Top Stories
ప్రధాన వార్తలు
![Loans guaranteed by TDP govt By Civil Supplies Corporation Markfed](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/BABU_APPULU.jpg.webp?itok=5oeZhgO1)
‘గ్యారెంటీ’ అప్పు రూ.5,200 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రూ.5,200 కోట్ల రుణం పొందేందుకు పౌరసరఫరాల సంస్థ, ఏపీ మార్క్ఫెడ్లకు అనుమతినిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతుల మేలు కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత రబీలో ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపులతో పాటు 2024–25 సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ రుణాన్ని వినియోగిస్తామని తెలిపింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.అప్పులు మినహా మరో మార్గం లేదు..రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇటీవలే రూ.1,000 కోట్లు విడుదల చేశాం. మరో రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రూ.2 వేల కోట్ల రుణం పొందేందుకు పౌర సరఫరాల సంస్థను అనుమతిస్తూ గత నెల 28వ తేదీన ప్రభుత్వం జీవో నెం.6 జారీ చేసింది. ఈ రుణం కోసం ప్రభుత్వ హామీ కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–25లో ధాన్యం కొనుగోలు కోసం వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ హామీతో రూ.3,200 కోట్ల కొత్త రుణం కోసం ఏపీ మార్క్ఫెడ్కు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలను సవరించి మెరుగైన విధానం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు మేలు చేసేందుకు అప్పులు చేయడం మినహా మరో మార్గం లేదు. ఉచిత పంటల బీమా స్థానంలో మెరుగైన పంటల బీమా పథకాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏర్పాటయ్యే కమిటీ నెల రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, గనుల పాలసీలు రద్దుఏపీ ల్యాండ్ టైటిలింగ్ 2022 చట్టం రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇసుక, గనుల పాలసీ 2019, మరింత మెరుగైన ఇసుక విధానం 2021ని రద్దు చేయడంతో పాటు వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్æ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం 2024 తెస్తాం. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తూ ఈ నెల 8న జారీ చేసిన జీవో నెం.43 ర్యాటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రానికి గుల్బెంకియన్ అవార్డు రావటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో అమలులో ఉన్న ప్రకృతి సాగును 2029 నాటికి కనీసం 20 లక్షల హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.కౌన్సిల్లో బలం లేదు.. నిజమే‘‘కౌన్సిల్లో మాకు బలంలేని మాట వాస్తవమే. అయితే అసెంబ్లీలో చేసిన చట్టాలను కౌన్సిల్ అడ్డగించే అవకాశం లేదు కదా?’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మద్దతిచ్చిన టీడీపీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించగా నాడు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చారని ఎదురు ప్రశ్నించారు. హౌసింగ్లో అక్రమాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సంపద సృష్టి విషయంలో కట్టుబడి ఉన్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ మొదలైందని మంత్రి చెప్పారు. కేవలం నెల రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. భూముల ధరలు కనీసం రూ.ఐదారు లక్షలకు పైగా పెరిగాయన్నారు. ఎయిర్, రైల్ ట్రాఫిక్ 30 శాతం పెరిగిందన్నారు.ఇసుకలో తలదూర్చొద్దు!ఇసుక వ్యవహారాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి కొంతకాలం సజావుగా సాగనివ్వాలన్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో వివిధ రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉందని, వచ్చే 3 నెలలకు కోటి టన్నుల ఇసుక అవసరమని చెప్పారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొత్త విధానాన్ని తెద్దామన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటన విషయం ప్రస్తావనకు రావడంతో కొన్ని విషయాలు వాళ్లతో మాట్లాడాల్సి ఉందని, అవన్నీ బయటకు చెప్పలేనని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ కార్యక్రమాలను కొందరు సరిగా జనంలోకి తీసుకెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఆగస్టు ఒకటో తేదీన ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలని సూచించారు.ఐదు రోజులు అసెంబ్లీఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును ఈ సమావేశాల్లోనే పెడదామని చెప్పారు. పంటల బీమా పథకం అమలు కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసం చేసిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.1,600 కోట్లు రుణం తెచ్చి రూ.వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగతాది ఎక్కడుందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి రేషన్ బియ్యం ఎగుమతి చేసి అక్రమాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించినట్లు తెలిసింది. కిలో రూ.43 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన సూచించగా వచ్చే మంత్రివర్గం సమావేశం నాటికి దీంతోపాటు భూ అక్రమాలపైనా విచారణకు ఆదేశించడంపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
![Iran Plot To Assassinate Donald Trump Cnn Reported](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/donaldtrump.jpg.webp?itok=jPJ036Yp)
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..! సీక్రెట్ సర్వీసెస్కు ముందే తెలుసా..?
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ను చంపాలని కొందరు కుట్ర పన్నిన విషయం అమెరికా సీక్రెట్ సర్వీసెస్కు ముందే తెలుసా..? సీక్రెట్ సర్వీసెస్ ఈ విషయాన్ని ట్రంప్ టీమ్కు చెప్పిందా..? ట్రంప్ టీమ్కు కూడా ఈ విషయం ముందే తెలుసా..? అంటే అవుననే అంటోంది ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ. ఈ మేరకు ఒక కథనం కూడా ప్రచురించింది.ట్రంప్ను చంపడానికి ఇరాన్ దేశం కుట్రపన్నినట్లుగా సీక్రెట్ సర్వీసెస్కు ముందుగానే సమాచారమందిందని, ఈ విషయాన్ని వారు ట్రంప్ టీమ్కు కూడా చెప్పారని కథనంలో తెలిపింది. అయితే ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నానికి ఇరాన్ కుట్రకు సంబంధముందనడానికి ఆధారాల్లేవని పేర్కొంది. ఇరాన్ కుట్రపై ఇంటెలిజెన్స్ సమాచారం అందగానే ట్రంప్ సెక్యూరిటీని సీక్రెట్ సర్వీసెస్ భారీగా పెంచినట్లు తెలిపింది. మరోవైపు ఇటీవలి పెన్సిల్వేనియా కాల్పుల్లో దుండగుడు ట్రంప్కు అత్యంత దగ్గరగా రావడంలో సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యం ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు.
![Oil Tanker Capsized off the Coast of Oman](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/oman.jpg.webp?itok=4ZFpdhfv)
Oman: చమురు నౌక మునక.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
ఒమన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్ వైపు వెళుతున్న చమురు నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఒమన్కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చమురు నౌక పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్.ప్రమాదం జరిగిన సమయంలో దీనిలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైనవారిలో 13 మంది భారతీయ పౌరులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని సమాచారం. ఈ చమురు నౌకకు తూర్పు ఆఫ్రికా దేశమైన కొమొరోస్ జెండా ఉంది. ఈ చమురు నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక డుక్మ్ పోర్ట్ సమీపంలో మునిగిపోయింది.ఈ ట్యాంకర్ షిప్ యెమెన్ వైపు వెళ్తుండగా దుక్మ్ పోర్ట్ సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తోంది. కొమొరోస్ ఫ్లాగ్ ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ రాస్ మదారకాకు ఆగ్నేయంగా 25 నాటికన్ మైళ్ల దూరంలో మునిగిపోయిందని మారిటైమ్ సేఫ్టీ సెంటర్ ఒక ట్వీట్లో తెలిపింది. A Comoros flagged oil tanker capsized 25 NM southeast of Ras Madrakah. SAR Ops initiated with the relevant authorities. #MaritimeSecurityCentre— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 15, 2024
![Athletes of the state who are ready to show their potential in the World Games](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/olympics.jpg.webp?itok=urZQAeA9)
Paris Olympics:ఆంధ్రా టు పారిస్.. ఆడుదాం ఒలింపిక్స్
విజయవాడ స్పోర్ట్స్: ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్లో సత్తాచాటేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 26 నుంచి పారిస్లో ప్రారంభమయ్యే ఈ క్రీడల్లో పాల్గొనే భారత జట్లను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇటీవలే ప్రకటించింది. ఒలింపిక్స్లో జరిగే 32 క్రీడా పోటీలకు గానూ భారత్ నుంచి 16 క్రీడలకు ప్రాతినిధ్యం వహించే 113 మంది సభ్యుల జాబితాను ఐఓఏ ఇటీవల వెల్లడించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఏడుగురు చోటు దక్కించుకుని రాష్ట్ర క్రీడా ప్రతిష్టను దేశానికి చాటారు. రియో, టోక్యో ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటి పతకాలు సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది ఒలింపిక్స్ క్రీడల్లోనూ సత్తాచాటనుంది. పతాకధారిగా భారత జట్లను ముందుండి నడిపించే బాధ్యతను సింధుకు భారత ప్రభుత్వం అప్పగించింది. సింధూతో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిమహారాజ్, రికర్వ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, అథ్లెట్లు యర్రాజి జ్యోతి, దండి జ్యోతికశ్రీ, పారా రోవర్ కె.నారాయణ, పారా సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పారిస్ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు ఇప్పటికే కొందరు క్రీడాకారులు ఆ దేశానికి చేరుకున్నారు. రాష్ట్రంలో పెరిగిన క్రీడా ప్రమాణాలుగడిచిన ఐదేళ్లలో రాష్ట్ర యువతలో క్రీడా ప్రమాణాలు పెరిగాయనడానికి ప్రపంచ అత్యున్నత క్రీడా సంబరం ఒలింపిక్స్కు గతం కంటే రెట్టింపు సంఖ్యలో ఎంపికైన క్రీడాకారులే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్కు ఆంధ్రప్రదేశ్ నుంచి సింధు (బ్యాడ్మింటన్), శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), రజిని (హాకీ) ఎంపికయ్యారు. 2020 టోక్యో ఒలింపిక్స్కు సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), రజిని (హాకీ) ఎంపికయ్యారు. అయితే ఈ దఫా జరిగే ఒలింపిక్స్కు ఎంపికైన ఏడుగురు క్రీడాకారుల్లో ఐదుగురు కొత్త వారు ఉన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో ఎలాగైనా పతకం సాధించాలనే కసితో అథ్లెట్లు జ్యోతికశ్రీ, జ్యోతి, ఆర్చర్ ధీరజ్, పారా ఒలింపిక్స్ క్రీడాకారులు నారాయణ, అర్షద్ గత నాలుగేళ్లుగా కఠోర శిక్షణ తీసుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి క్రీడాకారులు సింధు, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, హాకీ క్రీడాకారిణి రజిని, సాత్విక్ సాయిరాజ్తో పాటు పలువురిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సన్మానించి, నగదు ప్రోత్సాహకాలు ఇచ్చారు. అంతేగాక అకాడమీ ఏర్పాటుకు భూములను కేటాయించారు. దీంతో జ్యోతి సురేఖకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ చొరవ, క్రీడాకారులకు లభిస్తున్న భరోసాతో క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్న యువత ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ తలుపులు తడుతున్నారు.స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధుఅంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు విజయవాడ వాసి. ఇప్పటి వరకు రెండు ఒలింపిక్ మెడల్స్ (రియో, టోక్యో)ను కైవసం చేసుకుంది. 2017లో ప్రపంచంలో రెండో ర్యాంక్ సాధించిన ఆమె ప్రస్తుతం 11వ ర్యాంక్లో కొనసాగుతోంది. ఏషియన్ గేమ్స్లో రెండు, కామన్వెల్త్లో మూడు, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో ఐదు పతకాలు సాధించింది. ఇప్పటి వరకు మొత్తం 454 మ్యాచ్లు ఆడింది. 2020లో పద్మభూషణ్, 2016లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, 2015లో పద్మశ్రీ, 2013లో అర్జున అవార్డులతో భారత ప్రభుత్వం అమెను సత్కరించింది.రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన సాత్విక్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్కు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ పోటీల్లో మూడు, కామన్వెల్త్లో రెండు, బ్యాడ్మింటన్ ప్రపంచ పోటీల్లో ఒకటి, థామస్ కప్ పోటీల్లో ఒక పతకం సాధించాడు. 2015 నుంచి 2019 వరకు జరిగిన 10 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సిరీస్లలో తలపడి టైటిల్స్ సాధించాడు. భారత ప్రభుత్వం అతన్ని మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, అర్జున అవార్డ్లతో సత్కరించింది. బొమ్మదేవర ధీరజ్విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ తన ఆరో ఏట నుంచే రికర్వ్ ఆర్చరీలో శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ 15వ ర్యాంక్, ఆసియాలో నాలుగో ర్యాంక్, ఇండియాలో నంబర్–1 ర్యాంక్లో కొనసాగుతున్నాడు. త్వరలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో రికర్వ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో, టీం విభాగంలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆసియా కప్ పోటీల్లో ఒక పతకం, అంతర్జాతీయ పోటీల్లో నాలుగు, జాతీయ పోటీల్లో నాలుగు పతకాలు సాధించాడు. యర్రాజి జ్యోతివిశాఖపట్నానికి చెందిన యర్రాజి జ్యోతి అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో 10 పతకాలు, రెండు కామన్వెల్త్ పతకాలు, ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది. దండి జ్యోతికశ్రీపశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ఈ ఏడాది అథ్లెటిక్స్ 4(్ఠ)400 రిలే ఈవెంట్కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటి వరకు ఆమె రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది. ఒలింపిక్స్ భారత జట్లకు జరిగిన పోటీల్లో విశేష క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పారిస్కు పయనమైంది.షేక్ అర్షద్నంద్యాల జిల్లాకు చెందిన షేక్ అర్షద్ పారా సైక్లింగ్ చాంపియన్గా అవతరించాడు. ఇప్పటి వరకు జరిగిన పారా సైక్లింగ్ ఆసియా కప్ పోటీల్లో ఒక పతకం, అంతర్జాతీయ పోటీల్లో రెండు పతకాలు కైవసం చేసుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరిగే ఒలింపిక్స్లో తన సత్తా చాటేందుకు పారిస్కు పయనమవుతున్నాడు.కె.నారాయణకర్నూలుకు చెందిన కె.నారాయణ పారా ఒలింపిక్స్లో పారా రోవర్గా క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు అనేక జాతీయ, అంతర్జాతీయ పారా రోయింగ్ పోటీల్లో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పటి వరకు ఆరు అంతర్జాతీయ పతకాలు, నాలుగు జాతీయ పతకాలు సాధించాడు.
![Bjp High Command Focus On Uttarpradesh Bjp](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/yogi.jpg.webp?itok=Ef4l0JKD)
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
లక్నో: ఉత్తరప్రదేశ్లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే లక్నో విచ్చేసిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.ఓబీసీల్లో పట్టుండంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌర్యకు, సీఎం ఆదిత్యనాథ్కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు కేబినెట్ మీటింగ్లకు మౌర్య హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.ఈ కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్గా వెళ్లే అవకాశముంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. యూపీలో సీట్లు కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మ్యాజిక్ఫిగర్ను దాటలేక ఎన్డీఏ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
![Discussion in Jana Sena on separation of key department from Pawan departments](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/PAWAN-KALYAN-2.jpg.webp?itok=bO5xhT-h)
పవన్ శాఖలో చీలిక పీలికలు ఎందుకో!
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేటాయించిన మంత్రిత్వ శాఖలనూ చీలిక పీలికలు చేసి వేరే మంత్రికి అప్పగించడంపై ఆ పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైంది. ఒకే శాఖ పరిధిలో ఉండే విభాగాలను వేర్వేరు శాఖలుగా విభజించి ఇద్దరు మంత్రులకు కేటాయించడం హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను వేరు చేసి కొండపల్లి శ్రీనివాస్కు అప్పగించడం చర్చకు దారితీసింది. ఈ రెండింటికి ఇద్దరు మంత్రులు ఉన్నా రెండు శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఒకరే ఉండటం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ వరుసగా తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన శాఖల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల కొరత వేధిస్తోందని ఆయన చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు సెర్ప్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. దాదాపు 65 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా ఫింఛన్ల పంపిణీ సెర్ప్ నేతృత్వంలోనే సాగుతోంది. దీనికి డ్వాక్రా గ్రూపులు, వాటికనుగుణంగా వివిధ సంక్షేమ పథకాల అమలు కూడా సెర్ప్ పరిధిలోనే కొనసాగుతుంటాయి. అలాంటిది సెర్ప్ విభాగాన్ని పవన్ కళ్యాణ్కు కాకుండా మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అప్పగించడానికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. సెర్ప్కే అధికంగా నిధులుపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తం బడ్జెట్పరంగా చూసినా నిధుల కేటాయింపు సెర్ప్కే ఎక్కువగా ఉంటుంది. సెర్ప్ ద్వారా జరిగే పింఛన్ల పంపిణీకి ఏటా ప్రభుత్వం దాదాపు రూ.27 వేల కోట్లకు పైబడే నిధులు కేటాయిస్తోంది. ఇతర కార్యక్రమాలకు మరికొన్ని నిధులు ఎటూ తప్పనిసరి. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇతర అన్ని విభాగాలకు దాదాపు అంత బడ్జెట్ కేటాయింపులకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిలో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నేరుగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు కేటాయించే నిధులే. అందులో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల వాటా తక్కువే. ఓవైపు నిధుల కేటాయింపులోనూ అధిక వాటా కలిగి ఉండి, మరోవైపు ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యక్షంగా ప్రజల నుంచి మంచి పేరును తెచి్చపెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉన్న సెర్ప్ను పవన్ కళ్యాణ్కు కేటాయించకపోవడం ఏమిటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. నారాయణకు ప్రత్యేకం గ్రామాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో సెర్ప్ ఉన్నట్టే.. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మెప్మా పేరుతో ఒక విభాగం ఉంది. అయితే, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న మెప్మాను ఆ శాఖ మంత్రి నారాయణ పరిధిలోనే ఉంచడం గమనార్హం.
![Toli Ekadasi 2024: Importance And Significance](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/vishnu.jpg.webp?itok=EmZjlqf4)
తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..!
హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం..ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట.ఏకాదశి విశిష్టత..కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.ఏం చేయాలి..?ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజు జగన్నాథుడికి స్వర్ణాలంకారం జగన్నాథుడి తిరుగు రథయాత్ర మొదలైన మరునాడు– అంటే, తొలి ఏకాదశి రోజున జగన్నాథుని స్వర్ణాలంకృతుని చేస్తారు. దీనినే స్థానికంగా ‘సునా బేషొ’ అంటారు. జగన్నాథుడి స్వర్ణాలంకార వేషాన్నే ‘రాజ వేషం’, ‘రాజాధిరాజ వేషం’ అని కూడా అంటారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్లు, చేతులను, ముఖాలకు బంగారు ఊర్థ్వపుండ్రాలను అలంకరిస్తారు. జగన్నాథుడి ఊర్ధ్వపుండ్రానికి వజ్రం, బలభద్రునికి కెంపు, సుభద్ర ఊర్ధ్వపుండ్రానికి పచ్చ ΄దిగి ఉంటాయి.జగన్నాథుడి చేతుల్లో బంగారు శంఖు చక్రాలను, బలభద్రుడి చేతుల్లో బంగారు గద, హలాయుధాలను అలంకరిస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరీటాలు, కర్ణకుండలాలు, నాసాభరణాలు, కంఠహారాలు, బంగారు పుష్పమాలలు, వడ్డాణాలు, రాహురేఖలను అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరిస్తారు.(చదవండి: రూ.14 వేలకే 'దివ్య దక్షిణ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!)
![Karnataka Government Approval For 100 Reservation In Private Firms For Kannadigas](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/siddaramaiah_0.jpg.webp?itok=ZWen3_jO)
ప్రైవేట్ సంస్థల్లో వారికి 100 శాతం రిజర్వేషన్లు..కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సీ,గ్రూప్ డీ పోస్టుల్లో కన్నడిగులకు (కన్నడ ప్రజలు) 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన బిల్లును కేబినెట్ ఆమోదం తెలిపింది.సోమవారం (జులై 15)న జరిగిన కేబినెట్ సమావేశంలో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చ జరిగింది. ఆ భేటీ తర్వాత రిజర్వేషన్ బిల్లుపై కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు’ అని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳಲ್ಲಿ "ಸಿ ಮತ್ತು ಡಿ" ದರ್ಜೆಯ ಹುದ್ದೆಗಳಿಗೆ ನೂರಕ್ಕೆ ನೂರರಷ್ಟು ಕನ್ನಡಿಗರ ನೇಮಕಾತಿಯನ್ನು ಕಡ್ಡಾಯಗೊಳಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ನಿನ್ನೆ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ ನೆಮ್ಮದಿಯ ಬದುಕು ಕಟ್ಟಿಕೊಳ್ಳಲು… pic.twitter.com/UwvsJtrT2q— Siddaramaiah (@siddaramaiah) July 16, 2024తమ ప్రభుత్వం కన్నడ ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించాలని, వారికి అన్నీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి అన్నారు.ఈ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు న్యాయశాఖ వర్గాలు తెలిపాయి.
![tribal story upcoming movies in Tollywood](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/Prabhas%20Salarr.jpg.webp?itok=5RE2NWIu)
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్ఫుల్గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?
డ్రగ్స్ కేసులో 18 మందికి రిమాండ్
ఆ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి: విశ్వక్ సేన్
TTD: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
అఫ్గానిస్తాన్లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
బ్యాంకాక్లో సంచలనం.. ఆరుగురు టూరిస్టుల మిస్టరీ డెత్
ఎయిర్పోర్ట్లో కొత్త లాంజ్
కాంగోలో హింసాకాండ.. తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది మృతి
ధ్యానం.. ఆవాహనం
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
ఐఫా స్టార్స్.. 2024–హోస్ట్స్గా రానా, తేజా సజ్జ
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
కాంగోలో హింసాకాండ.. తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది మృతి
బడ్జెట్లో ‘ఫేమ్ 3’ ప్రకటన ఉండదు: కేంద్రమంత్రి
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..! సీక్రెట్ సర్వీసెస్కు ముందే తెలుసా..?
Ratna Bhandar: రేపు మళ్లీ రత్న భాండాగారం ఓపెన్
రైలు ఢీకొని పులిపిల్ల మృతి.. మరో రెండింటికి గాయాలు
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాద శిబిరాలు?
తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?
డ్రగ్స్ కేసులో 18 మందికి రిమాండ్
ఆ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి: విశ్వక్ సేన్
TTD: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
అఫ్గానిస్తాన్లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
బ్యాంకాక్లో సంచలనం.. ఆరుగురు టూరిస్టుల మిస్టరీ డెత్
ఎయిర్పోర్ట్లో కొత్త లాంజ్
కాంగోలో హింసాకాండ.. తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది మృతి
ధ్యానం.. ఆవాహనం
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
ఐఫా స్టార్స్.. 2024–హోస్ట్స్గా రానా, తేజా సజ్జ
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
కాంగోలో హింసాకాండ.. తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది మృతి
బడ్జెట్లో ‘ఫేమ్ 3’ ప్రకటన ఉండదు: కేంద్రమంత్రి
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..! సీక్రెట్ సర్వీసెస్కు ముందే తెలుసా..?
Ratna Bhandar: రేపు మళ్లీ రత్న భాండాగారం ఓపెన్
రైలు ఢీకొని పులిపిల్ల మృతి.. మరో రెండింటికి గాయాలు
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాద శిబిరాలు?
సినిమా
![Actresses Social Media posts Goes Viral In Instagram](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/sci.jpeg.webp?itok=t21pOYoc)
వైట్ డ్రెస్లో శ్రీలీల హోయలు.. ట్రెండీ లుక్లో బిగ్బాస్ బ్యూటీ!
క్రేజీ లుక్లో హీరోయిన్ శ్రీలీల..ఎరుపు డ్రెస్లో శ్రీముఖి హోయలు..కసరత్తులు చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ...దేవర భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్..ట్రెడిషనల్ లుక్లో బిగ్బాస్ భామ ఇనయా సుల్తానా పోజులు..పుష్ప భామ రష్మిక మందన్నా స్మైలీ లుక్స్... View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14)
![Kalki Director Nag Ashwin Reveals Most Awaited Sequel Film Name](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/as.jpg.webp?itok=DCaEeb37)
ఆ సినిమా కోసం క్యూరియాసిటీతో ఉన్నా: కల్కి డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ నాగ్ అశ్విన్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం చాలా సినీ యూనివర్స్లు వస్తున్నాయని.. ముఖ్యంగా పుష్ప-2, యానిమల్, సలార్ లాంటి సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయి.. ఒక అభిమానిగా మీరు ఏ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా పేరును నాగ్ రివీల్ చేశారు. తాను ప్రభాస్ మూవీ సలార్ పార్ట్-2 కోసం క్యూరియాసిటీతో ఉన్నానని నాగ్ అశ్విన్ అన్నారు. సలార్ స్టోరీ చాలా బాగా నచ్చిందని తెలిపారు. ముందుగా నేను గేమ్ ఆఫ్ త్రోన్స్కు వీరాభిమానిని.. అదోక విభిన్నమైన ప్రపంచం.. విభిన్నమైన హౌస్లు ఉంటాయి.. సలార్ కూడా అలాగే అనిపిస్తోందని అన్నారు. డిఫరెంట్ వరల్డ్, హిస్టరీ ఆధారంగా వస్తోన్న సలార్-2 కోసమే తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.కాగా.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ క్లైమాక్స్లో దేవ (ప్రభాస్) శౌర్యంగ అని రివీల్ అవుతుంది. దీంతో ఆ తర్వాత ఖాన్సార్లో ఏం జరిగిందనే దానిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం పేరుతో రానుంది."I'm definitely curious about #Salaar because the story just started there. I'm a huge Game of Thrones fan, so seeing different houses and stories makes me excited."My hero Prabhas - #NagAshwin 😍#Prabhas #Kalki2898AD pic.twitter.com/88NKadDsHT— Prabhas' Realm (@PrabhasRealm) July 16, 2024
![Kichcha Sudeep MAX Movie Official Teaser Out Now](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/sude.jpg.webp?itok=38mqlSFT)
విలన్గా సునీల్ ఎంట్రీ.. టీజర్ అదిరిపోయింది!
రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్వుడ్లో మ్యాక్స్ మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.టాలీవుడ్ నటుడు సునీల్ విలన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్లో సుదీప్ డిఫరెంట్ లుట్లో కనిపించారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్వుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వస్తోన్న మ్యాక్స్ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో కనిపించడంతో.. సుదీప్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.MAX Takes Charge! 💥👿🔗https://t.co/GbhvhNzPAl#MAXManiaBegins with the explosive #MaxTeaser 🔥 #boloMAXii@Max_themovie @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shivakumarart @shekarchandra71 @ganeshbaabu21 @dhilipaction @ChethanDsouza @saregamasouth…— Kichcha Sudeepa (@KicchaSudeep) July 16, 2024
![Yogi Babu Boomer Uncle Telugu Movie OTT Date locked](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/boomer-uncle.jpg.webp?itok=3Vid5bGs)
ఓటీటీలో ఫుల్ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ యోగిబాబు ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'బూమర్ అంకుల్'. కోలీవుడ్లో మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. స్వదీస్ ఎమ్ఎస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓవియా, రోబో శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది.ఇప్పటి వరకూ తమిళ్లో అందుబాటులో ఉన్న 'బూమర్ అంకుల్' సినిమా తెలుగులో జులై 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు తెలుగు ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బూమర్ అంకుల్ గట్టిగా నవ్విస్తాడంటూ స్ట్రీమింగ్ డేట్ను తమ సోషల్ మీడియా ఖాతాలో ఆహా వెళ్లడించింది. ఇందులో నేసమ్ (యోగిబాబు)- అమీ (ఓవియా) దంపతులుగా కనిపిస్తారు. విదేశీ యువతి అమీతో నేసమ్కు పరిచయం ఏర్పడటం.. ఆపై పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కానీ వారు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు..? విడాకులు కావాలనుకున్న నేసమ్కు తన సతీమణి ఎలాంటి కండీషన్ పెడుతుంది..? వంటి అంశాలను జులై 20న అహాలో చూడండి.
క్రీడలు
![Southgate resigns as England coach](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/ghosh.jpg.webp?itok=JwsSyWA8)
ఇంగ్లండ్ కోచ్ పదవికి సౌత్గేట్ రాజీనామా
గత ఎనిమిదేళ్లుగా ఇంగ్లండ్ పుట్బాల్ జట్టుకు కోచ్గా ఉన్న గ్యారెత్ సౌత్గేట్ తన పదవికి రాజీనామా చేశారు. బెర్లిన్లో జరిగిన యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్ 1–2 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. 2016 నుంచి సౌత్గేట్ శిక్షణలో ఇంగ్లండ్ రాటుదేలింది. 2018 ‘ఫిఫా’ ప్రపంచకప్లో సెమీఫైనల్ చేరుకోవడంతోపాటు 2021, 2024 యూరో టోర్నీ ల్లో రన్నరప్గా నిలిచింది. ‘మార్పు కోసం సమయం ఆసన్నమైంది. కొత్త అధ్యాయానికి తెర లేవనుంది’ అని సౌత్గేట్ వ్యాఖ్యానించారు.
![Yashasvi Jaiswal Is 47 Runs Away To Become First Player To Score 1000 Runs In International Cricket In 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/qwe.jpg.webp?itok=AejMw5e2)
యశస్వి జైస్వాల్.. మరో 47 పరుగులు చేస్తే..!
ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. యశస్వి.. త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లో మరో 47 పరుగులు చేస్తే.. ఈ ఏడాది 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. యశస్వి ఈ ఏడాది ఇప్పటివరకు 16 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 953 పరుగులు చేశాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి తర్వాతి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్ల్లో సెంచరీ, 8 అర్దసెంచరీల సాయంతో 844 పరుగులు చేశాడు. ఈ జాబితాలో యశస్వి, జద్రాన్ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 22 ఇన్నింగ్స్లు ఆడి 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 833 పరుగులు చేశాడు. ఈ జాబితా టాప్-10లో యశస్వి, జద్రాన్, రోహిత్ తర్వాత కుశాల్ మెండిస్ (833), రహ్మానుల్లా గుర్బాజ్ (773), బాబర్ ఆజమ్ (709), శుభ్మన్ గిల్ (691), పథుమ్ నిస్సంక (680), మహ్మద్ రిజ్వాన్ (632), చరిత్ అసలంక (596) ఉన్నారు.ఇదిలా ఉంటే, ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో యశస్వి మూడు మ్యాచ్లు ఆడి 70కి పైగా సగటుతో 141 పరుగులు చేశాడు. ఈ సిరీస్ నాలుగో టీ20లో యశస్వి అజేయమైన 93 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ తదుపరి జులై 27 నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది.
![Delhi Capitals Reject Sourav Ganguly As Head Coach After Sacking Ponting](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/asx.jpg.webp?itok=mDeyjEWO)
సౌరవ్ గంగూలీకి ఆశాభంగం..!
ఢిల్లీ క్యాపిటల్స్కు హెడ్ కోచ్ కావాలని ఆశపడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఆశాభంగం ఎదురైంది. దాదాను హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం చెప్పకనే చెప్పింది. డీసీ.. గౌతమ్ గంభీర్ లాంటి ట్రాక్ రికార్డు కలిగిన వ్యక్తిని హెడ్ కోచ్గా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం ఇద్దరు ముగ్గురు వరల్డ్కప్ విన్నర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్నాడు. అలాగే అతను ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీలైన దుబాయ్ క్యాపిటల్స్ (ILT20), ప్రిటోరియా క్యాపిటల్స్ (SA20) మంచి చెడ్డలు కూడా చూస్తున్నాడు. ఇన్ని బాధ్యతలు మోస్తుండటంతో డీసీ యాజమాన్యం గంగూలీని హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తుంది.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఏడు సీజన్ల పాటు హెడ్ కోచ్గా వ్యవహరించిన పాంటింగ్ డీసీని ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలబెట్టలేకపోయాడు. ఇదే కారణంగా డీసీ మేనేజ్మెంట్ అతనిపై వేటు వేసింది. పాంటింగ్ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాక గంగూలీ ఈ పదవిపై ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. ఓ బెంగాలీ పేపర్ను ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.ఇదిలా ఉంటే, పాంటింగ్ ఆథ్వర్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒకే ఒక్కసారి (2020) ఫైనల్కు చేరింది. 2018 ఎడిషన్లో తొలిసారి పాంటింగ్ ఆథ్వర్యంలో బరిలోకి దిగిన డీసీ.. ఆ సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆతర్వాతి సీజన్లో (2019) మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ.. 2021 సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. గడిచిన మూడు సీజన్లలో ఢిల్లీ 5, 9, 6 స్థానాల్లో నిలిచింది.
![Internet Shocked As Pic Of Sri Lanka WC Winning Captain Goes Viral](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/1234_1.jpg.webp?itok=LcU0U-0k)
కపిల్ దేవ్ పక్కనున్న దిగ్గజ క్రికెటర్ను గుర్తుపట్టారా?
క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు కన్నులపండుగే! అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇందులో.. భారత్కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ను ఈజీగానే గుర్తుపట్టారు నెటిజన్లు. అయితే, ఫొటోలో ఉన్న మరొక వ్యక్తి గురించి మాత్రం నమ్మలేకపోతున్నాం అంటున్నారు.దిగ్గజ బ్యాటర్ఆయన పూర్వ రూపానికి.. ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. కపిల్ దేవ్తో పాటు ఉన్న క్రికెటర్ మరెవరో కాదు అర్జున్ రణతుంగ. శ్రీలంకను 1996లో వరల్డ్కప్ విజేతగా నిలిపిన దిగ్గజ బ్యాటర్.శ్రీలంక తరఫున 1982 నుంచి 2000 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. కెప్టెన్గానూ వ్యవహరించాడు. మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన అర్జున్ రణతుంగ ఆయా ఫార్మాట్లలో 5105, 7456 పరుగులు సాధించాడు.పార్ట్టైమ్ బౌలర్ అయిన ఈ రైటార్మ్ మీడియం పేసర్ ఖాతాలో టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అర్జున్ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు.శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగానూశ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో భాగమయ్యాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్ రణతుంగ- కపిల్ దేవ్ ఫొటో తెరమీదకు రావడం విశేషం.ఇందులో అర్జున్ రణతుంగను చూసిన నెటిజన్లు.. ‘‘90వ దశకంలో ఆయన మ్యాచ్లు చూశాం. అసలు ఆయనా ఈయనా ఒక్కరేనా? అస్సలు నమ్మలేకపోతున్నాం. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల జూలై 27న తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టూర్తో టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. చదవండి: ‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’Two World Cup winning captains. pic.twitter.com/zJane9Oq0u— Rex Clementine (@RexClementine) July 16, 2024
బిజినెస్
![Swiggy Zomato Might Soon Deliver Alcohol In These States Details](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/alcohol-home-delivery.jpg.webp?itok=RvE5cYT4)
మద్యం హోమ్ డెలివరీ!.. త్వరలో ఈ రాష్ట్రాల్లో..
ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి వాటిని హోమ్ డెలివరీ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్వహించడానికి యోచిస్తున్నారు. మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నట్లు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ విధానం ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం హోమ్ డెలివరీ చేయడానికి అనుమతించాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ విధానంలో మద్యం డెలివరీ చేస్తున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమ్మకాలు 20 నుంచి 30 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వంద శాతం మంది హైదరాబాద్ వాసులు మద్యం హోమ్ డెలివరీ విధానాలకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఇది ఎప్పుడు అమలులోకి వస్తుంది అనే విషయానికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.మద్యం హోమ్ డెలివరీ అనేది పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి, పెద్ద నగరాల్లో మితమైన మద్యం అందించడానికి ఉపయోగపడుతుంది. మహిళలు, సీనియర్ సిటిజన్లు మద్యం కోసం షాప్ ముందు నిలబడాల్సిన అవసరం ఉండదని ఓ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అయితే మద్యం హోమ్ డెలివరీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన ఉందని పలువురు చెబుతున్నారు.
![Kia EV6 Recalled in India](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/kia-ev6.jpg.webp?itok=pZEG5HUh)
కొరియన్ బ్రాండ్ కీలక నిర్ణయం.. ఇండియాలో 1138 కార్లు వెనక్కి
భారతీయ విఫణిలో అధిక ప్రజాదరణ పొందిన సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. తన ఈవీ6 కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్లకు ఎందుకు రీకాల్ ప్రకటించింది? ఎన్ని కార్లపై ఈ ప్రభావం చూపుతుంది అనే విషయాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..కియా ఈవీ6 కార్లలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో ఏర్పడిన లోపం కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇది 1138 యూనిట్లపై ప్రభావం చూపుతుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి కంపెనీ స్వచ్చందంగానే రీకాల్ ప్రకటించింది. ఐసీసీయూ లోపం 12 వోల్ట్స్ బ్యాటరీ పనితీరు మీద ప్రభావం చూపుతుంది.2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన కియా ఈవీ6 కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. లోపాన్ని సరిచేయడానికి కంపెనీ కారులోని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంది. దీనికోసం అదనంగా డబ్బు చెల్లించాల్సిన పని లేదు. కంపెనీ త్వరలోనే కస్టమర్లకు ఈ సందేశాన్ని పంపిస్తుంది.
![Russian Antivirus Software Company Kaspersky to Exit America Market](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/kaspersky.jpg.webp?itok=n5Ssj-TG)
అమెరికాను వీడనున్న దిగ్గజ కంపెనీ.. ఉద్యోగులపై తీవ్ర ప్రభావం!
రష్యాకు చెందిన ప్రముఖ యాంటి వైరస్ సాఫ్ట్వేర్ కంపెనీ 'కాస్పర్స్కై' (Kaspesky) తన కార్యకలాపాలను నిలిపివేయడానికి సిద్ధమైంది. జో బైడెన్ కార్యవర్గం కంపెనీ ఉత్పత్తులను, పంపిణీని నిషేధించడంతో యూఎస్ నుంచి బయటకు వెళ్లాలని యోచిస్తోంది. దేశంలో వ్యాపారవకాశాలు మునుపటిలా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.ఈ కంపెనీపై మాస్కో ప్రభావం, అమెరికా మౌలిక సదుపాయాకు, సేవలకు ప్రమాదాన్ని కలిగిస్తాయని యూఎస్ వాణిజ్య కార్యదర్శి 'గినా రైమోండో' గత నెలలోనే వెల్లడించారు. అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీ సేకరిస్తుందని, ఈ కారణంగానే కాస్పర్స్కై కంపెనీపై చర్యలు తీసుకోవడం జరిగిందని రైమోండో పేర్కొన్నారు.గినా రైమోండో వ్యాఖ్యలను కాస్పర్స్కై కొట్టిపారేసింది. అంతే కాకుండా దేశంలో కంపెనీ తన కార్య కలాపాలనను జులై 20 నుంచి క్రమంగా తగ్గించడం ప్రారంభిస్తుంది. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకుంటుందని వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ అమెరికా మార్కెట్లో యాంటీవైరస్, సైబర్ సెక్యూరిటీ టూల్స్ విక్రయాన్ని కూడా నిలిపివేసింది. విక్రేతలు ఎవరైన తమకు తెలియకుండా తమ ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ హెచ్చరించింది.కాస్పర్స్కై కంపెనీ మాస్కోలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. అయితే ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లో ఆఫీసులున్నాయి. కాస్పర్స్కైలో 40 కోట్ల కంటే ఎక్కువమంది పనిచేస్తున్నారు. మొత్తం 200 కంటే ఎక్కువ దేశాల్లో 2,70,000 కంపెనీలు ఈ సాఫ్ట్వేర్ వాడుతున్నట్లు సమాచారం.
![Stock Market Closing Update 16 July 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/stock-market.jpg.webp?itok=QA4OwvdX)
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 80,708.86 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,602.70 వద్ద నిలిచాయి.టాప్ జెయినర్ జాబితాలో కోల్ ఇండియా, బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్), హిందూస్తాన్ యూనీ లివర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, భారతి ఎయిర్టెల్ కంపెనీలు ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ వంటివి టాప్ లూజర్స్లో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ
![Chandipura Virus spreads rapidly in children symptoms and tips](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/Chandipura%20Virus.jpg.webp?itok=4fA3NClR)
ప్రాణాంతక చండీపురా వైరస్ : అసలేంటీ వైరస్, లక్షణాలు
వర్షాకాలంలో వివిధ రకాల అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. తాజాగా గుజరాత్, రాజస్థాన్లలో ‘చండీపురా’ వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్కారణంగా చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుజరాత్ లోని ఆరావళి సబర్ కాంతా జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలువురు చిన్నారులు మృతిచెందారు. చండీపురా వైరస్ ఎంత ప్రమాదకరమైనది? లక్షణాలేంటి? దీని బారినుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.చండీపురా వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకిన పిల్లవాడు సకాలంలో చికిత్స పొందకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.చండీపురా వైరస్ లక్షణాలు సాధారణం ఫ్లూతో సమానంగా ఉంటాయి లక్షణాలు. దీంతో మామూలుగా జ్వరమే అనుకోవడంతో ప్రమాదం పెరుగుతోంది. చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. అధిక జ్వరం, జ్వరం వేగంగా పెరగడం. వాంతులు, విరేచనాలు , తలనొప్పి, ఒక్కోసారి తలనొప్పితో పాటు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకంగా మారుతోంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.చండీపురా వైరస్ అంటే ఏమిటి?చండీపురా వ్యాధి అనేది ఫ్లూ నుండి మెదడు జ్వరం వరకు తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వైరస్. ఈ వైరస్ తొలి కేసులు 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనిపించింది. అందుకే దీనికి చండీపురా అని పేరు పెట్టారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన RNA వైరస్. ఇది కీటకాలు, దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది.ఏ వయస్సు పిల్లలకు ప్రమాదంచండీపురా వైరస్ ఎక్కువగా 9 నెలల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్ పిల్లలపై దాడి చేసినప్పుడు, సోకిన పిల్లలకి హై ఫీవర్, జ్వరం, విరేచనాలు, వాంతులు, బ్రెయిన్ ఫీవర్ ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్కు వ్యాక్సిన్ లేదు. కనుక అప్రమత్తత చాలా అవసరం. చండీపురా వైరస్ను ఎలా నివారించాలి?దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది కనుగ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఆహారం విషయంలో జ్రాగ్రత్త వహించాలి. చండీపురా వైరస్ను నివారించడానికి, దోమలు, ఈగలు , కీటకాలను నివారించడం ముఖ్యం. పిల్లలకు రాత్రిపూట పూర్తిగా కప్పే దుస్తులు ధరించేలా జాగ్రత్తపడాలి. దోమ తెరలు వాడాలి. దోమల నివారణ మందు వాడండి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు , తలుపులు మూసి ఉంచాలి.
![Ruchi Kalra idea rejected 73 times her 2 companies worth Rs 52k crore](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/Ruchi%20Kalra%20-successstory.jpg.webp?itok=kHwZxpXY)
73 సార్లు తిరస్కరించారు : కట్ చేస్తే..రూ. వేలకోట్ల విలువైన కంపెనీలకు సారధి
స్టార్టప్ ఎకోసిస్టమ్లో అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ రుచి కల్రా. అనేక సవాళ్లను అధిగమించి, అసాధారణ విజయాన్ని సాధించిన స్వీయ-నిర్మిత వ్యవస్థాపకురాలు. స్టార్టప్ ప్రపంచంలో, భారతీయ స్టార్టప్ పరిశ్రమలో సూపర్వుమన్ రుచికల్రా. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. తిరస్కారంలోంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో సాధించిన విజయం ఉన్నాయి. రండి, రుచికల్రా సక్సెస్ గురించి తెలుసుకుందాం.రుచి కల్రా ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్. బీటెక్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా సాధించింది. వ్యాపారవేత్తగా రాణించే కంటే ముందు కల్రా మెకిన్సేలో ఎనిమిది సంవత్సరాల పాటు భాగస్వామిగా పనిచేశారు.అయితే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె పెట్టుబడిదారులను సంప్రదించారు. కానీ ఆమె ఐడియాను అందరూ 73 మంది తిరస్కరించారు. స్వయంగా కల్రా 2016లో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. భర్తతో కలిసి రెండు యునికార్న్ కంపెనీలను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తోంది. 2022 నాటికి ఆమె నికర విలువ రూ. 2600 కోట్లు. వాటి విలువ రూ. 52,000 కోట్లుగా అంచనా2015లో భర్త ఆశిష్ మొహపాత్, మరో ఇద్దరితో కలిసి ముడి పదార్థాలు, పారిశ్రామిక సరఫరాలను విక్రయించే B2B ప్లాట్ఫారమ్ ఆఫ్ బిజినెస్ను (OfBusiness) స్థాపించారు ఈ జంట. ఈ కంపెనీ విలువ రూ.44,000 కోట్లు. ఆఫ్బిజినెస్ రుణ విభాగమైన ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్కు సీఈవో కూడా కల్రా. దీని విలువ. రూ. 8200 కోట్లు.2017లో, కల్రా వారి ప్లాట్ఫారమ్లో కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ అందించడానికి ఆక్సిజోను స్థాపించారు, చిన్న ,మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు అందించడంలో పాపులర్ అయింది. 2021లో రూ. 197.53 కోట్లుగా ఉన్న ఆక్సిజో ఆదాయం మరు సంవత్సరం నాటికి రూ. 312.97 కోట్లకు పెరిగింది. 2022లో ఆఫ్బిజినెస్ ఆదాయం దాదాపు రూ. 7269 కోట్లు. పన్ను తర్వాత లాభం రూ. 125.63 కోట్లుగా నమోదైంది.మహిళలకు సందేశం‘‘వ్యవస్థాపక ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే కొన్ని పక్షపాతాలు చాలా సార్లు బయటికి కనిపించవు. కొన్ని అంతర్లీనంగా ఉంటాయి. అద్దంలో చూసుకొని నేను బాగానే ఉన్నా అనే విశ్వాసాన్ని పెంచుకోండి. వక్తిగత బలహీనతలను కరియర్లోకి రానివ్వద్దు. ప్రతీ దాంట్లో మనం నిష్ణాతులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు తెలియని విషయంలో సహాయం కోరడం వల్ల నష్టం లేదు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, చుట్టుపక్కల.. ఇలా ప్రతి ఒక్కరి కలహా తీసుకోండి. నా భర్త చాలా సపోర్ట్ చేశారు. నా ఆరేళ్ల కుమార్తె కూడా స్ట్రాంగ్ పిల్లర్గా ఉంది. నేను చాలా మందికి రుణపడి ఉంటాను’’ పెద్ద పెద్ద స్టార్టప్లు చేయలేని ఫీట్ను భర్తతో కలిసి సాధించారు రుచి కల్రా. రెండు భారీ, లాభదాయకమైన కంపెనీల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. మెకిన్సే అండ్ కోలో పనిచేస్తున్నపుడే రుచి, ఆశిష్ కలుసుకున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారి దంపతులయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు.
![Mustard benefits cholesterol and blood sugar levels go down](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/mustard%20benefits.jpg.webp?itok=3_ZREvqW)
ఆవాలతో ప్రయోజనాలు: చిన్నగా ఉన్నాయి కదాని లైట్ తీసుకోవద్దు!
షుగర్ లేదా మధుమేహం(Diabetes) ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు కారణంగా రోజు రోజుకు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాగే లక్షలాదిమంది ప్రీడయాబెటిస్తో జీవిస్తున్నారు. అయితే రోజూ వ్యాయామంతోపాటు కొన్ని ఆహార జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాల వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మన వంట ఇంట్లో సులువుగా లభించే ఆవాలతో ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఆవాలు చూడ్డానికి చిన్నవిగా ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మాత్రం చాలా శక్తివంతమైనవి. మన ఆహారంలో ఆవాలకు చాలా ప్రాధాన్యత ఉంది. రోజూ పోపు దినుసుగా వాడటంతోపాటు, మన ఆహారంలో భాగమైన ఆవకాయ లాంటి పచ్చళ్ళలో ఆవ పిండిని బాగా వాడతాము. కొన్ని ప్రాంతాలో ఆవకూర, ఆవనూనెను కూడా బాగా బాడతారు.ఆవాలు ఆరోగ్య ప్రయోజనాలుపుష్కలంగాపోషకాలు: ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వివిధ పోషకాలకు ఆవాలు మంచి మూలం.ఆవపిండిలో గ్లూకోసినోలేట్స్, మైరోసినేస్ వంటి సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఆవపిండిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఐసోథియోసైనేట్స్ అనే సమ్మేళనాలుంటాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఆవాలు లేదా ఆవాల నూనెతో శరీరంలో మంట తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆవలోని సెలీనియం ఎముకలకు బలాన్నిస్తుంది.జుట్టు, దంతాలను బలోపేతం చేయడానికి కూడా ఆవాలు సహాయపడతాయి. ఆవాలులో కార్బోహైడ్రేట్లు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అలాగే ఆవాలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది.గతంలో జరిగిన అధ్యయనం ప్రకారం ఆవాల వినియోగం ద్వారా రక్తంలో గ్లూకోజ్ ,వారి కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ముగ్గురికి గ్లూకోజ్ స్థాయిలు 46శాతం తగ్గాయి. కొలెస్ట్రాల్ స్థాయి సగటున 10శాతం తగ్గింది. చిగుళ్ళు, ఎముకలు, దంతాల నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి ఈ గింజలు. చర్మానికి కాంతినిస్తాయి. పైల్స్ నొప్పి నివారణలో కూడా ఆవనూనె బాగా ఉపయోగపడుతుంది.ఆహారంలో ఎలా చేర్చుకోవాలిఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనె కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు.
![How To Prevent Colds And Flu In This Rainy Season](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/rainy.jpg.webp?itok=wG_bNGt5)
వర్షాకాలం..వ్యాధుల కాలం..వీటి బారినపడకూడదంటే..!
సూర్యుడి భగభగలు నుంచి తొలకరి జల్లులతో వర్షాకాలం సమీపించి చల్లదనంతో సేదతీరేలా చేస్తుంది. కానీ ఇది ఎంత చల్లగా ఆహ్లాదంగా ఉన్నా..ఈ తేమకు ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు ప్రజలు. వీటిని ఎలా ఎదుర్కోవాలి?, ఈ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.!వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సీజన్లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. ఈ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.జలుబు, జ్వరం..ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం సర్వ సాధారణం. వైరల్ ఇన్ఫెక్షన్లకి ఇవి సాధారణ రూపం. కాబట్టి, వీటి కారణంగా ఎక్కువగా చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అసలు సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.దోమలు..రుతుపవనాలు వచ్చాయంటే చాలు మలేరియా వచ్చిట్లే. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. దీని వల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి.డెంగ్యూ..డెంగ్యూ జ్వరం పెద్ద సమస్యే. ప్రాణాంతకంగా మారింది. ఇది డెంగ్యూ వైరస్ కారణంగా వచ్చినప్పటికీ, క్యారియర్ దోమ, కాబట్టి, దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు.కలరా..కలరా అనేది కలుషిత నీటి ద్వారా వచ్చే సమస్య. ఇది జీర్ణాశయ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల చాలా మంచిది.టైఫాయిడ్..టైఫాయిడ్ ఫీవర్ కూడా కలుషిత ఆహారం, నీటి కారణంగా వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ వల్ల వచ్చే మరో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించడం, పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరం చేయొచ్చు.హెపటైటిస్..కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకడం, కలుషితాహారం, నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య వస్తుంది. ఈ సమస్య లక్షణాలు జ్వరం, వాంతులు, దద్దుర్లు మొదలైనవి వస్తాయి. సరైన పరిశుభ్రతను పాటించడం ముఖ్యం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వలన ఎక్కువగా జలుబు, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మాస్క్ ధరించి దీని బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు వేడి నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక గొంతు నొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు అయిల్ ఫుడ్ని దూరంగా పెట్టాలని సూచించారు. ఆహారం తిన్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలని, ఉప్పు నీటిని వాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల భారీ నుండి తప్పించుకోవచ్చు. అంతేగాదు వర్షాకాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందు నుంచి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.పోషకాహారం తీసుకోవాలి.ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.కాచి చల్లార్చిన నీటిని తాగాలి.దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి.దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరకు పాటించటం ఉత్తమం. (చదవండి: ఏకంగా 172 సార్లు పాము కాటుకి గురయ్యాడు..దీంతో అతడి రక్తం..!
ఫొటోలు
![rottela panduga in nellore 2024 photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/rottela%20panduga%20in%20nellore%202024%20photos_%20%281%29.jpg.webp?itok=TAPf9DT4)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/rottela%20panduga%20in%20nellore%202024%20photos_%20%281%29.jpg.webp?itok=TAPf9DT4)
నెల్లూరు : బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ భక్తుల సందడి (ఫొటోలు)
![Vijayawada: Actress Varsha launched Amjad Habib Premium Salon Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Vijayawada%20Actress%20Varsha%20launched%20Amjad%20Habib%20Premium%20Salon%20Photos_%20%281%29.jpg.webp?itok=zidWTOhn)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Vijayawada%20Actress%20Varsha%20launched%20Amjad%20Habib%20Premium%20Salon%20Photos_%20%281%29.jpg.webp?itok=zidWTOhn)
విజయవాడ : అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్ ని ప్రారంభించిన సినీనటి వర్ష (ఫొటోలు)
![Pushpa Pallaki Seva at Tirumala Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Pushpa%20Pallaki%20Seva%20at%20Tirumala%20Photos_1.jpg.webp?itok=6RLStDx_)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/17/Pushpa%20Pallaki%20Seva%20at%20Tirumala%20Photos_1.jpg.webp?itok=6RLStDx_)
తిరుమలలో వైభవంగా పుష్ప పల్లకి సేవ (ఫొటోలు)
![The International Indian Film Academy Utsavam 2024 Press Conference Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/16/The%20International%20Indian%20Film%20Academy%20Utsavam%202024%20Press%20Conference%20Photos%20%2816%29.jpg.webp?itok=WeCk70ga)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/16/The%20International%20Indian%20Film%20Academy%20Utsavam%202024%20Press%20Conference%20Photos%20%2816%29.jpg.webp?itok=WeCk70ga)
ఐఫా-2024 ప్రెస్ కాన్ఫరెన్స్లో మెరిసిన సినీతారలు (ఫొటోలు)
![Actress Pragya Jaiswal Latest Cute Photos In Pink Long Dress Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/16/Actress%20Pragya%20Jaiswal%20Latest%20Cute%20Photos%20In%20Pink%20Long%20Dress%20Photos%20%2813%29.jpg.webp?itok=If3Mky5f)
![Default image](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/16/Actress%20Pragya%20Jaiswal%20Latest%20Cute%20Photos%20In%20Pink%20Long%20Dress%20Photos%20%2813%29.jpg.webp?itok=If3Mky5f)
లెహెంగా లవ్: పింక్ డ్రెస్లో బార్బీ బొమ్మలా ప్రగ్యా జైశ్వాల్ (ఫొటోలు)
International View all
![title](/sites/default/files/article_images/2024/07/17/afghanistan.jpg)
అఫ్గానిస్తాన్లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
అఫ్గానిస్తాన్లో ప్రకృతి బీభత్సం సృష్టించింది.
![title](/sites/default/files/article_images/2024/07/17/bangkok.jpg)
బ్యాంకాక్లో సంచలనం.. ఆరుగురు టూరిస్టుల మిస్టరీ డెత్
బ్యాంకాక్: టూరిస్టుల స్వర్గధామం థాయ్లాండ్ రాజధాని బ్యాంకా
![title](/sites/default/files/article_images/2024/07/17/cango.jpg)
కాంగోలో హింసాకాండ.. తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది మృతి
కాంగోలోని ఒక గ్రామంలో సాయుధ దుండగులు జరిపిన హింసాకాండలో తొమ్మిది మంది
![title](/sites/default/files/article_images/2024/07/17/donaldtrump.jpg)
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..! సీక్రెట్ సర్వీసెస్కు ముందే తెలుసా..?
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ను చంపాలని కొందరు కుట్ర పన్నిన
![title](/sites/default/files/article_images/2024/07/17/oman.jpg)
Oman: చమురు నౌక మునక.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
ఒమన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
National View all
![title](/sites/default/files/article_images/2024/07/17/yogi.jpg)
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
లక్నో: ఉత్తరప్రదేశ్లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజ
![title](/sites/default/files/article_images/2024/07/17/train_0.jpg)
రైలు ఢీకొని పులిపిల్ల మృతి.. మరో రెండింటికి గాయాలు
మధ్యప్రదేశ్లోని సెహోర్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
![title](/sites/default/files/article_images/2024/07/17/border.jpg)
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాద శిబిరాలు?
పాక్ ఉగ్రవాదులు గత కొద్దిరోజులుగా భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని ఇటీవ
![title](/sites/default/files/article_images/2024/07/17/9898_0.jpg)
Ratna Bhandar: రేపు మళ్లీ రత్న భాండాగారం ఓపెన్
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రత్న భాండాగారం మ
![title](/sites/default/files/article_images/2024/07/17/siddaramaiah_0.jpg)
ప్రైవేట్ సంస్థల్లో వారికి 100 శాతం రిజర్వేషన్లు..కర్ణాటక కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక ని
NRI View all
![title](/sites/default/files/article_images/2024/07/16/YSR_75_Jayanthi.jpg)
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
ట్రెంటన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని
![title](/sites/default/files/article_images/2024/07/15/intel01.jpg)
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు
కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది.
![title](/sites/default/files/article_images/2024/07/13/labour.jpg)
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడి
![title](/sites/default/files/article_images/2024/07/13/Bonalu_London_News.jpg)
టాక్ ఆధ్వర్యంలో లండన్లో ఘనంగా బోనాల వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర
![title](/sites/default/files/article_images/2024/07/11/ukkk.jpg)
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్
క్రైమ్
![Encounter: Clashes in Jammu and Kashmir Four soldiers were martyred](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/jawan.jpg.webp?itok=UGp07rhM)
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్కు డిప్యూటేషన్పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం.
![Student died under suspicious circumstances](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/baby.jpg.webp?itok=ze0X30bW)
జ్వరమా.. మరేదైనా కారణమా..?
పెన్పహాడ్: గురుకుల పాఠశాల విద్యార్థిని అను మానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే జ్వరంతో విద్యార్థిని చనిపోయిందని ప్రిన్సిపాల్ చెబుతుండగా, రాత్రే చనిపోతే ఉదయం వరకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహంతో మృతురాలి బంధువులు ప్రిన్సి పాల్పై దాడి చేశారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి సోమయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు సరస్వతి(10) పెన్ పహాడ్ మండలంలోని దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. సరస్వతికి సోమవారం రాత్రి జ్వరం వచ్చింది.గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న జీఎన్ఎం మంగళవారం తెల్లవారుజామున పరీక్షించి మరో ఉపాధ్యాయురాలితో కలిసి గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ఇంజక్షన్ వేయించారు. అయినా జ్వరం తీవ్రత తగ్గకపోగా సీరియస్గా ఉండటంతో 108 వాహనంలో సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరస్వతిని పరీక్షించిన డాక్టర్ అప్పటికే చని పోయిందని చెప్పారు. దీంతో ప్రిన్సిపాల్ విజయ లక్ష్మి.. మీ పాపకు సీరియస్గా ఉందంటూ సర స్వతి తల్లి దండ్రులకు ఫోన్ చేశారు. వారు వెంటనే ఆస్పత్రికి చేరుకోగా అప్పటికే మృతి చెందినట్టు తల్లిదండ్రులకు తెలియజేశారు. తమ కూతురు బాగానే ఉందని, అప్పుడే ఎలా చనిపోయిందని వారు ప్రిన్సిపాల్ను నిలదీశారు. ఆస్పత్రిలో బంధువులు, తల్లిదండ్రుల ఆందోళనసరస్వతి మృతి చెందిన విషయం ప్రిన్సిపాల్ విజ యలక్ష్మి, పాఠశాల సిబ్బంది తమకు తెలియజే య కుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆస్పత్రి లోని మార్చురీ వద్ద కుటుంబసభ్యు లు ఆందోళన చేశారు. తమ కూతురు సోమ వారం రాత్రే చని పోయిందని, ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి మంగళవారం ఫోన్ చేసి సీరియస్గా ఉందని చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. తమ కూతురుని కొట్టి చంపారా.. లేక ఏదైనా చేశారా మాకు చెప్పాలని తండ్రి సోమయ్య డిమాండ్ చేశాడు. న్యాయం చేసే వరకు పోస్టుమార్టం చేయొద్దని పట్టుబట్టారు. మాట్లాడదామని చెప్పి...ప్రిన్సిపాల్తో మాట్లాడించాలని రీజినల్ కోఆర్డి నేటర్ షకీనాను బంధువులు కోరగా, ఆమెను తీసుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ప్రిన్సిపాల్పై సరస్వతి బంధువులు దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న డీఎస్పీ రవి జోక్యం చేసుకొని ప్రిన్సిపాల్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీసీ గురుకుల అధికారులు మద్దిలేటి,వెంకటేశ్వర్లు ఆస్పత్రి వద్దకు వెళ్లి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు మృతదేహాన్ని స్వగ్రామా నికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మృతురాలి తండ్రి కొంపెల్లి సోమయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
![Baby dies in dog attack](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/attacks.jpg.webp?itok=c7m8YS70)
గుంపుగా వచ్చి.. బాలుడిని ఈడ్చుకెళ్లి..
జవహర్నగర్/గాందీఆస్పత్రి: మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఆరు బయట ఆడుకుంటున్నాడు...అదే సమయంలో వీధి కుక్కలు గుంపుగా అక్కడకు వచ్చాయి. ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేశాయి. తలభాగాన్ని నోట్లో కరుచుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లాయి. అలా ఈడ్చుకుంటూ వెళుతున్న క్రమంలో ఆ బాలుడి తలవెంట్రుకలు, తలలోని కొంత భాగం ఆ పరిసరాల్లో ఊడి పడింది. గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మల్కాజిగిరి–మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన భరత్–లక్ష్మి దంపతులకు ఏడాదిన్నర కుమారుడు విహాన్ ఉన్నాడు. లక్ష్మి సోదరుడు వెంకట్ జవహర్నగర్లోని ఆదర్శనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన ఇంటికి లక్ష్మి దంపతులు కుమారుడితో కలిసి చుట్టపుచూపుగా కొద్దిరోజుల క్రితం వచ్చారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా విహాన్పై దాడి చేశాయి. కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లి పడేశాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అదే కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ఆ కుక్కల గుంపు దగ్గరకు వెళ్లి చూడగా, బాలుడు తీవ్ర రక్తస్రావంతో కిందపడి ఉన్నాడు. ఒళ్లంతా రక్కడంతో కుక్కకాటు గుర్తులు ఉన్నాయి. ఆ పరిసరాల్లోనే విహాన్ తల వెంట్రుకలు, మెదడులోని కొంత భాగం కూడా మరో చోట పడింది. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని గాంధీ ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. శరీరమంతా కుక్కకాట్లతో నిండిపోయి ఉండటంతో పరిస్థితి విషమించింది. అనస్థీషియా, పిడియాట్రిక్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రాత్రి 9:30 గంటలకు విహాన్ మృతి చెందాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో కాపాడలేకపోయామని గాంధీ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. జవహర్నగర్ పరిధిలో వీధికుక్కల బెడద ఎక్కువగానే ఉందని స్థానికులు వాపోయారు. ఇంకెన్ని ప్రాణాలు పోతే.. అధికారులు ఈ సమస్యను పట్టించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![Still Probe Going Nandyal SP On Muchumarri Girl Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/girlmissing.jpg.webp?itok=jCnAtb2a)
ముచ్చుమర్రి కేసు ఇంకా విచారణ జరుగుతోంది: ఎస్పీ
నంద్యాల, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన నంద్యాల ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా పురోగతిని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వివరించారు. అయితే కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, బాలిక మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందని వాళ్లు తెలిపారు.నందికొట్కూరు సమీపంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఈ నెల 7వ తేదీన బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశాం. విచారణలో ముగ్గురు పిల్లలు బాలికకు చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ తీసుకుని వచ్చి తమ ఇంట్లోవాళ్లకు విషయం చెప్పారు. ఆపై తమ తండ్రుల సాయంతో సంచిలో ఉన్న బాడీని వనములపాడు గ్రామానికి బైక్పై తీసుకెళ్లి.. బాలిక డెడ్బాడీ ఉన్న సంచిలో బండరాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. విచారణలో ఆ పిల్లల తల్లిదండ్రులు మోహన్,సద్గురులు నేరం ఒప్పుకున్నారు. గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. కేసులో ఐదుగురిని అదుపులో తీసుకున్నాం. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశాం. విచారణ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని అన్నారాయన. మరోవైపు.. ఘటన జరిగి పదిరోజులైనా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం, మైనర్ నిందితుల నుంచి పోలీసులు సరైన సమాచారం రాబట్టలేకపోతుండడం.. విమర్శలకు దారి తీస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపైనా ముచ్చుమర్రి గ్రామస్తులు మండిపడుతున్నారు. వాళ్లను అలా వదిలేయొద్దు‘‘పది రోజులైనా మా పాప ఏమైందో చెప్పలేకపోతున్నారు. మా పాపను అత్యాచారం చేసి చంపేశామని ముగ్గురు చెబుతున్నా పోలీసులు వారిని ఏమీచేయలేకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తేనే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది. మరో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లను చంపేయాలి’’:::బాలిక తల్లిదండ్రులుఇదీ చదవండి: గిరిజన బాలిక ఎక్కడ బాబూ?
వీడియోలు
![AP CM Chandrababu Naidu Serious On Ministers](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/3.png.webp?itok=XivAg0HI)
![AP CM Chandrababu Naidu Serious On Ministers](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/3.png.webp?itok=XivAg0HI)
మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్
![YS Jagan Wishes To Muslims On Muharram Festival](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/2.png.webp?itok=TSMRUXUR)
![YS Jagan Wishes To Muslims On Muharram Festival](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/2.png.webp?itok=TSMRUXUR)
మొహర్రం సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ సందేశం..
![Special Debate On TDP Alliance Failure](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/1.png.webp?itok=Skud3HGl)
![Special Debate On TDP Alliance Failure](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/17/1.png.webp?itok=Skud3HGl)
Big Question: అబద్ధాల శ్వేత పత్రాలపై ఉన్న శ్రద్ధ.. ఆడబిడ్డల రక్షణపై లేదా ?
![GPS Issues Between CM Chandrababu and Deputy CM Pawan Kalyan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/cm.jpg.webp?itok=ZpMwYVj6)
![GPS Issues Between CM Chandrababu and Deputy CM Pawan Kalyan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/cm.jpg.webp?itok=ZpMwYVj6)
చిచ్చు రేపిన జీపీఎస్... బాబు, పవన్ ల మధ్య దూరం
![Venkata Rami Reddy Serious Comments Over Raghu Rama Krishnam Raju Case On YS Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/bo_0.jpg.webp?itok=JOQmgt68)
![Venkata Rami Reddy Serious Comments Over Raghu Rama Krishnam Raju Case On YS Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/bo_0.jpg.webp?itok=JOQmgt68)
అధికారం ఇచ్చింది పరిపాలించడానికా లేక పగ తీర్చుకోవడానికా..!
![Vijaysai Reddy Gave Strong Reply To Yellow Media Reporter Question](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/vi_0.jpg.webp?itok=o4iV7x1X)
![Vijaysai Reddy Gave Strong Reply To Yellow Media Reporter Question](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/vi_0.jpg.webp?itok=o4iV7x1X)
ఎల్లో మీడియా రిపోర్టర్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన విజయసాయి రెడ్డి
![Telangana Crop Loan Waiver Rules](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/re_0.jpg.webp?itok=rr5sJCXw)
![Telangana Crop Loan Waiver Rules](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/re_0.jpg.webp?itok=rr5sJCXw)
రైతు కంట నీరు మంచిది కాదు..
![SP K Raghuveera Reddy About Muchumarri Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/po_3.jpg.webp?itok=pSYYOlKY)
![SP K Raghuveera Reddy About Muchumarri Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/po_3.jpg.webp?itok=pSYYOlKY)
అత్యాచారం తర్వాత..బండరాయి కట్టి విచారణలో విస్తుపోయే నిజాలు..
![100 Year Old Neem Tree Cut Down For Anna Canteen](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/an.jpg.webp?itok=c9wjR96w)
![100 Year Old Neem Tree Cut Down For Anna Canteen](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/an.jpg.webp?itok=c9wjR96w)
అన్నా క్యాంటీన్ కోసం 100 ఏళ్ల వేప చెట్టు నరికేశారు
![Chandrababu Conspiracy On New Medical College Openings](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/me_0.jpg.webp?itok=_oLMqGxS)
![Chandrababu Conspiracy On New Medical College Openings](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/16/me_0.jpg.webp?itok=_oLMqGxS)
పేద విద్యార్థులకు తీవ్ర నష్టం.. YS జగన్ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి..
న్యూస్ పాడ్కాస్ట్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
విద్యుత్తు కమిషన్కు మరో న్యాయమూర్తిని నియమించండి. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు వెంటనే ఆపండి.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వేంపల్లె అజయ్కుమార్రెడ్డికి పరామర్శ.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మర్... పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం... రిషి సునాక్ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
![Audio](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు.. ముంబైలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఇంకా ఇతర అప్డేట్స్