భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని జిల్లా సూపెరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారు డు తన అప్లికేషన్ స్థితిని ట్రాకింగ్ సిస్టంద్వారా తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు. అప్లికేషన్ నంబర్తో టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment