ఆస్పత్రిలో కలుషిత నీరు! | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో కలుషిత నీరు!

Published Tue, Apr 8 2025 11:11 AM | Last Updated on Tue, Apr 8 2025 11:11 AM

ఆస్పత

ఆస్పత్రిలో కలుషిత నీరు!

ఈ ఫొటోలను గమనించారా.. ఇవి నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రోగులు తాగునీరు అందించే ఫ్రిడ్జ్‌, అందులోని నీరు. కలుషితంగా కనిపిస్తున్న ఈ నీటినే రోజూ రోగులు తాగుతున్నారు. సోమవారం ఒక వ్యక్తి గ్లాసులో నీళ్లు పట్టుకుని తాగుతుండగా పురుగుల వచ్చాయి. దీంతో ఫ్రిడ్జ్‌ పైన మూత తీసి చూడగా ఫ్రిడ్జ్‌ నీరు కలుషితంగా.. పురుగుల మయంగా కనిపించింది. అక్కడి సిబ్బంది ఆ నీరు చూపించాడు. వారు ఆ నీటిని పారబోశారు. మళ్లీ అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. రోగాలు నయం చేసుకోవాడానికి ఆస్పత్రికి వస్తుంటే.. ఈ నీరు తాగితే మళ్లీ రోగాల బారినపడే ప్రమాదం ఉంటుందని అక్కడి రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. – నాగార్జునసాగర్‌

ఆస్పత్రిలో కలుషిత నీరు!1
1/1

ఆస్పత్రిలో కలుషిత నీరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement