maha rastra
-
ఇదే కాంగ్రెస్ సంస్కృతి : కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..ఆపై..
ముంబై: మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకోవడమే అందుకు కారణమైంది.నానా పటోలే మహరాష్ట్ర అకోలా జిల్లాలోని వాడేగావ్ అనే ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని తిరిగి తన కార్లో కూర్చున్నారు. అయితే ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా పటోలే పర్యటించిన ప్రాంతం బురదమయమైంది. బురద కాళ్లను శుభ్రం చేసుకునేందుకు నీళ్లు తేవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తను పురమాయించారు. సదరు కార్యకర్త నీళ్లు తెచ్చి పటోలే పాదాల్ని శుభ్రం చేశారు.ఇదే కాంగ్రెస్ సంస్కృతిపార్టీ కార్యకర్త తన బురద పాదాలను కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో నానా పటోలేపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే కాంగ్రెస్ సంస్కృతి అంటూ ముంబై బీజేపీ ట్వీట్లను షేర్ చేసింది. ‘దురదృష్టకరం ఏమిటంటే, పార్టీ కోసం ప్రాణాలను అర్పించే కార్యకర్తలను పదేపదే అవమానిస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కార్యకర్తతో తన బురదకాళ్లను కడిగించుకోవడం సిగ్గుచేటు ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి? అని ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ చర్యను షేర్ చేస్తూ కాంగ్రెస్ నాయకులది నవాబీ, ఫ్యూడల్ మనస్తత్వం అని దుయ్యబట్టారు.Congress has a Nawabi Feudal Shehzada mindset Maharashtra Congress president Nana Patole's gets his leg and feet washed by a party worker in Akola...They treat Janta and workers like Ghulam & themselves like Kings & QueensImagine how they treat people without coming to… pic.twitter.com/dmzeSUNZxB— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) June 18, 2024 కాంగ్రెస్ది ఫ్యూడల్ మనస్తత్వంకాంగ్రెస్ది ఫ్యూడల్ మనస్తత్వం. వారు ఓటర్లను, కార్యకర్తలను బానిసల్లాగా చూస్తారు. తాము రాజులమనుకుంటారు. అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తిస్తే ఒక వేళ అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటారో ఆలోచించండి. అందుకే కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి’ అని పూనావాలా అన్నారు.నేను రైతు బిడ్డని కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్న ఘటన వివాదం కావడంతో నానా పటోలే స్పందించారు. నేను రైతు బిడ్డను. బురద నాకు కొత్తేం కాదు. కాళ్లకు అంటిన బురద కడుక్కునేందుకు నీళ్లు కావాలని అడిగా.మా కార్యకర్త నీళ్లు తెచ్చారు. ఆయన నీళ్లు పోస్తే నేనే నాకాళ్లను కడుక్కున్నాను’ అని మీడియా సమావేశంలో వెళ్లడించారు. -
షీనాబోరా హత్యకేసులో బిగ్ ట్విస్ట్
ముంబై : 12 ఏళ్ల క్రితం జరిగిన హీనాబోరా హత్య కేసులో బిగ్ ట్విస్ట్. కేసులో కీలకంగా ఉన్న షీనాబోరా అస్థికలు (ఎముకలు) మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హత్య అనంతరం రాయగఢ్ పోలీసులు షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా అస్థికలు కనిపించడం లేదని సీబీఐ అధికారులు ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపారు.2012,మే 21న మహరాష్ట్రలోని రాయిఘడ్కు చెందిన గణేష్ ఎగ్డే తనకెంతో ఇష్టమైన మామిడి పండ్ల సీజన్ వచ్చేసిందని సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు రాయిఘడ్ అడవుల్లో దొరికే రుచికరమైన మామిడి పండ్ల కోసం బయలు దేరాడు. అయితే అడవిలోకి వెళ్తుండగా.. ఓ చెట్టు సమీపంలో పెద్ద సూట్కేస్ గణేష్ కంటపడింది. అంతే ఆ సూట్కేసులో ఏముందో అని చూసిన ఆయన షాక్ తిన్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన సంఘటన గురించి వివరించాడు. క్షణాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ సూట్కేస్లో కాలిన మృతదేహం కనిపించింది.కట్ చేస్తే షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ను విచారించగా.. షీనా బోరా హత్య గురించి బయటపెట్టాడు.షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని, ఆ తర్వాత షీనాబోరాను కాల్చివేసి ఆమె అస్థికల్ని రాయ్ఘడ్లోని గాగోడే-ఖుర్ద్ గ్రామ సమీపంలోని అడవుల్లో పడేసినట్లు చెప్పాడు. అప్రమత్తమైన షీనాబోరా కేసును విచారిస్తున్న అధికారులు స్థానిక రాయ్ఘడ్ పెన్ పోలీసుల సహకారంతో షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు.ఆ ఎముకల్ని పరీక్షించి అవి షీనాబోరావేనని సర్ జేజే హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ జెబా ఖాన్ తేల్చారు. మే 7న కోర్టు విచారణలో సీబీఐ తరపున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీజే నాండోడ్ కేసు విచారణలో షీనాబోరా అస్థికల్ని జెబాఖాన్కు చూపించి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.ఇందులో భాగంగా గురువారం (జూన్ 13) షీనాబోరా అస్థికల గురించి ఆరా తీయగా అవి మాయమైనట్లు సీబీఐ అధికారులు కోర్టుకు వెల్లడించారు. విచారణలో ఆధారాలు (ఎముకలు) ఉన్న రెండు మార్క్ ప్యాకెట్లను గుర్తించలేకపోయామన్నారు. అస్థికలు లేకున్నా షీనా బోరా కేసు విచారణ కొనసాగించాలని సీబీఐ భావించింది. అందుకు డిఫెన్స్ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. -
‘ఖతర్నాక్ కోడలు’.. చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే
ముంబై : రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో అత్యంత సాధారణ రకాలు హిట్ అండ్ రన్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక వ్యక్తిని ఢీ కొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో? పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినప్పుడు దాన్ని హిట్-అండ్-రన్గా పరిగణిస్తారు. తాజాగా, హిట్-అండ్-రన్ ప్రమాదంలో మృతి చెందిన 82 ఏళ్ల పురుషోత్తం కేసులో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం..నాగపూర్ సిటీలో అర్చనా మనీష్ పుట్టేవార్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మనీష్ పేరున్న డాక్టర్. టౌన్ ప్లానింగ్ అధికారిణిగా నగరంలో తనకున్న పేరు పలుకుబడితో భారీ ఎత్తున ఆస్తుల్ని పోగేశారు. అయినప్పటికీ మామ పూరుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్నేసింది. ఆయనకున్న రూ.300 కోట్ల ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం అర్చన తన క్రిమినల్ మైండ్కు పదును పెట్టింది. తన మామను కారుతో ఢీకొట్టి అది ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. హత్య చేయించేందుకు ఆమె భర్త డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్లకు కోటి రూపాయిలకు సుపారీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే?అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్ప్రత్రికి వెళ్లారు. తిరిగి వస్తున్న ఆయనను ప్లాన్లో భాగంగా కారుతో ఢీకొట్టిచ్చింది.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో స్థానికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పురుషోత్తంకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీపుటేజీని నిశితంగా పరిశీలించగా..అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పురుషోత్తంకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, హిట్-అండ్-రన్ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ కారులో ప్రయాణిస్తున్న బాగ్డే, నీరజ్,సచిన్లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా.. కోడలు అర్చన భాగోతం బట్ట బయలైంది. ఆస్తి కోసమే అర్చన తన మామ పురుషోత్తంను హతమార్చేందుకు సిద్దపడినట్లు తేలడంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పురుషోత్తం 15 రోజుల పాటు పోరాడి చివరికి ప్రాణాలొదిలినట్లు పోలీసులు తెలిపారు. -
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
లోక్సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా నగదు పంపిణీ చేశారంటూ మహరాష్ట్ర అజిత్ పవార్ (ఎన్సీపీ) వర్గంలోని ఐదుగురి మద్దతు దారులపై పోలీసులు నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశారు.మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ స్థానం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్) వర్గం నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే ఎన్సీపీ( ఎస్పీ) గ్రూపు నుంచి పోటీ చేస్తున్నారు. మంగళవారం మహరాష్ట్రలోని మొత్తం 48 లోక్సభ స్థానాల్లో మూడవ దశలో 11 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్కు ముందు రోజు అంటే సోమవారం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు బారామతి లోక్సభ పోలింగ్కు ముందు జిల్లాలోని భోర్ పట్టణంలోని ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఎన్న్సీపీ (శరద్ పవార్) ఆరోపించింది. దీంతో పూణే పోలీసులు నిందితులపై నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తన పార్టీపై, పార్టీ మద్దతుదారులపై వస్తున్న ఆరోణల్ని కొట్టిపారేశారు. -
రంజుగా మారిన రాజకీయం.. ప్రధాని మోదీకి ఎంఎన్ఎస్ భేషరతుగా మద్దతు
లోక్సభ ఎన్నికల తరుణంలో మహరాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంఎన్ఎస్ నేత రాజ్ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజ్ థాకరే బీజేపీ, ఏక్నాథ్ షిండే - శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పక్షాల కూటమి ‘మహాయుతి’లో చేరవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్థాకరే కీలక ప్రకటన చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్ థాకరే ప్రసంగిస్తూ లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేయదని తెలిపారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మద్దతు కోరారు. నాకు పదవులొద్దు నాకు రాజ్యసభ, విధానసభ పదవులు వద్దని ఫడ్నవీస్తో చెప్పాను. అంతేకాదు నేను ఎటువంటి అంచనాలు, షరతులు లేకుండా ప్రధాని మోదీతో పాటు మహాయుతి కూటమికి మద్దతిస్తున్నానని రాజ్ థాకరే అన్నారు. కాగా, ఎంఎన్ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు. -
అలాంటి వాళ్లతో సావాసమా?, ఆదిత్య ఠాక్రేపై విమర్శలు
ముంబై : ముంబై బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే శివసేన నేత, మాజీ కేబినేట్ మంత్రి ఆదిత్య థాకరేపై విమర్శలు చేశారు. ఓ మహిళను వేధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తికి ఆదిత్య ఠాక్రే రక్షణ కల్పిస్తున్నారని రాణే ఆరోపించారు. రాణే మాట్లాడుతూ, ‘వార్డ్ నంబర్ 106లో యూబీటీ శివసేన నేత అమోల్ సంసారే అనే వ్యక్తి ఆస్తి కోసం మహిళలను వేధించినందుకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం బైయిల్పై ఉన్న ఆయన ఆదిత్య ఠాక్రేని కలిశారని అన్నారు. దీని బట్టి మహిళని హింసించిన అమోల్ సన్సారేకు ఆదిత్య ఠాక్రే మద్దతు పలుకుతున్నట్లే కాదా అని రాణే ప్రశ్నించారు. కాగా, నితీష్ రాణే యూబీటీ నాయకులపై విమర్శలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేల పేర్లను ప్రస్తావించకుండానే కోవిడ్-19 కాలంలో జరిగిన అన్నీ కుంభకోణాల వెనుక ఉన్నవారు త్వరలో కటకటాల వెనుకకు వస్తారు అని వ్యాఖ్యానించారు. అందుకు యూబీటీ నేత సంజయ్ రౌత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఈడీ, సీబీఐ మూసివేసిన కేసుల్ని తిరిగి విచారణ జరిపిస్తాం. కాబట్టి అనవసర రాద్ధాంతం చేసే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని హెచ్చరించారు. #WATCH | Nitesh Rane Alleges Aaditya Thackeray Planning To Meet #ShivSenaUBT Worker Accused Of Harassing Woman#Mumbai #Maharashtra #BJP pic.twitter.com/AJc49QfmuA — Free Press Journal (@fpjindia) April 7, 2024 -
మహరాష్ట్ర అభివృద్దికి ప్రధాని మోదీ ఆశీర్వాదమే కారణం
సాక్షి,ముంబై : లోక్సభ ఎన్నికల తరుణంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహరాష్ట్ర వేగంగా అభివృద్ది చెందడానికి ప్రధాని మోదీ మద్దతు, ఆశీర్వామే కారణమన్నారు. మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగింది. ఈ 1.5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయడంలో విజయం సాధించాం. అందుకు ప్రధాని మోదీ ఆశీర్వాదమే కారణం. ప్రధాని మా ప్రభుత్వానికి పూర్తి బలం, మద్దతు ఇచ్చారు. ఎన్ని పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించారో మీరందరూ చూశారు. ఈ 1.5 ఏళ్లలో ప్రభుత్వం ఎన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంది. అదంతా ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందని అన్నారు. -
వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో?
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్ధులుగా మారి కయ్యానికి కాలుదువ్వనున్నారు. ముఖాముఖీ తలపడనున్నారు. గత 55 సంవత్సరాలుగా కుటుంబం హవా కొనసాగుతుండగా..రాజకీయ వైరంతో కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ పడనున్నారు. మరి ఈ ఎన్నికల పోరులో ప్రత్యర్ధులైన వదినా, మరదళ్లలో గెలుపెవరిదో ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్ పవర్..తన భార్యను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నారు. అందులోనూ దిగ్గజ నేత, తన బాబాయ్ ఎన్సీపీ అధినేత శరద్పవర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రీయా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి నుంచే బరిలో దింపుతున్నారు? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం)ల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ-అజిత్ పవర్ వర్గ కార్యకర్తలు బలమైన నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు అని పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తట్కరే అన్నారు. బారామతిలో అధికార కూటమి నుంచి పోటీ చేసేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉంది. కూటమి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సునేత్ర పవార్ బారామతి నుండి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని అన్నారు. 2009 నుంచి ప్రస్తుతం బారామతి లోక్సభ నుంచి గెలుస్తూ వస్తున్న శరద్ పవర్ కుమార్తె సుప్రీయా సూలే ప్రత్యర్ధిగా సునేత్ర పవార్ అవుతారు. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కనా వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! బాబాయితో మనస్పర్థలు ఎందుకు? అజిత్ పవార్ తండ్రి అనంతరావు పవార్. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్ సినిమా రంగంవైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబాయ్ శరద్ పవార్ మార్గాన్ని ఎంచుకున్నారు. తన సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్సభకు ఎన్నికయ్యారు.అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగతూ వచ్చారు. కానీ శరద్ పవర్ కుమార్తె సుప్రియా సూలే రాకతో అజిత్ పవర్ రాజకీయం మొత్తం మారిపోయింది. అంతా తానై శరద్ పవార్కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్లో స్థిరపడ్డారు. 2009 నుంచి బారామతి స్థానం లోక్సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచినా..ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్ పవార్ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్ రాజకీయ వారసుడు అజిత్ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం కూడా లభించింది. బాబాయ్పై తిరుగుబాటు అయితే, 2019లో జరిగిన వరుస పరిణామాలతో బాబాయి, ఎన్సీపీ అధినేత శరద్పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించారు. నాటి ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీకి మద్దతు పలికి డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలేను ఓడించాలనే ఉద్దేశంతో తన భార్య సునేత్రతో పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు అజిత్ పవర్ -
కొలిక్కిరాని ‘మహా’ సీట్ల పంచాయతీ!
ముంబై : మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం)ల మధ్య ఫలు దఫాలుగా జరిగిన సీట్ల పంపకం కొలిక్కి రాలేదు. తమ పార్టీ ఎక్కువ సీట్లు కావాలని శివసేన షిండే వర్గం పట్టుబడుతుంటే..తామే అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ తెగేసి చెబుతోంది. పైగా విమర్శలు..ప్రతి విమర్శలతో నాయకులు మహరాష్ట్ర రాజకీయాన్ని మరింత హీటుపుట్టిస్తున్నారు. బీజేపీ గొప్పతనం వల్లే బీజేపీ, శివసేన (షిండే వర్గాల)ల మధ్య సీట్ల పంపకాల చర్చలు అడ్డంకిగా మారాయి. బీజేపీ గొప్పతనం వల్లే సేన అధికారంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలకు సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ ఉద్ధవ్ ఠాక్రేపై షిండే తిరుగుబాటు చేయకుంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉండి ఉండేదని బదులిచ్చారు. తమకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందుకే (ఏక్నాథ్ షిండేని ఉద్దేశిస్తూ) ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్నథ్ షిండే తిరుగుబాటు చేయకుంటే 105 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండి ఉండేవారని, షిండే వల్లే తాము అధికారంలోకి వచ్చామని శిర్సత్ అన్నారు. బెదిరింపులు తగదు అంతకుముందు బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేశామని ఫడ్నవీస్ అన్నాంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫడ్నవీస్ వ్యాఖ్యలకు.. షిండే వర్గాన్ని బెదిరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, సొంత ఖర్చుతోనే మరిన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ఏక్నాథ్ షిండే సన్నిహితుడు రాందాస్ కదమ్ అన్నట్లు కథనాల్లో తెలిపాయి. విభేదాలు ఎందుకంటే? శివసేనకు బీజేపీ కేవలం 8 లోక్సభ సీట్లను ఆఫర్ చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం శివసేన ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కనీసం నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోంది. అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీ కూడా తమకు కేవలం 3 సీట్లు మాత్రమే ఆఫర్ చేసిందని మండిపడుతోంది. సీట్ల పంపకాల సమస్యల పరిష్కారానికి మూడు పార్టీల నేతలు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. మరి ఈ సారైనా సీట్ల పంపకం కొలిక్కి వస్తుందా? రాదా? అనేది వేచి చూడాల్సి ఉంది. -
రంగంలోకి ట్రబుల్ షూటర్.. నేతలతో అమిత్ షా రహస్య మంతనాలు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహరాష్ట్ర రాజకీయం వేడెక్కింది. లోక్సభలో ప్రాతినిధ్యం వహించే రెండవ అత్యధిక పార్లమెంట్ (48) స్థానాలున్న మహరాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం సంక్షిష్టంగా మారింది. బలాబలాలు తమకే ఎక్కువ ఉన్నాయని, కాబట్టే మాకే ఎక్కువ సీట్లు కేటాయించాలని శివసేన (షిండే వర్గం), అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పట్టుబడుతుంది. అయితే, ఈ సీట్ల పంపకాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కీలక నేతలతో అమిత్ షా వరుస భేటీలతో సీట్ల పంపంకం సానుకూలంగా జరిగే అవకాశం ఉందని పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక అమిత్ షా మంగళవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మొదటి 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం ఆ ఇద్దరు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తర్వాత మరో 50 నిమిషాల పాటు హోంమంత్రి, ముఖ్యమంత్రి షిండే మధ్య చర్చలు జరిగాయి. ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
నెలల చిన్నారితో అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
-
మహారాష్ట్ర : బల్లార్షా రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం
-
బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు
సురేష్, రమేష్ ఇద్దరు స్నేహితులు. ఆదివారం సెలవు రోజు కావడంతో తమకు నచ్చిన బిర్యానీని ఆరగించేందుకు సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. అలా వెళుతున్న ఆ ఇద్దరికి సడెన్గా రోడ్డు పక్కనే తాటికాయంత అక్షరాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆకర్షించింది. రెండు పార్శిళ్లు బిర్యానీ ఆర్డర్ ఇవ్వండి. ఒక బిర్యానీ పార్శిల్కే బిల్ కట్టండి' అంటూ ఫ్లెక్సీలోని ప్రకటన సారాంశం. అంతే డిస్కౌంట్లో బిర్యానీ వస్తుందని ఏమాత్రం ఆలోచించకుండా బిర్యానీ ఆర్డర్ చేశారు. సీన్ కట్ చేస్తే.. పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నరేగాన్ (Naregaon) అనే ప్రాంతంలో థామస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే థామస్ కు స్థానికంగా ప్రాచుర్యం పొందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వెజ్, నాన్ వెజ్లో బిర్యానీతో పాటు పలు వంటకాలపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలుసుకున్నాడు. అంతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. అలా ఆర్డర్ ఇచ్చాడో లేదో అకౌంట్లో ఉన్న రూ.89,000 మాయమయ్యాయి. దీంతో థామస్ కంగారు పడుతూ ఎంఐడీసీ(Maharashtra Industrial Development Corporation) స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), ఐటీ యాక్ట్ పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ..బాధితుడు తన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడని, అనంతరం ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైనట్లు తెలిపారు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుంది. మనిషి జీవన విధానాన్ని సమూలంగా మార్చేస్తుంది. అయితే ఈ టెక్నాలజీతో లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. లేదని ఏ మాత్రం అశ్రద్ధ వహించిన బ్యాంక్ అకౌంట్ల ఉన్న సొమ్ము క్షణాల్లో మాయం అవుతుందని హెచ్చరిస్తున్నారు. లేదని లైట్ తీసుకుంటే మోసపోతారని సూచిస్తున్నారు. సైబర్నేరాల్ని గుర్తించడం చాలా కష్టం. వెబ్సైట్/యాప్, బ్యాంక్/కార్డ్ డీటెయిల్స్ అడిగినప్పుడు, అది ఒరిజనల్లా లేదంటే ఫేకా అనే విషయాల్ని గుర్తించాలని అంటున్నారు. ముఖ్యంగా కొత్త వెబ్సైట్లు/యాప్లను ఉపయోగించే సమయంలో అలర్ట్గా ఉండాలని, సీవీవీ, కార్డ్ వివరాల్ని షేర్ చేయొద్దని సలహా ఇస్తున్నారు. చదవండి: నా తమ్ముడి ఫోన్ పేలింది సార్..! ట్వీట్ చేసిన అన్న -
పొంచి ఉన్న ‘మహా’ ముప్పు!
సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్/బోధన్ రూరల్ (బోధన్)/నిజామాబాద్ అర్బన్/ కాళేశ్వరం: పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్ భయం నెలకొంది. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో అక్కడి వారు తెలంగాణలోకి వస్తుండటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి సరిహద్దుల్లో లాక్డౌన్ సమయంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. ఇప్పుడు అలాంటి చర్యలేవీ లేకపోవడంతో రాష్ట్ర పోలీసు, వైద్య శాఖలు అప్రమత్తమవ్వాల్సిన అవసరమేర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆనుకుని ఉన్న నాందేడ్, యావత్మల్, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల పరిధిలో పట్టణాలకు, అటు ఉమ్మడి నిజామాబాద్కు సరిహద్దునున్న ప్రాంతా లకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగ నదీ వద్ద 44వ జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్న వాహనాలు మరోవైపు రైల్వే మార్గాలతో పాటు మూడు జాతీయ రహదారులు, ఇతర రోడ్డు మార్గాల గుండా జనాలు వ్యాపార, వాణిజ్యంతో పాటు బంధుత్వ కారణాలతో వస్తూపోతుంటారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు నిత్యం మహారాష్ట్రకు వెళ్లి వస్తుంటాయి. నిర్మల్ జిల్లాలో భైంసా మీదుగా మహారాష్ట్రలోని భోకర్, ఆదిలాబాద్ జిల్లా మీదుగా యావత్మల్, నాగ్పూర్ వైపు, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మీదుగా బల్లర్షా, చంద్రాపూర్ వైపు, నాగ్పూర్, మంచిర్యాల జిల్లా కోటపల్లి మీదుగా సిరోంచ, పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు నాలుగు వైపులా ప్రధాన దారులున్నాయి. ఈ సరిహద్దుల గుండా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇక తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో పెన్గంగా నది వద్ద జాతీయ రహదారిపై రోజూ వేలాది వాహనాలు వెళ్తుంటాయి. గతేడాది మార్చిలో కరోనా మొదలైన తర్వాత ఇక్కడ పోలీసు శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టు ఏర్పాటు చేసి శాశ్వతంగా ఓ షెడ్ను నిర్మించారు. కరోనా కేసులు తగ్గిన తర్వాత షెడ్ అలాగే ఉన్నప్పటికీ రాకపోకలు సాధారణమయ్యాయి. తెలంగాణ, మహారాష్ట్రను కలిపే నిర్మల్ జిల్లా తానూరు మండలం పరిధిలో జాతీయ రహదారి అక్కడి ప్రయాణికులకు టెస్టులు.. ఇటు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర, ఖండ్గావ్ చెక్పోస్ట్ వద్ద సాలూర పీహెచ్సీ వైద్య సిబ్బంది మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికులకు మాస్కులు, శానిటేషన్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం నుంచి బస్సుల్లో, ఇతర వాహనాల్లో వచ్చిన వారికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. మంగళవారం సాలూర చెక్ పోస్ట్ వద్ద మెడికల్ ఆఫీసర్ రేఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది 23 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటెవ్ వచ్చింది.. కాగా, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పక్బందీగా చెక్పోస్ట్ల వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. బోధన్ మండలంలోని హెల్త్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో రెండు టీంలను ఏర్పాటు చేసి సాలూర, ఖండ్గావ్ చెక్పోస్ట్ల వద్ద తనిఖీ, పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాళేశ్వరంలోని అంతర్ రాష్ట్ర వంతెన కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద యథేచ్చగా.. కాళేశ్వరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం బస్టాండ్లో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేశారు. కానీ జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఎలాంటి వైద్య శిబిరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
వైరల్: జ్యూస్ షాప్గా మారిన ఏటీఎం
ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఒక జ్యూస్ షాప్ యజమాని చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ యజమాని ఏటీఎంనే ఏకంగా జ్యూస్ షాప్గా మార్చేశాడు. సాధారణంగా ఏటీఎం లోపల ఒక వ్యక్తి ఉంటేనే మరో వ్యక్తిని లోనికి అనుమతించరు. అలాంటిది ఏటీఎం మిషన్ను ఒక మూలకు నెట్టి మరీ అతను లోపల కుర్చీలు వేసేశాడు. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బలు విత్డ్రా చేసుకోవడానికి వచ్చిన వారిని కుర్చీలో కూర్చోండి అంటూ మర్యాదలు కూడా చేస్తున్నాడు. చాలా మంది అక్కడ కూర్చొని ఉండగానే కస్టమర్లు వారి ఏటీఎం లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని బట్టి ఏటీఎంలు ఎంత రిస్క్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీ ఏటీఎం పిన్లను, ఓటీపీలను ఎవరికి తెలియనివ్వద్దు అంటూ బ్యాంకులు ప్రతిసారి మెసెజ్లు పంపుతూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటిది ఈ వ్యక్తి ఏటీఎంను జ్యూస్ షాప్గా మార్చడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. ఇది పూర్తిగా బ్యాంక్ ఏటీఎం నిబంధనలకు విరుద్ధం. ఏటీఎం రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి లోపల ఉంటే మరో వ్యక్తి అక్కడ ఉండటానికి వీలు లేదు. సాధారణంగా ప్రతి ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అయితే ఈ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ ఎందుకు లేదో తెలియడం లేదు. అంతేకాకుండా బ్యాంకు అధికారులు ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదైనా సాంకేతిక లోపలు తలెత్తినప్పుడు అధికారులు అక్కడికి వచ్చే ఉంటారు. అప్పుడు కూడా వారు జ్యూస్ యజమానిని ఎందుకు హెచ్చరించలేదు? అసలు ఆ వ్యక్తిపై బ్యాంక్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ వీడియో చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో సదరు వ్యక్తిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. వైరల్: జ్యూ స్ షాప్గా మారిపోయిన ఏటీఎం Autoplay ONOFF చదవండి: ఇటలీని షేక్ చేస్తున్న ప్రభాస్ మేనియా -
భారత్లో మరో వ్యాధి, మహారాష్టలో హై అలర్ట్
ముంబాయి: ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా కేసుల నమోదుతో అతలకుతలం అవుతున్న మహారాష్ట్రపై మరో పిడుగు పడింది. మహారాష్ట్ర జిల్లాలో అతి భయంకరమైన కాంగో జ్వరం వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని పాల్ఘర్ పరిపాలన విభాగం మంగళవారం అధికారులను ఆదేశించింది. సాధారణంగా కాంగో జ్వరం అని పిలువబడే క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్), పేలు ద్వారా మానవులలో వ్యాప్తిచెందుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దీని గురించి మాట్లాడుతూ, ఇది పశువుల పెంపకందారులు, మాంసం విక్రేతలు, పశుసంవర్ధక అధికారులకు ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దీనికి సరైన వ్యాక్సిన్ లేదా మందులు, చికిత్స అందుబాటులో లేని కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని వారు సూచించారు. పాల్ఘర్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డి కాంబ్లే ఒక సర్క్యులర్లో సిసిహెచ్ఎఫ్ గుజరాత్లోని కొన్ని జిల్లాల్లో కనుగొనబడిందని, ఇది మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. పాల్ఘర్ గుజరాత్లోని వల్సాద్ జిల్లాకు దగ్గరగా ఉంది. ఇప్పటికే వల్సాద్ జిల్లాలో కొన్ని కేసులు నమోదయ్యాయని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని నివారణ చర్యలు అమలు చేయాలని అధికారులను సంబంధిత శాఖ విభాగం హెచ్చరించింది. ఈ వ్యాధి ఒక నిర్దిష్ట రకం పేల ద్వారా ఒక జంతువు నుంచి మరొక జంతువుకు వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన జంతువుల రక్తం ద్వారాగానీ, వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినడం ద్వారా గానీ మానవులకు వ్యాపిస్తుందరి అందుకే జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్రలో ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఈ వ్యాధిని నిర్ధారించి, చికిత్స చేయకపోతే 30 శాతం మంది రోగులు మరణిస్తారు. సీసీహెచ్ఎఫ్ అనేది బున్యావిరిడే కుటుంబానికి చెందిన టిక్-బర్న్ వైరస్ (నైరోవైరస్) వల్ల కలిగే ఒక వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఈ వ్యాధికి గురయితే తీవ్రమైన జర్వం వస్తుంది. ఈ వ్యాధికి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సూదల పునర్వినియోగం, వైద్యసామాగ్రి కలుషితం కావడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చదవండి: మరో వైరస్..! ఐసీఎంఆర్ హెచ్చరిక -
ఆ రాష్ట్రంలో33,000 మంది పిల్లలకు కరోనా!
ముంబై: కరోనా వైరస్ (కోవిడ్–19)కు మహారాష్ట్ర కేంద్రంగా మారుతోంది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 42 లక్షలు దాటగా ఒక్క మహారాష్ట్రలోనే 9 లక్షలు దాటడం గమనార్హం. మరోవైపు మృతుల సం ఖ్యను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి సుమారు 70 వేలమంది మరణించగా మహారాష్ట్రలో మృతుల సంఖ్య 27 వేలకు చేరువైంది. రాష్ట్రంలో జూలై ఆఖరి వరకు పరి స్థితి కొంత మెరుగుపడుతుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కరోనా తీవ్రత పెరగడం కలకలం సృష్టిస్తోంది. గత వారం పది రోజులుగా కేసుల స్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా వరుసగా ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య 20 వేలు దాతుతోంది. 33 వేలమంది పిల్లలకు కరోనా.. రాష్ట్రంలో కొన్ని రోజులుగా మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా పిల్లలను కూడా వదలడం లేదు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు నవజాత శిశువుల నుంచి 10 ఏళ్లలోపు 33 వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో సుమారు నాలుగు శాతం. మరోవైపు 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసున్న కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో ఏడు శాతానికి పైగా ఉంది. కరోనా బాధితుల సంఖ్య ఓ వైపు పెరుగుతుండగా రికవరి రేటు కూడా గణనీయంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 72 శాతం దాటింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ముంబైలో 1.55 లక్షలకు చేరిన కరోనా కేసులు రాష్ట్రంలో కరోనా కేసులు తొమ్మిది లక్షలు దాటగా వీటిలో ఒక్క ముంబైలోనే 1.55 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత డేంజర్ జోన్గా ఉంది. అసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారావిలో కరోనా నియంత్రణకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం కాగా మరోవైపు ముంబైలో కూడా నిలకడగా కనబడింది. అయితే గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసుల సంఖ్య 17 వేల నుంచి 19 వేలు దాటుతోంది. దీంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ముంబైలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య సెప్టెంబరు 6వతేదీ నాటికి 1,55,622 కాగా యాక్టీవ్ కేసుల సంఖ్య 23,939 ఉంది. మరోవైపు మరణాల సంఖ్య 7,869కి చేరింది. ప్రపంచంలోనే 5వ స్థానంలో! మహారాష్ట్ర ఒక దేశంగా భావించినట్టయితే ప్రపంచంలోనే అయిదవ స్థానంలో ఉండేది. అత్యధిక కేసులతో ముందుండే చైనా, కెనడా, ఇటలీ, జర్మనీ తదితరాలను మహారాష్ట్ర ఎప్పుడో అధిగమించింది. తాజాగా ప్రస్తుతం అమెరికా అనంతరం 2వ స్థానంలో ఇండియా ఉండగా బ్రెజిల్ 3వ స్థానంలో, రష్యా 4వ స్థానంలో 10.30 లక్షల కరోనా కేసులతో ఉంది. అయితే 5వ స్థానంలో ఉన్న పేరు దేశంలో కేవలం 6.89 లక్షల కేసులుండగా ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసులు తొమ్మిది లక్షలకుపైగా నమోదయ్యాయి. థానే పోలీసు కమిషనర్కు కరోనా థానే పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సల్కర్కు కరోనా సోకింది. లాక్డౌన్ సమయంలో కోవిడ్ సోకిన థానే పోలీసులను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న పోలీసు కమిషనర్కు స్వయంగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నాలుగైదు నెలలుగా కొనసాగిన లాక్డౌన్ సమయంలో పోలీసులు రాత్రింబవళ్లు కరోనాను నియంత్రించేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపై తిరిగేవారిపై చర్యలు చేపట్టడంతోపాటు వలస కార్మికులను వారి వారి స్వగ్రామాలకు తరలించేందుకు తమ వంతు కృషి చేశారు. ఇలా ఎంతో ధైర్యంగా విధులు నిర్వహించిన పలువురు పోలీసులకు కరోనా సోకింది. అయితే వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుని వారి పై అధికారిగా అండగా నిలిచిన వివేక్ ఫన్సల్కర్కూ కరోనా సోకింది. దీంతో ఆదివారం రాత్రి ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు థానేలో 129 పోలీసు అధికారులు, 1,176 మంది పోలీసు సిబ్బంది ఇలా మొత్తం 1,305 మందికి కరోనా సోకింది. వీరిలో 1,664 మంది కరోనాను జయించి విముక్తి పొందారు. అయితే 18 మంది పోలీసులు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా 141 మంది వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చదవండి: రెండో స్థానంలోకి భారత్ -
ఆటోడ్రైవర్ల ఫోన్లు మాత్రమే దొంగిలిస్తాడు!
ముంబై: మహారాష్ట్రలోని పుణేలో ఒక వ్యక్తి కేవలం ఆటో డ్రైవర్ల ఫోన్లు మాత్రమే కొట్టేస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. 70కి పైగా స్మార్ట్ ఫోన్లను దొంగిలించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను దొంగతనం చేయడం వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతడు ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. తన ప్రియురాలు తనని మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని ఒక ఆటో డ్రైవర్తో వెళ్లిపోయిందని తెలిపాడు. దాంతో ఆటో డ్రైవర్ల మీద కక్ష తీర్చుకోవడం కోసమే వారి ఫోన్లను దొంగిలిస్తున్నట్లు తెలిపాడు. అహ్మదాబాద్కు చెందిన ఆసిఫ్ అకా భురభాయ్ ఆరిఫ్ షేక్ ఒక రెస్టారెంట్ను నడుపుతుండే వాడు. అయితే అతను అక్కడి నుంచి తన 27 ఏళ్ల ప్రేయసితో కలిసి పుణే వచ్చి ఒక బిజినెస్ ప్రారంభించాలనుకున్నాడు. అక్కడికి వచ్చిన రెండు రోజుల తరువాత అతని వద్ద ఉన్న డబ్బు తీసుకొని ఆమె ఒక ఆటో డ్రైవర్తో వెళ్లిపోయినట్లు ఆరిఫ్ షేక్ తెలిపాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆరీఫ్ దగ్గర నుంచి 20 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. చదవండి: దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు -
కరోనా: 38 శాతం ఐదు రాష్ట్రాల నుంచే!
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్రయోజనం ఉండటం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు మిలియన్లు దాటిపోయింది. 10 లక్షల కరోనా కేసులు దాటిన రోజు నుంచి వచ్చిన కొత్త కేసులలో దాదాపు 38 శాతం ఐదు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అవి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్. ఈ రాష్ట్రాలలో జూలై 16కి ముందు 19 శాతం కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదయిన మొదటి 10 లక్షల కేసులలో దాదాపు 12 శాతం కేసులు ఢిల్లీ నుంచి నమోదు అవ్వగా, రెండవ మిలియన్లో మాత్రం 3 శాతం కన్నా తక్కువ కేసులు వచ్చాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే కరోనా వ్యాప్తి గత మూడు వారాల్లో భౌగోళికంగా ఎలా మారిందో అర్థం అవుతుంది. ప్రస్తుతం ‘బిగ్ త్రీ’ - మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కువ వ్యాప్తి చెందుతోంది. జూలై 16న భారతదేశంలో కరోనా కేసులు మిలియన్ మార్కును దాటినప్పుడు నమోదయిన మొత్తంలో 56 శాతం ‘బిగ్ త్రీ’ నుంచి వచ్చాయి. వీటిలో 28.3 శాతం (284,281) కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. తమిళనాడులో 15.6 శాతం (1,56,369 ), ఢిల్లీలో 11.8 శాతం (1,18,645) కేసులు నమోదయ్యాయి. జూలై 16 తరువాత, దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొదటి మిలియన్ కేసులలో 11.8 శాతం ఢిల్లీ నుంచి నమోదుకాగా తరువాత మిలియన్ కేసులలో ఢిల్లీ నుంచి కేవలం 2.2 శాతం మాత్రమే వచ్చాయి. జూలై 16 తర్వాత నమోదైన కేసులలో దాదాపు ఐదవ వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. తరువాత దాదాపు 16 శాతం కేసులతో ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానం నుంచి రెండవ స్థానానికి చేరుకుంది. జూలై 16 నుంచి 122,775 కేసులతో, తమిళనాడు రెండవ మిలియన్ (12.1%) లో మూడవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా పరీక్షలు చేస్తుండటం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మొదటి మిలియన్ కరోనా కేసుల నమోదులో 19 శాతం కన్నా తక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో జూలై 16 నుంచి దాదాపు 42% కొత్త కేసులు వచ్చాయి. చదవండి: కరోనా రికార్డు: భారత్లో కొత్తగా 62 వేల కేసులు -
డాక్టర్ను పొడిచిన కరోనా రోగి బంధువులు
సాక్షి, ముంబై: కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో డాక్టరే కళ్లేదుట కనిపించే దేవుళ్లలా మారారు. ప్రాణాలకు తెగించి 24 గంటలు కష్టపడి సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ వారి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని లాతూరులో కరోనా రోగి బంధవులు డాక్టర్పై దాడి చేసి అతనిని కత్తితో పొడిచారు. కరోనా సోకిన ఒక వృద్ధ మహిళను లాతూర్లోని ఆల్ఫా సూపర్ స్పెషలిటీ హాస్పటల్లో చేర్పించారు. ఆమె వయసు రీత్యా కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. అయినా చికిత్స అందించాలని రోగి తరుపు బంధువులు అభ్యర్థించారు. కొన్ని రోజుల తరువాత ఆ మహిళ చనిపోయింది. ఆసుపత్రిలో గొడవ చేసిన రోగి బంధువులు దినేష్ వర్మ అనే డాక్టర్పై కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన ఛాతికి, గొంతుకు, చేతికి గాయాలయ్యాయి. ఆయనను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మెడికల్ ఆసోసియేషన్ సీరియస్గా తీసుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆదేశించింది. చదవండి: వైద్యురాలిపై ఉమ్మివేసిన కరోనా పేషెంట్లు -
దూకుడు పెంచిన దేవేంద్ర ఫడ్నవిస్
-
అక్కడ మరోసారి పూర్తి లాక్డౌన్!
ముంబాయి: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఇక మహారాష్ట్ర కరోనా వైరస్ కేసుల సంఖ్యలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య చైనాలోని కరోనా కేసులను కూడా దాటేశాయి. ఇప్పుడు మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 11 రోజుల పాటు పుణె, వాటి పరిసర ప్రాంతంలో పూర్తి లాక్డౌన్ను విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూలై 13-23వరకు ఈ ప్రాంతాలలో పూర్తి లాక్డౌన్ను విధించనున్నారు. గురువారం ఒక్కరోజే ఈ జిల్లాలో 1803 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసులు 34,399కి చేరుకోగా, చనిపోయిన వారి సంఖ్య 978కు చేరుకుంది. ఈ ప్రాంతంలో లాక్డౌన్ విధించిన 11రోజుల పాటు నిత్యవసర సరుకుల దుకాణాలు మినహా ఇంకేమీ పనిచేయమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ లాక్డౌన్ ద్వారా ఈ కరోనా వైరస్ చైన్ను వీడదీయవచ్చు అని ఆయన చెప్పారు. చదవండి: (కరోనా: యూపీ సర్కార్ కీలక నిర్ణయం) -
విధ్వంసం సృష్టించిన సేన సైనికులు, కారణం?
ముంబాయి: శివసేన కార్యకర్తలు బుధవారం మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలోని ఒక ఎలక్ట్రిక్ షాపులో విధ్వంసం సృష్టించారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రేను, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ శరద్ పవార్ను, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని విమర్శించినందుకు శివసేన కార్యకర్తలు షాపును నాశనం చేశారు. సోమవారం సోషల్మీడియాలో శివసేనకు వ్యతిరేకంగా పోస్ట్లు పెట్టడంతో శివసేన సైనికులు షాపు యజమానిపై ఫిర్యాదు చేశారు. ఇక్కడితో ఆగకుండా బుధవారం అతని షాపును నాశనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కొంత మంది పోలీసులు సమక్షంలోనే షాపులోకి ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువులను నాశనం చేశారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ నారాయణ్ రాణే సోమవారం గవర్నర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కరోనాని కట్టడి చేసే సామర్థ్యం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను కోరారు. ఇక మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పడంతో ప్రభుత్వ వైఫల్యల నుంచి కాంగ్రెస్ తప్పించుకొని నింద మొత్తం శివసేన మీద వేయడానికి చూస్తోందని ఆరోపించారు. ఇలా పరస్పర ఆరోపణల క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కెయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ యుద్దం ముదిరి అభిమానులు మహావికాస్అఘాడిపై ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో శివసేన సైనికులు సదరు వ్యక్తి షాపును ధ్వంసం చేశారు. (లాక్డౌన్ 5.0 : ఆ నగరాలపై ఫోకస్) -
మేయరమ్మ నీకు వందనం!
ముంబాయి: 58 ఏళ్ల వయస్సులో ముంబాయి మేయర్ కిషోరీ పెడ్నేకర్ 18 సంవత్సరాల తరువాత తిరిగి నర్స్ డ్రెస్ వేసుకున్నారు. సోమవారం బీవైఎల్ నైర్ హాస్పటల్ని సందర్శించిన కిషోరీ తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వారిలో స్ఫూర్తి నింపడానికి తానను మళ్లీ నర్స్గా పనిచేయాలనుకుంటున్నట్లు కిషోరీ తెలిపారు. ప్రతి రోజు మూడు గంటల పాటు కరోనా రోగులకు సేవలందిస్తూ ఆమె విధులు నిర్వర్తించనున్నారు. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రి ఉద్ధవ్ఠాక్రే కరోనాపై పోరాటంలో అందరూ చేతులు కలపాలని పిలుపినిచ్చారు. ఈ నేపథ్యంలోనే నేను మళ్లీ నర్స్గా పనిచేసి కరోనా రోగులకు సేవలందించడానికి ముందుకు వచ్చాను. ఇది కొంచెం ప్రమాదంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇలాంటి సమయంలో భయంతో విధుల నుంచి తప్పుకోవడంలో అర్థం లేదు. నాకు చాలా మంది నర్సింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి తమ పిల్లల్ని కోవిడ్-19 విధుల్లో వేయ్యొద్దు అని అడుగుతున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. ఈ వృత్తి అంటేనే రిస్క్తో కూడుకున్నది. ఈ వృత్తిలో ఉన్న వారు హెచ్ఐవి, టీబీ లాంటి రోగులకు కూడా సేవలందిస్తారు. అది కూడా ప్రమాదకరమే. కానీ ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు రిస్క్ చేయక తప్పదు అని చెప్పాను’ అని కిషోరీపేర్కొన్నారు. మూడుసార్లు ముంబాయి మేయర్గా గెలిచిన కిషోరీ రాజకీయాల్లోకి రాకముందు 16 సంవత్సరాలు నర్స్గా పనిచేశారు. 24 సంవత్సరాల వయస్సులో మహారాష్ట్రలోని రాయ్ఘర్లో నర్స్గా కేరీర్ మొదలుపెట్టారు. రాజకీయాల్లోకి వెళ్లినా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఇలా నర్స్గా మారడంతో అందరూ కిషోరీని అభినందిస్తున్నారు. (‘మిలటరీ క్రమశిక్షణతో లాక్డౌన్ సడలించండి’) -
‘మిలటరీ క్రమశిక్షణతో లాక్డౌన్ సడలించండి’
ముంబాయి: ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మహారాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టాలంటే దశల వారీగా లాక్డౌన్ను సడలించాలన్నారు. ఈ విషయం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఆలోచించాలని కోరారు. కరోనా ప్రభావం లేని, తక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్డౌన్ను సడలించాలని, అయితే అక్కడ కరోనా విజృంభించకుండా ఉండేందుకు మిలిటరీ రూల్స్ని పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, అలాంటి నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోలేమన్నారు. అయితే సామాజిక దూరాన్ని అందరూ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటూ మిలిటరీ క్రమశిక్షణను అమలు చేయగలిగితే కరోనా వ్యాప్తిని లాక్డౌన్ సడలించినప్పటికీ అరికట్టవచ్చన్నారు. (వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి) లాక్డౌన్ సడలింపులకు సంబంధించి కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. దుకాణదారులు, చిన్న చిన్న పరిశ్రమల వారు, చిరువ్యాపారులు కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. అటువంటి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రస్తుత పరిస్థితులను ఎలా అధిగమించాలో ఆలోచించాలన్నారు. తాను ఇది సరదా కోసం చెప్పడం లేదన్న ఆమె, కొన్ని నిబంధనాలు, మార్గదర్శకాలు పాటించడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వీలవుతుందన్నారు. ఇంట్లో ఉంటే మన సమస్యలు తీరవని అందుకోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కొన్ని దేశాల్లో లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిందని అలాంటి సమస్యలు మన దేశంలో రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూలే సూచించారు. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర) మహారాష్ట్రలో ఉద్ధవ్ఠాక్రే ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని సూచించారు. ప్రజలెవరూ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ని నమ్మవద్దని సూలే విజ్ఞప్తి చేశారు. అధికారులు ప్రజలకు వండ్డిన భోజంన పెట్టడం కంటే వారికి నిత్యవసర సరుకులు అందిస్తే బాగుంటుందన్నారు. అదేవిధంగా విద్యార్ధులందరూ లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉండి వారి పరీక్షలకు సంబంధించి చదువుకోవడం ఉత్తమమన్నారు. లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మే3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.