
శంభో.. శివ శంభో...
● జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
మక్తల్: శంభో.. శివ శంభో.. ఓం నమఃశ్శివాయ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నారాయణపేట, మక్తల్, కోస్గితోపాటు గ్రామాల్లో ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాలకు తరలివెళ్లారు. శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. మారేడు దళాలు, పువ్వులతో శివయ్యను ఆరాధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివుడి దర్శనాలు సాగాయి. రాత్రి శివ కల్యాణాలు కనులపండువగా జరిగాయి. మహా శివరాత్రి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

శంభో.. శివ శంభో...
Comments
Please login to add a commentAdd a comment