నృసింహుడికి పోచంపల్లి పట్టువస్త్రాలు
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు బహూకరిస్తుంటారు. అందులో భాగంగానే శనివారం స్థానిక శ్రీమార్కండేశ్వర స్వామి దేవాలయంలో పట్టువస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన, కీర్తనలతో పట్టువస్త్రాలతో ప్రదర్శనగా యాదగిరిగుట్టకు వెళ్లి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(డీఈఓ) భాస్కరశర్మకు రెండు పట్టు చీరలు, పట్టు పంచెలు, రెండు శాలువాలను అందజేశారు. అదేవిధంగా మార్కండేశ్వరస్వామి దేవాలయం ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ మహాజన సంఘం అధ్యక్షుడు సీత చంద్రయ్య, మార్కండేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సీత సత్యనారాయణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, పద్మశాలీ నాయకులు తడక వెంకటేశం, భారత లవకుమార్, రాపోలు శ్రీను, అంకం మురళి, భోగ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment