బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం | - | Sakshi
Sakshi News home page

బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం

Published Fri, Apr 11 2025 1:23 AM | Last Updated on Fri, Apr 11 2025 1:23 AM

బాబు,

బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం

కర్నూలు(సెంట్రల్‌): సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను నమ్మి మోసపోయామని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో.. ఇదిగో అంటూ డీఎస్సీ నోటిఫికేషన్‌ కాలయాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేట్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా తోపులాట చోటు చేసుకుంది. చివరకు కేసులుపెట్టి జైలుకు పంపుతామని త్రీటౌన్‌ సీఐ శేషయ్య హెచ్చరించడం.. కలెక్టర్‌ తరపున స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నాగ ప్రసన్న లక్ష్మీ వచ్చి వివరణ ఇవ్వడంతో నిరుద్యోగులు కాస్తా వెనక్కి తగ్గారు.

ప్రతి నెలా రూ.10వేల పైనే ఖర్చు

డీఎస్సీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా టీచర్‌ కావాలన్నదే నా లక్ష్యం. డీఎస్సీ కోచింగ్‌, ప్రిపరేషన్‌ కోసం హాస్టల్‌లో ఉండటంతో ప్రతినెలా రూ.10వేల పైనే ఖర్చు అవుతోంది. ప్రభుత్వం మా బాధలను పట్టించుకోవాలి.

– దేవిబాయి, ఎల్‌బండతండా, వెల్దుర్తి మండలం

డీఎస్సీ అభ్యర్థుల్లో కట్టలు తెంచుకున్న ఆక్రోశం

కర్నూలు కలెక్టరేట్‌ ముట్టడి

పోలీసులు, నిరుద్యోగ అభ్యర్థుల మధ్య

తోపులాట

బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం1
1/3

బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం

బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం2
2/3

బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం

బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం3
3/3

బాబు, పవన్‌లను నమ్మి మోసపోయాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement