాలీవుడ్ సమాచారం. జనవరి మూడో వారం వరకు ‘థామా’ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట. ఈ ఢిల్లీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ నెక్ట్స్ షెడ్యూల్ ఊటీలో జరగనుందని బీ టౌన్ టాక్. ఇక ‘థామా’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్తో ‘సికందర్’, విక్కీ కౌశల్తో ‘ఛావా’ చిత్రాలు చేస్తున్నారు రష్మికా మందన్నా. ‘సికందర్’ సినిమా ఈ ఏడాది ఈద్కి, ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నాయి. ఇలా హిందీలో రష్మికా మందన్నా నటించిన చిత్రాలు ఈ ఏడాది మూడు రిలీజ్ కానున్నాయి. -
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్లో భాగంగా చాహత్ తల్లి బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్బాస్ టీమ్కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్బాస్ టీమ్నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..? -
బిగ్బాస్ షోకి వెళ్లనున్న రామ్చరణ్!
హీరో రామ్చరణ్ (Ram Charan) మరోసారి బిగ్బాస్ షోకి వెళ్లనున్నాడు. మొన్న తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer Movie) చిత్ర ప్రమోషన్స్ కోసం హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వెళ్లనున్నాడట! వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో చరణ్ స్టేజీపై కనిపించనున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది.గేమ్ ఛేంజర్ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వారికి హైప్ ఎక్కించడం కోసం చరణ్ బిగ్బాస్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. హోస్ట్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ముచ్చటించి తన సినిమా ట్రైలర్ను చూపించనున్నారట! కాగా సల్మాన్- చరణ్ మధ్య ఇదివరకే స్నేహం ఉంది. (చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోని ఏంటమ్మా పాటలో చరణ్, వెంకటేశ్ స్టెప్పులతో అదరగొట్టారు. సల్లూభాయ్ హైదరాబాద్కు వచ్చినప్పుడు చరణ్ ఇంటికి పిలిచి ఆతిథ్యమిస్తుంటాడు. అటు చరణ్ ముంబై వెళ్లినప్పుడు కూడా సల్మాన్ తనను ఇంటికి ఆహ్వానిస్తుంటాడు. వీరిద్దరి కలయిక కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అంజలి కీలక పాత్ర పోషించింది. ఎస్జే సూర్య విలన్గా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.చదవండి: 'కలెక్టర్కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి -
పత్రికలు అచ్చువేయించాక ఆగిన పెళ్లి? నిజమేనన్న హీరోయిన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఎంతోమంది హీరోయిన్లను ప్రేమించాడు. వారిలో ఓ హీరోయిన్తో గాఢ ప్రేమలో ఉన్న అతడు పెళ్లికి సైతం ఒప్పుకున్నాడు. మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిపత్రికలు కూడా అచ్చు వేయించాడు.. కానీ చివరకు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇంతకీ అతడు జీవిత భాగస్వామిగా కోరుకున్న హీరోయిన్ మరెవరో కాదు సంగీత బిజ్లానీ (Sangeeta Bijlani).పత్రికలు కొట్టించాక ఆగిన పెళ్లి?సంగీత బిజ్లానీ తాజాగా ఇండియన్ ఐడల్ 15వ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా మానసి ఘోష్ అనే కంటెస్టెంట్ సంగీతను ఊహించని ప్రశ్న అడిగింది. సల్మాన్తో పెళ్లికి సిద్ధమై పత్రికలు కూడా కొట్టించుకున్నాక చివరకు ఆ వివాహమే ఆగిపోయింది. నిజమేనా? అని ప్రశ్నించింది. అది అబద్ధమైతే కాదు అని బదులిచ్చింది. దీంతో అందరూ షాకయ్యారు. ఎందుకు మీ పెళ్లి ఆగిపోయిందో చెప్తారా? అని అడిగాడు. ఇంతటితో ప్రోమో పూర్తయింది. మరి అతడి ప్రశ్నకు సంగీత ఆన్సరిచ్చిందా? లేదా? అనేది ఫుల్ ఎపిసోడ్లోనే చూడాలి!పదేళ్లకు పైగా డేటింగ్కాగా బాలీవుడ్ (Bollywood)లో కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో సల్మాన్ ఖాన్, సంగీత ఒకరినొకరు కలుసుకున్నారు. దశాబ్దకాలంపాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ చివరకు అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత సంగీత 1996లో మహ్మద్ అజారుద్దీన్ను పెళ్లి చేసుకుంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే సల్మాన్తో ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తోంది.చదవండి: మనవరాలి పెళ్లిపై మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
భార్యాభర్తలే కానీ ఒక గదిలో ఉండరట.. ఎంత టార్చర్ పెట్టారో!: సింగర్
పాపులర్ సింగర్ మికా సింగ్.. అదుర్స్ (పిల్లా నా వల్ల కాదు..), బలుపు (పాతికేళ్ల చిన్నది), డార్లింగ్ (యాహు యాహూ..) సినిమా పాటలతో తెలుగువారికీ సుపరిచితుడయ్యాడు. టాప్ సింగర్గా, ర్యాపర్గా రాణిస్తున్న ఇతడు రెండుమూడు సినిమాల్లోనూ నటించాడు. అంతేకాదు, ఓ సారి చిన్నపాటి సినిమా లేదా వెబ్ సిరీస్ తీయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 2020వ సంవత్సరంలో డేంజరస్ అనే వెబ్ సిరీస్ తీశాడు.రిస్క్ ఎందుకని?అయితే నిర్మాతగా ఇదే తన తొలి ప్రాజెక్ట్ కావడంతో రాజ్ సినిమా డైరెక్టర్ విక్రమ్ భట్ దగ్గరున్న కథనే సెలక్ట్ చేసుకున్నాడు. పెద్దగా రిస్క్ చేయడం ఇష్టం లేని అతడు రాజ్ సినిమాలోని కొందర్ని తన సిరీస్ కోసం సెలక్ట్ చేసుకున్నాడు. బడ్జెట్ మరీ మితిమీరిపోకూడదని భావించి కరణ్ సింగ్ గ్రోవర్ను ఎంపిక చేశాడు. అలాగే కొత్త హీరోయిన్ను పరిచయం చేయాలనుకున్నాడు. కానీ కరణ్ భార్య బిపాసా బసు (Bipasa Basu) తనే కథానాయికగా చేస్తానంది. దీంతో ఒప్పుకోక తప్పలేదు.దంపతులకు వేర్వేరు గదులుఇంకా మికా సింగ్ (Mika Singh) మాట్లాడుతూ.. నెల రోజుల షెడ్యూల్ కోసం 50 మంది కలిసి లండన్కు వెళ్లాం. తీరా వెళ్లాక అది రెండు నెలలవరకు కొనసాగింది. కరణ్, బిపాసా చాలా ఓవర్ చేశారు. వీళ్లు దంపతులే కాబట్టి ఒక రూమ్ బుక్ చేశాను. కానీ వాళ్లేమో వేర్వేరు గదులు కావాలన్నారు. నాకసలు అర్థమే కాలేదు. తర్వాత వేరే హోటల్కు వెళ్తామంటే అదీ చేశాను. ఒక యాక్షన్ సన్నివేశంలో కరణ్ కాలు ఫ్రాక్చర్ అయింది. అది మనసులో పెట్టుకుని డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేశారు. గొంతు బాలేదు, బిజీగా ఉన్నామంటూ ఇలా ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పేవారు. నానా రచ్చవారు చేసిన పనికి డబ్బిస్తున్నప్పుడు ఎందుకింత డ్రామా చేస్తున్నారనేది నాకసలు అంతుపట్టలేదు. ముద్దు సన్నివేశం దగ్గర కూడా నానా రచ్చ చేశారు. అందుకు ససేమీరా ఒప్పుకోమన్నారు. స్క్రిప్ట్లో ఈ సీన్ గురించి వివరంగా రాసుంది. అది చదివే అగ్రిమెంట్పై సంతకం చేశారు. పైగా ఇద్దరూ భార్యాభర్తలే అయినప్పుడు ముద్దు పెట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది? ఇలాంటివాళ్లు ధర్మ ప్రొడక్షన్, యష్ రాజ్ ఫిలింస్ వంటి పెద్ద నిర్మాతలకు భజన చేస్తారు. చిన్న పాత్ర ఇచ్చినా ఆహా ఓహో అని పొంగిపోతారు.యాటిట్యూడ్ చూపించారుకానీ చిన్న నిర్మాతల దగ్గర మాత్రం యాటిట్యూడ్ చూపిస్తారు. మేము కూడా వారిపై డబ్బు ఖర్చు పెడుతున్నాం కదా! ఇదంతా చూశాక ఇంకోసారి నిర్మాణం వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఇతరులకు కూడా అదే సలహా ఇస్తుంటాను. లేదు, కచ్చితంగా సినిమా నిర్మించాలనుకుంటే కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఉత్తమం. నేను సినిమా తీస్తున్న విషయం తెలిసి అక్షయ్ కుమార్ (Akshay Kumar) హెచ్చరించాడు కూడా! హీరోల సలహా లెక్కచేయలేనీకేమైనా పిచ్చిపట్టిందా? జీవితంలో ఎంతో సాధించావ్.. అలాంటిది ఇప్పుడు నటీనటుల వానిటీ వ్యాన్ దగ్గరకు వెళ్లి మీ షాట్ రెడీ అయింది, రండి అని పిలుచుకుంటూ ఉంటావా? నిర్మాతగా మారితే డబ్బు పోగొట్టుకుంటావ్ అన్నాడు. సల్మాన్ ఖాన్ అయితే.. సినిమా తీయాలనుకుంటే ఓకే, కానీ అందులో నువ్వు కూడా నటించు. ఎందుకంటే నువ్వు ఎంపిక చేసే హీరో కంటే నువ్వే ఎక్కువ ఫేమస్ అన్నాడు. ఇద్దరి మాటల్నీ నేను పట్టించుకోలేదు. నా సిరీస్ కోసం ఎంతో డబ్బు పోగేశాను.. కానీ అది ఫ్లాప్ అయింది. కనీసం అందులో నటించినా బాగుండేదని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అని మికా సింగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్! -
సల్మాన్ ఖాన్, మురుగదాస్ యాక్షన్ టీజర్ విడుదల
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కానుకగా ఆ చిత్రం నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా విడుదల కానుంది. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. -
సల్మాన్తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా
ఆన్స్క్రీన్ జంటల్ని జనాలెంతగానో ఇష్టపడతారు. రియల్ లైఫ్లోనూ ఆ హీరోహీరోయిన్లు జంటగా ఉంటే బాగుంటుందని ఆశపడతారు. కొందరైతే వారి మధ్య స్నేహాన్ని కూడా ప్రేమ అని ప్రచారం చేస్తుంటారు. అలా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), హీరోయిన్ ప్రీతి జింటా కూడా లవ్లో ఉన్నారని అప్పట్లో బోలెడు రూమర్స్ వచ్చాయి. ఇన్నాళ్లకు దానిపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్.ఎంతో ప్రేమిస్తున్నా..డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ బర్త్డే సందర్భంగా ప్రీతి జింటా (Preity Zinta) సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే సల్మాన్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మిగతాదంతా మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. మనిద్దరం మరోసారి ఫోటోలు దిగాలి. లేదంటే ఇదిగో ఇలా పాతవే పోస్ట్ చేస్తూ ఉంటాను అంటూ సల్మాన్తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్.. మీరిద్దరూ ప్రేమించుకున్నారా? అని అడిగాడు. హీరోతో లవ్?అందుకు ప్రీతి జింటా.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. అతడు తనకు క్లోజ్ ఫ్రెండ్ అని తెలిపింది. అలాగే తన భర్తకు కూడా మంచి స్నేహితుడని, తనకు కుటుంబసభ్యుడిలాంటివాడని చెప్పింది. మీరెంత ఊహించుకున్నా ఇదే నిజం అని రిప్లై ఇచ్చింది. కాగా సల్మాన్- ప్రీతిజింటా.. హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ చోరీ చుప్కే చుప్కే, దిల్నే జిసే ఆప్నా కహా, జాన్ ఎ మన్, హీరోస్, ఇష్క్ ఇన్ పారిస్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రీతి తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో హీరోయిన్గా మెరిసింది. Happy Burrday @BeingSalmanKhan 🎂Just wanna say I love you the mostest 🥳 Rest will tell you when I speak to you ….. and yes we need more photos otherwise I will keep posting the same old ones ! Ting 💕 pic.twitter.com/XLVHxTIFY6— Preity G Zinta (@realpreityzinta) December 27, 2024 No not at all ! He is family & my closest friend and my husband’s friend too .. just in case you were wondering 🤣🤣 Sorry ! Couldn’t resist 👼— Preity G Zinta (@realpreityzinta) December 28, 2024 చదవండి: గేమ్ ఛేంజర్ టీమ్కు అభిమాని వార్నింగ్.. 'ఆ పని చేయకపోతే చస్తా!' -
బిగ్బాస్ షోలో 'బేబీ'తో కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
ఖో ఖో ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్
మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్ టోర్నీకి భారత్ వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ప్రచారం కల్పించే క్రమంలో ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) కీలక ముందడుగు వేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించినట్లు బుధవారం వెల్లడించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న క్రీడాకారుల జాతీయ శిక్షణ శిబిరంలో మీడియా సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేసింది. కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాంషు మిట్టల్, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ త్యాగితో పాటు భారత పురుషుల, మహిళా క్రీడాకారులు, కోచ్లు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఖో ఖో ప్రపంచ కప్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఆటతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. దేశ రాజధానిలో ప్రపంచ కప్ నిర్వహించడం ప్రశంసనీయమన్నాడు. ఖో ఖో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటం చూసి ఎంతో థ్రిల్ అవుతున్నానని చెప్పాడు.ఏదో ఒక దశలో ఖో ఖో ఆడిన వాళ్లమే"తొలి ఖో ఖో ప్రపంచ కప్– 2025తో భాగం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది భారత నేల, ఆత్మ, బలానికి ఇచ్చే నివాళి. నాతో పాటు మనమంతా జీవితంలో ఏదో ఒక దశలో ఖో ఖో ఆడిన వాళ్లమే’ అని సల్మాన్ ఖాన్ తన సందేశంలో పేర్కొన్నారు. ‘నాన్స్టాప్ యాక్షన్తో ఉత్కంఠభరితమైన క్రీడ అయిన ఖో ఖో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వేదికపై ఖో ఖో స్ఫూర్తిని చాటేందుకు ఏకం అవుదాం’ అని పిలుపునిచ్చారు.మన మట్టిలో పుట్టిన ఆట కోసంఇక కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ సల్మాన్ ఖాన్కు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ ఉనికి ప్రపంచ కప్ వీక్షకుల సంఖ్యను పెంచుతుందని నమ్ముతున్నారు. "సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన బిజీ షెడ్యూల్లో కూడా మన మట్టిలో పుట్టిన ఆట కోసం సమయం ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.క్రీడ పట్ల ఆయన అభిరుచి నిజంగా స్ఫూర్తిదాయకం. రాబోయే ప్రపంచ కప్నకు సల్మాన్ యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తాడని మేము విశ్వసిస్తున్నాము. ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్ను విజయవంతం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాము’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో జనవరి 13–19 మధ్య ఖో ఖో ప్రపంచకప్ జరుగనుంది. వారం రోజుల పాటు జరిగే ఖో ఖో ప్రపంచ కప్లో టోర్నమెంట్లో 21 పురుషుల, 20 మహిళల జట్లు పోటీపడతాయి. మొత్తం 24 దేశాల జట్లు టోర్నమెంట్ కోసం భారత్కు వస్తున్నాయి.కాగా, జాతీయ శిక్షణ శిబిరంలో ప్రతీక్ వైకర్, ఆదిత్య గన్పూలే, రామ్జీ కశ్యప్, దిలీప్ ఖాండ్వీ, సుయాష్ గార్గేట్, గౌతమ్ ఎంకే సచిన్ భార్ఘవ, విశాల్, అరుణ్ గుంకీ, ప్రియాంక ఇంగ్లే, మాగై మజ్హి, మీన్ ముస్కనన్, . చేత్రా బి, నస్రీన్, రేష్మా రాథోడ్, నిర్మలా పాండే వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన పురుషుల, మహిళల జట్లకు డెమో మ్యాచ్ను నిర్వహించారు.భారత ఒలింపిక్ సంఘం మద్దతుప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖో ఖో అభిమానులకు ఈ ఆటలోని థ్రిల్లింగ్ అనుభవాన్ని ఈ టోర్నమెంట్ అందించనుంది. కేకేఎఫ్ఐ కూడా ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలను అందించడంపై దృష్టి సారిస్తోంది. అందుకే, పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన వేదికను ఏర్పాటు చేసింది. మరోవైపు.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఖో ఖో ప్రపంచ కప్నకు మద్దతు ఇస్తోంది. ఇందుకోసం ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. -
బాలీవుడ్ వెళ్తున్న కల్కి మ్యూజిక్ డైరెక్టర్
-
నా ఆరోగ్యం బాలేనప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించాడు: రష్మిక
అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కుబేర, చావ, సికిందర్, ద గర్ల్ఫ్రెండ్, థామ సినిమాలున్నాయి. ఇకపోతే సికిందర్ సినిమా విశేషాలను తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక.ఆరోగ్యం బాగోలేకపోయినా..ఆమె మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్తో నటించడమనేది గొప్ప విషయం. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అలాగే ఎంతో హుందాగా ఉంటాడు. ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేదు. అయినా షూటింగ్కు వెళ్లాను. నా పరిస్థితి తెలిసిన సల్మాన్ సర్ ఎలా ఉంది? అంతా ఓకేనా? అని ఆరా తీశాడు. స్పెషల్ కేర్మంచి హెల్తీ ఫుడ్, వేడి నీళ్లు అన్నీ ఏర్పాటు చేయమని అక్కడున్నవారికి చెప్పాడు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. స్పెషల్ కేర్ చూపించాడు. దేశంలోనే బడా స్టార్స్లో ఒకరైనప్పటికీ ఎంతో అణుకువతో ఉంటాడు. సికిందర్ నాకెంతో స్పెషల్ మూవీ. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిట్గా ఉన్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది.చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన టీమ్ -
సల్మాన్ ఖాన్కు మళ్లీ బెదిరింపులు
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్లో ఉండగా, ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. షూటింగ్లో ఉన్న ఇతర సిబ్బంది అతడిని బంధించారు. పోలీసులు రంగంలోకి దిగి సదరు గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్కు గతంలో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. -
తమిళ్ డైరెక్టర్స్ నే నమ్ముకున్న సల్మాన్ ఖాన్
-
రేపు నువ్వే నాకు తల్లిగా నటిస్తావ్.. హీరోయిన్ను ఏడిపించిన హీరో
ఇప్పుడు నా పక్కన హీరోయిన్గా చేస్తున్నావ్ కానీ, తర్వాత నాకు తల్లిగా కూడా నటిస్తావ్.. అంటూ కథానాయిక దియా మీర్జాను ఏడిపించాడట సల్మాన్ ఖాన్. వీరిద్దరూ తుమ్కో నా భూల్ పయేంగే (2002) అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆనాటి జ్ఞాపకాలను దియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. అప్పట్లో హీరోయిన్.. ఇప్పుడు తల్లి!ఆమె మాట్లాడుతూ.. తుమ్కో నా భూల్ పయేంగే సినిమా షూటింగ్లో సల్మాన్కు తల్లిగా యాక్ట్ చేసిన నటి తన షాట్ కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు సల్మాన్ నా దగ్గరకు వచ్చి.. ఆమె గతంలో అతడి సినిమాలో హీరోయిన్గా నటించిందన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అస్సలు నమ్మలేదు. దీంతో అతడు.. అవును, మొదట్లో నా పక్కన హీరోయిన్గా చేసిందని నొక్కి చెప్పాడు.ఆ రోజు రాకూడదని కోరుకున్నా..నీ వయసులో ఉన్న నటి నీకు తల్లిగా నటించడమేంటని షాకయ్యాను. అతడు మాత్రం.. ఏదో ఒక రోజు నువ్వు కూడా నా తల్లి పాత్రలో యాక్ట్ చేస్తావ్ అన్నాడు. అలాంటి రోజు రాకూడదని కోరుకున్నాను. ఈ సంఘటన నేను ఎన్నటికీ మర్చిపోలేను. కానీ సల్మాన్ చాలా సరదా మనిషి. అప్పట్లో సెట్లో ఆడవాళ్లు తక్కువగా ఉండేవాళ్లు. ఆ సమయంలో నన్నెంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అని చెప్పుకొచ్చింది.ఎవరీ దియా?ఇకపోతే దియా మీర్జా.. రెహనా హై తేరే దిల్ మే, దమ్, తెహజీబ్, పరిణీత, దస్, ఫైట్ క్లబ్ మెంబర్స్ ఓన్లీ, లగే రహో మున్నా భాయ్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంజు, థప్పడ్ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా.. ఐసీ 814: ద కాందహర్ హైజాక్ అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్? -
పోలీసులను గౌరవించేవాడిని కాదు..: సల్మాన్ ఖాన్
మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. కాలం మారేకొద్దీ తను ఎంతోకొంత మారుతూ ఉంటాడు. అలా తాను కూడా చాలా మారానంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆయన వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో పాల్గొన్నాడు. రజత్ అనే కంటెస్టెంట్ ప్రవర్తన తప్పని వారించాడు. ఒకప్పుడు నాదీ అదే యాటిట్యూడ్ఎవరైనా ఉన్నప్పుడు టేబుల్పై దర్జాగా కాలుపెట్టి మాట్లాడటం తప్పని, ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలని హితవు పలికాడు. తాను కూడా ఒకప్పుడు రూడ్గా ఉండేవాడినంటూ అందుకు సంబంధించిన ఓ ఉదాహరణను చెప్పుకొచ్చాడు. టేబుల్కు కాళ్లు అనించే అలవాటు నాక్కూడా ఉంది. గతంలో ఓ పోలీస్ స్టేషన్లో కాళ్లు టేబుల్కు ఆనించి ఠీవీగా కూర్చున్నాను. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నట్లుండేది నా వాలకం. పొగరుగా..కానీ ఎవరైనా సీనియర్ అధికారులు బ్యాడ్జ్ ధరించి వచ్చినప్పుడు లేచి గౌరవించాలి. ఆ పాత క్లిప్పింగ్స్ చూసినప్పుడు నేనేమీ గర్వంగా ఫీలవను. అంత పొగరుగా కూర్చోవాల్సిన అవసరమేముంది? అనుకునేవాడిని. పోలీసులను అగౌరవపర్చేలా అంత అహంకారంగా ఎందుకు ప్రవర్తించాననుకున్నాను. ఎంత అనుకున్నా.. దాన్నిప్పుడు మార్చలేను కదా! నీ కంటే పెద్ద గొంతుఇప్పుడు నీపై కూడా అంతే రూడ్గా మాట్లాడొచ్చు. నీ కంటే నా గొంతు పెద్దది. కానీ నేనలా గొంతు పెంచి అరవాలనుకోవడం లేదు అని చెప్పాడు. తన తప్పు అందరి ముందు ఒప్పుకోవాలంటే గుండె ధైర్యం కావాలి.. నువ్వు రియల్ హీరో అంటూ సల్మాన్ను పొగుడుతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐧𝐮𝐬𝐡𝐚 𝐆𝐡𝐨𝐬𝐡 ♡ (@anusha_salmankhan)మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ!
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.అన్ని అవాస్తవాలే...అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్కేటీవీకి లీగల్ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్మెంట్ విడుదల చేశారు.కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్ సెలబ్రిటీలు
సాక్షి ముంబై: ఎన్నికల ప్రచారంలో సినీతారలకు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. పంచ్ డైలాగులు, హావభావాలతో రోడ్ షోలు, ఎన్నికల సభలను రక్తికట్టించడంలో వారికి వారే సాటి. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు ఓ మాదిరి ఆర్టిస్టుల దగ్గర్నుంచి బడా నటీనటుల వరకూ రాజకీయ పార్టీలు తమ తరపున ప్రచారం చేయమంటూ ఆహ్వానించడం పరిపాటి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నప్పటికీ పలువురు సినీ, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈవైపు కన్నెత్తి చూడడం లేదు. క్యాంపెయినింగ్కు దూరంగా బాలీవుడ్.. గతంలో ప్రముఖ రాజకీయ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది బాలీవుడ్ తారలు ఇప్పుడు ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కొందరు మినహా అనేక మంది సినీ ప్రముఖులు ప్రచార సభలు, రోడ్షోలకు దూరంగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇటీవల కాల్పులు జరగటం, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బిష్ణోయి గ్యాంగ్ హత్య చేయడం, సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్లకు కూడా ఈ గ్యాంగ్ ద్వారా బెదిరింపు ఫోన్లు రావడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారలతోపాటు చిన్న చిన్న పాత్రలు పోషించే ఆర్టిస్టులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్లుగా మిన్నకుంటున్నారు. ఒకవేళ ఎవరైన బడా నేతలు ప్రచారానికి రావాలని అడిగినా షూటింగుల్లో బిజీగా ఉన్నామని, విదేశాల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే... లోక్సభ, అసెంబ్లీ, కార్పొరేషన్ ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చనా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పారీ్టలు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి. అందులో ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలీవుడ్ తారలను ప్రచారంలోకి దింపడం ఒక ఫ్యాషన్గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని, వీరి మాటల ప్రభావంతో ఓటర్లు తమ పార్టీ అభ్యరి్ధకి ఓటు వేస్తారని నేతల ప్రగాఢ నమ్మకం. మాజీ మంత్రి, ఇటీవలే హత్యకు గురైన బాబా సిద్దీఖీ తరపున గతంలో అనేక మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో సిద్దిఖీ నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి అనేక మంది దిగ్గజ సెలిబ్రిటీలు కనిపించేవారు. ఆయన విజయంలో ఇది కూడా పరిగణించదగ్గ అంశమని రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో బాలీవుడ్ తారల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ హత్య తామే చేసినట్లు బిష్నోయి గ్యాంగ్ అంగీకరించడంతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ప్రచార సభలకు సా««ధ్యమైనంత దూరంగా ఉండాలని వారంతా భావిస్తున్నారు. ప్రాంతీయ నటులతో ప్రచారం... గతంలో మాదిరిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక మంది సినీ తారలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినప్పటికీ ఈసారి వారంతా ముఖం చాటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా ప్రచార సభలకు హాజరయ్యేందుకు వారు నిరాకరిస్తుండటంతో రాజకీయ పారీ్టలు గత్యంతరం లేక ప్రాంతీయ సినిమా, స్టేజీ ఆరి్టస్టులను ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో మరాఠీ సినీ, నాటక రంగానికి చెందిన తారలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని గంటల ప్రచారానికి కొంతమంది రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇక రోజంతా ప్రచారంలో పాల్గొనాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఏ గ్రేడ్ తారలైతే రూ.20–35 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో మరోదారి లేక వారడిగినంత చెల్లించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాగా కొందరు మరాఠీ నటుల మాత్రం రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం... దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన, జరగనున్న ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఈసారి సోషల్ మీడియాదే అగ్రస్థానం. తాము చెప్పదలచుకున్న విషయాలను, వివరించదలచిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిమిషాల వ్యవధిలో ఓటర్లకు చేర్చడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్షోలు, ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. బాలీవుడ్ తారలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనక పోయినప్పటికీ వారి వాయిస్ రికార్డింగులు, వీడియోలను ఫేస్ బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్గా మారి తమకు భారీగా ఓట్లు దక్కే అవకాశముందని అభ్యర్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేకంగా...ముంబై సహా మహారాష్ట్ర సరిహద్దులైన విదర్భ. మరఠ్వాడాలోని చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్తోపాటు నాసిక్, ముంబై. పుణే, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల పరిధిలోని నియోజక వర్గాలలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీనటులతోపాటు తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు మహావికాస్ ఆఘాడి, కాంగ్రెస్లకు మద్దతుగా ర్యాలీలు, రోడ్ షోల ద్వారా విస్తత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ, టీడీపల మధ్య పొత్తు కుదిర్చేందుకు పవన్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలుండే నియోజక వర్గాలలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది నో స్టార్స్... ఓన్లీ క్యాంపెయినింగ్ క్యాంపెయిన్లో పాల్గొననున్న మరాఠీ తారలు వీరే ...నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) (అజిత్ పవార్ వర్గం)–శాయాజీ శిందే, భావు కదం. శివసేన (ఏక్నాథ్ శిందే)–గోవిందా, శరద్ పోంక్షే. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–ప్రజక్తా మాళీ, తేజస్వినీ పండిట్. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–అమోల్ కోల్హే. బీజేపీ–ప్రియా బేర్డే, నిశా పరుళేకర్. -
అసలు హీరో అనిల్ను వదిలేసి.. లారెన్స్కు ప్రాధాన్యం.. కరెక్ట్ కాదు!
ఒక లక్ష్యం కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ, పని చేస్తున్నవారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. 48 ఏళ్ల అనిల్ బిష్ణోయ్ అటువంటివాడే. ఆయన విద్యావంతుడే కాదు రైతు కూడా! ఆవాలు, పత్తి పండించేవాడు. వన్యప్రాణుల ప్రేమికుడు, జంతువులు... ముఖ్యంగా కృష్ణ జింకలు అంటే ఆయనకు చిన్నతనం నుంచీ ప్రేమ ఎక్కువ! జంతువులను వేటాడేవారిని అతడు తీవ్రంగా నిరసిస్తాడు. హనుమాన్గఢ్లోని శ్రీగంగానగర్లో జంతువులను రక్షించే మిషన్ను ప్రారంభించడానికి వేటగాళ్లే కారణం అంటాడు అనిల్.బిష్ణోయ్ కమ్యూనిటీ వారికి కృష్ణ జింక పవిత్ర జంతువు. ఈ కమ్యూనిటీ వారి గురువైన భగవాన్ జాంబేశ్వర్ అడవినీ, వన్యప్రాణులనూ రక్షించాలనీ, తద్వారా మాత్రమే పర్యావరణ పరి రక్షణ ఉంటుందనీ చెప్పేవారు! ఆ బోధనల ప్రభావం బిష్ణోయ్ కమ్యూ నిటీపై ఎక్కువ ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇదే ప్రాంతంలో జింకను చంపిన కేసు నమోదు అవ్వడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు చంపుతామనే బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి బిష్ణోయ్ సమాజానికి చెందినవారు సల్మాన్ను తమ మందిర్కు వచ్చి క్షమాపణ కోరమన్నారు. దీనిని ఆసరా చేసుకుని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగస్టర్ ముఠా బెదిరింపులకు దిగిందని అంటారు. జాతీయ మీడియా అసలు హీరో అనిల్ను వదిలేసి లారెన్స్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.హనుమాన్ గఢ్ జిల్లా శ్రీగంగా నగర్కు చెందిన అనిల్ చిన్న నాటి నుంచే జింకల వేటగాళ్ల పట్ల కోపంగా ఉండేవాడు! వారిని పోలీస్లకు పట్టించేవాడు, సాక్ష్యం చెప్పి వారికి శిక్షలు పడే విధంగా చూసేవాడు! 30 ఏళ్లుగా ఈ సంరక్షకుడు 10 వేల కృష్ణ జింకలను వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడాడు! వాటి రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. గత మూడు దశా బ్దాలుగా జింకల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాడు. చదవండి: ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!50 పంచాయతీలలో కృష్ణ జింకల సహజ అవాసాలకు కలిగిన నష్టం, వేటగాళ్ల దుశ్చర్యల గురించి ప్రచార కార్యక్రమం చేపట్టాడు. కృష్ణ జింకలకు నీరు వంటి కనీస వసతులు కల్పించడానికి పూనుకుని... తన గ్రామ ప్రజల నుంచి రెండు లక్షల రూపాయలు చందా పోగు చేశాడు. దానికి తన సొంత డబ్బు కొంత జతచేసి కృష్ణ జింకల అవసరాలను తీర్చడానికి 60కి పైగా చిన్న, మధ్య తరహా నీటి వనరులను ఏర్పాటు చేశాడు. వాటికి గాయాలు అయినపుడు చికిత్స ఏర్పాట్లు కూడా చేశాడు.చదవండి: వ్యక్తిగా రతన్ టాటా ఎలా ఉండేవారు?1990లో సూరత్ గఢ్లో కళాశాల చదువు చదువుతున్న కాలంలోనే అటవీ రక్షణ, వన్య ప్రాణుల రక్షణ మీద జరిగిన ఒక సదస్సులో అనిల్ పాల్గొన్నాడు. ‘ఈ సదస్సు నా మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపింది’ అంటాడు అనిల్! బీఏ. బీఈడీ చదువు పూర్తి కాగానే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ లోని 12 జిల్లాలలో 3,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకునే వారితో కలిసి వన్యప్రాణ రక్షణ మీద, శాంతి ర్యాలీలు, సమావేశాలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి దాకా వేటగాళ్ల మీద 200లకు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 కేసులు ముగింపు దశకు చేరాయి. కొందరికి జరిమానాలు పడ్డాయి. అనిల్ బిష్ణోయ్ తుంహే సలాం! – ఎండి. మునీర్సీనియర్ జర్నలిస్ట్ -
హైదరాబాద్లో సల్మాన్ ఖాన్.. ఆ హోటల్లో కఠిన నిబంధనలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సల్లు భాయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. సిటీలో రాయల్ హోటల్గా గుర్తింపు ఉన్న ఫలక్నుమా ప్యాలెస్లోనూ షూటింగ్ నిర్వహిస్తున్నారు.అయితే సల్మాన్ ఖాన్కు ఇటీవల వరుసగా బెదిరింపులు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణజింకల కేసు నుంచి ప్రముఖ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్ను చంపేస్తామంటూ కొందరి నుంచి కాల్స్ వస్తుండటంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. అలా ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆయన షూటింగ్కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.నాలుగంచెల భద్రత..ఈ నేపథ్యంలో ఫలక్నుమా ప్యాలెస్ హోటల్లో నాలుగు అంచెల భద్రతలో సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ నిర్వహించారు. ఆయన భద్రత విషయంలో రాజీ పడకూడకుండా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అతిథులు షూటింగ్ జరుగుతున్న హోటల్ను బుక్ చేసుకుంటే రెండంచెల చెకింగ్ను వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి హోటల్ సెక్యూరిటీ సిబ్బంది.. మరొకటి సల్మాన్ ఖాన్ ప్రత్యేక భద్రత బృందం వారిని తనిఖీ చేయాలి. ఆ తర్వాతే వారిని హోటల్లోకి అనుమతించడం జరుగుతుంది.ఐడీ ఉంటేనే అనుమతి...మరోవైపు హోటల్ సిబ్బందికి ఐడీ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ప్రతి రోజు సిబ్బంది ఐడీలను సైతం తనిఖీ చేస్తున్నారు. సల్మాన్ కోసం ఫలక్నుమా ప్యాలెస్ను పటిష్టమైన భద్రతా వలయంగా మార్చారు. ఆయన కోసం దాదాపు 50 నుంచి 70 వరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. వీరిలో మాజీ పారామిలటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్లో షూటింగ్ షెడ్యూల్ను ముగించిన తర్వాత సల్మాన్ దుబాయ్కు వెళ్లనున్నట్లు సమాచారం.కాగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బిగ్బాస్ హోస్టింగ్కు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో
బిగ్బాస్ షోలో వారం రోజులు కంటెస్టెంట పర్ఫామెన్స్ చూస్తే వీకెండ్లో హోస్ట్ వారికి ఎలా కోటింగ్ ఇస్తారు? ఎవరిని మెచ్చుకుంటారు? అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. అందుకే వీకెండ్లో రేటింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. కొందరు హీరోలు బిగ్బాస్ బాధ్యతను ఏళ్ల తరబడి భుజాలపై మోస్తున్నారు. బిగ్బాస్ షోకు డుమ్మావారిలో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపు 15 ఏళ్లుగా ఆయన హిందీ బిగ్బాస్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 18వ సీజన్కు హోస్టింగ్ చేస్తున్నాడు. అయితే ఈ వారం అతడు షూటింగ్కు డుమ్మా కొట్టనున్నాడట! ప్రస్తుతం అతడు సికిందర్ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్లో సినిమా షెడ్యూల్ ఉండటంతో బిగ్బాస్ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. సల్మాన్ స్థానంలో ఆ సెలబ్రిటీలుదీంతో ఈ వారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో సల్మాన్ స్థానంలో సెలబ్రిటీలు ఏక్తా కపూర్, రోహిత్ శెట్టి రానున్నారు. వీళ్ల స్పెషల్ ఎంట్రీ గురించి షో నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇక సికిందర్ సినిమా విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి -
వారి పిల్లలు చెట్లు, దైవం కృష్ణజింక
సల్మాన్ఖాన్కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు రావడంతో బాలీవుడ్ సూపర్స్టార్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ‘కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ఖాన్ నిర్దోషి’ అని అతని తండ్రి సలీంఖాన్ ప్రకటనపై బిష్ణోయ్ సంఘాలు నిరసన ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కృష్ణజింకలు, వాటితో బిష్ణోయ్ సమాజానికి ఉన్న అనుబంధం మరో సారి వార్తల్లోకి వచ్చింది.వారిది 550 సంవత్సరాల అనుబంధం!పదిహేనవ శతాబ్దంలో గురు జంబేశ్వర్ (జాంబాజీ అని కూడా పిలుస్తారు) స్థాపించిన బిష్ణోయ్ శాఖ 29 సూత్రాలతో మార్గనిర్దేశం చేయబడింది. జాంబాజీ బోధనలు వన్య ప్రాణులు, చెట్ల ప్రాముఖ్యత, సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తాయి. కృష్ణజింకను తమ ఆధ్యాత్మిక గురువుగా జాంబేశ్వర్ పునర్జన్మగా నమ్మి పూజిస్తారు.బిష్ణోయ్ల జానపద కథల్లోనూ కృష్ణజింక ప్రధానంగా కనిపిస్తుంది. కృష్ణజింకను తన ప్రతీకగా, వ్యక్తీకరణగా ఆరాధించమని జాంబేశ్వర్ తన అనుచరులకు ఆదేశించినట్లు చెబుతారు. తాము కృష్ణజింకలుగా పునర్జన్మ పొందుతామని బిష్ణోయ్లు నమ్ముతారు.చెట్లను బిడ్డల్లా చూసుకోవడం విషయానికి వస్తే...1730లో జోద్పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరికి వేయకుండా కాపాడే క్రమంలో 362 మంది బిష్ణోయిలు మరణించారు. జోద్పూర్ మహారాజా అభయ్సింగ్ ఆదేశాల మేరకు ఈ మారణకాండ జరిగింది.కొత్త రాజభవనాన్ని నిర్మించడానికి అభయ్ సింగ్ కలప కోసం చెట్లను నరికి వేయడానికి సైనికులను పంపాడు. అమృతాదేవి అనే మహిళ నాయకత్వంలో బిష్ణోయ్ ప్రజలు ప్రతిఘటించారు. అమృతాదేవి తదితరులు చెట్లను కౌగిలించుకొని వాటిని రక్షించడానికి సాహసోపేతంగా ప్రతిఘటించారు. ఈ సంఘటన 1973 చిప్కో ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది.(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!) -
హైదరాబాద్లో ఫుల్ సెక్యూరిటీతో సల్మాన్ ఖాన్.. కారణం ఇదే..!
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. ఇప్పుడు ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరగనుంది. ఈమేరకు సల్మాన్ భాగ్యనగరానికి వచ్చారు. ఈ మూవీకి సాజిద్ నడియాడ్వాలా నిర్మాతగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్లో సికందర్గా సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది.'కిక్' సినిమా తర్వాత సాజిద్, సల్మాన్ కలయికలో రానున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో సల్మాన్ను చంపేస్తామంటూ కొందరి నుంచి బెదిరింపుల కాల్స్ వస్తుండటంతో ఆయన సెక్యూరిటీని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడికెళ్లినా ఫుల్ సెక్యూరిటీతోనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఇప్పుడు షూటింగ్ కోసం ఇలాంటి పరిస్థితిల్లో హైదరాబాద్కు సల్మాన్ రావడంతో అందరిలోనూ ఆసక్తిగా ఉంది.హైదరాబాద్లో రాయల్ ప్యాలెస్గా గుర్తింపు ఉన్న ఫలక్నుమా ప్యాలెస్లో సికిందర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించనున్నారు. నవంబర్ 7వరకు సల్మాన్ షూటింగ్లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఈద్కి 'సికందర్' సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్కు ఎలాంటి డూప్ సాయం లేకుండా సల్మాన్ నటించనున్నారు. -
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి. చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.కారును ఢీకొట్టించు. జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని తగ్గించుకోరు. ఎంత అమానుషం!!‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’ ఎంత తేలిగ్గా అనేస్తారు!బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!కేరింగ్ను పొసెసివ్ అని ఎందుకు అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!రోజుకొకరు ఫోన్ చేసి, ‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే ఉండదు.నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్ మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్లను దింపుతూ ఉంటుంది.లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్హౌస్లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?-మాధవ్ శింగరాజు -
బాలీవుడ్ లో మరో సంచలనం
-
అండర్ వరల్డ్ నుంచి సల్మాన్కు వార్నింగ్స్.. ఆయనతో మూడేళ్లు ఉన్నా : సోమీ అలీ
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి సల్మాన్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తనను సల్మాన్ తీవ్రంగా కొట్టాడని కూడా ఆమె పేర్కొంది. అండర్ వరల్డ్ నుంచి సల్మాన్కు గతంలో బెదిరింపులు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తున్న సమయంలో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుతుండేవారని ఆమె చెప్పింది. అయితే, వారి పేర్తు ఎత్తకుండా 'అండర్ వరల్డ్' అని చెప్పేవారు. సల్మాన్తో సుమారు మూడేళ్ల పాటు గ్యాలెక్సీ అపార్ట్మెంట్లో తాను ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని గుర్తుచేసుకుంది. ఓసారి అండర్ వరల్డ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్ వచ్చినట్లు సోమీ అలీ తెలిపింది. అయితే, ఆ ఫోన్ కాల్ తానే లిఫ్ట్ చేసినట్లు ఆమె చెప్పింది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం తనకు తెలయదని ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఫోన్లో ఇలా వార్నింగ్ ఇచ్చాడు. 'సల్మాన్కు పలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఆయన ప్రియురాలిని కిడ్నాప్ చేయబోతున్నామని.' అన్నారు. ఆ కాల్ కట్ అయిన తర్వాత ఆమె చాలా భయపడిపోయినట్లు తెలిపింది. 'ఫోన్ కాల్ గురించి వెంటనే సల్మాన్తో చెప్పాను. నేను చాలా భయపడుతున్నానని చెప్పడంతో ఆయనలో కూడా కాస్త భయం మొదలైంది. అయితే, రెండురోజుల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని సల్మాన్ తెలిపారు. మరోసారి వార్నింగ్ ఫోన్ కాల్ రాలేదు. కానీ, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే.. సల్మాన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.' అని సోమీ అలీ చెప్పింది.సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ నటి అని తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్లుగా సల్మాన్తో ఆమె రిలేషన్లో ఉన్నారని సమాచారం. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం అక్కడ పెద్దగా ఛాన్సులు రావడంలేదు. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్కు రప్పించే ప్రయత్నాలు
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ కదలికలకు సంబంధించి అక్కడి పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో అమెరికా అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ (25) ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతన్ని భారత్కు వేగంగా రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని భారత్కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ.. ముంబై పోలీసులు గత నెలలో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సల్మాన్ ఖాన్ కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు అన్మోల్ బిష్ణోయ్ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే తమ ఉద్దేశాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అతడిని భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.ఇక.. ఇటీవల జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ బిష్ణోయ్ టచ్లో ఉండటం గమనార్హం. అన్మోల్ బిష్ణోయ్ సోదరుడు గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న విషయం తెలిసిందే.అన్మోల్ బిష్ణోయ్పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్అన్మోల్ బిష్ణోయ్ సంబంధించిన సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నందున కారణంతో అన్మోల్ బిష్ణోయ్ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేర్చింది. -
సల్మాన్ కంటే అతనే బెటర్.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్ఫ్రెండ్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్స్టార్ లారెన్స్ బిష్ణోయ్తో పోల్చింది. అతనికంటే సల్మాన్ ఖాన్ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ అలీ.. సల్మాన్తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్స్టార్ బిష్ణోయ్ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు. సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెటర్ అని సోమీ అలీ చెప్పింది.గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. -
సల్మాన్ ఖాన్కు బెదిరింపులు.. అంతే రేంజ్లో దూకుడుగా పోలీసులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి బెదిరింపు కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆయన్ను అంతం చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు కాల్స్ వచ్చాయి. దీంతో సల్మాన్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటున్నారు. అక్టోబర్ 30న సల్మాన్ను రూ. 2కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంత సమయం క్రితం అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం రూ. 5 కోట్లు కావాలని బెదిరింపులకు దిగిన కూరగాయల వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.గతంలో మాదిరే ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది. సల్మాన్ను చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన్ను ప్రాణాలతో వదిలేయాలంటే రూ. 2 కోట్లు ఇప్పించాలని మెసేజ్లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు బాంద్రాకు చెందిన ఆజం మహ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేశారు. 2022 నుంచి ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి మెసేజ్లు సల్మాన్కు వచ్చాయి. ముంబైలోని బాంద్రా వెస్ట్ గెలాక్సీ అపార్ట్మెంట్లోని అతని నివాసానికి సమీపంలో ఉన్న ఒక బెంచ్పై కూడా సల్మాన్ను బెదిరిస్తూ ఒక లేఖ కనుగొనబడింది. అప్పట్నించి ఈ కేసులో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు.1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన వారికి నచ్చలేదు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకొని లారెన్స్ బిష్ణోయ్ ఒక గ్యాంగ్ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్పై హత్యాయత్నం కూడా చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. -
నేనేంటో చూపిస్తా.. నటిని బెదిరించిన సల్మాన్ ఖాన్!
తనపై చేయి చేసుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని సల్మాన్ ఓ నటిని బెదిరించాడట.. దమ్ముంటే కొట్టి చూడు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువుగానీ అంటూ రెచ్చగొట్టాడట! ఈ ఆసక్తికర విషయం గురించి బాలీవుడ్ నటి ఇందిరా కృష్ట ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సల్మాన్ బెదిరించాడుఆమె మాట్లాడుతూ.. తేరే నామ్ సినిమాలో నేను సల్మాన్ను కొట్టే సన్నివేశం ఒకటుంటుంది. సరిగ్గా ఆ సన్నివేశానికి ముందు సల్మాన్ నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను చిన్నగా కొట్టినా సరే నేనేం చేస్తానో చూడు. ఎంత రచ్చ చేస్తానో నాకే తెలియదు అని బెదిరించాడు. నాకు చాలా భయమేసింది. ఆ సీన్ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక ఆందోళన చెందాను. చేతులు వణికాయి. ఇంతలో సల్మాన్ అదంతా ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చాను.ఆ ఫీలింగే రాదుఅతడితో కలిసి పని చేయడం నాకెంతో ఇష్టం. పెద్ద హీరోతో పని చేస్తున్న భావన రాదు. అంత కలివిడిగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. తేరే నామ్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు సతీశ్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. భూమిక చావ్లా హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఇందిర.. లేడీ విలన్ నీరజ అక్క మమత పాత్రలో నటించింది.చదవండి: హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబర్కు భారీ ఊరట! -
సల్మాన్ ఖాన్కి మరోసారి బెదిరింపులు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి బెదిరింపు కాల్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగిన దగ్గర నుంచి బెదిరింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఓ మెసేజ్ రాగా.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: హత్య కేసులో స్టార్ హీరో దర్శన్కి మధ్యంతర బెయిల్)ఈ క్రమంలోనే వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాపు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యమైన బాబా సిద్దిఖీ కొడుకు జీషన్ సిద్దిఖీని కూడా చంపేస్తామని బెదిరించాడు. ఇలా చేసిన 20 ఏళ్ల గుఫ్రన్ని అరెస్ట్ చేసిన కాసేపటికే సల్మాన్కి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.అప్పుడెప్పుడో కృష్ణజింకలని వేటాడిన కేసు ఇప్పటికీ సల్మాన్ఖాన్ వెంటాడుతూనే ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పలుమార్లు చంపుతామని బెదిరిస్తూనే ఉన్నారు. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని కూడా అన్నారు. కానీ భద్రత పెంచుకోవడం తప్పితే సల్మాన్ నుంచి క్షమాపణ గురించి స్పందన లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?) -
బాలీవుడ్ స్టార్ సల్మానఖాన్ కు మళ్లీ బెదిరింపులు
-
సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు
-
‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’
ముంబై: తన తండ్రి హత్య తర్వాత బాలీవుడ్ నటుడు, సిద్ధిఖీ కుటుంబానికి సన్నితుడైన సల్మాన్ ఖాన్ ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ తెలిపారు. అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీని కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. అయితే హత్యకు లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్తో సన్నిహితంగా ఉండటం వల్లే బాబా సిద్ధిఖీని టార్గెట్ చేశామని తెలిపారు. అయితే ఇటీవల జీషన్ సిద్ధిఖీ ఓ ఇంటర్వ్యులో తన తండ్రి మరణం తర్వాత సల్మాన్ ఖాన్ ఎలా మద్దుతుగా నిలిచారో పలు విషయాలు పంచుకున్నారు.‘‘నాన్న హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ప్రతీరోజు రాత్రి క్రమం తప్పకుండా నా రాత్రి నాకు కాల్ చేసి బాగోగులు తెలుసుకుంటున్నారు. సల్మాన్ భాయ్.. మా నాన్న హత్య విషయంలో చాలా బాధపడ్డారు. మా నాన్న, సల్మాన్ భాయ్ నిజమైన అన్నదమ్ముల్లా చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న చనిపోయిన తర్వాత సల్మాన్ భాయ్.. నేను రాత్రి సమయంలో ఎలా ఉన్నాను. నిద్ర పోతున్నానా లేదా అని ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. రాత్రి నేను నిద్ర పోకపోతే.. నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సపోర్ట్గా నిలిచారు’’ అని జీషన్ తెలిపారు.మరోవైపు.. జీషన్ సిద్ధిఖీ గత వారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరారు. అంతేకాక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాండ్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతున్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో ఆగస్టులో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే తనపై వచ్చిన ఈ అభియోగాలను జీషన్ తోసిపుచ్చారు.చదవండి: బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీపై ట్రోలింగ్ షురూ! -
పప్పూ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు
పట్నా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బీహార్ ఎంపీ పప్పూ యాదవ్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోమవారం ఓ ఆడియో క్లిప్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో బిహార్లో కలకలం రేపుతోంది.‘‘ఎంపీ పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు సంబంధించిన విషయాల నుంచి ఆయన దూరంగా ఉండాలి. అలా ఉండకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడము. అహ్మదాబాద్లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్తో నేరుగా కమ్యూనికేషన్ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆయన మాత్రం మా కాల్స్కు స్పందించటం లేదు’’ అని ఆడియోలో క్లిప్లో ఓ వ్యక్తి మాట్లాడారు.ఇక.. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యపై బిహార్లోని పూర్నియా నియోజకవర్గం ఎంపీ (స్వతంత్ర) పప్పూ యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం 24 గంటల్లో అంతం చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వచ్చిన బెదిరింపులపై పప్పూ యాదవ్ బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.చదవండి: చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్షా -
అన్మోల్ బిష్ణోయ్ గురించి సమాచారమిస్తే రూ. 10 లక్షల రివార్డు
-
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
ముంబై: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అలాగే అన్మోల్ను పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా గత ఏప్రిల్లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మీన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్కు ప్రమేయం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు అన్మోల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. బాబా సిద్దిఖీ హత్యతో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారుఅన్మోల్ బిష్ణోయ్ని అలియాస్ భానుగా పిలుస్తారు. గత ఏడాది నకిలీ పాస్పోర్ట్తో భారత్ నుంచి పారిపోయిన అన్మోల్.. అనంతరం కెన్యా, కెనడాలో గుర్తించారు. ప్రస్తుతం అతడు కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. -
సల్మాన్ ఖాన్ను చంపేస్తామన్న కూరగాయల వ్యాపారి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను చంపేస్తానంటూ కొద్దిరోజుల క్రితం బెదిరింపు మెసేజ్ పెట్టిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఝార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన షేక్ హుస్సేన్ (24)గా గుర్తించారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో హుస్సేన్ కూడా అదే గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తి అంటూ సల్మాన్ నుంచి రూ. కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ చేశాడు.సల్మాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కూరగాయల వ్యాపారి షేక్ హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే తాను ఇలాంటి ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ అతన్ని పూర్తిగా విచారించిన తర్వాతే కోర్టులో హాజరుపరచనున్నారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులకు కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. అయితే, ఒకరోజు తర్వాత అతను మరో సందేశం ఇలా పంపించాడు. 'నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి' అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. జంషెడ్పూర్ చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. -
‘సల్మాన్ను బెదిరించి తప్పు చేశాం’.. నిందితుడు మరో మెసేజ్
ముంబై: కొద్దిరోజు క్రితం ఓ నిందితుడు సల్మాన్ ఖాన్ను బెదిరింపులకు పాల్పడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులకు మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడే సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేసినట్లు మరో వాట్సప్ మెసేజ్ పంపించాడు. ప్రస్తుతం ఈ అంశం బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది వారం రోజుల క్రితం సల్మాన్ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగింది. హత్యోదంతం తర్వాత అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సల్మాన్కు వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ ఓ నిందితుడు బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్కు హైసెక్యూరిటీ మధ్య భద్రత కల్పిస్తున్నారు. అంతేకాదు ఆ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ తరుణంలో సోమవారం, ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గతవారం సల్మాన్ ఖాన్ను బెదిరించిన నిందితుడు మరో మెసేజ్ పంపించాడని, సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిందితుడు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
కోట్ల విలువైన ఆస్తిని అమ్మేసిన స్టార్ హీరో చెల్లెలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ సీజన్-18కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. బిగ్బాస్ సెట్ వద్ద దాదాపు 60 మందితో భద్రత ఏర్పాటు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ అనే రౌడీ షీటర్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తాజాగా తన ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆయన సోదరి అర్పితా ఖాన్ శర్మ ముంబయిలోని ఖర్ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ను రూ.22 కోట్లకు విక్రయించినట్లు బాలీవుడ్లో టాక్. 2017లో ఆ ఇంటిని ఆమె రూ.18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబయిలోని శివయ్య సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అపార్ట్మెంట్ను అమ్మినట్లు సన్నిహితులు తెలిపారు. ఆ ప్రాంతం పరిసరాల్లోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్లతో సహా పలువురు బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు. -
ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని నడిరోడ్డుపై దుండగులు కాల్చి చంపడం కొన్నిరోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కి ఇతడు ఆప్తుడు కావడం వల్లే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దిఖీని చంపేశారనే టాక్ వినిపించింది. రెండు రోజుల క్రితం సల్మాన్ని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలా వరస సంఘటన కారణంగా సల్మాన్లో ప్రాణభయం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొన్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)1999లో కృష్ణ జింకలు వేటాడిన కేసులో సల్మాన్పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు కానీ బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ అనే కుర్రాడు మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్ని చంపేందుకు కుట్ర పన్నుతూనే ఉన్నాడు. గత రెండేళ్లలోనూ ఆ ప్రయత్నాలు చేశారు. బాబా సిద్దిఖీ మర్డర్, రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తాజాగా బెదిరింపు మెసేజ్.. ఇలా బోలెడన్ని కారణాల వల్ల సల్మాన్ అప్రమత్తమయ్యాడు.సుమారు రూ.2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్ నుంచి ఆయన దిగుమతి చేసుకోనున్నాడట. త్వరలోనే ఇది సల్మాన్ గ్యారేజ్లో చేరనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆయన ఎంపిక చేసుకున్న ఆ మోడల్ కారు మన దేశంలో దొరకదని సమాచారం. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సల్మాన్ దగ్గరుంది. కానీ లేటెస్ట్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ కొత్త కారును కొనుగోలు చేశాడని సమాచారం.ఈ కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
బిగ్ బాస్ సెట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత.. కారణం ఇదే
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు రావడంతో ఆయన కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది నడుమ ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ఫుల్స్టాప్ పడాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే, ఇలాంటి సమయంలో హిందీ బిగ్ బాస్ 18 సెట్లో ఆయన పాల్గొంటారా..? లేదా..? అనే సందేహాలు వచ్చాయి. ఇక ఈ సీజన్కు హోస్ట్గా సల్మాన్ వైదొలగనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇలాంటి వాటికి ఆయన ఫుల్స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది.బిగ్ బాస్ 18 వీకెండ్ కోసం సల్మాన్ హజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది మధ్య ఆయన ఇప్పటికే సెట్లో ఎంట్రీ ఇచ్చారని సమాచారం. శుక్రవారమే 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్ను యూనిట్ పూర్తి చేయనుంది. సల్మాన్కు రక్షణగా సుమారు 50మందికి పైగానే సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, వారందరూ సల్మాన్ పర్యవేక్షణలో ఉండనున్నారు. ఎట్టిపరిస్థితిలో ఇతరులను హోస్లోకి అనుమతించరట. బిగ్ బాస్ యూనిట్ సభ్యులను కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వారిని సెట్స్లోకి అనుమతించనున్నారు. సల్మాన్కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యాకే అక్కడున్న వారిని బయటకు పంపనున్నారు. సెట్లోని ఇతరుల వద్ద కనీసం ఫోన్ కూడా ఉంచకుండా జాగ్రత్తపడుతున్నారట. 1998లో జరిగిన ఘటన1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన లారెన్స్కు నచ్చలేదు. అయితే, ఈ ఘటన జరిగిన సమయానికి అతని వయసు సరిగ్గా 5 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచే సల్మాన్పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2018 సమయం నుంచే సల్మాన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకొని ఒక గ్యాంగ్ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్పై హత్యాయత్నం కూడా చేశాడు. -
బాలీవుడ్ నటుడు సల్మానఖాన్ కు బెదిరింపులు
-
సల్మాన్ ఖాన్కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు చంపుతామని బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్ కాస్త ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పాలి. ఇంతకీ అసలేం జరుగుతోంది?కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. సల్మాన్కి స్నేహితుడు అయినందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా సల్మాన్కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఈ మెసేజ్ ఎవరు పంపించారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 1999లో కృష్ణ జింకల్ని వేటాడిన తర్వాత కొన్నాళ్ల పాటు సల్మాన్ జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటనతో సల్మాన్పై బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ పగ పెంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.2022లోనూ బాంద్రాలోని సల్మాన్ ఇంటి దగ్గర అనుమానాస్పద రీతిలో ఉత్తరం దొరికింది. 2023లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స్వయంగా సల్మాన్కే మెయిల్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాబా సిద్దిఖీని చంపేయడంతో సల్మాన్కి పోలీసులు మరింత భద్రత పెంచారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్.. షార్ప్ షూటర్ అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన వారిలో మరోకరిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హరియాణాలోని పానిపట్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఒక షార్ప్ షూటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు అతన్ని కోర్టులో హజరుపరచనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్లో ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు నాటి నుంచి ఆ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో జూన్లో కూడా మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు తెలిపారు. సల్మాన్కు సంబంధించిన పన్వేల్ ఫామ్హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో ఆయనపై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తి షార్ప్ షూటర్ అని తెలుస్తోంది. అతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో చాలా కీలకంగా ఉన్నట్లు సమాచారం. సల్మాన్ను అంతం చేసేందుకు ఆయన కదలికలను పర్యవేక్షించడానికి దాదాపు 60 నుండి 70 మంది ఈ గ్యాంగ్లో భాగం అయ్యారని పోలీసులు తెలిపారు. పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య మాదిరే.. కారులోనే సల్మాన్ను హత్య చేయాలని ఈ గ్యాంగ్ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. -
బిగ్బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!
బాలీవుడ్లో ప్రస్తుతం బిగ్బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఊహించని విధంగా బయటకొచ్చేశాడు. అడ్వకేట్ అయిన గుణరత్న సదావర్తే బిగ్ బాస్ హౌస్కు గుడ్ బై చెప్పారు. కారణమిదే...తాజా సమాచారం ప్రకారం అడ్వకేట్ గుణరత్న సదావర్తే సోమవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అతను రాలేదు. దీంతో న్యాయమూర్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుణరత్న సదావర్తే బిగ్బాస్ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే అతను మళ్లీ బిగ్బాస్ హౌస్లోకి తిరిగి వస్తాడా? లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.న్యాయవాది గుణరత్న కేసుఅంతకుముందు బిగ్ బాస్ హౌస్లో ఉన్నందున గుణరత్న సదావర్తే కోర్టుకు హాజరు కాలేకపోయాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమైన సమస్య అయిన మరాఠా రిజర్వేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు విచారిస్తోంది. కాగా.. సదావర్తే తన సతీమణి జైశ్రీ పాటిల్తో కలిసి రిజర్వేషన్పై పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19కి కోర్టు వాయిదా వేసింది. -
5 ఏళ్ల వయసు నుంచే సల్మాన్పై పగ.. లారెన్స్ బిష్ణోయ్పై వర్మ ట్వీట్
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ దారుణ ఘటనలో బిష్ణోయ్ల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. సల్మాన్తో సిద్ధిఖీ ఎక్కువగా సన్నిహితంగా ఉన్న కారణంగానే ఈ హత్య చేశారని తెలుస్తోంది. ఈ అంశం గురించి తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పలు ట్వీట్లు చేశారు. 30 ఏళ్ల పంజాబీ గ్యాంగ్ స్టర్ జైల్లో ఉన్నప్పటికీ తన సోదరుడి సాయంతో కొందరిని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని కెనడా నుంచి ఒక గ్యాంగ్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ గ్యాంగ్తో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు.25 ఏళ్లుగా పగను పెంచుకున్నాడు: ఆర్జీవీ'1998లో కృష్ణజింకను చంపబడినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కేవలం 5 సంవత్సరాల పిల్లవాడు. బిష్ణోయ్ల పగ కోసం 25 సంవత్సరాలుగా అతను పోరాడుతున్నాడా..! ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాల వయస్సులో ఒక స్టార్ నటుడిగా ఉన్న సల్మాన్ను అంతం చేయడమే తన జీవిత లక్ష్యం అని చెప్పడం ఏంటి..? ఇది ఆ జంతువుపై వారికి ఉన్న విపరీతమైన ప్రేమా..? లేదా.. దేవుడు ఆడుతున్న వింత నాటకమా..?' అంటూ ఆర్జీవీ ప్రశ్నించాడు.లారెన్స్ బిష్ణోయ్ గురించి ఆర్జీవీ మరో ట్వీట్ కూడా ఇలా చేశారు. గ్యాంగ్స్టర్గా మారిన ఒక న్యాయవాది ( లారెన్స్ బిష్ణోయ్) ఒక సూపర్ స్టార్ని చంపడం ద్వారా జింక మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నాడు. అతని ఆదేశాలతో తన గ్యాంగ్లోని 700 మంది నడుచుకుంటున్నారు. అతను మొదట స్టార్ హీరోకు సన్నిహితుడైన ఒక పెద్ద రాజకీయవేత్తను చంపమని ఫేస్ బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేరు, అడ్డుకోలేరు. ముంబై మాఫియాలోని ఇతర గ్యాంగ్స్టర్ల మాదిరిగా కాకుండా, అతను ఇప్పటికే హై సెక్యూరిటీ జైలులో, ప్రభుత్వ రక్షణలో ఉన్నందున అతన్ని పట్టుకోవడం లేదా ఎదుర్కోవడం సాధ్యం కాదు. అని ఆర్జీవీ అభిప్రాయా పడ్డారు. లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. కానీ, తనను చాలామంది కలుస్తుంటారని, సెల్ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటాడని పేరుంది. అతనికి ప్రభుత్వాలు, అధికారులు సాయం చేస్తున్నారనే పరోక్షంగా ఆర్జీవీ చెప్పారు.1998లో జరిగిన ఘటన1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన లారెన్స్కు నచ్చలేదు. అయితే, ఈ ఘటన జరిగిన సమయానికి అతని వయసు సరిగ్గా 5 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచే సల్మాన్పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2018 సమాయినికి సల్మాన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకొని ఒక గ్యాంగ్ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్పై హత్యాయత్నం కూడా చేశాడు. LAWRENCE BISHNOI was just a 5 YEAR OLD KID when the deer was killed in 1998 and Bishnoi maintained his grudge for 25 years and now at age 30 he says that his LIFE’S GOAL is to kill SALMAN to take REVENGE for KILLING that DEER .. Is this ANIMAL love at its PEAK or GOD playing a… https://t.co/KGiOSojxfT— Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2024 -
కండలవీరుడికి ముద్దు పెట్టిన హీరోయిన్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రియాలిటీ షో బిగ్బాస్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో బిగ్బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ సీజన్ అభిమానులను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోంది. తాజా ఎపిసోడ్లో బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ మెరిసింది. ఇటీవల విడుదలైన తన మూవీ విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాను ప్రమోట్ చేసేందుకు వచ్చింది.ఈ ఎపిసోడ్లో పాల్గొన్న మల్లికా షెరావత్.. సల్మాన్ ఖాన్పై ప్రేమవర్షం కురిపించింది. ఇండియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ అంటూ కొనియాడింది. నా కళ్లలో కళ్లు పెట్టి చూడు అంటూ సల్మాన్తో సరదాగా మాట్లాడింది. మీరు నా హృదయంలో ఉన్నారంటూ వేదికపైనే సల్మాన్కు ముద్దుపెట్టి మరి తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ సిగ్గుపడుతూ కనిపించారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. సల్మాన్ హోస్ట్గా ఉన్న ఈ రియాలిటీ షోలో మల్లికా షెరావత్ మొదటిసారి కనిపించింది. ఈ ఎపిసోడ్కు మల్లికతో పాటు చిత్రంలో నటించిన రాజ్కుమార్ రావు, ట్రిప్తి డిమ్రీ కూడా హాజరయ్యారు. 1990లో ఓ చిన్న పట్టణంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
సల్మాన్కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని ముంబైలో శనివారం రాత్రి ముగ్గురు నిందితులు కాల్చి చంపారు. ఈ హత్య పలు సందేహాలకు తావిస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్కు దగ్గరైనందుకే బాబా సిద్ధిఖీని హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులు తాము బిష్ణోయ్ గ్యాంగ్కు చెందినవారిమని పోలీసులకు చెప్పారని సమాచారం. ఈ షూటర్లలో ఒకరి పేరు కర్నైల్ సింగ్, ఇతను హర్యానా నివాసి. రెండో షూటర్ ధరమ్రాజ్ కశ్యప్.. ఇతను యూపీకి చెందినవాడు. వీరు గత కొంతకాలంగా బాబా సిద్ధిఖీ ఇంటికి రెక్కీ చేశారని పోలీసుల విచారణలో తేలింది.గత కొన్నేళ్లుగా నటుడు సల్మాన్ ఖాన్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెంబడిస్తోంది. లారెన్స్ గ్యాంగ్ షూటర్లు సల్మాన్ ఖాన్ను రెండుసార్లు రెక్కీ చేశారు. మొదటిసారి రెడీ సినిమా షూటింగ్లో ఉండగా, రెండోసారి పన్వేల్లోని సల్మాన్ ఫామ్హౌస్కి వెళ్లి రెక్కీ చేశారు. ఆ తరువాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలోని సల్మాన్ ఉంటున్న లాక్సీ అపార్ట్మెంట్పై కాల్పులు జరిపారు. అమెరికాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ఈ ముఠాను నిర్వహిస్తున్నాడని సమాచారం. సల్మాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి అంటూ గతంలొ అన్మోల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముష్కరులతో అన్మోల్ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడాడు. వారికి ఆదేశాలు ఇచ్చాడని తేలింది.ఇదిలావుండగా లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోద్రా ఇటీవల మీడియాతో.. సల్మాన్ ఖాన్కు స్నేహితుడైనవాడు తమకు శత్రువు అని వ్యాఖ్యానించాడు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న బాబా సిద్ధిఖీకి సల్మాన్ ఖాన్తో మంచి స్నేహం ఉంది. దీనికి తోడు బాలీవుడ్ హీరోలు సల్మాన్- షారుక్ ఖాన్ మధ్య స్నేహాన్ని కుదర్చడంలో సిద్ధిఖీ కీలకపాత్ర పోషించాడని చెబుతారు. మొత్తంగా చూస్తే సల్మాన్తో దోస్తీ కారణంగానే బాబా సిద్ధిఖీ.. లారెన్స్ బిష్ణోయ్కి శత్రువయ్యాడని, ఈ నేపధ్యంలోనే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ -
ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్బాస్ షూటింగ్ రద్దు
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ.. ముంబైలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న ఈయన కుమారుడు ఆఫీస్ బాంద్రాలో ఉంది. అక్కడకు దగ్గర్లో ఉన్న సమయంలో సిద్దిఖీపై గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్స్ కాల్పులు జరిపారు. హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈయన మృతి చెందారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)మరణవార్త తెలుసుకున్న సల్మాన్.. బిగ్ బాస్ 18వ సీజన్ షూటింగ్ మధ్యలోనే ఆపేసి మరీ సిద్దిఖీని పరామర్శించడానికి వెళ్లారు. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ప్రతి ఏడాది సిద్ధిఖీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు సల్మాన్ కచ్చితంగా హాజరవుతుంటారు. అలానే సిద్దిఖీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే సల్మాన్ రావాల్సిందే. అలాంటిది ఇప్పుడు తన స్నేహితుడు చనిపోవడం సల్మాన్ విషాదంలో నింపేసింది.సిద్దిఖీ విషయానికొస్తే ముంబైలోని బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగారు. గత ఫిబ్రవరిలో పార్టీని వీడి, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీలో చేరారు. మరో నెలరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కాల్పులు ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: కిర్రాక్ సీత ఎలిమినేట్)"Difficult times for #SalmanKhan. Some time ago, his father was threatened, and today his close friend #BabaSiddiqui was murdered. When Mumbai's superstars are not safe, what about the common people? This is a danger for everyone!""जीशान सिद्दीकी" pic.twitter.com/MQb7mFzkrt— Arun sisodiya (@kum58993361) October 12, 2024 -
మరో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
అతిథి పాత్రలపై సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లున్నారు. ఆల్రెడీ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలోనూ సల్మాన్ ఓ గెస్ట్ రోల్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్లు హీరోలుగా నటిస్తున్న హిందీ మూవీ ‘వార్ 2’లో కూడా సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లో భాగంగా ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ స్పై యూనివర్స్లోని ‘టైగర్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ నటించారు. దీంతో ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్ స్పైగా ఓ అతిథి ΄ాత్రను ΄ోషించేలా ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ కథలో చిన్న మార్పు చేశారట. మరి... ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒకే సీన్లో కనిపిస్తే సినిమా ఫ్యాన్స్కు పండగే అని చెప్పవచ్చు. ఇది నిజం అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
బేబీ జాన్లో అతిథిగా సల్మాన్ ఖాన్
‘బేబీ జాన్’కు అతిథి అయ్యారు సల్మాన్ ఖాన్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’. హిందీలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ తొలి చిత్రంలో నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ అతిథిపాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం సల్మాన్–వరుణ్ ధావన్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం.అంతేకాదు... సల్మాన్ ఖాన్–వరుణ్ ధావన్లపై వచ్చే యాక్షన్ సీన్స్ని మాత్రం ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అట్లీ తీస్తున్నారట. ఇక తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘తేరీ’కి హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రం వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
పదేళ్ల తర్వాత సూపర్హిట్ మూవీకి సీక్వెల్.. ప్రకటించిన డైరెక్టర్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఓరియటండ్ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే అంతలోనే మరో మూవీకి సిద్ధమయ్యారు సల్మాన్ ఖాన్. గతంలో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం కిక్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్గా కిక్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాజిద్ నదియావాలా తాజాగా ప్రకటించారు. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: నేను తప్పు చేయలేదు, బిగ్బాస్ నన్ను రోడ్డున పడేశాడు)కాగా.. 2009లో టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా నటించిన ‘కిక్. ఈ మూవీ ఆధారంగానే బాలీవుడ్లో కిక్ తెరకెక్కించారు. సల్మాన్ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ నటించిన ఈ సినిమాకు సాజిద్ నదియావాలా దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ ఫిల్మ్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా అందుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. View this post on Instagram A post shared by Nadiadwala Grandson (@nadiadwalagrandson) -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్లో ఈ ఏడాది ఈద్కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్గా సెట్స్పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్బస్టర్ అందుకున్నారు రణ్బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్తో సన్నీ డియోల్కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
సల్మాన్తో సినిమా.. 37 ఏళ్ల ఏజ్ గ్యాప్ అని ట్రోల్ చేశారు: హీరోయిన్
సినిమా తారలకు ట్రోల్స్ కామన్. ఏదో ఒక విషయంలో వాళ్లను ట్రోల్ చేస్తునే ఉంటారు. అయితే సీనియర్ యాక్టర్స్ ఇలాంటివి పట్టించుకోరు కానీ..కొత్తగా వచ్చిన వాళ్లు మాత్రం ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోతారు. మానసిక ఒత్తిడికి గురవుతారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు కూడా వాటిని పట్టించుకోకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్తారు. (చదవండి: కంగువా రిలీజ్ వాయిదా.. రజనీకాంత్ కోసమే!)అలా తాను కూడా కెరీర్ స్టార్టింగ్లో ట్రోలింగ్కు గురయ్యానని, తట్టుకోలేక కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకే దూరంగా ఉన్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్. సల్మాన్ఖాన్ హీరోగా వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం ‘దబాంగ్ 3’తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే తొలి సినిమానే వయసులో తనకంటే 37 ఏళ్లు పెద్ద నటుడైన సల్మాన్తో నటించడంతో అప్పట్లో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్పై సయీ స్పందించింది.(చదవండి: అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!)‘నా తొలి సినిమా సల్మాన్తో అనగానే వెంటనే ఓకే చెప్పా. అప్పటికీ నాకు పీఆర్ టీమ్ లేదు. అందుకే నాకేమీ తెలియదు. సినిమా విడుదలైన తర్వాత నాపై విమర్శలు వచ్చాయి. 37 ఏళ్ల పెద్ద వయసు అయిన హీరోతో నటించావంటూ నన్ను ట్రోల్ చేశారు. చాలా బాధపడ్డాను. ఆ ట్రోల్స్ నా కెరీర్పై ప్రభావం చూపొద్దని ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. కొన్నాళ్ల తర్వాత అలాంటి విమర్శలు వస్తే బాధపడడం మానేసి.. సరి చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాను’ అని సయీ చెప్పుకొచ్చింది. -
సల్మాన్ చేతికి ఖరీదైన రూ.42 కోట్ల వాచ్..
-
పాటతో పండగ
ముంబైలోని ధారావిలో గల మురికివాడలో జరిగిన ఓ పండగకు హాజరయ్యారు సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా. ఆ పండగలో భాగంగా అక్కడి రెండు వందల మందితో కలిసి డ్యాన్స్ చేశారు. సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న ‘సికందర్’కి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్త ఇది. కథలో భాగంగా ధారావిలో జరిగే పండగకి ఈ ఇద్దరూ వెళతారట. అప్పుడు వచ్చేపాటను చిత్రదర్శకుడు మురుగదాస్ భారీగా చిత్రీకరించారని సమాచారం. జోష్గా సాగే ఈపాటకు సల్మాన్, రష్మికా అదిరి΄ోయే లెవల్లో స్టెప్పులు వేశారట.మురికివాడలకు సంబంధించిన సెట్ని ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో వేయించి, ఈపాటను చిత్రీకరించారని భోగట్టా. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ ‘సికందర్’ సెట్స్లో అడుగుపెట్టారు. ‘సికందర్ డే 1’ అంటూ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టం చేశారు కాజల్. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
సల్మాన్ చేతికి ఖరీదైన వాచ్ : తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంతమైన ఖరీదైన వాచ్లను ధరించడం కొత్తేమీ కాదు. డైమండ్స్ పొదిగిన ఖరీదైన వాచీలు అంటే సల్మాన్కు చాలా ప్రీతి. తాజాగా ఖరీదైన వాచ్తో ఓ ఫొటోకు పోజివ్వడం అందర్నీ ఆకర్షించింది.విలాసవంతమైన వాచ్ కంపెనీ జాకబ్ అండ్ కో బిలియనీర్ III వాచ్ను ధరించాడు. అంతేకాదు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకోవడం కనిపించింది. జాకబ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్కు అలంకరించాడు. తాను ఎపుడు ఎవర్నీ బిలియనీర్ వాచ్ని ట్రై చేయనీయలేదు, కానీ సల్మాన్ అందుకు మినహాయింపు అంటూ వీడియోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు బీటౌన్ టైగర్, స్టార్ పవర్ ఆ వాచ్కే అందం తెస్తాడు స్పందించారు. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ పెట్టుకోవం కాదు. ఈ గడియారాన్ని సల్మాన్ ఖాన్ ధరించడమే విశేషం, సల్మాన్ పెట్టుకోవడం వల్లే దానికి వాల్యూ వచ్చింది, లివింగ్ లెజెండ్, బాస్ ఆఫ్ బాలీవుడ్ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ తెగ ఫీలయి పోతున్నారు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo)రూ. 41.94 కోట్ల వాచ్ విశేషాలు జాకబ్ అండ్ కో కంపెనీ సంబంధించిన చాలా ప్రత్యేకమైన వాచ్ బిలియనీర్ III . ఇవి ప్రపంచవ్యాప్తంగా కేవలం 18 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని కేస్, లోపలి రింగ్పై 152 ఎమరాల్డ్ కట్ డైమండ్స్, అదనంగా 76 వజ్రాలు మరింత ఆకర్షణీయంగా పొదిగారు. 57 బాగెట్-కట్ డైమండ్స్తో ,బ్రాస్లెట్లో మొత్తం 504 తెల్లని పచ్చ-కట్ డైమండ్స్తో కలిపి మొత్తం న 714 అద్భుతమై వజ్రాలతో దీన్ని రూపొందించారు. జాకబ్ అండ్ కో వెబ్సైట్ ప్రకారం, బిలియనీర్ III ధర. రూ. 41.94 కోట్లు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo) -
సికందర్కు సాయం
‘సికందర్’కు సాయం చేయనున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ . సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. త్వరలోనే ‘సికందర్’ షూటింగ్లో ఆమెపాల్గొంటారని బాలీవుడ్ టాక్. కథ రీత్యా ఈ చిత్రంలో సల్మాన్ కు సాయం చేసేపాత్రలో కాజల్ నటిస్తారట. మరి.. ‘సికందర్’లో కాజల్ భాగమైనట్లేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం ‘సికందర్’ చిత్రీకరణ జరుగుతోంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. -
వినాయక చవితి వేడుకల్లో స్టార్ హీరో డ్యాన్స్.. వీడియో వైరల్!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముంబయిలో సందడి చేశారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చిన్నపిల్లలతో కలిసి డప్పుల ముందు చిందులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. ఇటీవల పక్కటెముకల గాయంతో ఓ ఈవెంట్లో ఇబ్బంది పడుతూ కనిపించారు. మరోవైపు హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు హోస్ట్గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.గాయంతో ఈవెంట్కు హాజరు..ఈ బిగ్బాస్ ఈవెంట్లోనూ తాను ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. రెండు పక్కటెముకలు విరిగాయని, ఈ గాయం తాను అనుకున్నదానికంటే కూడా సీరియస్గా ఉందని పేర్కొన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోటో, వీడియో జర్నలిస్టులకు సూచించాడు. సల్మాన్ ఇబ్బందిని గమనించిన అభిమానులు అంత కష్టంలోనూ పనిధ్యాసే అని పొగుడుతున్నారు. Happy Ganesh Chaturthi pic.twitter.com/Ac7d9Om86v— Salman Khan (@BeingSalmanKhan) September 9, 2024 -
పక్కటెముకలు విరిగాయి.. గాయంపై నోరు విప్పిన సల్మాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితం గాయపడ్డాడు. షూటింగ్లో అతడి పక్కటెముకలకు గాయమైందని తెలిసింది. అయినప్పటికీ ఆ బాధను భరిస్తూనే తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నా సరే విశ్రాంతి తీసుకోకుండా ఈవెంట్స్లో హాజరవుతున్నాడు. బిగ్బాస్ షో..ప్రస్తుతం సికిందర్ సినిమా చేస్తున్న సల్లూభాయ్ మరోవైపు హిందీ బిగ్బాస్ 18వ సీజన్ను షురూ చేసే పనిలో పడ్డాడు. ఈ బిగ్బాస్ ఈవెంట్లోనే తన ఇబ్బందిని బయటపెట్టాడు. తనకు రెండు పక్కటెముకలు విరిగాయని, ఈ గాయం తాను అనుకున్నదానికంటే కూడా సీరియస్గా ఉందని పేర్కొన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోటో, వీడియో జర్నలిస్టులకు సూచించాడు. సల్మాన్ ఇబ్బందిని గమనించిన అభిమానులు అంత కష్టంలోనూ పనిధ్యాసే అని పొగుడుతున్నారు. థీమ్ ఏంటంటే?బిగ్బాస్ విషయానికి వస్తే.. హిందీలో ఇప్పటివరకు ఈ రియాలిటీ షో 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 18వ సీజన్ త్వరలోనే రాబోతుందని తెలియజేస్తూ సల్మాన్తో ఓ ప్రోమో కూడా షూట్ చేశారు. ఈసారి గతం-వర్తమానం-భవిష్యత్తు అనే థీమ్తో బిగ్బాస్ షోను నడిపించనున్నారట! మరి ఈ థీమ్ ఏంటి? అది ఎలా వర్కవుట్ అవుతుందనేది రానున్న రోజుల్లో తేలనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హాట్టాపిక్గా సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ హెల్తీ డైట్..!
బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనకు ఫ్యాన్సే. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత అంగ రక్షకుడు షేరా డైట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. సల్మాన్ ప్రతి షోకి వెంట ఉంటే షేరా గురించి పాటించే ఆహార నియమాలపై సల్మాన్ అభిమాను కుతుహలం ఎక్కువ. ఎందుకంటే భాయిజాన్ను రక్షించే అతడు కూడా మంచి ఫిట్గా కనిపించడమే అందుకు కారణం. అనునిత్యం సల్మాన్ని రక్షిస్తుండే అతడు ఏం తింటాడు దాని గురించి అభిమానులు ఆసక్తిగా ఉంటారు. అయితే షేరా ఒక ఇంటర్వ్యూలో తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ప్రతిదీ హ్యాపీగా తింటానని, కానీ బ్రెడ్, రోటీ లేదా శుద్దీ చేసిన ఆహారాల జోలికి మాత్రం పోనని అన్నారు. అంతేగా రోజంతా యాక్టివిగ్ ఉండేందుకు కచ్చితంగా భోజనానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తప్పనిసరిగా వ్యాయామం చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండేలా సరైన వంటకాలను ఎంచుకోవాలని చెబుతున్నాడు. అలాగే సల్మాన్తో తనకు గల విడదీయరాని బంధం గురించి చెప్పారు. అలాగే తన కొడుకు హీరోగా లాంచ్ చేసే విషయంలో సల్మాన్ తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. అలాగే తమ మధ్య ఎలాంటి సాంస్కృతిక విభేదాలు తలెత్త లేదని చెప్పారు. కాగా, సల్మాన్కి అంగరక్షకుడిగా 1990ల నుంచి పనిచేశాడు. ఆ తర్వాత 2019లో రాజకీయల్లోకి ప్రవేశించారు. అయితే ఆయన సల్మాన్ని రక్షించడంలో చాలా అంకితభావంతో పనిచేస్తాడని పేరు ఉండటం విశేషం.(చదవండి: ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం! పరిశోధకుల స్ట్రాంగ్ వార్నింగ్) -
సల్మాన్ క్రేజ్.. ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారా?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ క్రేజే వేరే లెవెల్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఫ్యాన్స్ ఉన్న హీరోల్లో సల్మాన్ ముందుంటారు. ఇటీవల ఓ ఈవెంట్లో వేదికపై చిన్నపిల్లాడి అభిమానంతో సల్మాన్ కాళ్లకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. తాజాగా బిగ్బాస్-18 సెట్స్లోనూ ఆయన ఓ అభిమానితో ముచ్చటించారు.సల్మాన్ ఖాన్ను చూసిన ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. మీకోసం నేను దేవుడిని ప్రార్థించానంటూ సల్మాన్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంది. ఆమె చెబుతున్న మాటలను సల్మాన్ ఖాన్ ఆసక్తిగా విన్నారు. కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఫ్యాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సల్మాన్ ఖాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీలో కనిపించనున్నాడు, ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. అంతేకాకుండా కమల్ హాసన్- అట్లీ మూవీలోనూ సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరిగా కూర్చోలేకపోయాడు. పదే పదే కదులుతూ ఇబ్బంది పడ్డాడు. దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు ఏం జరిగిందా అని మాట్లాడుకుంటున్నారు. తాజాగా ముంబైలో పర్యావరణ హిత వినాయక చవితి అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో 'బచ్చే బోలే మోరియా' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సల్మాన్ ఇబ్బంది పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నాని 'సరిపోదా శనివారం'కి ఊహించని కలెక్షన్స్!)సల్మాన్కి ఏమైంది?తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కొత్త సినిమా 'సికిందర్'. ఇందులో సల్మాన్ ఖాన్ హీరో. రీసెంట్గా షూటింగ్ టైంలో సల్మాన్ గాయపడగా.. పక్కటెముకలకు గాయమైందని తెలుస్తోంది. ఇలా ఓ వైపు నొప్పి వేధిస్తున్నా సరే ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ విషయాన్నే కార్యక్రమాన్ని నిర్వహించిన అమృత ఫడ్నవీస్ చెప్పకొచ్చారు.గాయం ప్రమాదమా?అయితే సల్మాన్ ఖాన్ ఇలా కుర్చీలో ఇబ్బంది పడుతున్న వీడియోని చూసి అభిమానులు కంగారు పడ్డారు. కానీ అదెమంత పెద్ద సమస్య కాదని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ)#SalmanKhan Bhai is suffering from serious Rib Injury, get well soon Bhai, your health and happiness matters the Most 🙏❣️pic.twitter.com/CQomVLEKZd— MASS (@Freak4Salman) August 28, 2024 -
ఆదిపురుష్కు మంచి వసూళ్లు వచ్చాయ్.. ప్రభాస్తో పాటు ఆ హీరో..
ఫ్లాప్ అవడం వేరు, అప్రతిష్ట మూటగట్టుకోవడం వేరు. కొన్ని కథలు బాగున్నా కలెక్షన్స్ కూడబెట్టడంలో విఫలమై ఫ్లాప్గా నిలుస్తాయి. మరికొన్ని భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఊరిస్తూ ఊదరగొడుతూ బాక్సాఫీస్ ముందుకు వచ్చి అట్టర్ఫ్లాప్గా నిలుస్తాయి. అంతేనా దారుణంగా ట్రోలింగ్కు గురవుతాయి. ఆదిపురుష్ సినిమా రెండో కోవలోకి వస్తుంది.ఆదిపురుష్పై ట్రోలింగ్భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అంతేకాదు, నటీనటుల లుక్పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. వానరాలను చూపించిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. ఇలా ఒక్కటేమిటి, బోలెడు తప్పులను జనాలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతూ దర్శకుడు ఓం రౌత్ను ఏకిపడేశారు.బానే ఆడిందిఅయితే తన సినిమాకేమైందంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ మరాఠీ షోలో మాట్లాడుతూ.. సినిమాను విమర్శించడం వేరు, బాక్సాఫీస్ వద్ద దాని పనితీరు వేరు. ఆదిపురుష్ సినిమానే ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇది మొదటి రోజు ఒక్క ఇండియాలోనే రూ.70 కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. అంటే బాక్సాఫీస్ వద్ద బానే ఆడింది.నేను పట్టించుకోనుఇక్కడ డబ్బులు పోలేదు. కాకపోతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు థియేటర్లో కొన్ని సీన్లు రికార్డు చేసి ఆన్లైన్లో ట్రోల్ చేశారు. అలాంటివాటిని నేనసలు పట్టించుకోను. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా తమ పాపులారిటీని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకునే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు సల్మాన్ ఖాన్. వారి ఇమేజ్ చెక్కుచెదరదువీరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా వీరి ఇమేజ్ అలాగే ఉంటుంది. సినిమా వైఫల్యంతో సంబంధం లేకుండా వారి క్రేజ్ అలాగే కొనసాగుతుంది అన్నారు. ఇకపోతే దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.393 కోట్లు వసూలు చేసింది.చదవండి: ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు -
కోట్ల విలువైన కారును కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఇటీవల సల్మాన్ఖాన్కు పక్కటెములకు గాయాలు కావడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్కు దూరంగా ఉన్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గాయం అయినప్పటికీ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్కు హాజరయ్యారు.అయితే తాజాగా సల్మాన్ ఖాన్కు బాడీగార్డ్ షేరా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. 1995 నుంచి సల్మాన్కు బాడీగార్డ్గా పనిచేసిన షేరా కొత్త రేంజ్ రోవర్ను కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ కారు విలువ దాదాపుగా రూ.1.4 కోట్లుగా ఉంటుందని సమాచారం. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ కాగా.. సల్మాన్కు బాడీగార్డ్గా పని చేయడమే కాకుండా టైగర్ సెక్యూరిటీ అనే సంస్థను స్థాపించారు. View this post on Instagram A post shared by shera (@beingshera) -
స్టార్ హీరోయిన్.. కానీ బడా హీరోలతో ఇంతవరకు జోడీ కట్టలేదు!
కొన్ని రోజులుగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు మార్మోగిపోతోంది. అటు స్త్రీ ఘన విజయం ఆమెను ఉబ్బితబ్బిబ్బు చేస్తోంది. మరోవైపు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించింది. కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ బడా స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లతో మాత్రం ఇంతవరకు నటించనేలేదు. స్టార హీరోలతో నటించే ఛాన్స్ రాలేదా?ఖాన్ త్రయంతో నటించకపోవడానికి గల కారణాన్ని శ్రద్ధ తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. షారూఖ్, ఆమిర్, సల్మాన్లతో నటించే ఛాన్స్ నాకు ఎప్పుడో వచ్చింది. కానీ పాత్రలో సత్తా లేకపోవడం వల్ల, అసలు ఆ రోల్ బాగోకపోవడం వల్ల ఇప్పటివరకు ఏదీ ఫైనలైజ్ కాలేదు. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఆఫర్ చేసిన పాత్ర పేలవంగా ఉంటే నేను చేయలేను.బెస్ట్ అనిపించేవి సెలక్ట్ చేసుకుంటామంచి సినిమాలే చేయాలనుకుంటాను. ఉత్తమ దర్శకులతో పని చేయాలని భావిస్తాను. ఇవన్నీ చేసినప్పుడే కదా పెద్ద స్టార్స్తో కలిసి నటించే ఛాన్స్ వస్తుంది. అలాంటి ఆఫర్ ఇప్పుడొస్తే కచ్చితంగా ఓకే చెప్తాను అని చెప్పుకొచ్చింది. కాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన స్త్రీ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.400 కోట్లు రాబట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజ్కుమార్ రావు, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
టైగర్ తో ఫైటింగ్ కి దిగుతున్న లైగర్
-
బిగ్బాస్ షోలోకి టాలీవుడ్ బ్యూటీ.. ఈసారి పక్కాగా..!
మరికొద్ది రోజుల్లో బిగ్బాస్ షో ప్రారంభం కానుంది. తెలుగులో, తమిళంలో బిగ్బాస్ 8వ సీజన్ మొదలు కానుండగా హిందీలో 18వ సీజన్ షురూ కానుంది. ఇప్పటికే ఈ మూడు సీజన్ల కోసం కంటెస్టెంట్ల వేట మొదలుపెట్టారు. ఈపాటికే కొందర్ని ఫైనల్ చేయగా మరికొందరు పారితోషికం దగ్గర బేరాలాడుతున్నారు.బ్యూటీకి ఆహ్వానం..ఇదిలా ఉంటే హీరోయిన్ సమీరా రెడ్డి సైతం రియాలిటీ షోలో భాగం కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఆమె షో మేకర్స్ నుంచి ఆహ్వానం అందింది. కానీ పలు కారణాల వల్ల ఆ ఆఫర్ను వదులుకుంది. అయితే ఈసారి మాత్రం సమీరా రావడం పక్కా అంటున్నారు.తెలుగులో..కాగా హిందీ బిగ్బాస్ 18వ సీజన్ అక్టోబర్ 5న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను బట్టి ఈ తేదీలో మార్పుచేర్పులు ఉండవచ్చు. సమీరా విషయానికి వస్తే ఈమె తెలుగులో నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించింది. 2012లో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్లో ఆడిపాడింది. -
ఆ స్టార్ హీరో డ్యాన్స్ చూసి ఏడ్చేశా: కొరియోగ్రాఫర్
బాలీవుడ్లోని ఓ స్టార్ హీరోకు డ్యాన్స్ రాదని, తనకు నేర్పించడం చేతకాక ఏడ్చేశానంటోంది కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. బాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న ఫరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న కొత్తలో ఆడిషన్స్కు వెళ్లాడు. అలా ఓసారి స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు తనకు డ్యాన్స్ నేర్పించాను. స్టెప్పులేయడమే చేతకాదునాలుగు గంటలపాటు నేర్పిస్తూనే ఉన్నాను, కానీ తనకు రావట్లేదు. నీకు డ్యాన్స్ నేర్పించడం ఎవరి వల్లా కాదు. నీకసలు స్టెప్పులేయడమే చేతకాదని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాను. తర్వాత అతడిని మైనే ప్యార్ కియా సినిమాకు సెలక్ట్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ మూవీలో అతడు ఒదిగిపోయే తీరు చూసి షాకైపోయాను అని చెప్పుకొచ్చింది.సల్మాన్ జర్నీకాగా సల్మాన్ ఖాన్.. 1988లో 'బివి హో తో ఐసీ' అనే సినిమాతో వెండితెరపై ప్రయాణం ప్రారంభించాడు. దబాంగ్ సినిమాలో మున్నీ బద్నాం హూయి పాటలో సల్మాన్కు ఫరా స్టెప్పులు నేర్పించింది. మరెన్నో హిట్ సాంగ్స్కు సైతం ఫరాయే కొరియోగ్రఫీ చేసింది. సల్మాన్ గతేడాది.. కిసి కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3 చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం సికిందర్ సినిమా చేస్తున్నాడు. -
ఏకంగా సల్మాన్ ఖాన్ తో విజయ్ దేవరకొండ క్లాష్
-
వరుస ప్లాపులు అయిన నమ్ముతున్న స్టార్స్..
-
గర్భశయాన్ని తొలగించారు.. తల్లిని కాలేను.. హీరోయిన్ ఎమోషనల్!
నటి రాఖీ సావంత్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్గా ఫాలో అయ్యే నెటిజన్స్కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో స్పెషల్ సాంగ్స్కి కేరాఫ్గా నిలిచింది. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గడంతో రాఖీ పేరు అంతా మర్చిపోయారు. దీంతో కొంతకాలం పాటు సైలెంట్గా ఉండి.. హిందీ బిగ్బాస్ రియాల్టీ షోతో మళ్లీ ఫామ్లోకి వచ్చింది. బిగ్బాస్ హౌస్లో రాఖీ చేసిన సందడి, కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆమెకు నెట్టింట మంచి ఆదరణ లభించింది. ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అయింది. కాంట్రవర్సీ పోస్ట్లతో హల్చల్ చేసింది. (చదవండి: డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి)అయితే గత కొన్నాళ్లుగా మాత్రం రాఖీ కాస్త సైలెంట్ అయిపోయింది. దానికి కారణం ఆమె అనారోగ్యం బారిన పడడమే. ప్రస్తుతం ఈ బ్యూటీ దుబాయ్లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఆ మధ్య శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ తన ఆరోగ్య విషయాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. (చదవండి: రొమాంటిక్ ఫొటోలతో ప్రియుడ్ని పరిచయం చేసిన బ్యూటీ)‘నాకు శస్త్ర చికిత్స జరిగిన విషయం వాస్తవమే. ఓ సారి వైద్యులు చెక్ చేసి గుండె పోటు లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వైద్య పరిక్షల అనంతరం నా గర్భాశయంలో 10 సెంటీ మీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని..లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. దీంతో నేను సర్జరీ చేయించుకున్నాను. కణితితో పాటు గర్భాశయాన్ని కూడా తొలగించారు. ఇక నేను తల్లిని కాలేనని వైద్యులు చెప్పడంతో ఏడ్చేశాను. నేను తల్లి అవ్వాలంటే.. సరోగసీ ద్వారా పిల్లలను పొందాల్సిందే’ అని రాఖీ సావంత్ ఎమోషనల్ అయింది. ఇక ఆస్పత్రిలో ఉన్నప్పుడు హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడని, తన మెడికల్ బిల్లులు మొత్తం ఆయనే కట్టేశాడని చెప్పింది. -
క్రికెటర్ ధోనీ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న ఏకైక సినీ హీరో
క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోనీ.. తలైవా, జార్ఖండ్ డైనమైట్, కెప్టెన్ కూల్, ద ఫినిషర్ ఇలా అభిమానులు ఆయన్ను పిలుచుకుంటారు. ప్రపంచ క్రికెట్లో ఆయన ఒక చరిత్రను సృష్టించాడు. 2011 ప్రపంచకప్, 2007 T20 ప్రపంచకప్ భారత్కు అందించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. నేడు (జులై 7) ధోని 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో బర్త్డే కేక్ని ధోనీ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి సాక్షితో పాటు బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు.శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహీ బర్త్ డే వేడుకల్లో సల్మాన్ ఖాన్తో పాటు సాక్షి పాల్గొన్నారు. మిస్టర్ కూల్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను ఆయన భార్య సాక్షి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. బర్త్ డే వేళ ధోనీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చెన్నై టీమ్ ఒక అద్భుతమైన వీడియోతో మహీకి బర్త్డే విషెష్ చెప్పింది. క్రికెట్ ప్రపంచంలో ధోనీ క్రియేట్ చేసిన రికార్డ్స్ను అభిమానులు మరోసారి గుర్తుచేస్తున్నారు. ఇలా నెట్టింట సందడిగా #HBDMSDhoni హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది.బర్త్డేలో సల్మాన్ మాత్రమేధోనీ ప్రస్తుతం అనంత అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా ముంబైలో ఉన్నాడు. ఈ క్రమంలోనే మహీ పుట్టినరోజు వేడుకల్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఒక ఫోటోను ఆయన పంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా హ్యాపీ బర్త్డే కెప్టెన్ సాహెబ్ అంటూ సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో భారీగా ట్రెండ్ అవుతుంది. ఒకే ఫ్రేమ్లో ఇద్దరు లెజెండ్స్ అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. బాలీవుడ్ బాప్, క్రికెట్ బాప్ కలిస్తే రచ్చే అంటూ మరోక నెటిజన్ తెలిపాడు. సోషల్మీడియాలో వారిద్దరి అభిమానులు 'డ్రీమ్ కమ్ ట్రూ' అంటూ తెగ సంబరపడిపోతున్నారు.ధోనీ కాళ్లకు నమస్కరించిన సతీమణిధోనీ భార్య సాక్షి సింగ్ ఒక వీడియో షేర్ చేసి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. కేక్ కట్ చేసిన ధోని మొదట తన సాక్షికి తినిపించాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్కు ధోనీ కేక్ తినిపించారు. ఈ క్రమంలో ధోనీ కాళ్లకు సాక్షి సింగ్ నమస్కరించింది. చాలా సరదాగా ఉన్న ఆ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. సల్మాన్, ధోనీ మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఇలా మరోసారి అభిమానులకు చూపించారు. ఇటీవల జూలై 6న జరిగిన ఆనంద్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత వేడుకలో వారిద్దరూ కలిసి కనిపించారు. View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r)This clip is going to break internet!Salman Khan × MS Dhoni ❤#HappyBirthdayMSDhonipic.twitter.com/HMeFiymdUo— ` (@WorshipDhoni) July 6, 2024 -
అనంత్ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన సంగీత్ ఫంక్షన్కు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ సంగీత్లో అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్ చేయడం అన్నింటికన్నా హైలైట్గా నిలిచింది. సినిమా తారలు తగ్గేదేలే అంటూ స్టేజీని రఫ్ఫాడించారు.బాలీవుడ్ జంట ఆలియా భట్-రణ్బీర్ కపూర్ డ్యాన్స్తో అదరగొట్టారు. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా వారితో కలిసి స్టెప్పులేశాడు. అటు సల్మాన్ ఖాన్, అనంత్తో కలిసి హిందీ పాటకు చిందేశాడు. లవ్ బర్డ్స్ జాన్వీ కపూర్-శిఖర్ పహారియా, మానుషి చిల్లర్, వీర్ పహారియా కలిసి డ్యాన్స్ చేశారు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన గాత్రంతో అదరగొట్టాడు. బేబీ, పీచెస్, లవ్ యువర్సెల్ఫ్ వంటి సాంగ్స్ ఆలపించాడు.ఈ ఫంక్షన్కు విక్కీ కౌశల్, మాధురి దీక్షిత్, అనన్య పాండే, సల్మాన్ ఖాన్, జెనీలియా దేశ్ముఖ్, రితేశ్ దేశ్ముఖ్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న ముంబైలో ఘనంగా జరగనుంది. జూలై 14న రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) Ranbir and Alia dancing along with Akash and shloka Ambani on “Show me the thumka” 🔥#RanbirKapoor #AliaBhatt pic.twitter.com/MiJsXO5cxI— ritika ❤️🔥 | L&W ERA (@ritikatweetssx) July 6, 2024 చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్ -
కమల్–సల్మాన్–ఓ సినిమా
హిందీలో షారుక్ ఖాన్తో ‘జవాన్’ తీసి, బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చల్లో భాగంగా అల్లు అర్జున్తో సినిమా చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా గురించి అధికారిక సమాచారం ఏదీ రాలేదు.కాగా అట్లీ ఓ మల్టీస్టారర్ మూవీ కథను రెడీ చేశారని, ఇందులో రజనీకాంత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రజనీకాంత్ ప్లేస్లో కమల్హాసన్ నటించనున్నారని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. సల్మాన్–కమల్ కాంబినేషన్లో అట్లీ దర్శకత్వంలోని సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. -
రూ. 25లక్షల ఒప్పందం.. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖలు చేసిన చార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సల్మాన్ ఖాన్ను హత్య చేసేందుకు కరుడుగట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర బయటపడింది. కాగా గత ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్లో ఆత్మహత్య చేసుకున్నాడు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ పన్వెల్ ఫామ్హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్కు వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.నిందిత మైనర్లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి పనిచేస్తున్నట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. -
కొత్త పెళ్లికూతురు సోనాక్షి ‘ఫ్యామిలీ’ విశేషాలు, సల్మాన్తో లింకేంటి?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (జూన్ 23, 2024న)న తన డ్రీమ్ బోయ్ జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. చాలా సింపుల్గా రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ ప్రముఖులందరూ తరలి వచ్చారు. అలాగే వీరి వెడ్డింగ్, రిసెప్షన్ వీడియోలు, ఫోటోలు నెట్టింట బాగా సందడి చేసాయి. రేఖ, కాజోల్ లాంటి సీనియర్ హీరోయిన్లతోపాటు ,సోనాక్షి తన అత్తమామలతో సన్నిహితంగా, ప్రేమగా మెలిగిన ఫోటోలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ క్రమంలో సోనాక్షి మెట్టినిల్లు, జహీర్ ఇక్బాల్ కుటుంబం, నేపథ్యం హాట్ టాపిక్గా నిలుస్తోంది. సోనాక్షి భర్త, నటుడు, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ జహీర్ ఇక్బాల్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ. అలాగే సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హాకు సన్నిహితుడైన ఇక్బాల్ రతాన్సీకి వ్యాపార పరిశ్రమలో మంచి పేరుంది. ప్రధానంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు చాలా సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే రతాన్నీ సల్మాన్కు 'పర్సనల్ బ్యాంకు' లాంటి వాడట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ వెల్లడించాడొక సందర్భంలో. 2011లో తీసుకున్న ఆయన అప్పు ఇంకా తీర్చలేదని, వడ్డీ కూడా లేదంటూ చెప్పుకొచ్చాడు. ఎవరీ రతాన్సీ?ముంబైకి చెందిన ఇక్బాల్ రతాన్సీ నగల వ్యాపారంతో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రవేశం లేనప్పటికీ అనేక సినీరంగ ప్రముఖులతో సంబంధాలు మాత్రం ఉన్నాయి. 2005లో స్టెల్మాక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. 2011 వరకు ఈ సంస్థలో డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో మరింత విస్తరించేలా బ్లాక్స్టోన్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించారు. ప్రస్తుతం దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు రతాన్సీ.ఇక్బాల్ రతాన్సీ సినిమా వ్యాపారం 2016లో సినిమా రంగంలోకూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఫిల్మ్ టూల్స్, లైట్స్ అండ్ గ్రిప్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కోవిడ్ సమయంలో జహీరో మీడియా అండ్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు.ఇక్బాల్ రతాన్సీ కుటుంబంరతాన్సీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు జహీర్ నటుడు కాగా మరో కుమారుడు, మొహమ్మద్ లోధా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఇక ఏకైక కుమార్తె సనమ్ రతాన్సీ. ఈమె స్టైలిస్ట్ , కాస్ట్యూమ్ డిజైనర్గా రాణిస్తోంది. సోనాక్షి వ్యక్తిగత స్టైలిస్ట్గా పేరొందింది.సల్మాన్ ఖాన్తో ఇక్బాల్ రతాన్సీ బంధంఇక్బాల్ , సల్మాన్ల స్నేహం మూడు దశాబ్దాలకు పైబడి కొనసాగుతోంది. కష్ట సమయాల్లో సల్మాకు ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలిచిన వారిలో రతాన్సీ ఒకరు. ఈ నేపథ్యంలో ఇక్బాల్ కుమారుడు జహీర్ను బాలీవుడ్లో నోట్బుక్ చిత్రంతో పరిచయం చేశాడు. అంతేకాదు ఇక్బాల్ రతాన్సీ వ్యాపారవేత్తగా రాణిస్తూనే, స్నేహితులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే ప్రియమైన స్నేహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. -
టైగర్తో జైలర్.. సెట్ చేస్తున్న టాప్ డైరెక్టర్
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది షారుఖ్ ఖాన్తో జవాన్ తీసి హిట్ కొట్టిన ఆయనకు బాలీవుడ్లో కూడా క్రేజ్ పెరిగింది. అయితే, ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఒక సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్తో అట్లీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.జవాన్ సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్లోనే ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు అట్లీ. ఈమేరకు వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్తో ఓ మల్టీస్టారర్ చేసేందుకు కథను కూడా ఆయన ఫిక్స్ చేశారట. అయితే, ఈ సినిమాలో సౌత్ ఇండియా టాప్ హీరోను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కథలో కీలకంగా ఉండే ఆ పాత్ర కోసం రజనీకాంత్ను ఎంపిక చేస్తే బాగుంటుందని అట్లీ కోరుతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం గురించి రజనీతో కూడా ఆయన చర్చలు జరిపినట్లు తెలిసింది. సన్పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు సూపర్స్టార్స్ను దృష్టిలో పెట్టుకొని అట్లీ కథను రెడీ చేశారట. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయట. వచ్చే ఏడాదిలో సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ఖాన్ ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్' విడుదలకు సిద్ధంగా ఉంటే.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రానున్న 'కూలీ' చిత్రీకరణ ప్రారంభించుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ల తర్వాత అట్లీ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం. -
సల్మాన్ రేస్లో లేరా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘రేస్’లో లేరా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘రేస్’ మూవీ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు (2008లో ‘రేస్’, 2013లో ‘రేస్ 2’, 2018లో ‘రేస్ 3’) వచ్చి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచాయి. దీంతో ఈ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘రేస్, రేస్ 2’ చిత్రాలకు అబ్బాస్–మస్తాన్ దర్శకత్వం వహించగా, ‘రేస్ 3’కి రెమో డిసౌజా దర్శకత్వం వహించారు.‘రేస్ 3’లో సల్మాన్ ఖాన్, అనీల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా కీలక పాత్రలు పోషించారు. 2018 రంజాన్ సందర్భంగా రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ‘రేస్ 4’ పై ఎలాంటి అప్డేట్ వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు నిర్మాత రమేశ్ ఎస్. తౌరానీ ఓ స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ– ‘‘రేస్’ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో చిత్రానికి ఇప్పటికే కథ సిద్ధంగా ఉంది. ఇందులో నూతన నటీనటులు ఉంటారు.‘రేస్ 4’లో సల్మాన్ ఖాన్ భాగమవుతాడా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. ఈ మూవీకి దర్శకుడు ఎవరన్నది కూడా ఇంకా నిర్ణయించలేదు. ఈ ఏడాది చివరికల్లా ఈ ్రపాజెక్ట్ సెట్స్పైకి వెళుతుంది’’ అన్నారు. మరి ‘రేస్ 4’లో సల్మాన్ భాగమవుతారా? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
సల్మాన్ ని చూసి బన్నీని పక్కన పెట్టిన అట్లీ..
-
రూ. 6300 కోట్లతో రిచెస్ట్ హీరోగా షారూఖ్ : మరి ఐకాన్ స్టార్ సంపద ఎంత?
బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. దశాబ్దాల కరియర్లో అనేక బ్లాక్ బ్లస్టర్లు, సూపర్హిట్ మూవీలతో బాక్సాఫీసు కలెక్షన్లలో దుమ్ము రేపి రారాజుగా నిలిచాడు. ఇటీవలి కాలంలో కొన్ని ఫ్లాప్ మూవీలు, సౌత్ సినిమా హవా ఉన్నప్పటికీ, 'జవాన్' ,పఠాన్' సినిమాల విజయవంతంతో షారుఖ్ ఖాన్ నికర విలువ గణనీయంగా పెరిగింది. అందుకే సంపాదనలో టాప్లో నిలిచాడు.ఇటీవల, IMDb డేటా సహాయంతో, ఫోర్బ్స్ భారతదేశంలోని టాప్ టెన్ ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తర ,దక్షిణ భారత నటీనటులు ఉన్నారు. ఈ జాబితాలో ఏకంగా 6300 కోట్ల నికర విలువో షారూఖ్ ఖాన్ టాప్లో నిలిచాడు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, రజనీకాంత్ వంటి ఇతర నటీనటులు ఈ జాబితాలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. షారూఖ్ కరియర్లో జవాన్, పఠాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.20000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ‘డుంకీ’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధించింది..ఇక ఈ లిస్ట్లో రూ. 2900 కోట్ల నికర సంపదతో స్టార్హీరో సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. సల్మాన్ చిత్రం ‘టైగర్ 3’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 466.63 కోట్లను వసూలు చేసింది.అక్షయ్ కుమార్ నికర విలువ దాదాపు 2500 కోట్లు ఉంటుందని అంచనా. 'OMG 2' కుమార్ అతిథి పాత్రను చూసింది , ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 221 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ నటుడు తరువాత చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్.'ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్1862 కోట్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచాడు. విజయ్ నికర విలువ దాదాపు రూ. 474 కోట్లుగా లెక్కించారు. రజనీకాంత్ నికర విలువ దాదాపు 430 కోట్లు. టాలీవుడ్కి సంబంధించి పుష్ప సినిమాతో కలెక్షన్ల సునామీ రేపిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నికర విలువ 350 కోట్లుగా ఉండగా, ప్రభాస్ నికర విలువ 241 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్ నికర విలువ రూ.196 కోట్లు. కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలతో 10వ స్థానంలో నిలిచారు. -
బన్నీ మూవీ పక్కన పెట్టి.. సల్మాన్ వైపు అట్లీ చూపు..
-
అల్లు అర్జున్ చేయాల్సిన మూవీ సల్మాన్ చేతికి!
దక్షిణాది డైరెక్టర్లకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళ దర్శకులు మురుగదాస్, అట్లీ లాంటోళ్లు అక్కడ హిట్స్ కొట్టారు. ఏఆర్ మురుగదాస్.. 'గజిని'తో సక్సెస్ అందుకోగా, అట్లీ 'జవాన్'తో వెయ్యి కోట్ల వసూళ్లు మూవీ తీశాడు. కాగా అట్లీ మరోసారి బాలీవుడ్పై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి అల్లు అర్జున్ హీరోగా ఇతడు మూవీ తీస్తాడని ప్రచారం జరిగింది. కాకపోతే ఇదే ఇప్పుడు సల్మాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)అల్లు అర్జున్తో కథా చర్చలు జరిగాయని, అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారని సమాచారం. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి సల్మాన్ ఎంటరయ్యాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇది సెట్స్పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
అదిరి పోయే ఫైట్స్ చేసేందుకు రెడీ అవుతున్న ‘సికందర్’
ముంబైలో అదిరి పోయే ఫైట్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు సికందర్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. ఇందులో సికందర్గా కనిపించనున్నారు సల్మాన్ ఖాన్. కాగా ఈ మూవీ చిత్రీకరణ ఈ నెల 18 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. తొలుత యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేలా సన్నాహాలు చేస్తున్నారు ఏఆర్ మురుగదాస్. ముంబై షెడ్యూల్ తర్వాత విదేశాల్లో ఓ భారీ షెడ్యూల్ను జరపాలని ప్లాన్ చేస్తోందట యూనిట్. సాజిద్ నడియాడ్ వాలా నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. -
సౌత్ సినిమాలో సల్మాన్ !.. ఏ హీరో సినిమాలో అంటే ?
-
సౌత్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ ప్రముఖ నటీనటులు ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారిస్తున్నారు. జాకీష్రాఫ్, సంజయ్దత్, బాబీ డియోల్ వంటి స్టార్ నటులు దక్షిణాదిలో విలన్గా లేదంటే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా దక్షిణాది తెరపై మెరవబోతున్నట్లు ఓవార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ తమిళ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్.దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ తన 23వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు బిజుమీనన్, తుపాకీ చిత్రం ఫేమ్ విద్యుత్ జమ్వాల్ ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్ అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ హిందీలో సల్మాన్ఖాన్ హీరోగా సిఖిందర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే సల్లూభాయ్ను తమిళంలో శివకార్తికేయన్తో చేస్తున్న చిత్రంలో అతిథి పాత్రలో నటింపజేస్తున్నట్లు టాక్. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ -
సల్మాన్ ఖాన్ ను చంపేందుకు తిరుగుతున్న గ్యాంగ్ స్టార్
-
టార్గెట్ సల్మాన్ ఖాన్.. విస్తుపోయే విషయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. వారిని ముంబై పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నిందితుల్లో ఒకరైన అనూజ్ థాపన్ కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా సల్మాన్పై నిఘా పెట్టింది. ముందే వార్నింగ్ ఇచ్చినట్లుగా సల్మాన్ ఖాన్ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సల్మాన్ ఎక్కడెక్కడ ఉంటాడో నిత్యం ఆయన కదలికలపై నిఘా పెట్టింది.కారుపై కాల్పులు జరిపేందుకు స్కెచ్సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సమయం నుంచి ముంబై పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. కేసులో దర్యాప్తు చేస్తుంటే పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ ఖాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమయ్యే ఏకే-47 తుపాకులను పాకిస్థాన్కు చెందిన ఒక గ్యాంగ్ నుంచి వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారట. వాటితో పాటు ఏకే-92, అధునాతనమైన ఆయుధాలను తెప్పించుకున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ కారులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులు జరపాలని స్కెచ్ వేశారట. ఒకవేళ ఆ అవకాశం కుదరకపోతే ఆయన ఉంటున్న ఫామ్హోస్లోకి చొచ్చుకుపోయి కాల్పులు జరపాలని బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ రచించిందట.కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో తాజాగా బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన నలుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ ఉన్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో పాటు ఆయన సోదరుడు అన్మోల్, గోల్డీబ్రార్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్కు చెందిన సుమారు 20 మంది పన్వేల్లో ఉన్న సల్మాన్ ఫామ్హోస్ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారు. వారందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ఖాన్కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఆయనపై దాడి చేసే ప్లాన్స్ వారు వేశారు కూడా.. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్లు వచ్చాయి. కృష్ణజింకలను వేటాడటం ద్వారా బిష్ణోయ్ల మనోభావాలను సల్మాన్ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. -
సికందర్కు విలన్ గా
సల్మాన్ ఖాన్ కు విలన్ గా నటుడు సత్యరాజ్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరిగేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్కు సత్యరాజ్ను తీసుకున్నారట మురుగదాస్.ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ టాక్. సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న ‘సికందర్’ వచ్చే ఏడాది రంజాన్కి విడుదల కానుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్ కూలీ మూవీలో అతడి స్నేహితుడి పాత్రలో సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్ టాక్. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’ సినిమాలో రజనీకాంత్, సత్యరాజ్ చివరిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్లీ 38 సంవత్సరాల తర్వాత ‘కూలీ’ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వేచి చూడాలి. -
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్ బాష్ను ఘనంగా నిర్వహించుకున్న లవ్బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఛలో ఇటలీ..ఈ ఏడాది మార్చిలో జామ్నగర్లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్కు ప్రయాణించే క్రూజ్లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్ అంబానీ , కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు. ( ఇదీ చదవండి: అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?)అలాగే రాధిక-అనంత్కు మంచి స్నేహితులు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి, పాపతో కలిసి ఎయిర్ పోర్ట్లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్ : రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా)కాగా అనంత్-రాధిక రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్లో ఉన్న వేదికకు చేరుకుంటుంది. -
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్
హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రారంభం కానుంది. జియో సినిమాలో ఇప్పటికే రెండు ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుని భారీగా అభిమానలను ఈ కార్యక్రమం సొంతం చేసుకుంది. ఓటీటీలో గత సీజన్కు మంచి ఆధరణ రావడంతో ఇప్పుడు సీజన్ 3 కోసం రంగం సిద్ధమైంది. జియో సినిమాలో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది చూసిన షోగా బిగ్ బాస్ సీజన్ 2 నిలిచిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3ను బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హిందీ బిగ్ బాస్కు సంబంధించిన అన్ని సీజన్లను సల్మాన్ ఖాన్ హోస్ట్గా కొనసాగిన విషయం తెలిసిందే. కానీ, సల్మాన్ ఖాన్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం గత నెలలో సల్మాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో భద్రతాపరమైన చిక్కులు ఎదురౌతాయని ఈ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ జూన్లో ప్రారంభమౌతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, హోస్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ఆ స్టార్ హీరో అమ్మాయిలను ఫూల్ చేస్తాడు.. జన్మలో పెళ్లి చేసుకోడు!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సల్మాన్ ఖాన్ హీరోయిన్లతో నడిపిన ప్రేమాయణాలకు లెక్కే లేదు. ఎంతోమంది ముద్దుగుమ్మలను బుట్టలో వేసుకున్న ఇతడు వారితో జీవితాన్ని కొనసాగించాలని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. అందుకే ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాడు. అయితే సల్మాన్ పెళ్లి చేసుకోడన్న విషయం తనకెప్పుడో తెలుసంటున్నాడు నటుడు మిథున్ చక్రవర్తి. తాజాగా ఓ షోలో సల్మాన్ తుంటరితనాన్ని వెల్లడించాడు.ఒక్క నిమిషం కూడాసల్మాన్ నన్ను ఎంతగానో అభిమానిస్తాడు. ఎక్కువ ప్రేమను పంచుతాడు. మేము కలిసున్నప్పుడైతే నా వెంటే తిరుగుతాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండలేడు. నేను పడుకున్నా సరే నిద్రలో నుంచి లేపి మరీ కబుర్లు చెప్తుంటాడు. ఓసారి సెయింట్ పీటర్స్బర్గ్లో రాత్రి రెండు గంటలకు షూటింగ్ ఉంది. నేను ఆ విషయం మర్చిపోయి గదిలో గడియ పెట్టి నిద్రపోయాను. సడన్గా కళ్లు తెరిచేసరికి అతడు నా ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. అతడు లోపలకు ఎలా వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వేం మనిషివిరా బాబూ అనుకుని లేచాను.పెళ్లి చేసుకోడుతనలో ఆ తుంటరితనం ఎక్కువగా ఉండేది. అతడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు.. అమ్మాయిలందరినీ ఫూల్ చేస్తాడు. నాకింకా పెళ్లవలేదు, తెలుసా అంటూ అమ్మాయిలతో మాట కలుపుతాడు. వాళ్లేమో.. ఇంత హ్యాండ్సమ్ సూపర్ స్టార్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రేమలో పడతారు. కానీ అతడు ఎన్నటికీ పెళ్లిపీటలెక్కడని నేను గ్యారెంటీ ఇస్తాను' అని మిథున్ చెప్పుకొచ్చాడు. -
సికందర్తో జోడీ
సికందర్తో జోడీ కట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.‘‘కొంతకాలంగా నా నెక్ట్స్ మూవీ ఏంటని అడుగుతున్నారు. ‘సికందర్’లో నటించనున్నాను. ఈ విషయాన్ని సర్ప్రైజ్గా ఫీలవుతారని అనుకుంటున్నాను. ‘సికందర్’లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ఇది ఆమె కెరీర్లో 25వ చిత్రమని తెలుస్తోంది. ఇక ‘సికందర్’ వచ్చే ఏడాది రంజాన్కి రిలీజ్ కానుంది. -
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
‘పుష్ప’ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. మిషన్ మజ్ను, గుడ్బై లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ మూవీ రష్మికకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అందులో ప్రేమతో హింసించే భర్తకు భార్యగా రష్మిక అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. యానిమల్ తర్వాత రష్మికకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది ఈ నేషనల్ క్రష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్ప్రైజ్. ‘సికందర్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని రష్మిక తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో రాసుకొచ్చింది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమలేఖ వైరల్ అవుతోంది. అవును మీరు విన్నది నిజమే. 'నేను ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను' అని సల్మాన్ చేతిరాతతో రాసిన లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిపోయింది. అసలు ఇంతకీ ఈ లేఖ ఎవరికీ రాశారు? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో సల్మాన్ ఖాన్.. దాదాపు మూడు-నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పట్లో 'ప్రేమ పావురాలు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచాడు. ఇప్పుడు మాత్రం కేవలం హిందీ చిత్రాలే చేస్తున్నాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి సల్మాన్ వార్తల్లో నిలుస్తున్నాడు. సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం అనేది షాకింగ్గా అనిపించింది.సరే ఇదంతా పక్కనబెడితే 'మైనే ప్యార్ కియా'(ప్రేమ పావురాలు) సినిమా రిలీజ్ తర్వాత.. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం సల్మాన్ స్వయంగా ఓ లేఖ రాశాడు. ఇప్పుడదే మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే.. 'నన్ను అంగీకరించినందుకు, ప్రేమించినందుకు థ్యాంక్స్. ఇక నుంచి ఏ సినిమా చేసినా 'మైనే ప్యార్ కియా'తో పోలుస్తారని తెలుసు. కాబట్టి మంచి సినిమా చేయాలనే నా ప్రయత్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను-మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం మానేసిన రోజు.. నేను సినిమాలు చేయడం ఆపేస్తాను. అది నా కెరీర్కి ముగింపు అవుతుంది' అని సల్మాన్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) -
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ లాకప్లో ఉన్న నిందితుడు అనుజ్ థాపన్.. బుధవారం ఉదయం 11 గంటలకు లాకప్ గదిలో వాష్రూమ్కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అధికారులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. పంజాబ్కు చెందిన అనూజ్ను ఏప్రిల్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా గత నెల 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ అధికారులు.. నిందితులు, విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. వీరితోపాటు నిందితులకు ఆయుధాలు అందించిన అనుజ్ థాపన్, సుభాష్ చందర్లను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిలో ఒకడైన అనూజ్ తపన్ బుధవారం బలవనర్మణానికి పాల్పడ్డాడు.అయితే అనుజ్తోపాటు మరో పదిమంది అదే లాకప్లో ఉన్నారని, నలుగురు నుంచి అయిదుగురు పోలీసులు నిత్యం వీరిని గమనిస్తూ ఉంటారని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందనిప్పారులాకప్లో వ్యక్తి మరణిస్తే హత్య కేసుగా పరిగణిస్తారని, పోలీస్ స్టేషన్లోని పోలీసులందరినీ సీఐడీ ప్రశ్నిస్తుందని అని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే జైన్ చెప్పారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ఏ వస్తువు అందుబాటులో ఉండకుండా పోలీసులు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తుంటారని పేర్కొన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు లాకప్ వద్ద నిత్యం గస్తీ కాస్తుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా నలుగురు నిందితులు జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది. -
నన్ను అంత మాటన్నారు.. ఏడ్చేసిన నటుడు
ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. చాలామంది ఇక్కడ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరే సఫలీకృతులవుతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లిని పెళ్లాడిన ఆయుష్ శర్మ కూడా నటుడిగా ప్రయత్నించాలనుకున్నాడు. లవ్ యాత్రి అనే సినిమా చేశాడు. దీన్ని సల్మాన్ ఖాన్ నిర్మించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆయుష్ మీద విమర్శల వర్షం కురిసింది. ఆయుష్కు బదులుగా ఓ కుక్కను పెట్టి సినిమా తీయాల్సిందని తీవ్రంగా ట్రోల్ చేశారు.నానా మాటలు..తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు ఆయుష్. 'నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలనుకున్నాను. కానీ ఆరోజు నా గురించి చాలా చెత్తగా మాట్లాడారు. ఆ సినిమా రిలీజైన రోజు నానా మాటలన్నారు. నన్ను కుక్కతో పోల్చారు. రేపు పొద్దున నా కుమారుడు పెద్దయ్యాక ఈ వార్త చదివితే నా పరిస్థితి ఏంటి? నా కూతురు.. మా నాన్న ఒక శునకం అని ఉన్న వార్తలు చూస్తే నేనేం కావాలి? వాళ్లు తండ్రి గురించి మంచి విషయాలు తెలుసుకోవాలి..నన్ను శునకంతో పోల్చారునన్ను చూసి గర్వంగా ఫీలవ్వాలి. ఒక మీడియా అయితే ఆయుష్ శర్మ ఒక కుక్క అని రాసేసింది. కానీ వాళ్లకు నేనిప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నన్ను అవమానించడం వల్లే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను' అని ఎమోషనలయ్యాడు. కాగా ఆయుష్.. తర్వాత సల్మాన్తో అంతిమ్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇది హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు నటించిన రుస్లాన్ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది.చదవండి: అభిషేక్ అగర్వాల్ నుంచి ‘ది ఢిల్లీ ఫైల్స్ ’ .. రిలీజ్ ఎప్పుడంటే? -
స్టార్ హీరో ఇంటికెళ్లిన సీఎం.. !
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈనెల 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లోని భుజ్లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. #WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9 — ANI (@ANI) April 16, 2024 #WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde met actor Salman Khan at his residence. Inside visuals from the residence. (Source: Eknath Shinde office) pic.twitter.com/lbMmfCOBNm — ANI (@ANI) April 16, 2024 -
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్వాప్తులో వేగం పెంచారు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లోని భుజ్లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు తాజాగా వెళ్లడించారు. షూటర్లు ఇద్దరూ బీహార్లోని పశ్చిమ చంపారన్కు చెందినవారని పోలీసులు తెలిపారు. గతంలో వారిద్దరిపై చాలా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో దొంగతనాలు కూడా చేసినట్లు ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. దొంగతనాలు చేస్తున్న క్రమంలో హత్యలు కూడా చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఏప్రిల్ 14న కాల్పులు జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పదికి పైగా టీమ్లుగా విడిపోయి కేసును ఛేదించారు. వారిద్దరిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని వారు తెలిపారు. -
కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్ ఖాన్కు వార్నింగ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. కాల్పులు జరిగిన ఘటనలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి సమాచారం అందినట్లు వెళ్లడించారు. సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోపు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తుపెట్టుకో. తప్పకుండా మా టార్గెట్ రీచ్ అవుతాం.' అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ ఖాన్కు ఇలాంటి బెదిరింపులు ఇప్పటికే పలుమార్లు వచ్చాయి. గతంలో ఈమెయిల్స్ ద్వారా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో గొడవేంటి..? ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి సల్మాన్ఖాన్కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్లు వచ్చాయి. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా బిష్ణోయ్ల మనోభావాలను సల్మాన్ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్ ఢిల్లీ జైలులో ఉన్నాడు. दाउद इब्राहीम और छोटा शकील के नाम के हमने दो कुत्ते पाल रखे हैं - अनमोल विश्नोई (लॉरेंस के भाई का पोस्ट)#LawrenceBishnoi #DawoodIbrahim #SalmanKhan #AnmolBishnoi #ChotaShakeel #BJPManifesto pic.twitter.com/oj2sTHRlK8 — Nisha A (Modi's family) (@matribhumi1st) April 14, 2024 -
ఇండస్ట్రీలో కలకలం.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గతంలో గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్ టెన్ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. #WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning. Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J — ANI (@ANI) April 14, 2024 -
పైసా సంపాదన లేదు.. అయినా సల్మాన్ చెల్లితో పెళ్లి చేశారు!
బాలీవుడ్లోని బడా కోటీశ్వరుల్లో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ సింపుల్గా ఉండటానికి ఇష్టపడే ఇతడికి వేలకోట్ల ఆస్తులున్నాయి. కానీ అతడి చెల్లి అర్పితఖాన్కు పెళ్లి చేసేటప్పుడు మాత్రం బావ సంపాదిస్తున్నాడా? లేదా? అని కూడా చూసుకోలేదు. చెల్లిని గుండెలో పెట్టి చూసుకుంటే చాలనుకున్నాడు. అలా లవ్ బర్డ్స్ అర్పిత ఖాన్, ఆయుశ్ శర్మ పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. అమ్మాయిని ఎలా పోషిస్తావు? అయితే అర్పితను పెళ్లాడే సమయానికి ఆయుశ్ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నేను అర్పితను ప్రేమిస్తున్నానని చెప్పగానే అమ్మానాన్న షాకయ్యారు. నువ్వు ఏ పనీ చేయడం లేదు.. పైసా సంపాదించట్లేదు.. పెళ్లికి మాత్రం సిద్ధమయ్యావు. పైగా ఆమె ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావు? అని అడిగారు. నేనేం పోషించను.. అంతా మీరే చూసుకోవాలని చెప్పాను. అమ్మ తెగ కంగారు ప్రేమలో పడింది నువ్వు, పెళ్లి చేసుకునేది నువ్వు.. కానీ మీ బిల్లులు మాత్రం నేను కట్టాలా? అని నాన్న చిన్నగా కోప్పడ్డాడు. తర్వాత ఆయన రిలాక్స్ అయ్యాడు కానీ అమ్మ మాత్రం తెగ కంగారుపడిపోయింది. ఎందుకంటే నాదేమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ (కాంగ్రెస్ కీలక నేత పండిత్ సుఖ్ రామ్ మనవడే ఆయుశ్).. తనదేమో సినిమా బ్యాక్గ్రౌండ్. ఎలాగోలా వారిని ఒప్పించి సల్మాన్ ఖాన్ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాను. కంగారు పడొద్దని సల్మాన్ భరోసా అప్పుడు నాన్న.. 'మేమంతా హిమాచల్ ప్రదేశ్లోని మండిలో నివసిస్తాం.. ఒకవేళ తప్పని పరిస్థితులు ఎదురైతే నువ్వు అక్కడికి రాగలవా?' అని అర్పితను అడిగాడు.. అందుకు సల్మాన్.. ఆయుశ్ ఎక్కడంటే అర్పిత అక్కడే ఉంటుంది. ఈ విషయంలో మీరేం కంగారుపడకండి అని భరోసా ఇచ్చాడు' అని తెలిపాడు. ఆయుశ్-అర్పిత జంటకు అయత్ అనే కూతురు, అఖిల్ శర్మ అనే కుమారుడు సంతానం. చదవండి: ఎంతగానో ప్రేమిస్తే.. నన్ను మోసం చేశాడు.. ప్రతిరోజూ ఏడుపే! -
Bobby Deol His Wife Photos: యానిమల్ విలన్కు ఇంత అందమైన భార్య ఉందా..! (ఫోటోలు)
-
సల్మాన్ బ్రదర్ ఇంట ఈద్ పార్టీ.. ఏదీ ఓసారి టచ్ చేసి చూడు! (ఫోటోలు)
-
సల్మాన్ ఖాన్ సికందర్
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘సికందర్’ టైటిల్ ఖరారైంది. గురువారం (ఏప్రిల్ 11) ఈద్ సందర్భంగా ‘సికందర్’ టైటిల్ను అధికారికంగా ప్రకటించి, టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు మేకర్స్. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్కు రిలీజ్ కానుంది. ‘‘ఈ ఈద్కు ‘బడే మియా చోటే మియా’, ‘మైదాన్’ సినిమాలను థియేటర్స్లో చూడండి. వచ్చే ఈద్కు ‘సికందర్’ వస్తాడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు సల్మాన్ ఖాన్. -
Kriti Sanon Latest Photos: ఆ హీరోతో సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది
-
నాలుగేళ్ల లవ్కు బ్రేకప్.. సినిమాకు ఒప్పుకోరేమోనని టెన్షన్!
ప్రేమలో ఉన్నంతసేపు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమంటారు. బ్రేకప్ అయ్యాక ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం చాలా ప్రొఫెషనల్. సినిమా కోసం పర్సనల్ విషయాలను పక్కనపెట్టి కలిసిపోయారు, కేవలం సెట్స్లోనే! సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పుడు ప్రేమపక్షులన్న విషయం తెలిసిందే! అయితే సల్మాన్ ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు, కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అలాగే కత్రినాతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అసౌకర్యంగా ఉంటుంది అది జరిగిన కొంతకాలానికే డైరెక్టర్ కబీర్ ఖాన్ 'ఏక్ థా టైగర్' సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కానీ ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ వల్ల ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారో, లేదోనని తెగ టెన్షన్ పడ్డాడు. దాని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కత్రినా, నాకు ఇంట్లో మనిషిలా అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పగానే వెంటనే సంతకం చేసింది. తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లాం. అసలే బ్రేకప్ అయింది. అలాంటి సమయంలో కలిసి పని చేయాలంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. కత్రినా అని తెలిసి కూడా ఆయన ఒప్పుకుంటాడో, లేదోనని టెన్షన్ పడుతూనే తన ఇంటికి వెళ్లాం. హీరోయిన్గా కత్రినాను సెలక్ట్ చేశాం అని చెప్పాను. 5-10 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత సరే చేసేద్దాం అన్నారు. మా గుండె నుంచి పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు. కాగా సల్మాన్- కత్రినా నాలుగేళ్లపాటు డేటింగ్ చేశారు. 2009లో విడిపోయారు. తర్వాత కత్రినా రణ్బీర్ కపూర్తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం కూడా నిలవలేదు. వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నాక విక్కీ కౌశల్ను లవ్ చేసింది. 2021లో వీరు పెళ్లి చేసుకున్నారు. చదవండి: పదేళ్ల క్రితం ఆశపడ్డాడు.. చివరికి అది నెరవేరకుండానే.. -
Salman khan: ఫైటింగ్కి రెడీ అయిన సల్మాన్ ఖాన్!
మేలో యాక్షన్ స్టార్ట్ చేయనున్నారు సల్మాన్ ఖాన్. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించనున్న సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ చిత్రీకరణ మేలో ముంబైలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. ముందుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్. ఈ సినిమాలోఅదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఓ సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల మురుగదాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్న ఈ చిత్రం 2025 రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. -
అంబానీకి స్టార్ హీరో ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?
అంబానీ ఇంట సెలబ్రేషన్స్ అంటే మాటలా.. దేశమంతా ఈ ఫ్యామిలీ వేడుకలను చూసి నోరెళ్లబెడుతోంది. ప్రీవెడ్డింగ్ కోసమే వెయ్యి కోట్లపైనే ఖర్చు చేయడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలంతా గుజరాత్లోని జామ్నగర్లోనే రెండు, మూడు రోజులపాటు సెటిలయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పనులన్నీ పక్కనపెట్టి ఈ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఆటపాటలతో అలరించారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అంబానీ ఫ్యామిలీకి చాలా క్లోజ్. అనంత్ అంబానీ- సల్మాన్ మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. అందుకే ప్రీవెడ్డింగ్కు సైతం సల్లూభాయ్ ఓ గిఫ్ట్ పట్టుకెళ్లాడట! అనంత్ కోసం ప్రత్యేకంగా ఓ వాచ్ తయారు చేయించాడట. దాని విలువ కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్కు డైమండ్ ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చాడట. ఇది చూసిన కొందరు అంబానీకి ఆ గిఫ్ట్స్ ఏం సరిపోతాయని సెటైర్లు వేస్తున్నారు. అయినా అంబానీకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటే వారి మధ్య స్నేహం మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: పెళ్లికి రెడీ అయిన కిరణ్ అబ్బవరం! ఆ హీరోయిన్తో ఏడడుగులు? -
బాలీవుడ్ స్టార్ చాలా ఎక్కువ తింటాడు.. శునకంలా..: నటుడు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నటుడు విందు దార సింగ్ కాలేజీ నుంచే స్నేహితులు. చదువుకునేరోజుల్లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తాజాగా అతడు సల్మాన్ గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టాడు. విందు మాట్లాడుతూ.. నా శరీరాకృతి చూశాక సల్మాన్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడని చెప్తుంటాడు. కానీ చాలా ఎక్కువ సేపు జిమ్లోనే గడుపుతాడు. తిండి విషయంలోనూ ఇంతే.. పందిలా తింటాడు.. కుక్కలా ఎక్సర్సైజ్ చేస్తాడు. చాలా తింటాడు.. అంతే కష్టపడతాడు అతడు చాలా ఎక్కువ తింటాడు. తిన్నదంతా ఎక్కడికి పోతుంది? అని అడిగితే.. ఎక్సర్సైజ్ ద్వారా ఆ తిన్నదంతా కరిగించేస్తానంటాడు. తను చాలా అద్భుతమైన వ్యక్తి. అతడంటే నాకెంతో ఇష్టం. తనది మంచి మనసు. సాయం చేసే గుణం కూడా ఉంది. అతడి తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ప్రతిరోజూ సల్మాన్కు డబ్బులిచ్చేవాడు. డబ్బులు ఉంచుకోడు ఆ డబ్బును ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చేవాడు. రూ.50 వేలిచ్చినా, లక్ష రూపాయలిచ్చినా సరే దాన్ని పేదలకు దానం చేసేవాడు. ఇప్పటికీ అతడు అలాంటి దానధర్మాలెన్నో చేస్తాడు. నెలకు దాదాపు రూ.25- 30 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఇప్పటికీ తన పాకెట్మనీ తండ్రి దగ్గరే వసూలు చేస్తాడు. కానీ తన దగ్గర మాత్రం ఉంచుకోడు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: శరత్బాబుతో ప్రేమలో పడ్డా.. నేను చెడిపోయినా పర్వాలేదని లొంగిపోయాను -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్చరణ్కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
సందడి సందడిగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (ఫొటోలు)
-
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్నగర్లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్లోని జామ్నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
సినిమా చూసి సెల్యూట్ కొడతారు
‘‘మన సైనికుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. మనందరికీ దేశభక్తి ఉంటుంది.. కానీ, మా సినిమా చూశాక అది మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ ట్రైలర్ను హీరో సల్మాన్ ఖాన్, తెలుగు ట్రైలర్ను హీరో రామ్చరణ్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మన దేశంలో సినిమా పెద్ద వినోద సాధనం. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరూ ముందు సినిమావైపు వెళ్తారు. అందుకే ప్రేక్షకులు ఖర్చు పెట్టే టిక్కెట్ డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. చాలా కొత్తగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసే చాలా సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమాని చాలా గర్వంగా, గుండెల నిండా దేశభక్తితో చూసి మన సైనికులకు సెల్యూట్ కొడతారు’’ అన్నారు. ‘‘యాక్షన్, ఫన్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు శక్తి ప్రతాప్. -
మురుగదాస్ ను పిలిచి సినిమా ఆఫర్ ఇచ్చిన సల్మాన్..?
-
తమ్ముడి రెండో పెళ్లి.. నా మాట ఎప్పుడు విన్నాడని?: సల్మాన్
ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలా? ఇదేం ప్రశ్న అనుకునేరు.. చాలామంది ప్రేమలో పడుతున్నారు.. కానీ ఎక్కువకాలం కొనసాగలేక బ్రేకప్ చెప్పుకుంటున్నారు. చివరాఖరకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రమే ఆ ప్రేమను పెళ్లితో పవిత్రబంధంగా మార్చుకుంటున్నారు. అయితే బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ మాత్రం షాదీ చేసుకునేదే లేదంటున్నాడు. అందుకే 58 ఏళ్ల వయసొచ్చినా సింగిల్గానే ఉంటున్నాడు. అతడి తమ్ముడిది ఇంకో దారి! 56 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లి ఐటం సాంగ్ హీరోయిన్ మలైకా అరోరాను పెళ్లాడిన ఇతడు కొడుకు పుట్టాక ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. 56 ఏళ్ల వయసులో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్తో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా గతేడాది చివర్లో నిఖా చేసుకున్నాడు. ఆదివారం నాడు(జనవరి 29న) సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్బాస్ 17వ సీజన్ గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కమెడియన్ భారతీ సింగ్.. పెళ్లికి తననెందుకు పిలవలేదని నిలదీసింది. ఇంకెక్కడ పెళ్లి? ఇందుకు అర్బాజ్.. నెక్స్ట్ పెళ్లికి పిలుస్తానులే అని సరదాగా వ్యాఖ్యానించాడు. 'తమ్ముడి పెళ్లిపై నీ రియాక్షన్ ఏంటి? నువ్వు ఎలాంటి సలహాలిచ్చావు?' అని సల్మాన్ను ప్రశ్నించింది లేడీ కమెడియన్. అందుకు సల్లూభాయ్ స్పందిస్తూ.. 'అతడు నా మాట ఎప్పుడు విన్నాడని? నా మాటలు విని ఉంటే..' అని మధ్యలోనే ఆపేశాడు. దీంతో అర్బాజ్ తన ప్రేమ-పెళ్లి వ్యవహారాల్లో సొంత అన్న మాట కూడా వినడని అర్థమైంది.ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు సల్మాన్ బదులిస్తూ.. 'ఇంకెక్కడ పెళ్లి.. నా జీవితంలో ఆ ముచ్చట ఉండదు' అని తేల్చేశాడు. ఇకపోతే బిగ్బాస్ 17వ సీజన్లో మునావర్ ఫరూఖి విజేతగా నిలిచాడు. age dekhiye #BB17 main hone walah hai #BhartiSingh comedy with #sohail & #arbaazkhan . AND MILEGA TOP 3 SE TOP 2 of #BB17Finale . . HBD KING MUNAWAR Follow Me 🙏 #BB17Finale #MunawarFaraqui𓃵 #BB17 #MKJW #MunwarKiJanta #MannaraFam pic.twitter.com/hZgYJxSGBs — LiveKhabri❄ (@theLiveKhabri) January 28, 2024 చదవండి: భార్యతో స్టార్ హీరో డ్యాన్స్.. ఆప్యాయంగా ముద్దాడుతూ.. -
జైలు జీవితం నుంచి 'బిగ్ బాస్' విన్నర్గా నిలిచిన కమెడియన్
హిందీ, కన్నడ బిగ్ బాస్ సీజన్స్ రియాల్టీ షోలు ఒకే రోజు ముగిశాయి. కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 విజేతగా కార్తీక్ మహేష్ నిలుస్తే.. హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ట్రోఫీని స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ గెలుచుకున్నాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ ఎపిసోడ్కు ముఖ్య అతిథిగా నటుడు అజయ్ దేవగన్ హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్కు హాస్ట్గా ఉన్న విషయం తెలిసిందే. పోటీలో చివరిగా మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ అభిషేక్ కుమార్, మునావర్ ఫారూఖీల చేతులు పట్టుకుని స్టేజీపైకి సల్మాన్ వచ్చారు. ఎంతో ఉత్కంఠతకు దారితీసిన ఫైనల్ ఎపిసోడ్లో 'విజేత' మునావర్ ఫరూఖీని సల్మాన్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విజేతగా నిలిచిన మునావర్ ఫరూఖీకి రూ.50 లక్షల డబ్బుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. ఆకర్షణీయమైన ట్రోఫీని అందుకున్న మునావర్ ప్రేక్షకుల వైపు చూపిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్ విన్నర్ అతనే అని చాలామంది అభిప్రాయపడ్డారు. అందరూ అనుకుంటున్నట్లే ఆయన విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. జైలు జీవితం నుంచి బిగ్ బాస్ విజేతగా పయనం మునావర్ ఒక కార్యక్రమంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ గతంలో బీజేపీ ఎంపీ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుజరాత్కు చెందిన మునావర్ ఫరూఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయన చివరకు బెయిల్ మీద విడుదల అయ్యాడు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోస్ట్ చేసిన రియాలిటీ టీవీ షో 'లాక్ అప్' 2022 సీజన్లో మునావర్ ఫరూఖీ విన్నర్గా నిలిచాడు. తాజాగా ఆయన బిగ్బాస్ సీజన్లో కూడా విన్నర్గా గెలవడంతో ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. ఈ సీజన్లో కామెడీతో పాటు చమత్కారంతో ప్రేక్షకులను మెప్పించిన మునావర్.. 17 మందిలో విజేతగా నిలిచాడు. ఐదో స్థానంలో హైదరాబాద్ యూట్యూబర్ బిగ్ బాస్ 17వ సీజన్లో హైదరాబాద్ యువకుడు అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి ఐదో స్థానంలో నిలిచి మెప్పించాడు. శ్రీకాంత్ యూట్యూబర్గా రానిస్తున్నాడు. సీజన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఇతగాడు బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. The moment #MunawarFaraqui𓃵 became the winner Of #BB17 🎉🔥 even He also Shared His trophy with #AbhishekKumar 😍💞 Dosti ho Toh #MunAbhi jaisa MUNAWAR THE DEFINITE WINNER HBD KING MUNAWAR Follow Me 🙏 #BB17Finale #MunawarFaraqui𓃵 #BB17 #MKJW #MunwarKiJanta pic.twitter.com/wClV3YSt6j — LiveKhabri❄ (@theLiveKhabri) January 28, 2024 -
ఆ హీరో సడన్గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ
మైనే ప్యార్ కియా(తెలుగులో ప్రేమ పావురాలు) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది భాగ్యశ్రీ. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. ఆ మధ్య ప్రభాస్ రాధేశ్యామ్, బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ మూవీ ఛత్రపతిలోనూ కనిపించింది. తాజాగా ఈ నటి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అందువల్ల స్కూల్లో చదువుకునే రోజుల్లో మా క్లాస్లో అబ్బాయిలతో మాట్లాడేదాన్నే కాదు. కానీ అనుకోకుండా హిమాలయ దస్సానీతో ప్రేమలో పడ్డాను. మా ప్రేమ విషయం నాన్నకు ఎక్కడ తెలిసిపోతుందో? తను ఎలా స్పందిస్తాడో? అని టెన్షన్ పడేదాన్ని. ఊటీలో షూటింగ్.. ఆ రోజు సినిమాల్లోకి వచ్చేంతవరకు కూడా అది సీక్రెట్గానే ఉంచాను. మైనే ప్యార్ కియా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నా విషయం సల్మాన్కు తెలిసింది. ఆ తర్వాత మేము దిల్ దీవానా బిన్ సజ్నాకే సినిమా చేశాం. ఈ మూవీ షూటింగ్ కోసం ఊటీలో నెలరోజులపాటు ఉన్నాం. అప్పుడు సల్మాన్ వచ్చి నా చెవిలో పాట పాడాడు. పదేపదే ఏదో గుసగుసలాడుతున్నట్లుగా దగ్గరకు వచ్చి పాటలు పాడుతూనే ఉన్నాడు. అంతకుముందెన్నడూ అలా ప్రవర్తించలేదు. ఇతడేంటి? నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడు? తనకిది సరదాగా ఉందా? అని చిరాకెత్తుకొచ్చింది. హీరోను తిట్టేశా.. తనను పక్కకు తీసుకెళ్లి ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు.. బుద్ధిగా నడుచుకో అని చెప్పాను. అప్పుడతడు నీ ప్రేమ విషయం తెలిసిపోయిందిలే, అందుకే ఆటపట్టిస్తున్నా అన్నాడు. నీ ప్రియుడిని సెట్స్కు పిలువు.. ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలా హీరో అండతో దస్సానీని కలుసుకుని మాట్లాడేదాన్ని. అందరూ అతడిని సల్మాన్ ఫ్రెండ్ అనుకున్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా భాగ్యశ్రీ.. 1990లో హిమాలయ దస్సానీని పెళ్లాడింది. వీరికి అవంతిక, అభిమన్యు సంతానం. చదవండి: ఆ బుజ్జిని గుర్తుపట్టారా? ఈమె మిడిల్ క్లాస్ మదర్! -
బిగ్ బాస్ చరిత్రలోనే ఇది దారుణమైన టాస్క్.. వీడియో వైరల్
హిందీ బిగ్ బాస్ 17 దాదాపు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం 95 రోజుకు ఈ సీజన్ చేరుకుంది. తాజాగా చివరి నామినేషన్ ప్రక్రియ జరిగింది. తెలుగులో మాదిరి కాకుండా వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక టాస్క్ ఇచ్చి నామినేషన్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. ప్రస్తుతం హౌస్లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిని రెండు గ్రూపులుగా విభిజించి టాస్క్లు పెట్టాడు. టాప్-5 లిస్ట్లో ఉంటారని అనుకున్న వారిలో నలుగురిని ఒక టీమ్లో బిగ్ బాస్ ఉంచాడు. ఆ నలుగురిని కూడా రెండు జంటలుగా ఉంచాడు. మున్నావర్, అరుణ్, అభిషేక్, మన్నారా చోప్రా గ్రూపు-Aలో ఉన్నారు. అంకిత, ఇషా,విక్కీ, ఆయేషా ఈ నలుగురు గ్రూప్-Bలో ఉన్నారు. గ్రూప్-ఏ వాళ్లు అందరూ దాదాపు టాప్-5 రీచ్ అయ్యే కంటెస్టెంట్లు.. గ్రూప్ -బీ సభ్యుల్లో ఉన్న విక్కీ, ఆయేషా ఎలిమినేట్ అవడం దాదాపు ఖాయం అయిపోయింది.. దీంతో ఎలాగైనా చివరి వారం ఎలిమినేషన్ తప్పించుకుంటే ఫైనల్ రేసులోకి ఎంట్రీ ఇవ్వచ్చు అని తాజాగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్లో విక్కీ, అయేషా చాలా ఎక్స్ట్రీమ్కు వెళ్లారు. దీంతో మన్నారా చోప్రా, అభిషేక్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చివరి వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గేమ్లో భాగంగా అక్కడ ఒక బజర్ను బిగ్ బాస్ ఏర్పాడు చేశాడు. ఆ బజర్ను నొక్కి పట్టుకున్నంత సేపు అక్కడ ఒక లైట్ వెలుగుతుంది. బజర్ నుంచి చెయి తీసేస్తే ఆ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఎవరు ఎంత సమయం పాటు బజర్ను నొక్కి పట్టుకుంటారనేది టాస్క్... ఆ సమయంలో ఆపోజిట్ టీమ్ వాళ్లు పలు ఇబ్బందులు క్రియేట్ చేవయవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. అక్కడ గెలుస్తే టాప్-5 వెళ్తారు.. లేదంటే నామినేషన్ లిస్ట్లో ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు. గేమ్లో భాగంగా మొదట గ్రూప్-ఏ నుంచి మన్నారా చోప్రా, అభిషేక్ జోడీగా టాస్క్ ప్రారంభిస్తారు. వీరిద్దరూ కూడా టాప్ -5 లిస్ట్లో దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. వీరిద్దరూ జోడీగా బజర్ను నొక్కి పట్టుకుంటారు. ఆ సమయంలో వారిని ఇబ్బంది పెట్టేందుకు గ్రూప్- బీ నుంచి విక్కీ, అయేషా వస్తారు. వారిద్దరూ టాప్ -5 రేసులో లేరు.. చివరి వారంలో దాదాపు ఎలిమినేట్ అవడం ఖాయం అని వారికి కూడా తెలుసు. దీంతో ఎలాగైనా ఈ టాస్క్ గెలిచి టాప్-5లో చేరిపోవాలని వారిద్దరూ విచక్షణ కోల్పోయి టాస్క్లో ఎక్స్ట్రీమ్కు చేరుకుంటారు. బజర్ మీద చెయి పెట్టి ఉన్న మన్నారా చోప్రా, అభిషేక్ ముఖం మీద ఏకంగా కారం పొడి, కిచెన్లో ఉన్న మసాల పొడులు తీసుకొని వచ్చి పూస్తారు. అంతటితో ఆగకుండా నీటిలో కారం పొడి కలిపి వారి మొఖం మీద కొడుతారు. ఆ సమయంలో వారిద్దరూ అల్లాడిపోయారు. అలా సుమారు 29 నిమిషాల పాటు వారు భరించి బజర్ మీది నుంచి చేతిని తీసేస్తారు. చివరకు వారిద్దరూ మెడికల్ రూమ్కు వెళ్లి చికిత్స పొందారు. కొన్ని గంటల తర్వాత ఆగిపోయిన గేమ్ మళ్లీ ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో విక్కీ, అయేషా ఎలా విచక్షణ కోల్పోయి కారం పొడి చల్లారో ఆ వీడియోను టీవీలో బిగ్ బాస్ చూపిస్తాడు. అప్పుడు బిగ్ బాస్ గ్రూప్-A వారికి ఒక ఆఫర్ ఇస్తాడు.. మీరు కూడా ఇలాగే కారం పొడి కొట్టి గేమ్ అడుతారా..? లేదా గ్రూప్ -B వారిని డైరెక్ట్గా నామినేట్ చేస్తారా..? అని అడుగుతాడు.. అప్పుడు గ్రూప్ ఏ వారు తాము ఈ గేమ్ ఆడలేమని చెప్పి గ్రూప్ బీ వారిని డైరెక్ట్గా నామినేట్ చేయమని బిగ్ బాస్ను కోరుతారు. దీంతో అంకిత, ఇషా, విక్కీ, ఆయేషా ఈ వారం నామినేషన్ లిస్ట్లో ఉన్నారు. విచక్షణ కోల్పోయి గేమ్ ఆడిన ఆయేషా, విక్కీ పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చర్య జరుగుతుంటే ఆపాల్సింది పోయి గేమ్ను కొనసాగించడం ఏంటి..? అని బిగ్ బాస్ టీమ్ పట్ల కూడా వారు ఫైర్ అవుతున్నారు. ఈ శనివారంలో హౌస్ట్ సల్మాన్ ఖాన్ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది. It was a tough one, uff! Thank you fam for the support and wishes 🙏💖 #MannaraChopra #BB #BB17 #Mannara #BiggBoss #biggBoss17 pic.twitter.com/rEn6PGdJ1B — Mannara Chopra (@memannara) January 17, 2024 #BiggBoss really wanted to show how much torture this Sherni #MannaraChopra went through compared to the boys #AbhishekKumar, #MunawarFaruqui & #ArunMashettey. #BB17 #BiggBoss17 #MunAra #MKJW pic.twitter.com/M6MjmTGOAh — dw🍼🍼 (@doodhwaali) January 17, 2024 View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
బాలీవుడ్ స్టార్స్ ఇలాంటివి నమ్ముతారా.. ద్యావుడా!
సినిమా రంగంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువ. ప్రతిభ కంటే అదృష్టానికే విలువెక్కువ. గుడ్డి నమ్మకాలకు గౌరవిస్తూ పేర్లను కూడా మార్చుకుంటారు. ఈ సెంటిమెంట్ స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీదా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు వాళ్లంతా. అలాంటి వింత అలవాట్లు, సెంటిమెంట్లను ఫాలో అవుతున్న కొంతమంది బాలీవుడ్ స్టార్స్ గురించి.. పేరుతో సక్సెస్ రాదు.. చేసే పనితో వస్తుంది అకుంటాం. కానీ బాలీవుడ్లో దీనికి రివర్స్! పేరులో అక్షరాలు కరెక్ట్గా ఉంటేనే సక్సెస్ అని నమ్ముతారు బాలీవుడ్ సెలబ్రిటీస్లో చాలా మంది. సీనియర్ మోస్ట్ యాక్టర్ సంజయ్ దత్ ఇలాంటి నమ్మకాల్లోనూ సీనియరే. చిన్నప్పుడు స్కూల్లో అతని పేరు ‘Sunjay dutt’గా నమోదయింట. కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సక్సెస్ అంతత్వరగా దరి చేరకపోయేసరికి ‘Sajay’లోని‘U’అక్షరాన్ని తీసేసి ఆ స్థానంలో ‘A’ని చేర్చి ‘Sanjay’గా మార్చుకున్నాడట. అప్పటి నుంచి సక్సెస్ ఆ పేరుకు సఫిక్స్ అయిందని అతని స్ట్రాంగ్ బిలీఫ్! బాలీవుడ్ నటుడు గోవిందా ఏదైనా షూటింగ్లో ఉన్నప్పుడు అతన్ని కలవడానికి విజిటర్ ఎవరైనా రెడ్ కలర్ డ్రెస్లో వస్తే ఆ విజిటర్ని కొట్టేసేంత ఆవేశాన్ని, కోపాన్నీ కంట్రోల్ చేసుకుంటాడట. కారణం షూటింగ్స్లో రెడ్ అతనికి యాంటీసెంటిమెంట్ అట. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా ఇంటి భోజనమే తింటాడు. ఈ సెంటిమెంట్ ఎంతదూరం వెళ్లిందంటే ఔట్డోర్ షూటింగ్స్కి తనింటి గేదేనే తీసుకెళ్లేంత. ఈ గేదె పాలతో కాచిన కాఫీ, టీలనే తీసుకుంటాడని బాలీవుడ్ వర్గాల భోగట్టా. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా సెంటీఫెలోనే.. న్యూమరాలజీ విషయంలో! ఆయనకు నంబర్ 9 పట్ల అబ్సెషన్. రెమ్యునరేషన్ కూడా టోటల్ నైన్ వచ్చేలా తీసుకుంటాడట. అంటే 5 కోట్లు, 63 కోట్లు, 72 కోట్లు.. ఇలా రెండు అంకెలను కూడితే 9(ఇండస్ట్రీలో తనకున్న డిమాండ్, తన సినిమాలకు ఉన్న మార్కెట్ను బట్టి) వచ్చేలా చూసుకుంటాడట. ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. తెల్ల కాగితం మీద ‘ఓం’అని రాసి.. దానికి దండం పెట్టుకోందే ఏ కొత్త పనీ మొదలుపెట్టడట. బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు రాజ్కుమార్ రావ్ అని అందరికీ తెలిసిందే! అయితే రావు అనేది అతని పెట్టుడు పేరు అని తెలిసింది మాత్రం కొందరికే! ఆ నటుడి అసలు పేరు రాజ్కుమార్ యాదవ్. ఈ పేరుతో కొనసాగినన్నాళ్లూ సినిమాల్లో అతనికి సహాయక పాత్రలే దొరికాయి. అవి ‘మంచి నటుడు’అని పేరు తెచ్చినా.. ముఖ్య పాత్రలను మాత్రం రప్పించలేకపోయాయి. సెంటిమెంట్ల ఊట అయిన సినిమా ఫీల్డ్లో ఎవరు సలహా ఇచ్చారో మరి.. తన పేరును మార్చుకున్నాడు. Rajkummar Rao అని! అంతే హీరో అయిపోయాడు. సింపుల్గా పేరు ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ఎక్స్ట్రాగా ఒక ‘M’ చేర్చి, యాదవ్ని డిలీట్ చేసి రావ్ని యాడ్ చేశాడు అంతే! చమత్కార్ హోగయా! అమితాబ్ బచ్చన్కి ఉన్న మూఢనమ్మకాన్ని వింటే నిజంగానే విస్తుపోతారు. అమితాబ క్రికెట్కి వీరాభిమాని. అంత అభిమానం ఉన్నవాళ్లెవరైనా స్టేడియంలో కూర్చొని ఆటను చూసే అవకాశాన్ని అస్సలు వదులుకోరు కదా! కానీ అమితాబ్ అలాంటి ప్యాన్ కదాఉ. లైవ్ మ్యాచెస్కి వెళ్లడు. టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తాడు. ఎందుకంటే తను స్టేడియంలో కూర్చొని ఆటను తిలకిస్తే.. తన ఫేవరేట్ టీమ్ ఓడిపోతుందని భయమట. ఒకటి రెండు సార్లు అలా జరిగిందట. అందుకే అప్పటి నుంచి ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఆటను టీవీలోనే చూస్తాడట. జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్లినా వెంట మెరుపు మెరుపుల గులాబీ రంగు వాటర్ బాటిల్ని క్యారీ చేస్తుందట. అంతేకాదు దానికి ‘చుస్కీ(సిప్)’అని పేరు కూడా పెట్టుకుందట. ఆ బాటిల్, ఆ పేరు ఎంతగా ఫేమస్ అయిందంటే.. జాన్వీ కపూర్ ఫ్యాన్ ఒకరు చుస్కీ పేరుతో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను క్రియేట్ చేసేంతగా! సల్మాన్ ఖాన్కి వేడి వేడి భోజనమే ఇష్టం. అయితే చద్దాన్నాన్ని డస్ట్బిన్లో పారేస్తాడా? అయ్యే లేఉద.. అన్నం పరబ్రహ్మా స్వరూపం అని గట్టిగా నమ్ముతాడు. మరైతే వేడి చేసుకుని తర్వాత పూటకు తినేస్తాడా? నో. ఒక్కసారి వండినవాటిని మళ్లీ వేడిచేయడం అనారోగ్యమనే ఆరోగ్య సూత్రాన్ని అస్సలు విస్మరించడు. మరేం చేస్తాడు? చద్దన్నానికి బటర్, పచ్చడి కలుపుకొని లాగిస్తాడట. సోనమ్ కపూర్ అహుజా సెంటిమెంట్ వింటే విస్తుపోతారు. తను నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్లో గనుక తను పొరపాటున కిందపడితే ఆ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆమె నమ్మకం. అందుకే షూటింగ్ ముహూర్తం రోజు నుంచి షూటింగ్ ఆఖరి రోజు వరకు తను కిందపడిపోయే చాన్స్ కోసం ఎదురు చూస్తుంటుందట. ఫిట్నెస్ క్వీన్ బిపాశా బసుకు దిష్టి మీద నమ్మకం ఎక్కువ. అందుకే ప్రతి శనివారం నిమ్మకాయలు, పచ్చి మిరపకాయలు కొని వాటిని ఒక ఇనుప తీగకు గుచ్చి కారు విండ్ షీల్డ్కున్న రియల్ వ్యూ మిర్రర్కి వేలాడదీస్తుందట. ఈ ప్రాక్టీస్ని వాళ్లమ్మ నుంచి నేర్చుకుందట బిపాశా. డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి గుర్తున్నాడు కదా! అతనికున్న నమ్మకం గురించి కూడా చదివేయండి. తను నటించే సినిమా షూటింగ్ ముహుర్తాలు ఎగ్గోడ్తాడట. తను షూటింగ్ ముహూర్తానికి హాజరయిన సినిమాలన్నీ ఘోరంగా ఫ్లాప్ అవడంతో తను ముహుర్తానికి అటెండ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే నమ్మకం ఏర్పడిపోయిందట అతనికి. ఇక అప్పటి నుంచి తన సినిమా ముహుర్తాలకు ఆబ్సెంట్ వేయించుకోవడం మొదలుపెట్టాడట. నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదా సీదా కాటుక కాదు.. పాకీస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! -
స్టార్ హీరో ఇంట్లోకి చొరబాటు.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్
స్టార్ హీరో ఇంటి దగ్గర అలజడి. అభిమానులు అని చెప్పిన ఇద్దరు అనుమానితులు.. బలవంతంగా సదరు హీరో ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో అంతా టెన్షన్ టెన్షన్గా మారిపోయింది. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. ఇద్దరు అజ్ఞాత వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అసలు వాళ్లెవరు? ఇక్కడికొచ్చి ఎందుకు చొరబడే ప్రయత్నం చేశారని దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ముంబయికి సమీపంలోని పాన్వెల్ ప్రాంతంలో ఫామ్ హౌస్ ఉంది. ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటాడు. తాజాగా ఈ ఫామ్ హౌస్లోకి ఇద్దరు అనుమానితులు చొరబడే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ గార్డ్స్తోనూ వాదించారు. పోలీసులకు సమాచారం అందించగా వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తుల దగ్గర నకిలీ ఐడీ కార్డ్స్ ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే గతంలో సల్మాన్ ఖాన్.. కృష్ణజింకలని వేటాడాడు. ఇందులో భాగంగానే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఈ హీరోకి బెదిరింపు ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి. గతేడాది ఇతడితో పాటు మరో ఇద్దరిపైనా కేసు పెట్టారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బిష్ణోయ్.. సల్మాన్ని చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు అనుమానితులు.. సల్మాన్ ఇంటి దగ్గర కనిపించడం ఆందోళన కలిగించింది. అయితే వీళ్లు సల్మాన్ని చంపడానికి వచ్చారా? మరోదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ కొత్త మూవీ) -
రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ
మరో యాక్షన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ కోసం జరిగిన గందరగోళం మరో దాని విషయంలో జరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుందన్నట్లు వార్తలొచ్చాయి. కాదుకాదు ఇప్పట్లో రాదని మరో పోస్టర్ వైరల్ అయింది. ఇప్పుడవన్నీ కాదన్నట్లు అసలు ఏ మాత్రం సౌండ్ చేయకుండా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'టైగర్ 3'. దీపావళి కానుకగా నవంబరు 12న థియేటర్లలో విడుదల చేశారు. యష్ రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా దీన్ని తీశారు. కాకపోతే దీని ముందు చిత్రాలైన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' తరహాలో ఇది అలరించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిపోయింది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి త్వరగా వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నవంబరు 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. డిసెంబరు తొలివారంలోనే ఓటీటీలోకి వచ్చేయాల్సింది. కానీ దాన్ని అలా వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు జనవరి 7న స్ట్రీమింగ్ అవుతుందన్నట్లు చెప్పారు. కానీ చివరి నిమిషంలో 'కమింగ్ సూన్' అన్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా కాస్త కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఇప్పుడేమో సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. విచిత్రమైన విషయం ఏంటంటే.. థియేటర్లలో, ఓటీటీలో ఇలా రెండు చోట్ల ఈ సినిమా ఆదివారమే రిలీజైంది. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్) Locked, loaded and ready! 📷 Aa raha hai Tiger…#Tiger3OnPrime, watch now only on @PrimeVideoIN#KatrinaKaif | @emraanhashmi | #ManeeshSharma | @yrf pic.twitter.com/xgLHdQRqcf — Salman Khan (@BeingSalmanKhan) January 6, 2024 -
స్టార్ హీరో మూవీ.. త్రిష స్థానంలో సమంత?
హీరోయిన్ సమంత మళ్లీ రిఫ్రెష్ అవుతున్నారు. 2010లో ఏ మాయ చేసావె సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సామ్. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో తనకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. అలా జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం, మహేశ్ బాబు సరసన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, రాజమౌళి దర్శకత్వంలో ఈగ వంటి పలు సినిమాలు బ్లాక్బస్టర్గా నిలిచి సామ్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ.. అదేవిధంగా తమిళంలోనూ విజయ్, సూర్య, ధనుష్, విజయ్సేతుపతి వంటి స్టార్ హీరోల సరసన నటించిన క్రేజీ హీరోయిన్గా మారారు. వీటితో పాటు కొన్ని లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలలోనూ నటించి సక్సెస్ అయ్యారు. ఇలా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమంత జీవితంలో ఒక్క కుదుపు.. అదే మయోసైటిస్.. ఈ అరుదైన వ్యాధి వల్ల సమంత కొంత మానసిక వేదనకు గురయ్యారు. వైద్య చికిత్స కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి! ది బుల్ సినిమాలో సామ్? అయితే ఆమె ఇప్పటికీ అభిమానులకు మాత్రం దూరం కాలేదు. సమంత చివరిగా నటించిన చిత్రం ఖుషీ. అదేవిధంగా హిందీలోనూ ది ఫ్యామిలీ మెన్–2, సిటాడాల్ అనే వెబ్ సిరీస్లలో నటించారు. ప్రస్తుతం చైన్నె స్టోరీస్ అనే ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈమెకు బాలీవుడ్ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రంలో సల్మాన్ఖాన్ కథానాయకుడిగా నటించనున్నారు. దీనికి ది బుల్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదట త్రిషను హీరోయిన్గా తీసుకోవాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఈసారైనా నిజమవుతుందా? కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ పాత్రలో సమంతను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఉఊ అంటావా అనే ఐటమ్ సాంగ్లో సమంత నటన బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో సల్మాన్ఖాన్కు జంటగా ఈ బ్యూటీని నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఆ మధ్య కూడా సల్మాన్ సినిమాలో సమంత నటించనుందంటూ వార్తలు రాగా అవి ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసిందీ బ్యూటీ. మరి ఈసారి జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో చూడాలి! చదవండి: Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్ -
రజనీకాంత్పై 'రంభ' వైరల్ కామెంట్లు.. సోషల్మీడియాలో వివాదం!
రంభ 90వ దశకంలో తమిళ,తెలుగు చిత్రసీమలో అగ్రనటిగా కొనసాగింది. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, చిరంజీవి వంటి ప్రముఖ నటులందరితోనూ ఆమె నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిన నటి రంభ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రంభ షూటింగ్ స్పాట్లో నటుడు రజనీకాంత్తో తన పాత జ్ఞాపకాలను పంచుకుంది., నటుడు రజనీకాంత్ చిలిపి పనులలో మునిగిపోతారని రంభ చెప్పిన మాటలను కట్ చేసి రజనీకాంత్ హ్యాష్ట్యాగ్తో ఆ వీడియోను కొందరు ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 1997లో సుందర్ సి దర్శకత్వంలో అరుణాచలం చిత్రంలో రజనీ, సౌందర్య, రంభ నటించారు. ఈ సినిమాలో రంభ కీలక పాత్ర పోషించింది. అందులో రజనీకాంత్కు అసిస్టెంట్గా ఆమె మెప్పించింది. ఆ సినిమా సెట్లో జరిగిన సంఘటన గురించి ఆమె ఇలా తెలిపింది. 'అరుణాచలం సినిమాతో పాటు నేను ఆ సమయంలో సల్మాన్ ఖాన్తో బంధన్ చిత్రం కూడా ఒప్పుకున్నాను. అప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ హైదరాబాద్లో జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బంధన్ షూటింగ్ చేశాను. ఆ సమయంలో రజనీకాంత్ను కలిసేందుకు హిందీ నటుడు సల్మాన్ ఖాన్ వచ్చాడు.. అప్పుడు నేను ఆయన్ను చూసి వెంటనే వెళ్లి కౌగిలించుకుని పలకరించాను.. ఆ సమయంలో రజనీ దూరంగా కూర్చొని మమ్మల్ని చూస్తున్నాడు.. ఆ తర్వాత రజనీ షూటింగ్ ఆపి దర్శకుడు సుందర్ సితో మాట్లాడుతున్నారు. సల్మాన్ ఖాన్ వెళ్లిన తర్వాత అసలు కథ స్టార్ట్ అయ్యింది. సెట్లో గందరగోళం.. నెలకొంది. రజనీకాంత్ టవల్ విసిరికొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడారు. అప్పుడు సుందర్ సి నా వైపు కంగారుగా చూశారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న కెమెరామెన్ కలుగచేసుకుని ఏంటి మేడమ్..? ఇలా చేశారు, ఇకపై మీతో నటించను అని రజినీసార్ అంటున్నారని ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో నేను వెంటనే ఏడ్చేశాను . అప్పుడు నేను ఏడుస్తున్నట్లు రజనీ సార్ గమనించి భయపడి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఆమెను ఎందుకు ఏడిపించారని అక్కడున్న వారందరిపై మండిపడ్డారు. నేనేం తప్పు చేశాను సార్.. ఏం జరిగింది..? అని నేను అడిగాను. అప్పడు వెంటనే షూటింగ్ స్పాట్లో ఉన్న వారందరినీ రజనీ అక్కడికి పిలిచారు. ఉదయం సల్మాన్ ఖాన్ రాగానే రంభ వెంటనే పరుగెత్తుకుంటు వెళ్లి కౌగిలించుకుంది.. ఇక్కడ ఎవరినైనా ఎప్పుడైనా అలా హగ్ చేసుకుందా అంటూ దానిని ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించారు. అదే మా సినిమా సెట్లో అయితే.. గుడ్ మార్నింగ్ సార్ అని మాత్రమే చెప్పి వెళ్లిపోతుంది. తన బాలీవుడ్ సినిమా హీరో అయితే కౌంగిలించుకుని మరీ విష్ చేస్తుంది అంటూ అందరి రజనీకాంత్ సరదాగా నన్ను ఆటపట్టించారు. నన్ను ఇలా ఆట పట్టించాలని వారు ముందే ప్లాన్ చేసుకున్నారని తర్వాత అర్థం అయింది. అదేం నాకు తెలియకపోవడంతో చాలా సమయం పాటు నేను ఏడ్చాను. అలా సరదాగా రజనీ సార్ నన్ను ఏడిపించారు.' అని ఆనాటి విషయాలను రంభ గుర్తు చేసుకుంది. ఏదేమైనా రజనీ సర్ని ఎప్పుడూ అలా చూడలేదని రంభ చెప్పింది. ఇది ఉత్తర భారత సంస్కృతి అని ఆయనతో చెప్పాను. వెంటనే తను రేపటి నుంచి యూనిట్లో అందరూ వరుసలో నిలుచోవాలని కోరారు. రేపటి నుంచి రంభ వచ్చి అందరినీ కౌగిలించుకుని గుడ్ మార్నింగ్ చెపుతుందని మరోసారి రజనీ సార్ ఆటపట్టించారని ఆమె గుర్తుచేసుకుంది. కానీ కొందరు సోషల్ మీడియాలు రంభ వ్యాఖ్యలను కొంత వరకు మాత్రమే కట్ చేసి రజనీ కాంత్ పట్ల నెగటివ్ను వ్యాప్తి చేయడం గమనార్హం. #Rajinikanth made cute & sweet pranks to #Rambha at #Arunachalam sets 😊😊pic.twitter.com/sknYOopbSt — VCD (@VCDtweets) January 3, 2024 #Rajinikanth made cute & sweet pranks to #Rambha at #Arunachalam sets 😊😊pic.twitter.com/sknYOopbSt — VCD (@VCDtweets) January 3, 2024 -
బాల్యం నుంచి స్టార్ హీరో దాకా.. సల్మాన్ ఖాన్ అరుదైన చిత్రాలు
-
KRK Arrest: వివాదాస్పద సినీ క్రిటిక్ అరెస్ట్.. ఆ స్టార్ హీరోపై తీవ్ర ఆరోపణలు!
కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్ చల్ చేసేవారిలో కేఆర్కే ఒకరు. ఇటీవల డంకీ, సలార్ చిత్రాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇచ్చేశాడు. సినిమా ఏదైనా సరే బాగాలేదు, డిజాస్టర్ అనే పదాలు ఎక్కువగా వినియోగించే వారిలో కేఆర్కేను మించినవారు ఉండరు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నామని అనుకుంటున్నారా? అసలే జరిగిందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: Alia-Ranbir: ముద్దుల కూతురిని పరిచయం చేసిన స్టార్ కపుల్!) కేఆర్కే అసలు పేరు కమల్ రషీద్ ఖాన్ కాగా.. తాజాగా ఆయను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. నేను జైల్లో చనిపోతే అది హత్యగా భావించాలంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అతను ట్వీట్లో రాస్తూ.. "నేను గత ఏడాది కాలంగా ముంబైలో ఉన్నా. నా అన్ని కోర్టు కేసులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నా. ఈ రోజు నేను కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్కి వెళ్తున్నా. కానీ ముంబై పోలీసులు నన్ను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పోలీసుల దృష్టిలో నేను మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నా. ఇది 2016లో జరిగిన ఒక కేసు. నా వల్లే తన సినిమా టైగర్-3 ఫ్లాప్ అయిందని సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లోనో, జైల్లోనో చనిపోతే అది హత్యగా మీరందరు భావించాలి. దీనికి బాధ్యులు ఎవరో మీ అందరికీ తెలుసు. " అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం కేఆర్కే పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. గతేడాది తన అరెస్ట్కు, సల్మాన్ ఖాన్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సల్మాన్ ఖాన్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చేశారు. తాజా అరెస్ట్తో మళ్లీ సల్మాన్పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: ప్రియుడికి స్పెషల్ విషెస్ చెప్పిన 'సరైనోడు' భామ.. పోస్ట్ వైరల్!) గతేడాది ఆగస్ట్ 30న దుబాయ్ నుంచి ముంబైకి వచ్చినప్పుడు కూడా అరెస్టు చేశారు. తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్లపై 2020లో నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నారు. గతంలో దివంగత ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్లపై చేసిన ట్వీట్లపై యువసేన నాయకుడు రాహుల్ కనాల్ 2020 ఏప్రిల్ 30న ఫిర్యాదు చేశాడు. I am in Mumbai for last one year. And I am attending my all court dates regularly. Today I was going to Dubai for new year. But Mumbai police arrested me at the airport. According to police, I am wanted in a 2016 case. Salman khan is saying that his film #Tiger3 is flop because… — KRK (@kamaalrkhan) December 25, 2023 -
రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?
స్టార్ హీరో తమ్ముడు, ప్రముఖ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఈ వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆదివారం రాత్రి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇంతకీ ఎవరా నటుడు? ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్.. నటుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1998లోనే నటి మలైకా అరోరాని పెళ్లి చేసుకున్నాడు. 2017 వరకు వీళ్లు సంసారం చేశారు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. మలైకా- హీరో అర్జున్ కపూర్తో రిలేషన్లో ఉంది. అటు అర్బాజ్.. నటి జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లు ప్రేమలో ఉండి ఇటీవలే బ్రేకప్ చెప్పాడు. అయితే కొన్నిరోజుల నుంచి అర్బాజ్ రెండో పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) అయితే పెళ్లి నిజమా కాదా? అని అందరూ అనుకున్నారు. తాజాగా ముంబయిలోని తన సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో అర్బాజ్, మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్తో నిఖా చేసుకున్నాడు. ఈ వేడుకకు సల్మాన్ కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అర్బాజ్ పెళ్లిలో అతడి కొడుకు కూడా కనిపించడం విశేషం. తన పెళ్లి ఫొటోల్ని పోస్ట్ చేసిన అర్బాజ్.. అందరి ఆశీర్వాదం కావాలని క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం కొత్తజంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. హిందీలో నటుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేసిన అర్భాజ్.. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' మూవీలో విలన్గా నటించి మెప్పించాడు. 2017లో రాజ్ తరుణ్ 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' చిత్రంలోనూ నటించాడు. అయితే ఇక్కడ ఆఫర్స్ రాలేదో ఏమో గానీ చాలావరకు హిందీలో యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) View this post on Instagram A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) -
అంతా ఆ మూవీ వల్లే.. దేవర డిజప్పాయింట్ అయ్యాడా...?
-
Kolkata International Film Festival 2023: ఫిలిం ఫెస్టివల్లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలవలేదు.. సల్మాన్ నా ఫేవరెట్: గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు స్వాగతం పలికాడు. సల్మాన్ తన అభిమాన నటుడన్న దాదా.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయనను కలవలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఏదేమైనా కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా సల్లూ భయ్యాను కలుసుకోవడం సంతోషంగా ఉందని గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. కాగా కోల్కతా వేదికగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి మంగళవారం తెరలేచింది. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా కోల్కతాకు విచ్చేసిన బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేశ్ భట్, శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా తదితరులకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో వేదికపైకి వచ్చిన సౌరవ్ గంగూలీ సల్మాన్ ఖాన్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా అభిమాన నటుడు మిస్టర్ సల్మాన్ ఖాన్కు కోల్కతా తరఫున స్వాగతం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవడం ఇదే తొలిసారి. LATEST: #SouravGanguly on #Salmankhan Salman is Huge Name in Indian Cinema And famous in other countries also Legendary Megastar@BeingSalmanKhan | #Tiger3 pic.twitter.com/LROpHCWN1Q — FIGHTя (@SalmanzFighter_) December 5, 2023 ఇన్నేళ్లుగా మిమ్మల్ని ఒక్కసారి కూడా ప్రతక్ష్యంగా కలుసుకోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే నిజంగా ఇది దురదృష్టకరమే. అయితే, ఇప్పుడు ఆ లోటు తీరింది’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్లతో పాటు సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా బెంగాల్ తరఫున టీమిండియాకు ఆడిన సౌరవ్ గంగూలీ దూకుడైన కెప్టెన్గా పేరొందిన విషయం తెలిసిందే. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగానూ తన మార్కు చూపించాడీ బెంగాలీ బ్యాటర్. #WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee, Film Director Mahesh Bhatt, former Indian cricketer Sourav Ganguly, actors Salman Khan, Anil Kapoor and Sonakshi Sinha shake a leg at the Kolkata International Film Festival (KIFF). (Source: KIFF Social Media) pic.twitter.com/EHOKtK9g3B — ANI (@ANI) December 5, 2023 చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! Latest - Former president of BCCI #Souravganguly about Megastar #Salmankhan. ' Our very favourite my favourite, Salman Khan welcome to Kolkata, we have never met before. But I'm his huge fan ' 🙌❤️pic.twitter.com/12FENf5TTa — YOGESH (@i_yogesh22bakup) December 5, 2023 -
అనుకున్న టైం కంటే ముందే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా!
మరో స్టార్ హీరో సినిమా.. నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. యాక్షన్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించేస్తుందని ఆశపడ్డారు. కానీ రియాలిటీలో తేడా కొట్టేసింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రానుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రాబోతుంది? (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) యాక్షన్ సినిమాలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగింది. 'పఠాన్', 'జవాన్' లాంటి చిత్రాలు రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేశాయి. తాజాగా 'యానిమల్' కూడా ఆ నంబర్ దాటేస్తుందనిపిస్తోంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' కూడా ఇలాంటి అంచనాలతోనే మొన్నీమధ్య దీపావళికి(నవంబరు 12న) థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ ఆశించిన స్పందన రాలేదు. వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. ఉత్తరాదిలో కాస్తోకూస్తో కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ తెలుగు సినిమా, వసూళ్లు.. రెండూ దెబ్బకొట్టేశాయి. దీంతో ఇప్పుడీ మూవీని నెల రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారు. 'టైగర్ 3' చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. లెక్క ప్రకారం 6-8 వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో డిసెంబరు 12నే ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్ చేశారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ హీరోగా ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ‘ది బుల్’ అనే సినిమా తెరకెక్కనుంది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మార్చిలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో పారా మిలిటరీ ఆఫీసర్గా సల్మాన్ ఖాన్ నటిస్తారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక తన సినిమాల వైఫల్యాల (‘అంతిమ్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లను ఉద్దేశిస్తూ..) గురించి కూడా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నా సినిమాలు విడుదలైనప్పుడు, ఆ సినిమాల టికెట్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ధరలతో విడుదల చేస్తే ఆ సినిమాల కలెక్షన్స్ కూడా భారీగానే ఉంటాయి. నా తర్వాతి సినిమాను అలాగే రిలీజ్ చేయాలనుకుంటున్నాను’ అని సల్మాన్ అన్నారు. అంతేకాదు.. తక్కువ సినిమా టికెట్ ధరలతో ప్రజల డబ్బును మేం సేవ్ చేస్తున్న విషయం అందరికీ సరిగ్గా అర్థం కావడం లేదని కూడా సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. -
అలాంటి సీన్స్లో నటించిన భార్య.. భర్త రియాక్షన్ ఇదే
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ జోడీగా నటించిన భారీ యాక్షన్ చిత్రం టైగర్- 3.. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రంపై డివైడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా సుమారు రూ. 450 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. స్పై యూనివర్స్లో భాగంగా గత రెండు చిత్రాల్లో తొలి మహిళా స్పైగా మెప్పించిన కత్రినా కైఫ్.. టైగర్ 3 చిత్రంలో కూడా అదిరిపోయే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. టర్కీ హమామ్లో కత్రినా కైఫ్పై చిత్రీకరించిన టవల్ ఫైట్ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ చిత్రంలో కత్రినా బోల్డ్ టవల్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. ఇది అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తోంది. ఇందులో బాత్ టవల్స్ ధరించిన ఉన్న కత్రినతో పాటు మరో లేడీ.. ఇద్దరు తలపడుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒకరి టవల్ను మరొకరు లాగేసుకుని.. ఫైనల్గా తమ నేక్డ్ బాడీని కవర్ చేసుకున్నట్లుగా కనిపించారు. ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్ సినిమాకు భారీగా బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ఈ సీన్స్పై స్పందించాడు. ఈ ఫైట్ సీన్ తర్వాత తన భార్యను చూసి భయపడుతున్నట్లు ఆయన చెప్పాడు. 'నేను ఈ సినిమా నా భార్య కత్రినాతో కలిసి మొదటిరోజే చూశాను. ఇందులో యాక్షన్ సీన్స్లలో ఆమె చాలా అద్భుతంగా చేసింది. టవల్ ఫైట్ సీన్ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. తను ఈ సీన్ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నాను. ఈ సీక్వెన్స్ తర్వాత ఆమె వైపు చూసి ఇలా అన్నాను 'ఇక నుంచి నేను నీతో గొడవపడకపోవడమే మంచి అని అనుకుంటున్నాను. లేదంటే నువ్వు టవల్ సాయంతో నన్ను కొట్టావంటే ఇక అంతే.' అని ఫన్నీగా చెప్పాను. బాలీవుడ్లో కత్రినా అద్భుతమైన యాక్షన్ నటిగా భావిస్తున్నాను. ఇలాంటి కష్టమైన యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె పడుతున్న శ్రమకు నేను నిజంగా గర్వపడుతున్నాను.' అని ఆయన చెప్పుకొచ్చారు. -
బిగ్బాస్ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్ అవుతానంటున్న కంటెస్టెంట్!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్. బాలీవుడ్లో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ షోను తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం హిందీలో సీజన్-17 నడుస్తోంది. ఈ సీజన్కు హోస్ట్గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో కంటెస్టెంట్గా పాల్గొన్న అనురాగ్ ధోబాల్.. హోస్ట్గా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సల్మాన్ ఖాన్ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని హోస్లో ఉన్న మరో కంటెస్టెంట్ సనా రయీస్ ఖాన్తో చెప్పారు. హోస్ట్గా ఉండాల్సిన మీరే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సల్మాన్ను ఉద్దేశించి అనురాగ్ ధోబాల్ ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బిగ్బాస్.. కంటెస్టెంట్ అనురాగ్కు వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించాడు. అయితే బిగ్ బాస్ కామెంట్స్ను సీరియస్గా తీసుకున్న అనురాగ్ ఈ షో నుంచి మధ్యలోనే తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. బిగ్బాస్ వార్నింగ్ ఇవ్వడాన్ని తనకు అగౌరవంగా భావిస్తున్నట్లు హౌస్మేట్స్తో చెప్పడం కనిపించింది. బిగ్ బాస్ తనను తిట్టిన తరువాత స్వచ్ఛందంగా షో నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు హోస్మేట్స్తో చెప్పారు. ఇకపై ఈ షో గురించి పట్టించుకోనని అనురాగ్ అన్నారు. ఈ షో కంటే నాకు అభిమానులు, కుటుంబం చాలా ముఖ్యమని తెలిపారు. బిగ్ బాస్ షో నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేందుకు రూ.2 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని హోస్మేట్స్తో అనురాగ్ ధోబాల్ అన్నారు. Bhai ne Maa Ka Sapna Pura Kiya Ab Bhai ka Sapna Pura Karte hain ❤️🤌🏻 pic.twitter.com/0hsRKarUNq — Anurag Dobhal (@uk07rider) November 25, 2023 -
సల్మాన్ ఖాన్ కు సీక్వెల్ ఫీవర్.. టైగర్ 4 ప్లాన్!
-
'ఫారే' ప్రీమియర్ షోలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)