maha rastra
-
ఛత్రపతి శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?.. వీకీపీడియాపై కేసులు
ముంబై: మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Maharaj) వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ (chhatrapati sambhaji maharaj) గురించి వీకీపీడియా అభ్యంతరకర పోస్టు పోస్టు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం(21-02-2025) వీకీపీడియాకు చెందిన 4-5 ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఇటీవల వీకీపీడియా ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి తప్పుడు సమాచారం పోస్టు చేసిందని, వెంటనే ఆ కంటెంట్ను తొలగించాలని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు అమెరికాకు చెందిన వీకీపీడియా మాతృసంస్థ వీకీమీడియా ఫౌండేషన్కు నోటీసులు జారీ చేశారు.15 ఈమెయిల్స్ పంపినా ఇంత వరకూ వీకీమీడియా ఫౌండేషన్ నుంచి ఎలాంటి స్పందనరాలేదు. దీంతో వీకీపీడియా శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతరకర కంటెంట్ పోస్టు చేసిందని, ఆ కంటెంట్ వల్ల శాంతిభద్రతకు విఘూతం కలిగే అవకాశం ఉందని సైబర్ సెల్ పోలీసులు వీకీపీడియా ఎడిటర్లపై కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 69,79 ఉల్లంఘించినందుకు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ (Chhaava)విడుదల నేపథ్యంలో వికీపీడియా కంటెంట్పై అభ్యంతరాలు వచ్చాయి. మరాఠాలు ఇదే విషయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. చారిత్రక వాస్తవాలను వక్రీకరించే కంటెంట్ను సహించబోమని, వీలైనంత త్వరగా వికీపీడియాను సంప్రదించాలని సైబర్ సెల్ పోలీసుల్ని ఆదేశించారు. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
కూటమికి ఏక్నాథ్ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..
ముంబై : ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయ్యిందో లేదో .. మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. దీంతో కూటమి చీలిపోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతకీ మహా రాజకీయాల్లో ఏం జరుగుతోంది.మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి.మహాయుతి కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు,ఎంపీలకు వై కేటగిరీ భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. భద్రత తగ్గింపులో కూటమిలో ఎన్సీపీ అజిత్ కుమార్ వర్గం కంటే.. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నేతలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం 44 మంది ఎమ్మెల్యేలకు , 11 లోక్సభ ఎంపీలకు ‘వై’ కేటగిరి భద్రతను అందించింది. తాజాగా, ఆ భద్రతను తొలగించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో భద్రతా సమీక్షా కమిటీ జరిగింది. భద్రతా కమిటీ సమీక్షల ఆధారంగా.. ప్రజాప్రతినిధులకు వైకేటగిరి భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరమైన జోక్యం లేదని స్పష్టం చేశారు.అయినప్పటికీ మహాయుతి కూటమిలో మనస్పర్ధలు ఉన్నాయని, సీఎం దేవేంద్రఫడ్నవీస్ షిండేని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ఇటీవల అయితే, దావోస్ పర్యటనకు ముందు సీఎం ఫడ్నవీస్ ఎన్సీపీ,బీజేపీకి చెందిన నేతల్ని రాయ్గఢ్ రాయ్గఢ్, నాసిక్లకు ఇన్ఛార్జులుగా నియమించారు. అందులో శివసేన నేతలు లేకపోవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇన్ఛార్జ్ల నియామకానికి బ్రేకులు పడ్డాయి. ఈ పరిణామాల వేళ..షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలకు భద్రతను కుదించాలని నిర్ణయించుకోవడం గమనార్హం.మహాయుతి కూటమి లుకలుకలపై శివసేన (యూబీటీ)ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. మహాయుతి కూటమి ప్రేమికుల దినం జరుపుకుంటోంది అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. -
లక్ష కోట్లు చెల్లించండి.. సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వానికి అల్టిమేటం!
ముంబై : ప్రభుత్వం తమతో పనులు చేయించుకుని సుమారు రూ.లక్ష కోట్ల విలువైన బకాయిలను చెల్లించడం లేదని మహరాష్ట్ర స్టేట్ కాంట్రాక్టార్ అసోసియేషన్ (ఎంఎస్సీఏ) ఆరోపించింది. సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేదంటే వారం రోజుల తర్వాత ఆందోళన చేపడతామని కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు అల్టిమేట్టం జారీ చేశారు.జూలై 2024 నుండి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) నుండి చెల్లించని బిల్లులు దాదాపు రూ. 46,000 కోట్లకు చేరాయని ఎంఎస్సిఎ ప్రెసిడెంట్ మిలింద్ బోస్లే పేర్కొన్నారు. తద్వారా 4 లక్షల కాంట్రాక్టర్లు, 4 లక్షల కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మా ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారం కోసం ఉచితాలపై దృష్టి పెట్టింది’ అని భోస్లే ఆరోపించారు.ముంబై సర్కిల్లోని మూడు డివిజన్లలో రూ.600 కోట్ల బిల్లులు చెల్లించలేదని ముంబై కాంట్రాక్టర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాదా ఇంగలే పేర్కొన్నారు. చాలా మంది చిన్న కాంట్రాక్టర్లు, నిరుద్యోగ యువత అభివృద్ధి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. అయితే చెల్లింపులు ఆలస్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.వివిధ శాఖల వద్ద మొత్తం రూ.1,09,300 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సంఘం పేర్కొంది. కాంట్రాక్టర్ల సంఘం ప్రకారం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (రూ. 46,000 కోట్లు), జల్ జీవన్ మిషన్ (రూ. 18,000 కోట్లు), గ్రామీణాభివృద్ధి (రూ. 8,600 కోట్లు), నీటిపారుదల శాఖ (రూ. 19,700 కోట్లు), పట్టణాభివృద్ధికి రూ.17,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. .ప్రభుత్వం హామీ కాంట్రాక్టర్ల ఆగ్రహంపై గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ స్పందించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా నిధుల పంపిణీ ఆలస్యమైందని, చెల్లింపులు జరగలేదనే ఆరోపణలను తోసిపుచ్చారు. వచ్చే బడ్జెట్ సెషన్లో నిధుల్ని విడుదల చేస్తామన్నారు. విడతల వారీగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని పబ్లిక్ వర్క్స్ మంత్రి శివేంద్ర రాజే బోస్లే హామీ ఇచ్చారు. -
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిది మంది దుర్మరణం
ముంబై : మహారాష్ట్రలో ప్రమాదం సంభవించింది. ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మరణించారు. కనీసం 5 నుండి 6 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ విభాగంలో ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పైకప్పు కూలిపోయింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జేసీబీ సాయంతో రెస్క్యూ సిబ్బంది శిధిలాలను తొలగిస్తున్నారు. శిధిలాల కింద ఉన్న బాధితుల్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. At least 7 people were killed and several injured in a major explosion at the ordnance factory in Bhandara; rescue efforts underway. #Maharashtra #Explosion #Bhandara #OrdnanceFactory pic.twitter.com/XP21qWEKHV— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) January 24, 2025 -
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి
ముంబై : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లా పరండా రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంపై ప్రయాణికుల తెలిపిన వివరాల మేరకు.. జల్గావ్ జిల్లా పరండా రైల్వేస్టేషన్ సమీపంలోని పాచోరా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న పుప్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకో పైలెట్ బ్రేకులు వేశారు. బ్రేకులు వేయడంతో ట్రైన్ చక్రాల నుంచి పొగ వ్యాపించింది. దీంతో ఆ పొగను చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పుప్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు వ్యాపించాయంటూ బిగ్గరగా అరుస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వారిలో 35-40 మంది ట్రైన్ నుంచి దూకారు. ట్రైన్ చైన్ లాగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. పట్టాలు దాటుతుండగా..ఎదురుగా వస్తున్న కర్నాటక ఎక్స్ప్రెస్ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారని సమాచారం. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. VIDEO | At least six persons were killed after they stepped down from their train on the tracks and were run over by another train coming from the opposite direction in North Maharashtra's Jalgaon district on Wednesday evening. Visuals from the spot near Pachora station, where… pic.twitter.com/EKQU5LE50w— Press Trust of India (@PTI_News) January 22, 2025 -
పొత్తులేదు.. బీఎంసీ ఎన్నికల్లో మాది ఒంటరి పోరే
ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిగా జట్టుకట్టిన శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ల మధ్య లుకలుకలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే బృహణ్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఎంవీఏ మిత్రులతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.శనివారం ముంబైలో మీడియాతో రౌత్ మాట్లాడారు. దేశ వాణిజ్యరాజధాని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను అవిభాజ్య శివసేన ఏకంగా పాతికేళ్లపాటు అప్రతిహతంగా ఏలింది. 1997 నుంచి 2022దాకా బీఎంసీపై శివసేన పట్టుకొనసాగిన విషయం విదితమే. ‘‘ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిగా కాకుండా ఒంటరిగానే బరిలో దిగుదామని మా శివసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అందుకే వారితో ఈ అంశాన్ని చర్చించేందుకు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమావేశం అవుతున్నారు’’అని రౌత్ వెల్లడించారు. కూటమిలో విభేదాలున్నాయన్న వాదనను రౌత్ తోసిపుచ్చారు.‘‘శివసేన రెండుగా చీలకముందుకూడా మేం గతంలో బీజేపీతో కలిసి ఉన్న సందర్భాల్లోనూ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీచేశాంకదా. పుణె, పింప్రి–చించ్వాడ్, నాసిక్ పురపాలికల్లో ఎంవీఏ కూటమి ఉమ్మడిగానే పోటీచేస్తుంది ’’అని రౌత్ అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మాదిరే అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, బీజేపీలతో శివసేన ఉమ్మడిగా మహాయుతి కూటమిగా బీఎంసీ ఎన్నికల్లో బరిలో దిగుతామని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. -
‘మహా’ కేబినెట్ విస్తరణ.. మంత్రులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వార్నింగ్!
ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్తగా మంత్రివర్గంలో చేరిన కేబినెట్ సభ్యులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన 39 మంది సభ్యులు పనితీరు ఆధారంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వన్నట్లు తెలిపారు. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం కేబినెట్ను విస్తరించింది. కొత్తగా మంత్రివర్గంలోని చేరిన 39 మంది ఆదివారం రాష్ట్ర రెండో రాజధాని నాగ్పూర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 39 మందిలో 16 మంది కొత్త వారు కాగా, 10 మంది మాజీ మంత్రులకు ఉద్వాసన పలికారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకు రెండు, మూడు రోజుల్లో శాఖ కేటాయింపు ఉంటుందని తెలిపారు. అయితే, కేబినెట్ విస్తరణ అనంతరం మంత్రుల పనితీరుపై సమీక్షలు జరుపుతామని, కూటమిలోని మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్ పవర్), శివసేన(ఏక్నాథ్షిండే)తో కేబినెట్ సభ్యులతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. Devendra Fadnavis's HUGE statement on ministers🔥Fadnavis⚡️: We are going to audit the performance of all the ministers.If it is found in the audit that any minister is not doing the right work then that minister will be reconsidered ↩️pic.twitter.com/qAS0TpKe3u— Political Views (@PoliticalViewsO) December 15, 2024కేబినెట్ విస్తరణ అనంతరం మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలపై మహాయుతి కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు తమ పదవీకాలంలో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ను తయారు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. బీజేపీ మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటారనే దానిపై ఫడ్నవీస్ స్పష్టత ఇవ్వలేదు. కానీ డిప్యూటీ సీఎం, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే తన పార్టీ మంత్రులకు రెండున్నరేళ్ల సమయం ఇచ్చారు. పనితీరు ఆధారంగా వారి రాజకీయ భవిష్యత్పై నిర్ణయం ఉంటుందన్నారు. అజిత్ పవార్ మాత్రం రెండున్నరేళ్ల సమయంలో మంత్రుల పనితీరు బాగుంటే కొనసాగుతారని, లేదంటే భర్తీ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుంది. దీంతో కేబినెట్ విస్తరణలో బీజేపీకి 19 మంత్రి పదవులు దక్కగా, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 11,డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి 9 మంత్రి పదవులు దక్కాయి. -
‘మహా’ ఎన్నికల్లో ట్యాంపరింగ్.. సుప్రీం కోర్టుకు ఇండియా కూటమి నేతలు
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి పార్టీ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అత్యున్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్లు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరువురి నేతల భేటీలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు, త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఎన్నికల తరహాలో ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా కార్యకర్తలకు, నేతలకు భవిష్యత్ కార్యచరణపై దిశానిర్ధేశం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇండియా కూటమి తరుఫున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలపై శరద్ పవార్ సుప్రీం కోర్టు ఆశ్రయించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహా ఎన్నికల్లో ఘోర పరాజయంఈ నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. Maharashtra: At the anti-EVM event at Markadwadi village in Solapur district, NCP-SCP chief Sharad Pawar says, "Elections happen...some win some lose...but in recently concluded election in Maharashtra, people have doubt over the election process and voters are not feeling… pic.twitter.com/QkmKK5XNQU— ANI (@ANI) December 8, 2024అయితే, ఈ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ విజయం సాధిస్తుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదే కూటమిలో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్సీపీ నేతలు అంచనా వేశారు. కానీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. ఊహించని విధంగా ఎన్సీపీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలపై దేశంలో ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎం ఓటింగ్పై సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. -
సీఎంగా ప్రమాణ స్వీకారం.. దేవేంద్ర ఫడ్నవీస్ భార్య ఫస్ట్ రియాక్షన్ ఇదే
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా ముగిసింది. గురువారం సాయంత్రం 5.30గంటలకు ముంబై ఆజాద్ మైదాన్లో జరిగిన ప్రమాణ స్వీకారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ఎన్డీఏ అలయన్స్ నేతలు పాల్గొన్నారు. అయితే, ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన సతీమణి అమృతా ఫడ్నవీస్ సంతోషం వ్యక్తం చేశారు. ‘దేవేంద్ర ఆరోసారి ఎమ్మెల్యే అయ్యి మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. ఈ రోజు మాకు బ్యూటిఫుల్ డే. మాకు బాధ్యత కూడా మరింత పెరిగింది’అని వ్యాఖ్యానించారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి ఘన విజయం సాధించింది.288 స్థానాలకు గానూ మహాయుతి కూటమి 235 అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (57), ఎన్సీపీ (41) స్థానాల్ని దక్కించుకున్నాయి. అదే ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో గెలుపొందగా, దాని భాగస్వామ్య పక్షాలు శివసేన (యుబిటి) 20, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) 10 స్థానాలను గెలుచుకున్నాయి. VIDEO | "I believe today is a very auspicious and good day for Maharashtra. Mahayuti has taken a pledge to dedicate themselves to the service of the people and the progress of the state in the coming days. This brings me immense happiness," says Amruta Fadnavis, wife of… pic.twitter.com/CJfmTXZrrB— Press Trust of India (@PTI_News) December 5, 2024 -
షిండేజీ ఇలా ప్రమాణం చేయకూడదు.. అసలు ఏం జరిగిందంటే..?
ముంబై : మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, డిప్యూటీ సీఎంగా చేసిన ఏక్నాథ్ షిండే ప్రమాణం స్వీకారం చేసిన తీరుపై వేదికపై ఉన్న ప్రముఖుల ముఖాలు ఎర్రబారాయి. వెంటనే పక్కనే ఉన్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ‘షిండేజీ మీరు ఇలా ప్రమాణ స్వీకారం చేయకూడదని చెప్పడంతో.. మరోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw— ANI (@ANI) December 5, 2024అసలు ఏమైందంటే?దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం అనంతరం ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వద్దకు వెళ్లారు. గవర్నర్ అను నేను.. ఆ తర్వాత ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభించారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో మాతృభాషలో ఏక్నాథ్ షిండే అనే నేను .. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. అంటూ ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ అలా చేయలేదు. బదులుగా ఏక్నాద్ షిండే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను హిందూ హృదయ సామ్రాట్ అని ప్రస్తావించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి, మహరాష్ట్ర ప్రజలపై ప్రశంసలు కురిపిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. వెంటనే గవర్నర్ అప్రమత్తమయ్యారు. ప్రమాణ స్వీకారం రాజ్యాంగం ప్రకారం చేయాలంటూ ఏక్ నాథ్ షిండేను ఆపారు. దీంతో తాను ముందుగా సిద్ధం చేసుకున్న ప్రమాణ స్వీకార స్క్రిప్ట్ను పక్కన పెట్టి గవర్నర్ చెప్పినట్లుగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. -
ఒక కేసులో బెయిల్.. గంటల వ్యవధిలో మరో కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
ఢిల్లీ : ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే దోపిడీ కేసులో షరతులతో కూడిన బెయిల్ పొందారు. అలా బెయిల్ వచ్చిందో లేదో .. ఇలా మరో కేసులో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ బుధవారం దోపిడీ కేసులో బెయిల్ పొందిన కొన్ని గంటల తర్వాత, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు.ఆదివారం ఢిల్లీ ఉత్తమ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్యాన్ను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.PTI SHORTS | AAP MLA Naresh Balyan arrested in an organised crime case under MCOCA; granted bail in a separate extortion caseWATCH: https://t.co/enOt0Wf9Lo Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you…— Press Trust of India (@PTI_News) December 4, 2024 అయితే, ఈ అరెస్ట్కు ముందే గత శనివారం దోపిడీ కేసులో మూడు రోజుల కస్టడీ గడువు ముగిసిన అనంతరం, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. దోపిడీ కేసులో రూ.50 వేలు ఫైన్ విధిస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు ఆదివారం బల్యాన్ను దక్షిణ ఢిల్లీలోని ఆర్కే పురం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చిన బల్యాన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఎమ్మెల్యేకు బెయిల్,అరెస్ట్పై బీజేపీ, ఆప్ నేతలు విమర్శల దాడికి దిగారు. నేరాలకు పాల్పడుతున్న తన పార్టీ ఎమ్మెల్యేపై అరవింద్ కేజ్రీవాల్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. అయితే, బీజేపీ విమర్శల్ని ఆప్ ఖండించింది. బల్యాన్ అరెస్ట్ అక్రమమని, బీజేపీ అబద్ధపు ప్రచారం చేసి తమ పార్టీ నేతలపై కేసులు పెట్టిస్తుందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. -
Maha Yuti: మీడియా ముందే సెటైర్లు.. ఇంతలోనే సర్దుకుపోయారా?!
ముంబై : మహా రాజకీయంలో మరో సస్పెన్స్కు శుభం కార్డు పడింది. ‘నేను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానో? లేదో?’ అంటూ బాంబు పేల్చిన ఏక్నాథ్ షిండే మళ్లీ వెనక్కి తగ్గారు. రేపు (డిసెంబర్5) మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్తో పాటే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని శివసేన నేతలు ప్రకటించారు.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనం విజయం సాధించింది. అనంతరం, మహా ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. సీఎం పదవి కోసం చివరి నిమిషం వరకు శివసేన నుంచి షిండే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుంది. ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. బీజేపీ అధిష్టానం బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వరుస పరిణామలపై అలబూనిన షిండే.. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు బుధవారం మహాయుతి కూటమి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వేదికైంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకై గవర్నర్ రాధాకృష్ణన్ను ఆహ్వానించారు. అనంతరం మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్,ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల మధ్య జరిగిన చర్చ అనేక అనుమానాలకు దారి తీసింది. సీఎం పదవికి నేనే సిపారసు చేశాప్రెస్ కాన్ఫరెన్స్లో ఏక్నాథ్ సిండే మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవికి ఫడ్నవీస్ను నేనే సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. బాంబు పేల్చిన షిండేఅనంతరం, రేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.అజిత్ పవార్పై షిండే సెటైర్లు షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. అయితే.. అజిత్ కామెంట్లకు షిండే సెటైర్లు వేశారు. అజిత్ దా(అజిత్ పవార్)కి ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. రెండు సార్లు ఎలా ప్రమాణం చేయాలో ఆయనకు తెలుసు అని అన్నారు. షిండే అలా అనడంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. #WATCH | Mumbai: When asked if he and NCP chief Ajit Pawar will also take oath as Deputy CMs tomorrow, Shiv Sena chief Eknath Shinde says, "Wait till evening..."Replying to Shinde, NCP chief Ajit Pawar says, "Sham tak unka samaj aayega, I will take it (oath), I will not wait."… pic.twitter.com/ZPfgg6Knco— ANI (@ANI) December 4, 2024 -
రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం.. పేరు మార్చుకున్న దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై : మహరాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ అధికారికంగా తన పేరును మార్చుకున్నారు.మహరాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. దీంతో ఫడ్నవీస్ రేపు (డిసెంబర్5న) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ముంబై ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ముమ్మరం కొనసాగుతున్నాయి.ఈ ప్రమాణ స్వీకారంలో ప్రముఖుల్ని ఆహ్వానిస్తూ మహరాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్ ఇన్విటేషన్లను సిద్ధం చేశారు. ఆ ఇన్విటేషన్లలో దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ బదులు ‘దేవేంద్ర సరిత గంగాధరరావు ఫడ్నవీస్’పేరుతో ఇన్విటేషన్లు పంపిస్తున్నారు.దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని సైతం దేవేంద్ర సరితా గంగాధరరావు ఫడ్నవీస్ పేరుతో సిద్ధం చేస్తున్నారు.అఫిడవిట్లో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కి దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ పేరుతో అఫిడవిట్లను సమర్పించారు.2014,2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఫడ్నవీస్ తన తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించలేదు. కానీ ఈ సారి అనూహ్యంగా తల్లి,తండ్రి పేరు కలిసేలా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.యుక్త వయస్సులో తండ్రి దూరమై.. ఫడ్నవీస్ తల్లిపేరు సరితా ఫడ్నవీస్,తండ్రి గంగాధర్ ఫడ్నవీస్. బీజేపీలో ఎమ్మెల్సీగా చేశారు. ఫడ్నవీస్ యుక్త వయస్సులో ఉన్నప్పుడే తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ క్యాన్సర్ కారణంగా మరణించారు. ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవిస్ బ్యాంకర్,సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఫడ్నవీస్ దంపతులకు కుమార్తె దివిజ ఉన్నారు. -
‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం!
ముంబై : మహరాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఈ తరుణంలో మహా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు. ఫడ్నవీస్తో భేటీ తర్వాత ఏక్నాథ్ షిండే ముంబైకి బయలుదేరారు. తొలిసారి భేటీమహరాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన మొదలైన తర్వాత ఫడ్నవీస్, షిండేల మధ్య ఇదే తొలి సమావేశం. అయితే, డిసెంబర్ 5న మహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో తదుపరి భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు ఏక్నాథ్ షిండే నివాసానికి వెళ్లినట్లు స్థానిక మీడియా,మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు. మోదీ నిర్ణయం శిరోధార్యంమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విషయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పదవి కోసం ఫడ్నవీస్,షిండేలు పోటీ పడ్డారు. అయితే, బీజేపీ అగ్రనేతలతో జరిగిన సమావేశం తర్వాత ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గారు. మహాముఖ్యమంత్రి ఎవరు? అనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారని ప్రకటించారు. మోదీ నిర్ణయమే తమకు శిరోధార్యమని బహిరంగంగా వెల్లడించారు. #WATCH | Mumbai: BJP leader Devendra Fadnavis arrives at Varsha bungalow to meet Maharashtra caretaker CM Eknath Shinde pic.twitter.com/hjruFEswbj— ANI (@ANI) December 3, 2024 -
‘మహా’ కేబినెట్.. షిండే, అజిత్ పవార్ వాటాకు ఎన్ని మంత్రి పదవులంటే?
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలకబూనిన షిండే.. ఎట్టకేలకు ముంబై చేరుకున్నారు. దీంతో.. మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక.. బీజేపీ నేతృత్వంలోనే ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వంలో షిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖరారైంది. దీనిపై రేపు కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు.మహారాష్ట్ర నూతన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ వేదిక కానుంది. అయితే మహాయుతి కూటమిలో.. ఏ పార్టీ ఎన్ని పోర్టుపోలియోలు ఆశిస్తుందనే అంచనాలతో జాతీయ మీడియా సంస్థలు, అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బీజేపీ(132 సంఖ్యా బలం) : ముఖ్యమంత్రితో పాటు హోం,రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్,శాసనమండలి చైర్మన్ పదవులను కూడా ఆశిస్తోంది. శివసేన(57): ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన.. తమకు 16 మంత్రిత్వ శాఖలను కేటాయించాలని పట్టుబడుతోందంట. వాటిల్లో పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్నింటికి బీజేపీ ఓకే చెబుతుందో చూడాలి. మరోవైపు.. గత అసెంబ్లీలో శాసనసభ డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన చేతుల్లో ఉండగా.. ఈసారి శాసనమండలి చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.ఎన్సీపీ(41): అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం.. తాము సీఎం సీటును త్యాగం చేశామనే ప్రకటనలు ఇచ్చుకుంది. వాటి ఆధారంగా కీలక శాఖలనే కోరే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ, శాసనసభలో డిప్యూటీ స్పీకర్తో సహా 9 నుంచి 10 మంత్రిత్వ శాఖలు కావాలని పట్టుబడుతున్నట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బుధవారమైనా తేలుస్తారా?ఆరు రోజులుగా మహారాష్ట్ర సీఎం పంచాయితీ ఎడతెగకుండా నడుస్తోంది. అయితే.. మహాయుతిలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాకు మరోసారి ఓకే అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. వీటిపై బుధవారం ఉదయం స్పష్టత రానుంది. ఎందుకంటే.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసన సభా పక్షం బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తారన్నది ఆ కథనాల సారాంశం.ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారంమహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ ముస్తాబవుతోంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మహాయుతి కూటమి నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే మంత్రి వర్గ కూర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
మెరుగుపడని ఆరోగ్యం.. ఆస్పత్రికి ఏక్నాథ్ షిండే
ముంబై: మహరాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతుండగా.. ప్రస్తుత, మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆస్పత్రి పాలయ్యారు.గతవారం అనారోగ్యం కారణంగా ఏక్నాథ్ షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో షిండేని అత్యవసర చికిత్స నిమిత్తం థానేలోని జూపిటర్ ఆస్పత్రికి తరలించారు.పలు రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఏక్నాథ్ షిండే ఆరోగ్యం మెరుగుపడలేదని నిర్ధారించారు. పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.దీంతో ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చింది.కొద్ది సేపట్లో మహాయుతి కూటమి కీలక సమావేశంఓ వైపు ఏక్నాథ్ షిండే అనారోగ్య రిత్యా ఆస్పత్రిలో చేరాగా.. మరోవైపు మహాయుతి కూటమి కీలక సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర కేబినెట్ పోర్ట్ఫోలియో కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు సమాచారం.వేర్వేరు నగరాల్లో మహాయుతి కీలక నేతలుమహారాష్ట్ర సీఎం ఎంపికపై ఉత్కంఠత కొనసాగుతుంది. మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు జరుగుతున్న తరుణంలో కీలక నేతలు వేర్వేరు నగరాల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని కీలక నేతలు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టత ఇచ్చారు. గత వారం ఏక్నాథ్ షిండే అనారోగ్యంతో తన స్వగ్రామానికి వెళ్లారు. నాటి నుంచి మహాయుతి కూటమి నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత శనివారం ఏక్నాథ్ షిండేని పరీక్షించిన వైద్యులు వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా, మంగళవారం మధ్యాహ్నం ఆరోగ్యం కుదుట పడకపోవడంతో థానేలోని జూపిటర్ ఆస్పత్రికి వెళ్లారు. 'Tabiyat agar bhadiya hai' then what exactly is Eknath Shinde doing in the hospital while Maharashtra waits for its Chief Minister?#EknathShinde #MaharashtraCM pic.twitter.com/9eZwOpqe70— Sneha Mordani (@snehamordani) December 3, 2024 -
‘మహ’ సీఎం ఎంపిక : పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ
ముంబై: మహరాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ డిసెంబర్ 4 జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రేపే ఢిల్లీకి వెళ్లనున్నారు. మహరాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి పెద్దలు చేస్తున్న కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి పెద్దలతో ఏకాంతంగా చర్చలు జరిపేందుకు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఢిల్లీకి పయనమయ్యారు. కేబినెట్ పదవులు ఖరారు చేసేందుకు మహాయుతి నేతల సమావేశానికి ఏక్నాథ్ షిండే హాజరు కావాల్సి ఉంది. కానీ షిండే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం షిండే బీజేపీ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాల సమాచారం మేరకు.. ఇవాళ తమ అధినేత షిండేకు.. బీజేపీ అగ్రనేతలతో సమావేశానికి సంబంధించి ఎలాంటి మీటింగ్ షెడ్యూల్ ఖరారు చేయలేదని తెలిపారు. బీజేపీ పెద్దలు మీటింగ్ షెడ్యూల్ ఖరారుపై ఎదురు చూస్తున్నారంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ అగ్రనాయకులతో చర్చలు జరిపేందుకు అజిత్ పవార్ ఢిల్లీకి బయలుదేరడం గమనార్హం. Union Finance Minister @nsitharaman and Former Gujarat Chief Minister Vijay Rupani have been appointed as #BJP's Central Observers for Legislature Party meeting to elect leader in #Maharashtra. pic.twitter.com/3wb1DryKVD— All India Radio News (@airnewsalerts) December 2, 2024 -
‘మహా’ సీఎం పదవిపై వీడని ఉత్కంఠ .. షిండే కుమారుడు ట్వీట్ వైరల్
ముంబై : మహా సీఎం పదవిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ తరుణంలో తనకు డిప్యూటీ సీఎం పదవి అంటూ వస్తున్న వార్తల్ని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే కొట్టి పారేశారు.తన కుమారుడు శ్రీకాంత్ షిండేకి డిప్యూటీ సీఎం పదవి కావాలంటూ ఏక్నాథ్ షిండే మహాయుతి కూటమి పెద్దలతో మంతనాలు జరిపారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని శ్రీకాంత్ షిండే సోమవారం ఖండించారు. తన గురించి నిరాధారమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయని, తాను మహారాష్ట్రలో ఏ మంత్రి పదవికి రేసులో లేనని స్పష్టం చేశారు. ‘మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. కాబట్టే చర్చలు, పుకార్లకు దారి తీసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్య సమస్యల కారణంగా రెండు రోజులు తన స్వగ్రామంలో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను ఉపముఖ్యమంత్రి అవుతాననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ ఈ వార్తలు నిరాధారమైనవి’ అని శ్రీకాంత్ షిండే ట్వీట్లో పేర్కొన్నారుमहायुतीच्या सरकारचा शपथविधी थोडा लांबल्यामुळे सध्या चर्चा आणि अफवा यांचे पीक फोफावले आहे. काळजीवाहू मुख्यमंत्री मा. श्री एकनाथ शिंदे यांनी प्रकृती अस्वास्थ्यामुळे दोन दिवस गावी जाऊन विश्रांती घेतली. त्यामुळे अफवांना अधिकच बहर आला. मी उपमुख्यमंत्री होणार अशा बातम्या प्रश्नचिन्हे…— Dr Shrikant Lata Eknath Shinde (@DrSEShinde) December 2, 2024 -
‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం.. షిండే ఏమన్నారంటే?
ముంబై : మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేని డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలనే యోచనలో మహాయుతి కూటమి పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఆ చర్చల్లో నిజమెంత? అనే దానిపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సి ఉంది. మరోవైపు, శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ వస్తున్న వార్తపై ఏక్నాథ్ షిండే స్పందించారు. ‘ఇలాంటి చర్చలన్నీ మీడియా వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. మహాయుతి కూటమిలో పదవులపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. #WATCH | Satara: Maharashtra caretaker CM Eknath Shinde says, "I am doing good now. I had come here to rest after the hectic election schedule... I did not take any leave during my 2.5 years as the CM. People are still here to meet me. This is why I fell ill... This government… pic.twitter.com/YYa8p7Sh1y— ANI (@ANI) December 1, 2024ఎన్నికల ఫలితాల అనంతరం, రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే కేంద్రం హోంమంత్రి అమిత్ షాత్తో నేను (ఏక్నాథ్షిండే), అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యాం. ముంబైలో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఆ సమావేశంలో అన్నీ విషయాలపై కులంకషంగా చర్చిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన ప్రజలకు మేం జవాబుదారీగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, మహాయుతి పెద్దలు తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏక్నాథ్ షిండే ఖండించారు. తీవ్ర జ్వరంతో సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో ఉన్న షిండే మీడియాతో మాట్లాడుతూ.. నిర్విరామంగా ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురయ్యా. అందుకే మా స్వగ్రామం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నా. నా ఆరోగ్యం బాగుంది. ఇక మహరాష్ట్ర సీఎం ఎవరు? అని అంటారా. సోమవారం మహాయుతి పెద్దలే స్పష్టత ఇస్తారు’ అని స్పష్టం చేశారు. -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
ముంబై : మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు బోల్తాపడి 10 ప్రయాణికులు మరణించారు. పలువురి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మహరాష్ట్ర స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పేషన్(ఎంఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం భండారా నుండి సకోలి మీదుగా గోండియా అనే ప్రాంతానికి వెళ్తుంది.ఆ సమయంలో ఓ మలుపు వద్ద ఆర్టీసీ బస్సుకు అకస్మాత్తుగా ఓ ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చాడు. ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రమాదం జరగకుండా బస్సును పక్కకి తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికుల్లో 10 మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణ భయంతో బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. బస్సు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, తోటి వాహనదారులు ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియాబస్సు ప్రమాదంపై మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తక్షణమే రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..‘గోండియా జిల్లాలోని సడక్ అర్జున్ సమీపంలో శివషాహి ఆర్టీసీ బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మరణం నన్ను కలచి వేస్తుంది. మరణించిన వారికి నా నివాళి’అని తెలిపారు. ‘ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ఫడ్నవీస్ ట్వీట్లో పేర్కొన్నారు. गोंदिया जिल्ह्यातील सडकअर्जुनीनजीक शिवशाही बसचा दुर्दैवी अपघात होऊन काही प्रवाशांचा मृत्यू झाल्याची घटना अतिशय दुर्दैवी आहे. मृतांना मी भावपूर्ण श्रद्धांजली अर्पण करतो. त्यांच्या कुटुंबीयांच्या दु:खात आम्ही सहभागी आहोत.या घटनेत जे लोक जखमी झाले, त्यांना खाजगी रुग्णालयात उपचार…— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 29, 2024 -
పదవుల కోసం పాకులాడం: ఏక్నాథ్ షిండే
ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై అధికార మహాయుతి కూటమిలో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు.ఈ ఇద్దరి మధ్య భేటీ సానుకూలంగా జరిగిందని ఏక్నాథ్ షిండే మీడియాకు వెల్లడించారు.‘అమిత్షాతో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి,ప్రమాణ స్వీకారం వంటి అంశాలపై చర్చించాం. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉంది. మహారాష్ట్ర సీఎం ఎవరు? అనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది.ఈ అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మహా సీఎం ఎంపికపై కసరత్తు పూర్తయిన వెంటనే వివరాల్ని వెల్లడిస్తాం. మహారాష్ట్ర ప్రజలు తమను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించారు. ప్రజల ఆదేశాల్ని గౌరవించడమే ప్రాధాన్యత. పదవుల కోసం పాకులాడం’ అని ఏక్నాథ్ షిండే వెల్లడించారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 132 సీట్లు సొంతం చేసుకోగా.. షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఆ నిర్ణయం కమలం పెద్దలదేమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. దీంతో మహారాష్ట్ర సీఎంగా ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని మహాయుతి కూటమిలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ,ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మహా సీఎం నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకే అప్పగిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలో అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం మహరాష్ట్ర సీఎం ఎవరు? ఏ కూటమికి ఎన్ని మంత్రి పదవులుతో పాటు ఇతర అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది. -
సీఎం పదవిపై నాకు ఆశలేదు: ఏక్నాథ్ షిండే
ముంబై : మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ వీడింది. సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదని ప్రకటించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. తాను ఏనాడూ పేరు కోసం పాకులాడలేదని, బాల్ థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారాయన. బుధవారం థానేలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. సీఎం పదవిపై నాకు ఆశ లేదు. నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్. అంతిమంగా.. మహారాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యం’’ అని అన్నారాయన.మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ విజయాన్ని అందించిన ఓటర్లకు నా కృతజ్ఞతలు. కూటమికి మద్దతు పలికిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. బాల్ ఠాక్రే ఆశయాలతో ముందుకెళ్తా. మహయుతి కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది. నా జీవితంలో నేను సీఎం అవుతానని అనుకోలేదు. ఎన్నో ఒడిదుడుకులు చూశాను. పేదల కష్టాలు, బాధలు చూశాను. మహాయుతి కూటమిలో ఓ కార్యకర్తగా పనిచేశా. ప్రధాని మోదీ మద్దతు నాకు ఉంది అని అన్నారు.ఇక కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరు? అనేది బీజేపీ పెద్దలే నిర్ణయిస్తారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని చేసినా తనకు అభ్యంతరం లేదని ప్రధాని మోదీకి చెప్పాను. పీఎం మోదీ మాటకు కట్టుబడి ఉంటాను’ అని ఉత్కంఠకు తెర దించారు ఏక్నాథ్ షిండే.#WATCH | Thane: Maharashtra caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, "For the past 2-4 days you must have seen rumours that someone is miffed. We are not people who get miffed...I spoke with the PM yesterday and told him that there is no obstruction from our end in… pic.twitter.com/IvFlgD5WQI— ANI (@ANI) November 27, 2024 -
షిండే హ్యాపీయేనా? శివసేన ఏమంటోంది?
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఢిల్లీ పెద్దల దౌత్యంతో.. ఏక్నాథ్ షిండే బెట్టు వీడారనే సంకేతాలు మాత్రం అందుతున్నాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్కు లైన్ క్లియర్ అయ్యాయనే విశ్లేషణలు నడుస్తున్నాయి. మరి సీఎం పదవి వదులుకునే విషయంలో షిండే నిజంగానే హ్యాపీగా ఉన్నారా?. శివసేన అందుకు ఒప్పుకుంటోందా?.. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచి మూడు రోజులవుతుంది. కానీ ఇంతవరకు సీఎం ఎవరనేది బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎటూ తేల్చలేకపోతున్నాయి. ఈ తరుణంలో 14వ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియగా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా గవర్నర్కు సమర్పించారు. ఆపద్ధర్మ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆయనే కొనసాగుతారు. ఇక.. ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలని బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో.. సీఎం సీటు ఎవరికి అనే దానిపై బలనిరూపణ చేయాలంటూ షిండే వర్గం కొత్త డిమాండ్ను తెర మీదకు తెచ్చింది. అయితే ఆ వాదన అసంబద్ధమని తన వర్గీయులను షిండే వారించినట్లు సమాచారం. ‘‘మహాయుతి కూటమి గొప్ప విజయం తర్వాత రాష్ట్రంలో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడనుంది. మహాకూటమిగా కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం.నేటికీ కలిసి ఉన్నాం. నాపై ప్రేమతో.. అందరూ కలిసి ముంబైకి రావాలి’’ అని తాజాగా ఈ ఉదయం ట్వీట్లో ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. ఈలోపు..महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కొనసాగుతున్న చర్చలు మంగళవారం రాత్రి లేదంటే బుధవారం ఉదయానికల్లా ఓ కొలిక్కి రావొచ్చని శివసేన నాయకుడు సంజయ్ శిర్సత్ తెలిపారు. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలనే దానిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలతో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు చర్చిస్తున్నారని. ఇవాళో, రేపో కచ్చితంగా తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే.. ఇదే శిర్సత్.. షిండేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిన్నటిదాకా మీడియా ముందు హడావిడి చేశారు.మహా ల్లో ప్రజాదరణ ఉన్న నేత ఏక్నాథ్ షిండే అని, ఆయన నాయకత్వంలో శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద కూటమి పార్టీగా అవతరించిందని, కాబట్టి ఏక్నాథ్ షిండే సీఎం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీహార్ ఫార్ములా డిమాండ్ లేవనెత్తిన శివసేన నరేష్ కూడా.. ఇప్పుడు షిండే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం గమనార్హం. ఈ లిస్ట్లో ఇవాళ షిండే వర్గీయులు చాలామందే చేరారు. దీంతో.. శివసేనలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. షిండే వెనక్కి తగ్గాలి : కేంద్రమంత్రిమహరాష్ట్ర సీఎం ఎవరు? అనే అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ‘‘మహారాష్ట్ర వివాదం త్వరలో ముగియాలి. దేవేంద్ర ఫడ్నవిస్ను సీఎంను చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఆ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తిని పోగొట్టాలి. అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది కాబట్టి బీజేపీ అందుకు ఒప్పుకోదు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్లాగా ఏకనాథ్ షిండే కూడా రెండు అడుగులు వెనక్కి వేయాలి. లేదంటే ఫడ్నవీస్ నాలుగు అడుగులు వెనక్కి వేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పని చేయాలి. లేదా ప్రధాని మోదీ, అమిత్షాలు జోక్యం చేసుకోవాలి. ఏక్నాథ్ షిండేతో పాటు ఆయన 57 మంది ఎమ్మెల్యేలు..త్వరగా రాజీ కుదుర్చుకుని మంత్రివర్గాన్ని విస్తరించాలి’’ అని అన్నారు.ఒక పార్టీ మద్దతుంటే చాలుమహరాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 132 మంది ఎమ్మెల్యేలు, శివసేన 57, ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో 288 మంది సభ్యుల అసెంబ్లీలో 145 మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడానికి బీజేపీ మహాయతి కూటమిలోని రెండు మిత్రపక్షాలలో ఒక మిత్ర పక్షం మద్దతుంటే సరిపోతుంది. -
షిండేనే మహారాష్ట్ర సీఎం.. తెరపైకి బీహార్ మోడల్!
ముంబై : మహరాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్నే సీఎంను చేయాలని బీజేపీ భావిస్తుండగా.. ఏక్నాథ్ షిండే అడ్డు పడుతున్నారు. అయితే.. ఫలితాలు వెలువడ్డాక సీఎం రేసులో తాను ఉన్నానంటూ సంకేతాలిచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్.. ఇప్పుడు ఫడ్నవిస్కే మద్దతు ఇవ్వబోతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తునాయి. ఈలోపు.. బీహార్ మోడల్ను తెరపైకి తెచ్చారు ఓ ఎంపీ. బీహార్ మోడల్ ప్రకారం.. ఏక్నాథ్ షిండేని సీఎంగా కొనసాగించాలని ఆ వర్గం నేత నరేష్ మ్హస్కే డిమాండ్ చేస్తున్నారు. . అలా జరిగితే.. తన మిత్ర పక్షాల్ని రాజకీయావలసరాల కోసం వాడుకుని, ఆపై వదిలేస్తుందనే విమర్శలకు బీజేపీ ధీటైన సమాధానం ఇచ్చినట్లు అవుతుందని నరేష్ అంటున్నారు. బీహార్ మోడల్ ఏంటంటే..2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 243 స్థానాలకు గానూ.. ఆర్జేడీ 75 సీట్లు దక్కించుకోగా, బీజేపీ 74, జేడీ(యూ) 43 స్థానాలు దక్కించుకుంది. అయితే.. బీజేపీ జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. నితీశ్ కుమార్ను సీఎంను చేసి పెద్ద త్యాగమే చేసింది. ఆ టైంలో శివసేన పత్రిక సామ్నా ఈ పరిణామంపై సెటైర్లు కూడా వేసింది.2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, శివసేన 56, ఎన్సీపీ 54 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే సీఎం పదవిని బీజేపీ వదులుకోకపోవడంతో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత.. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వర్గం చీలికతో బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. షిండేనే బీజేపీ సీఎంను చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 132 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అయితే, సీఎం విషయమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.బీజేపీ అధిష్టానం దేవేంద్ర ఫడ్నవీస్కు సీఎం బాధ్యతల్ని అప్పగించేందుకు మొగ్గు చూపుతుంది. అజిత్ పవార్ నేతృత్వరంలోని ఎన్సీపీ సైతం ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టడాన్ని సమర్థిస్తోంది. కానీ, శివసేన నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే మాత్రం సీఎం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. షిండే వర్గం నేతలు ఇదే విషయంపై కుండబద్దలు కొడుతున్నారు. ఈ తరుణంలో సోమవారం (నవంబర్ 25న) మహాయుతి కూటమి వర్గం కీలక నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే,అజిత్ పవార్లు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ పెద్దలు రాత్రికల్లా తేల్చే అవకాశం ఉంది. -
‘నేను రాలేదు.. కాబట్టే నువ్వు గెలిచావ్ రా’!..
ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ బాబాయ్ అజిత్ పవార్, అబ్బాయి రోహిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం, ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తరుఫున అహల్య జిల్లా ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ సోదరుడి కుమారుడు రోహిత్ పవార్.. బీజేపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.ఈ తరుణంలో సోమవారం(నవంబర్ 25) మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేనే ఖజరత్ జమ్ఖేడ్లో ఎన్నికల ప్రచారం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేది?’’ అని రోహిత్ పవార్ను ఉద్దేశిస్తూ అజిత్ పవార్ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడారు. ఆ మాటతో రోహిత్ పవార్.. అజిత్ పవార్ కాళ్లకు నమస్కరించారు.స్వల్ప తేడాది విజయంఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహల్యానగర్ జిల్లాలోని ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నేత రామ్ షిండేపై 1,243 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 41 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ గెలుపుగత వారం మహరాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలలో శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)10 స్థానాల్ని కైవసం చేసుకోగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. स्व. यशवंतराव चव्हाण साहेबांची समाधी प्रितीसंगम म्हणजे पवित्र स्थळ. चव्हाण साहेबांनीच एक सुसंस्कृत अशी राजकीय संस्कृती जपण्याचे संस्कार महाराष्ट्रावर केले. त्यानुसारच आज प्रितीसंगमावर आदरणीय अजितदादांची भेट झाली. त्यांची राजकीय वाटचाल स्वतंत्र दिशेने सुरु असली तरी त्यांचा राजकीय… pic.twitter.com/Oc8eQYdwfN— Rohit Pawar (@RRPSpeaks) November 25, 2024 -
అది వాళ్లకు అనవసరం.. రాజకీయాలకు స్వస్తి పలకడంపై శరద్ పవార్
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర పరాజయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఊహించలేదని, ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయమని అన్నారు .మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ మాట్లాడారు. 288 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ 41 స్థానాల్ని గెలిచారని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ ఫలితాల్ని మేం ఊహించలేదు. ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయం. నాకంటే అజిత్ పవార్కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహరాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.ఈ తరుణంలో పలువురు ఎన్సీపీ నేతలు.. శరద్ పవార్ రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఏం చేయాలో వాళ్లకు అనవసరం నేను ఏం చేయాలో నేను, నా సహచరులు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
న్యూఢిల్లీ: కేవలం అభివృద్ధి రాజకీయాలకే ప్రజలు పట్టం కట్టారని, అబద్ధాల రాజకీయాలను చిత్తుచిత్తుగా ఓడించారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రగిల్చిన విద్వేషాలను జనం తిప్పికొట్టారని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విభజన శక్తులను, ప్రతికూల రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో స్థిరత్వానికే ఓటు వేశారని, సమాజాన్ని అస్థిరపర్చాలని చూసే వారికి తగిన గుణపాఠం నేర్పారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు ఐక్య సందేశాన్ని ఇచ్చాయని, ఏక్ హై తో సేఫ్ హై నినాదాన్ని బలపర్చాయని వెల్లడించారు. జార్ఖండ్ ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తామని ప్రకటించారు. జార్ఖండ్ మరికొంత కష్టపడి పనిచేస్తే బీజేపీ గెలిచేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... విభజన శక్తులను ప్రజలు మట్టి కరిపించారు ‘‘ఏక్ హై తో సేఫ్ హై అనే నినాదం మొత్తం దేశానికి మహామంత్రంగా మారింది. దేశాన్ని కులం, మతం పేరిట ముక్కలు చేయాలని చూస్తున్న దుష్ట శక్తులను ఈ మంత్రం శిక్షించింది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేసి ఆదరించారు. రాజ్యాంగం పేరిట అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్నచిన్న గ్రూప్లుగా విడదీసి లాభపడొచ్చని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావించాయి. కానీ, ప్రజలు ఆయా పారీ్టల చెంప చెళ్లుమనిపించారు. విభజన శక్తులను మట్టి కరిపించారు. దేశంలో మారుతున్న పరిస్థితులు, వాస్తవాలను గుర్తించడంలో కాంగ్రెస్ విఫలమైంది. అస్థిరతను ఓటర్లు కోరుకోవడం లేదు. దేశమే ప్రథమం(నేషన్ ఫస్టు) అనే సూత్రాన్ని నమ్ముతున్నారు. పదవే ప్రథమం(చైర్ ఫస్టు) అని కలలు కంటున్నవారిని ఎంతమాత్రం విశ్వసించడం లేదు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలను అమలు చేయ డం లేదు. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరు ఆధారంగా మహారాష్ట్రలోనూ ఆ పార్టీపై ప్రజలు ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు. అందుకే ఎన్ని హామీలిచ్చి నా ఎన్నికల్లో గెలిపించలేదు. కాంగ్రెస్ తప్పుడు హామీలు, ప్రమాదకరమైన ఎజెండా మహారాష్ట్రలో పనిచేయలేదు. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే పని చేస్తుందని మహారాష్ట్ర ఎన్నికలు తేటతెల్లం చేశాయి’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను అస్సలు ఊహించలేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ
ఢిల్లీ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని తాను ఊహించలేదని అన్నారు కాంగ్రెస్ అగనేత రాహుల్ గాంధీ. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ 288 స్థానాల్లో ఏకంగా 130 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర మిత్ర పక్షాలతో కలిసి మెజార్టీని సాధించారు. దీంతో రెండోసారి మహాయతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఈ తరుణంలో మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. మహరాష్ట ఫలితాల్ని నేను ఊహించలేదు. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఓటమికి గల కారణాల్ని విశ్లేషిస్తామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీకి మద్దతిచ్చిన ఓటర్లకు, సోదరీమణులందరికీ, పార్టీ గెలుపుకోసం కృష్టి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు’అని అన్నారు. మరోవైపు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూమి రక్షణ విజయం’అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వం వహిస్తున్న జేఎంఎం 34 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలించింది.झारखंड के लोगों का INDIA को विशाल जनादेश देने के लिए दिल से धन्यवाद। मुख्यमंत्री हेमंत सोरेन जी, कांग्रेस और झामुमो के सभी कार्यकर्ताओं को इस विजय के लिए हार्दिक बधाई और शुभकामनाएं।प्रदेश में गठबंधन की यह जीत संविधान के साथ जल-जंगल-ज़मीन की रक्षा की जीत है।महाराष्ट्र के नतीजे…— Rahul Gandhi (@RahulGandhi) November 23, 2024 -
థ్యాంక్యూ అమ్మ.. తల్లితో దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించింది. మొత్తం 288 స్థానాల్లో అధికార బీజేపీ 229 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కేవలం 54 స్థానాలకే పరిమితమైందిఈ తరుణంలో కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తమ కుమారుడే మహరాష్ట్ర సీఎం అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తన కుమారుడు 24 గంటలూ కష్టపడుతున్నారని మీడియాతో పేర్కొన్నారు.మరోవైపు, మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న దేవేంద్ర ఫడ్నవీస్కు ఆమె తల్లి సరితా ఫడ్నవీస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫోన్ కాల్లో ‘ఎన్నికల తతంగం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తా అమ్మా. మీతో అన్నీ మాట్లాడుతాను. మీరు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.కాగా,ప్రస్తుతం విడుదలైన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 124 స్థానాల్లో ముందంజలో ఉంది. 144 స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహాయుతి కూటమిలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 56, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. శివసేన(యూబీటీ) 18, శరద్ పవార్ ఎన్సీపీ 15 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. #WATCH | As Mahayuti is set to form govt in Maharashtra, Deputy CM Devendra Fadnavis' mother, #SaritaFadnavis says, "Of course, he will become the CM...It is a big day as my son has become a big leader in the state. He was working hard at all 24 hours..."#ElectionResults… pic.twitter.com/MV36KVSyJe— TIMES NOW (@TimesNow) November 23, 2024 -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా!
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్ పవార్తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్, జార్ఘండ్లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్ పవార్.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా -
మహారాష్ట్ర ఎన్నికలు.. సీఎం షిండే బ్యాగ్ తనిఖీ చేసిన అధికారులు
ముంబై: మహరాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రతిపక్షాలకు చెందిన నేతల బ్యాగుల్ని మాత్రమే తనిఖీ చేస్తారని, అధికార పార్టీ నేతల బ్యాగులను పరిశీలించరంటూ శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. అందుకు కౌంటర్గా బుధవారం ఎన్నికల అధికారులు మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బ్యాగులను చెక్ చేశారు.నవంబర్ 20న మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సీఏం ఏక్నాథ్ షిండే బుధవారం పాల్ఘర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్కు తన హెలికాప్టర్తో వచ్చారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులు హెలికాప్టర్లో ఉన్న ఏక్నాథ్ షిండే వ్యక్తిగత స్కూట్కేసును పరిశీలించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న షిండే వ్యక్తి గత సిబ్బంది సూట్కేసులో దుస్తులు తప్ప ఏమిలేవని చెబుతుండగా.. మధ్యలో షిండే జోక్యం చేసుకుని వారి డ్యూటిని వారిని చేయనివ్వండి అంటూ ఎన్నికల అధికారులకు అనుమతి ఇచ్చారు. దీంతో షిండే సూట్కేసును పరిశీలించగా అందులో దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. హెలికాప్టర్లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బ్యాగును ఎన్నికల అధికారులు చెక్ చేశారు. హెలికాప్టర్లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి.#WATCH | Maharashtra: CM Eknath Shinde’s bags were checked at Palghar Police ground helipad where he reached for the election campaign.(Source: Shiv Sena) pic.twitter.com/44CnWiTYzG— ANI (@ANI) November 13, 2024 ప్రతిపక్షాల నేతలకేనా ఈ నిబంధనలుకాగా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం యవత్మాల్కు వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగ్ని తనిఖీ చేశారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లు,బ్యాగులు మాత్రమే పరిశీలిస్తున్నారని, అధికార కూటమి నేతల విషయంలో నిబంధనలు అమలు చేయడం లేదని ఆరోపించారు. అంతేకాదు, యావత్మాల్లో తన బ్యాగులను తనిఖీ చేసిన తర్వాత ఠాక్రే ఎన్నికల అధికారులను వారి పేరు, వారి పోస్టింగ్ గురించి అడిగారు. సదరు అధికారులు సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, హోం మంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీల బ్యాగ్లను తనిఖీ చేశారా అని ప్రశ్నించారు.అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఎన్నికల నిబంధనల మేరకు దేశంలోని అగ్ర రాజకీయ నేతలకు సంబంధించిన హెలికాప్టర్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేరకే ఠాక్రే బ్యాగును పరిశీలించామన్నారు. #WATCH | #MaharashtraElections2024: Uddhav Thackeray’s Bags Checked By EC Officials Again; Video Surfaces#ShivSenaUBT #UddhavThackeray #Latur #Maharashtra pic.twitter.com/FxMVWufcxY— Free Press Journal (@fpjindia) November 12, 2024 -
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు
నాందేడ్: ఇప్పటికే తెలంగాణా,కర్ణాటక రాష్ట్రాలలో సంచలన విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలోనూ భాగ స్వామ్య పక్షాలతో కలిసి విజయం సాధించి దక్షిణాదిలో బీజేపీ దూకుడుకు ముకుతాడు వేసేందుకు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది.భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు అంశంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.ఈ మేరకు ఏఐసీసీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలెట్లు బుధవారం మహారాష్ట్రలోని నాందేడ్లో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించి నాయకులు, పార్టీ శ్రేణులకు ఎన్నికల రూట్ మ్యాప్పై దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేలా కృషిచేయాలంటూ వారికి సూచించారు. -
సుందరీకరణ ప్రాజెక్ట్ : ఎన్నికల్ని బహిష్కరిస్తాం.. ఓటర్ల హెచ్చరిక
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో పేరుకుపోయిన ఎర్రమట్టిని తొలగించే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పర్యావరణానికి అలాగే తమకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తున్న ఈ ఎర్రమట్టిని తొలగిస్తారా..? లేదా..? అని ప్రజలు స్ధానిక ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుంటే నవంబరు 20న జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేయాలని తమను బలవంతం చేసినా లేదా ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా..? నన్ ఆఫ్ ఎబౌ (నోటా) మీటను నొక్కుతామని స్పష్టం చేశారు.శివాజీపార్క్ మైదానం బీఎంసీకి చెందిన జీ–ఉత్తర వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ వార్డు అసిస్టెంట్ కమిషనర్ అజీత్కుమార్ ఆంబీని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహానికి గురైన మైదానం చుట్టుపక్కల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని, కుదరని పక్షంలో నోటాపై నొక్కాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు ఆందోళనలో పడ్డారు. సైలెన్స్ జోన్లో ఉన్నా...షరతులతో అనుమతి.. నగరం నడిబొడ్డున దాదర్ ప్రాంతంలో 98 వేల చదరపు మీటర్ల స్ధలంలో చారిత్రాత్మక శివాజీపార్క్ మైదానం విస్తరించి ఉంది. బ్రిటీష్ హయాంలో స్వాతంత్య్ర పోరాటం సహా అనేక పోరాటాలకు ఈ మైదానం వేదికైంది. అంతేకాదు గతంలో సునీల్ గవాస్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనీల్ కాంబ్లే వంటి దిగ్గజాలు సహా అనేకమంది క్రికెటర్లు క్రికెట్ ఆటను ఈమైదానంలో సాధన చేసేవారు.ఇక లోక్సభ, అసెంబ్లీ, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వచ్చాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రచార సభలతో ఈ మైదానం హోరెత్తుతుంటుంది. ఈ మైదానం సైలెన్స్ జోన్లో ఉన్నప్పటికీ కొన్ని షరతులతో అనుమతి ఇవ్వక తప్పకపోవడంతో వీటన్నిటి నేపథ్యంలో మైదానంలో పెద్దఎత్తునఎర్రమట్టి పేరుకుపోతోంది. ఫలితంగా చుట్టపక్కల నివాసముంటున్న వేలాది కుటుంబాలు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కుంటున్నాయి. తమ సమస్య పరిష్కరించాలని ఏళ్ల తరబడి బీఎంసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగలడంతో తమ సమస్యను పరిష్కరించాలని కాలుష్య నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు లేఖలు కూడా రాశారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో అనేక ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మే లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా స్ధానికులు ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన ప్రభుత్వం మైదానంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ప్రారంభించింది.కానీ జూన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.మైదానంలో ఉదయం, సాయంత్రం అనేక మంది వ్యాయామం చేస్తారు. కొందరు మార్నింగ్, ఈవ్నింగ్ వాక్కు వస్తుంటారు. మరికొందరు పిల్లపాపలతో సరదాగా గడిపేందుకు, మరికొందరు కాలక్షేపం కోసం వస్తుంటారు. దీంతో స్ధానికులతోపాటు ఇక్కడకు వచ్చినవారంతా శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ను అమల్లో ఉందంటూ బీఎంసీ అధికారులు పనుల కొనసాగింపును వ్యతిరేకిస్తున్నారు. కాగా మట్టిని తొలగించడానికి ఎన్నికల కోడ్కు సంబంధమేమిటని శివాజీపార్క్ రహివాసీ సంఘటన సభ్యులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
మరో సంచలనం : అజిత్ పవార్పై శరద్ పవార్ మనవడు పోటీ
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతిలో నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పోటీ చేస్తుండగా..ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ) పోటీచేస్తున్న 45 మంది అభ్యర్థుల జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఈ 45 మంది అభ్యర్థుల జాబితాలో బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 32ఏళ్ల యుగేంద్ర పవార్ పేరు సైతం ఉంది. పవార్ కుటుంబానికి కంచుకోట బారమతి నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం అధినేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్పవార్ పోటీ చేస్తుండడం చర్చనీయంశంగా మారింది. Pune | On Baramati candidate selection, Maharashtra State President of the NCP (Sharadchandra Pawar faction), Jayant Patil says, "Baramati candidate selection is based on the demand from the local people of Baramati...I had the interaction with them...They have suggested he is… pic.twitter.com/Fi2mClnFrr— ANI (@ANI) October 24, 2024లోక్సభ ఎన్నికల్లో బారామతి లోక్సభ స్థానం నుంచి ఆయన భార్య సునేత్ర పవార్ను బరిలోకి దింపగా.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేశారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో సుప్రియా గెలుపొందడం శరద్ పవార్ వర్గానికి భారీ ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశానని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని పలుమార్లు మీడియా ఎదుట వెల్లడించారు. ఇప్పుడు తాజా అజిత్ పవార్పై తన మనవడు శరద్పవార్ను పోటీకి దించడం సంచలనంగా మారింది. -
‘MVA’లో కొలిక్కి వచ్చిన సీట్ల పంచాయితీ .. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
ముంబై : మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చింది. కూటమిలోని ఒక్కో పార్టీ 85 సీట్లలో పోటీ చేస్తున్నట్లు కుటమి నేతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.మహరాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 20న జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం),నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్పవార్ వర్గం)లోని మహా వికాస్ అఘాడీ కూటమి పోటీ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంవీఏలోని ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేదు. సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల నేతల మధ్య ఫలు దఫాలుగా జరిగిన చర్చాలు జరిగాయి. తాజాగా బుధవారం జరిగిన చర్చల అనంతరం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు వెల్లడించారు. మిగిలిన 33 స్థానాలపై తర్వలో స్పష్టత ఇవ్వనున్నారు. బీజేపీ తొలి జాబితా విడుదల మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్కు చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు. జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. -
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
మహిళ ప్రాణం తీసిన మ్యాన్హోల్ గ్రిల్స్ దొంగతనం
మ్యాన్హోల్ గ్రిల్స్ (మెటల్స్) దొంగతనం 45 ఏళ్ల విమల్ అనిల్ గైక్వాడ్ ప్రాణం తీసింది. భారీ వర్షాలకు గైక్వాడ్ మ్యాన్హోల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండేలా అధికారులు మ్యాన్హోల్స్ను మెటల్స్ను అమర్చారు. ఆ మెటల్స్ను అగంతకులు దొంగతనం చేశారు. ముంబైలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు విమల్ అనిల్ గైక్వాడ్ ప్రమాదవ శాత్తూ డ్రైనేజీలో పడి మరణించారు. ఈ ఘటనలో కుటుంబానికి ఆధారమైన తన భార్య మరణానికి కారణమైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి భర్త పోలీసుల్ని ఆశ్రయించారు‘నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నన్ను, నా ఇంటి బాధ్యతల్ని తన చూసుకునేది. ఇంటి బాధ్యతల్ని నా భార్యనే చూసుకునేది. ఆమె మరణంతో మేం సర్వం కోల్పోయాం ’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా తప్పు ఎవరిదైనా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనిల్ గౌక్వాడ్ ఫిర్యాదుతో పోలీసులు..ఈ దర్ఘుటనలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ శాఖ.. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసి, మూడు రోజుల్లో నివేదికను కోరింది. నిన్న కురిసిన భారీ వర్షం వల్ల ఆర్థిక రాజధానిలో రైలు పట్టాలు, రోడ్లు నీట మునిగాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది .14 విమానాలు దారి మళ్లించాయి. అయితే వర్షం బీభత్సం సమయంలో గైక్వాడ్ అంధేరీ ఈస్ట్లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనం గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్హోల్లో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు,అగ్నిమాపక దళ సిబ్బంది ఆమెను కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.కాగా, ఈ ఏడాది ముంబైలో వేర్వేరు మ్యాన్హోల్లో పడిన ఘటనల్లో కనీసం ఏడుగురు మరణించారు. నగరంలో మ్యాన్హోల్ మెటల్ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయని, గతేడాది ముంబైలో 791 మ్యాన్హోల్ కవర్ దొంగతనాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
ముంబైలో వర్ష బీభత్సం
ముంబై: మహరాష్ట్రలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముంబై రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం కారణంగా స్పైస్జెట్, విస్తారాతో పాటు పలు సంస్థలు విమానాలను దారి మళ్లించాయి. వాతావరణ శాఖ బుధవారం ఉదయం ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల అనంతరం మధ్యాహ్నం నుంచి ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో భారీ వర్ష పాతం నమోదైంది. ములుండ్ దాని పరిసరాల్లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాతావరణ శాఖ అధికారి సుష్మా నాయర్ మాట్లాడుతూ, ఉత్తర కొంకణ్ నుండి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాలలో తుఫాను ద్రోణి నడుస్తుందని చెప్పారు. ఫలితంగా ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందన్నారు. ఈ వారంలో కొంకణ్, గోవాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె వావాతవరణ శాఖ అధికారి సుష్మా నాయర్ చెప్పారు. -
పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే కుమారుడు సంకేత్ బవాన్కులే మద్య మత్తులో బీభత్సం సృష్టించారు. పూటుగా మద్యం సేవించి ఇతర వాహనాల్ని ఢీకొట్టారు. ఘటన అనంతరం సంకేత్ బవాన్కులేతో పాటు అతని స్నేహితులు పరారయ్యారు. సంకేత్ కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..సోమవారం అర్ధరాత్రి 1 గంటకు మద్యం మత్తులో ఉన్న సంకేత్ బవాన్కులే ఆడి కారుతో మాన్కాపూర్ ప్రాంతం వైపు వెళుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్న వాహనాల్ని ఢీకొట్టాడు. నానా హంగామా చేశాడు. అయితే సంకేత్ తీరుతో కోపోద్రికులైన ఇతర వాహనదారులు.. అతని కారును వెంబడించారు. దీంతో మార్గం మద్యలోనే కారును వదిలేశాడు. అందులో ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్ట్.. ఆపై బెయిల్ప్రమాదంలో తన కారుకు డ్యామేజీ జరిగిందంటూ జితేంద్ర సోన్కాంబ్లే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంకేత్ బవాన్కులే కారు డ్రైవర్ అర్జున్ హవ్రే, రోనిత్ చిట్టమ్వార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది సేపటికే బెయిల్పై విడుదలయ్యారు. చట్టం ముందు అందరూ సమానులేఈ సందర్భంగా కారు ప్రమాదంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే స్పందించారు. ఆ ఆడి కారు తన కుమారుడు సంకేత్ పేరిట రిజిస్టర్ అయినట్లు అంగీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా క్షుణ్ణంగా,నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి.దోషులకు కఠిన శిక్ష విధించాలి.చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. -
తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు : డిప్యూటీ సీఎం
మీ రాజకీయ లబ్ధి కోసం తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ జన సమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో..రాష్ట్ర మంత్రి ధర్మారావు బాబా ఆత్రం, ఆయన కుమార్తె భాగ్యశ్రీ గురించి మాట్లాడారు. భాగ్యశ్రీ తండ్రి ప్రత్యర్ధి పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పి)లోకి వెళ్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు తండ్రి ధర్మారావు బాబా ఆత్రంపై కుమార్తె భాగ్యశ్రీ పోటీ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంపై అజిత్ పవార్ స్పందించారు. ‘ తండ్రిపై కుమార్తె పోటీ చేయడం ఎంత వరకు కరెక్ట్. కూతురిని తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ బెల్గాం వెళ్లినప్పటికీ..గడ్చిరోలిలో ఆమెకు (తండ్రి ఆత్రం) అండగా నిలిచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేశారు. ఇప్పుడు మీరు (భాగ్యశ్రీ) మీ తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన మీదే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మీ నిర్ణయం సరైందేనా? అని ప్రశ్నించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ తండ్రికి మద్దతు ఇవ్వండి. అతనిని గెలిపించండి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం , సంకల్పం ఆయనకు మాత్రమే ఉంది. కుటుంబంలో చీలికలు రావడాన్ని సమాజం అంగీకరించదు. నా విషయంలోనూ ఇదే జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్ను పోటీకి దింపి ఉండాల్సింది కాదు. నేను తప్పు చేశా. చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకుంటున్నా’ అని అన్నారు.అజిత్ పవార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. కొద్ది రోజుల క్రితం ఇలాగే మాట్లాడారు. ఇటీవల మహరాష్ట్ర లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శరద్ పవార్ తన అనుభవాన్ని రంగరించి, తన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ ఎన్నికల్లో బారామతి లోక్సభ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరుఫున సుప్రీయా సూలే బరిలో దిగగా..అదే స్థానంలో సుప్రియా సూలేపై అజిత్ పవార్ ఎన్సీపీ తరుఫున ఆయన భార్య సునేత్ర పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మహరాష్ట్ర అధికార కూటమి నుంచి అజిత్ పవార్ను బీజేపీ పక్కన పెట్టేస్తుందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాల నడుమ అజిత్ పవార్ ఇలా మాట్లాడుతుండడం గమనార్హం. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం షురూ.. నేటి నుంచి ప్రజల్లోకి రాహుల్
ముంబై : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం షురూ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ గురువారం ప్రారంభించనున్నారు. ప్రచారంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారంలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు వాంగిలో మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత పతంగరావు కదమ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు, ఆ తర్వాత 1.45 గంటలకు కడేగావ్లో బహిరంగ సభ నిర్వహిస్తారు’ అని జాతీయ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.288 అసెంబ్లీ స్థానాల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది.మహరాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో ఈ ఏడాది మహరాష్ట్రలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. 48 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 23 స్థానాలు,శివసేన 18 స్థానాలు,నేషనలిస్ట్ కాంగ్రెస్ 4 స్థానాలు,కాంగ్రెస్ 2,స్వాభిమాని పక్ష ఒకస్థానంలో గెలిచింది. #WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from his residence. Rahul Gandhi will visit Maharashtra today, where he will hold a public meeting. pic.twitter.com/aysHPWuY9I— ANI (@ANI) September 5, 2024 -
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన : నిందితుడు దొరికాడు
ముంబై : మహారాష్ట్రలో 35 అడుగుల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనలో విగ్రహ తయారీ దారుడు జయదీప్ ఆప్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. జయదీప్ ఆప్టే ప్రస్తుతం రాష్ట్ర డీసీపీ కార్యాలయంలో పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెల ఆగస్ట్ 26న సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిపోయింది. ఈ ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరాఠా యోధుడి విగ్రహం ఏర్పాటులో అవినీతి జరిగిందని, నిందితుల్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో జయదీప్ పరారయ్యాడు. ఎట్టకేలకు కణ్యాణ్ ప్రాంతంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.అనుభవం లేకుండా విగ్రహం తయారీమహరాష్ట్రలో దుమారం రేపుతున్న శివాజీ విగ్రహం కూలిన ఘటనపై జయ్దీప్ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కల్యాణ్ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న జయ్దీప్కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవం ఉన్న జయ్దీప్ 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశారనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. అనుభవం లేకపోవడం, ఫలితంగా విగ్రహం కూలిపోవడంపై పోలీసులు జయ్దీప్పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ విగ్రహం కూలిపోవడంతో ఇప్పటికే మహరాష్ట్ర పోలీసులు జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్పై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆగస్టు 31న పాటిల్ను అరెస్టు చేయగా..ఆప్టేపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం, సింధుదుర్గ్ పోలీసులు బృందాలుగా విడిపోయి జయ్దీపై కోసం ముంబై, థానే, కొల్హాపూర్తో సహా పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అరెస్ట్ చేశారు. రాజకీయ దుమారంమరికొన్ని రోజుల్లో మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.236 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంత భారీ నిర్మాణాన్ని రూపొందించడంలో అనుభవం లేకపోయినా జయదీప్కు ఇంత ముఖ్యమైన కాంట్రాక్టు ఎలా ఇచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్కనారు. -
సీఎం అభ్యర్థి గురించి ఇప్పుడెందుకు? ముందు ఎన్నికల్లో గెలుద్దాం
మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) తరుఫు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదని, కూటమి సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే విపక్ష కూటమికి సీఎం అభ్యర్థిగా శివసేన (యుబిటి)కి నేతృత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేను ఖరారు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్న తరుణంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎవరు? అనేది సంఖ్యా బలాన్ని బట్టి నిర్ణయించాలి. ఎన్నికల ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని శరద్ పవార్ తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరు అని తేల్చకుండా ఎన్నికల ప్రచారం, గెలుపుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదంటూ నాటి ఎమర్జెన్సీ (1977) సమయంలో జరిగిన లోక్సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు.ఎమర్జెన్సీ సమయంలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తర్వాతనే ప్రధాని మొరార్జీ దేశాయ్ని జనతా పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల ప్రచారంలో పీఎం అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు కూడా అంతే.. సీఎం ఎవరు? అనేది ఆలోచించాల్సిన సందర్భం కాదు. కలిసి ఎన్నికల బరిలోకి దిగుదాం. ప్రజల మద్దతు లభించిన తర్వాత.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిందాం’ అని శరద్ పవార్ పిలుపునిచ్చారు. డైలమాలో కాంగ్రెస్రానున్న ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడంలో కాంగ్రెస్ సైతం డైలమాలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శివసేన (యుబిటి) ఒత్తిడి చేస్తుండగా..అదే సమయంలో, ఉద్ధవ్ను సంకీర్ణ ప్రచార సారథిగా చేయాలని కాంగ్రెస్ యోచిస్తుందనే వార్తలు మహా పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతున్నాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. -
ప్రధాని మోదీలో అహంకారాన్ని చూశారా? : ఉద్ధవ్ ఠాక్రే
ముంబై : ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహరాష్ట్రలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుతాత్మ చౌక్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు విపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అయితే మోదీ క్షమాపణలపై మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.మోదీ క్షమాపణల్లో మీరు అహంకారాన్ని చూశారా? ప్రధాని ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయినందుకా? లేదంటే విగ్రహం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నందుకా? అని ప్రశ్నలు కురిపించారు. శివాజీ మహారాజ్ను అవమానించిన శక్తులను ఓడించడానికి ఎంవీఏ క్యాడర్ కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఇక శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించిన సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మేం రాజకీయాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తుంది. మేం రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర కీర్తి కోసం పోరాడుతున్నాం. మహాయుతి ప్రభుత్వానికి గెట్ అవుట్ చెప్పడానికి మేము గేట్వే ఆఫ్ ఇండియాకు వచ్చాము’అని హెచ్చరించారు. -
‘బాబోయ్ వాంతులు’.. కూటమిలో చిచ్చు పెట్టిన మంత్రి కామెంట్లు!
వీళ్ల పక్కన కూర్చోవాలంటేనే నాకు వాంతి వచ్చినట్లే అనిపిస్తుందంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందోనని అధికార మహాయుతి కూటమి నేతలకు భయం పట్టకుంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు?సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంత్రి తానాజీ సావంత్ ఎన్సీపీ (అజిత్పవార్), కాంగ్రెస్ పట్ల తనకున్న అయిష్టత గురించి బహిర్గతం చేశారు. ‘‘నేను హార్డ్కోర్ శివసైనికుడిని. నా జీవితంలో కాంగ్రెస్, ఎన్సీపీతో నేను ఎప్పుడూ స్నేహం చేయలేదు. విద్యార్థి దశ నుంచి ఆ రెండు పార్టీలకు నేనెప్పుడూ దూరమే. కానీ రాజకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ నేతలతో కలిసి కేబినెట్ సమావేశంలో కూర్చోక తప్పడం లేదు. కూర్చున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత నాకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది’’ అని మహరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ వ్యాఖ్యానించారు.STORY | Sit next to NCP ministers at cabinet meetings but it’s nauseating: Shiv Sena’s Tanaji SawantREAD: https://t.co/fMan6gEu4UVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/YQIlgm72Hf— Press Trust of India (@PTI_News) August 30, 2024 ధర్మాన్ని కాపాడేందుకే మౌనంమరోవైపు తానాజీ సావంత్ కామెంట్స్పై ఎన్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అమోల్ మిత్కారీ ఓకింత అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనమైన సంకీర్ణాన్ని కొనసాగించడం తమ పార్టీ బాధ్యత మాత్రమేనా? అని ప్రశ్నించారు. సంకీర్ణ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే తాము మౌనంగా ఉన్నామని అన్నారు.బీజేపీకి అజిత్ పవార్ అవసరం తీరినట్లుందితానాజీ సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గం నేతలతో పాటు ఎన్సీపీ (శరద పవార్) వర్గం నేతలు సైతం స్పందిస్తున్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ..తానాజీ వ్యాఖ్యలు మహాయుతి సంకీర్ణానికి ఇకపై అజిత్ పవార్ ఎన్సీపీ అవసరం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లైంది. ఆర్ఎస్ఎస్లో కూడా అజిత్ పవార్తో పొత్తుపై ఆందోళనలు తలెత్తాయని, ఇప్పుడు సావంత్ ప్రకటనతో ఆందోళనలు బహిర్గతం అయ్యాయని సూచించారు. బీజేపీ అజిత్ పవార్ను మహాయుతి నుండి బయటకు పంపే సమయం ఆసన్నమైంది. పరిస్థితులు బాగలేవని చెప్పారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిఅజిత్ పవార్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోయారని, ఎన్సీపీతో పొత్తుపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని మరో ఎన్సీపీ (ఎస్పి) ప్రతినిధి మహేష్ తపసే పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్సిపిలో అపారమైన గౌరవాన్ని పొందిన అజిత్ పవార్ అధికారం కోసం తన ఆత్మగౌరవాన్ని రాజీ చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు. మరి ఈ వరుస పరిణామాలపై మహాయుతి కూటిమి పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.తానాజీ సావంత్ వ్యాఖ్యలతో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమి నేతల్లో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం’ : షిండే
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. గురువారం మరాఠా యోధుడి పాదాలపై శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.అయితే, ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా కొత్త విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేయొచ్చనే అంశంపై ప్రభుత్వానికి తగు సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. ‘రాజకీయం చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనందరి దేవుడు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ఆయన పాదాలకు శిరస్సు వంచి ఒక్కసారి కాదు వందసార్లు క్షమాపణలు చెబుతాను. మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యవహారాల్ని చక్కబెడుతున్నాము’అని అన్నారు. ‘బుధవారం రాత్రి మేం ఐఐటీల ఇంజనీర్లు, నేవీ అధికారులతో భేటీ అయ్యాము. కొత్త విగ్రహం ఏర్పాటుపై రెండు కమిటీలను నియమించాం. ఆ స్థలంలో త్వరలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను ఒక కమిటీ గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాలను తయారు చేసిన అనుభవం ఉన్న శిల్పులు, నిపుణులతో పాటు ఇంజనీర్లు, నేవీ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
‘నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచి పెట్టం’
ముంబై : దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. కోల్కతా ఆర్జీకార్, బద్లాపుర్ పాఠాశాల లైంగిక వేధింపుల ఘటనలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ మోదీ వ్యాఖ్యానించారు. మహరాష్ట్రలోని లఖ్పతి దీదీ కార్యక్రమంలో మహిలలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మోదీ ప్రసంగించారు. నేను అన్నీ రాష్ట్రాలకు చెబుతున్నా. మహిళలపై దారుణాలకు ఒడిగట్టే నేరస్థులు ఎవ్వరైనా సరే ఉపేక్షించవద్దు. త్వరలో చట్టాల్ని మరింత పటిష్టపరుస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Jalgaon, Maharashtra: 'The security of women is also very important for our country. I will once again tell every state government that crimes against women are unforgivable. No matter who the culprit is, they should not be spared,' says PM Modi at the Lakhpati Didi Sammelan pic.twitter.com/6I1SSo9FOk— IANS (@ians_india) August 25, 2024 -
స్కూల్లో చిన్నారులపై దారుణం.. ఆందోళనలతో ఆగిన రైళ్ల రాకపోకలు
థానే: ఓ వైపు ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆందోళలు కొనసాగుతున్న వేళ.. మరికొందరు చిన్నారుల పట్ల ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు.ఆగస్టు 16న మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్లో చదివే ఇద్దరు బాలికలపై అదే స్కూల్లో క్లీనింగ్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో థానే జిల్లా నిరసన కారుల ఆందోళనతో అట్టుడికిపోయింది. #Maharashtra l Parents & residents in #Badlapur protest over the sexual exploitation of 2 minor girls, blocking the railway tracks. The accused sweeper has been arrested & the school has suspended staff & closed for 5 days.#Crime #Thane #WomenSafety#Justice #Assault #Protest pic.twitter.com/RClqTFyvwx— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) August 20, 2024 బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్థానిక బద్లాపూర్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. దీంతో రైల్వే రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసింది. క్లాస్ టీచర్ని తొలగించినప్పటికీ తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భద్రతకు పూర్తి బాధ్యత వహించడంలో పాఠశాల విఫలమైందని, పాఠశాల యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో పాఠశాల భద్రత విషయంలో లోపాలు బయటపడ్డాయి. బాలికల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు మహిళా అటెండర్లు లేరని తేలింది. స్కూల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. -
వెల్లుల్లిని కొంటున్నారా.. ఇది తెలిస్తే
ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లాస్తారు. కానీ అదిలేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషదం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్ని ఉండాల్సిందే. అలాంటి దివ్య ఔషదాలున్న వెల్లుల్ని ధరలు విపరీతంగా ఉన్నాయి. ఆ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు కాసుల కక్కుర్తికోసం అడ్డదార్లు తొక్కుతున్నారు.మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది.ఆ వీడియోలో వెల్లుల్ని పొట్టు ఒలిచిన తర్వాత రాయిలా గట్టిగా ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో కొన్ని కూరగాయల మార్కెట్లలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజా వెలుగులోకి వచ్చిన కొనుగోలు దారులలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న వెల్లుల్ని స్వచ్ఛతపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.देशभर में लहसुन के दाम फिलहाल आसमान छू रहे हैं। इस बीच एक हैरान करने वाला मामला सामने आया है, जहां महाराष्ट्र के अकोला में कुछ फेरीवाले नागरिकों को सीमेंट से बना नकली लहसुन बेचकर धोखा दे रहे हैं। #Garlic #Maharashtra #Akola इनपुट्स: धनंजय साबले pic.twitter.com/Q4v1hZBhR9— सत्य सनातन भारत (Modi ka parivar)🚩🙏🕉️🙏🕉 (@NirdoshSha33274) August 18, 2024 -
అడవిలో అమెరికన్ మహిళ.. కేసులో కొత్త ట్విస్ట్
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అమెరికాకు చెందిన ఓ మహిళను గొలుసులతో కట్టేసిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల వాంగ్మూలంలో అమెరికన్ మహిళ తనకు తాను సంకెళ్లు వేసుకున్నానని, మరెవరి ప్రమేయం లేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. జులై 27 న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతమైన సోనుర్లి గ్రామ శివార్లలో ఇనుప గొలుసులతో మహిళను చెట్టుకు కట్టేశారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లిన పశువు కాపరికి మహిళ బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించారు. దీంతో పశువుల కాపరి అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కట్టేసిన గొలుసుల్ని విడిపించారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం (ఆగస్టు 3) సింధుదుర్గ్ పోలీసులు మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సమయంలో ఆమె మూడు తాళాలు, ఇనుప గొలుసులతో ముంబై నుంచి 460 కిలోమీటర్ల దూరంలోని సోనుర్లి గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లినట్లు, తాను అక్కడనున్న ఓ చెట్టుకు కట్టుకున్నట్లు తెలిపారు. ఆమెను ఎన్ని రోజులు చెట్టుకు కట్టివేసిందనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఆయన చెప్పారు.ఇక మహిళ వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలించగా.. ఆమె బ్యాగ్లో అమెరికా పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆమెను తమిళనాడుకు చెందిన లలితా కయీగా గుర్తించిన పోలీసులు..తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. తదిపరి విచారణ కొనసాగుతోంది. -
నాకు 80 నుంచి 90 అసెంబ్లీ సీట్లు కావాల్సిందే.. అమిత్షాతో అజిత్ పవార్
ముంబై : తర్వలో మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి భాగస్వామ్యాల మధ్య సీట్ల పంపకంపై చర్చలు షురూ అయ్యాయి. చర్చల్లో భాగంగా బుధవారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తన వర్గానికి (నేషనలిస్ట్ కాంగ్రెస్ట్ పార్టీ అజిత్ పవార్ వర్గం) 80-90 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.అంతేకాదు లోక్సభ ఎన్నికల తరహాలో చివరి నిమిషం వరకు చేసినట్లు అసెంబ్లీ ఎన్నికల్లో చేయొద్దని వీలైనంత త్వరగా సీట్ల పంపిణీ ఖరారు చేయాలని అజిత్ పవార్ తేల్చి చెప్పినట్లు పలు జాతీయమీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సీట్ల కేటాయింపులో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఎన్సీపీ గెలిచిన 54 స్థానాల్లో పోటీ చేయడంపై అజిత్ పవార్ పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్ర,మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర (ఖండేష్) ప్రాంతం నుంచి కాంగ్రెస్పై 20 స్థానాల్లో పోటీ చేయాలని, మైనారిటీ వర్గాల ప్రాబల్యం ఉన్న ముంబైలోని 4–5 స్థానాల్లో కాంగ్రెస్పై పోటీ చేసేందుకు అజిత్ పవార్ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని చూస్తుండగా, బీజేపీ 160 నుంచి 170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. మహరాష్ట్రాలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు మహాయుతి కూటమిలోని మూడు ప్రధాన భాగస్వామ్యాలు ఒకదానికొకటి సీట్లను ఎలా సర్దుబాటు చేసుకుంటాయో చూడాలి మరి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ 28 స్థానాలకు గాను 2019లో గెలిచిన 23 స్థానాల్లో కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలవగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం రాయగఢ్లో ఒక్క సీటును, శరద్ పవార్ వర్గం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఓటమికి బీజేపీతో పొత్తే కారణమని ఆర్ఎస్ఎస్ అనుసంధాన వారపత్రిక ‘వివేక్’ ఆరోపించింది. దీంతో పాటు అజిత్ పవార్ను టార్గెట్ చేస్తూ పూణేకు చెందిన 28 మంది ఎన్సీపీ నాయకులు, పింప్రి-చించ్వాడ్ యూనిట్ నగర అధ్యక్షుడితో సహా ,ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)లో చేరడానికి పార్టీని వీడారని తెలిపింది. ఇలా అజిత్ పవార్ గురించి కథనాలు వెలుగులోకి వచ్చిన రోజుల వ్యవధిలో అజిత్ పవార్.. అమిత్ షాతో భేటీ అవ్వడం చర్చాంశనీయంగా మారింది. -
సీఎం ఏక్నాథ్ షిండేకి ఎదురుదెబ్బ?
పూణే : మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకి ఎదురుదెబ్బ. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహరాష్ట్ర అధికార మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తోంది. దీంతో ఆ కూటమి తరఫున ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్న షిండే మరో మారు ముఖ్యమంత్రి అవుతారా? లేదంటే రాజకీయ ఎత్తుగడలకు బలవుతారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.ఇటీవల మహరాష్ట్ర లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి అంచనాలు తలకిందులయ్యాయి. 48 పార్లమెంట్ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 17 స్థానాలు.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించాయి.బీజేపీ ముందే జాగ్రత్త పడుతోందిఆ ఫలితం సెప్టెంబర్ - అక్టోబర్ నెలల మధ్య కాలంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికార మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ముందే జాగ్రత్త పడుతోంది. అందుకే ఆ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకొని అధికార పీఠాన్ని అధిష్టించాలని పావులు కదుపుతోంది.ఏక్నాథ్ షిండేకి చెక్ పెట్టేందుకు ఇందులో భాగంగా 288 మంది అసెంబ్లీ స్థానాలకు ఒక్క బీజేపీ మాత్రం 160 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తని కనబరుస్తుండగా..మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్ షిండేకి చెక్ పెట్టేందుకు సీఎం అభ్యర్ధి ఎవరనేది ప్రకటించకుండానే ఆ ఎన్నికల ప్రచారం చేసేలా కూటమిలోని ఇతర పార్టీ అధినేతలు, ముఖ్యనేతలతో చర్చ జరుపుతుందని సమాచారం. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలు నేరుగా తలపడనున్నాయి. అధికార మహాయుతి కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తుండగా.. బీజేపీకి శివసేన (యూబీటీ),ఏక్నాథ్ షిండే వర్గం..నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ వర్గం మద్దతు పలుకుతున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్కు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్సీపీలు (శరద్చంద్ర పవార్)లు కీలక భాగస్వామ్యాలుగా ఉన్నాయి.శరద్ పవార్ వర్గం వైపువచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపూ ఖరారైనట్లేనని ‘మహ’ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేసే కేవలం ఒక సిటుకే పరిమితం కావడంతో అజిత్ పవార్ వర్గం నేతలు.. శరద్ పవార్ వర్గంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సుమారు 15 మంది అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు శరద్ పవార్ టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీన్ని అదునుగా భావించిన శరద్ పవార్ తన వర్గం ఎన్సీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలను ఆహ్వానించేందుకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. #WATCH | BJP leader Pankaja Munde celebrates with her supporters she wins Maharashtra MLC pollsAll 9 Mahayuti candidates have won Maharashtra MLC polls.(Video source: Pankaja Munde's Office) pic.twitter.com/WwzsdjqXYY— ANI (@ANI) July 12, 2024అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఊరటఅసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమనేలా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంకేతాలిచ్చాయి. గత వారం విడుదలైన 12 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి 9 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఐదు స్థానాలు,ఏక్నాథ్ షిండే వర్గం (2), అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం (2) స్థానాల్లో గెలుపొందారు. యూబీటీ శివసేన నుంచి ఒక అభ్యర్థి, కాంగ్రెస్ నుండి ఒకరు విజయం సాధించారు. ఈ ఎన్నికల గెలుపునే రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా బీజేపీ ఎన్నికల ప్రచారం చేసేందుకు సమాయత్తమవుతుంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. -
అజిత్ పవార్కు ఎదురు దెబ్బ.. శరద్ పవార్కు టచ్లోకి 15 మంది ఎమ్మెల్యేలు!
ముంబై : అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అజిత్ పవార్ వర్గంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 20 మంది నేతలు (అందులో 15మంది ఎమ్మెల్యేలు).. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నేతృత్వం వహిస్తున్న అజిత్ పవార్కు గట్టి షాక్ తగిలింది. అజిత్ పవార్కు నేతృత్వంలోని ఎన్సీపీకి నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. త్వరలోనే శరద్ పవార్తో జతకట్టనున్నారు.పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను అజిత్ పవార్కు పంపించారు. గవానేతో పాటు స్టూడెండ్ వింగ్ అధ్యక్షుడు యష్ సానే,మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే,పంకజ్ భలేకర్ ఎన్సీపీకి గుడ్బై చెప్పారు.అజిత్ పవార్ వర్గంలో అలజడిపింప్రి చించ్వాడ్కు చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేయడంతో అజిత్ పవార్ వర్గంలో అలజడి మొదలైంది. మరికొందరు నేతలు సైతం అజిత్ను కాదని శరద్ పవార్తో టచ్లోకి వెళ్లారంటూ మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు అందుకు ఊతం ఇచ్చేలా శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో పింప్రి చించ్వాడ్ అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ నేతలు తన రాజీనామాలు చేయడం మహా రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీశాయి.షాక్లోకి అజిత్ పవార్ వర్గంఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహరాష్ట్ర అజిత్ పవార్ వర్గం 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఊహించని ఫలితాలు తనని షాక్కి గురి చేశాయని, ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలుకాగా, ఈ ఏడాది నవంబర్లో మహరాష్ట్రలో 288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఉద్దవ్ఠాక్రే నేతృత్వంలోని శివసేన 115 నుంచి 125 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుండగా.. లోక్సభ ఎన్నికల ఫలితాలో డీలా పడ్డ అజిత్ పవార్ వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్కు టచ్లోకి వచ్చినట్లు సమాచారం.శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఉద్ధండుడు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలింది. పార్టీ సీనియర్ నేత, పవార్కు స్వయానా అన్న కుమారుడైన అజిత్ పవారే పార్టీని చీల్చారు. ఎన్సీపీలో తనకు, తనకుమారుడు పార్థ్కు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఆందోళనతో పార్టీని చీల్చి శరద్ పవార్ వర్గంలో నేతల్ని తనవైపుకు తిప్పుకున్నారు. వెంటనే ప్రభుత్వంలో చేరారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. మహరాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టారు. -
ఇదే కాంగ్రెస్ సంస్కృతి : కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..ఆపై..
ముంబై: మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకోవడమే అందుకు కారణమైంది.నానా పటోలే మహరాష్ట్ర అకోలా జిల్లాలోని వాడేగావ్ అనే ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని తిరిగి తన కార్లో కూర్చున్నారు. అయితే ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా పటోలే పర్యటించిన ప్రాంతం బురదమయమైంది. బురద కాళ్లను శుభ్రం చేసుకునేందుకు నీళ్లు తేవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తను పురమాయించారు. సదరు కార్యకర్త నీళ్లు తెచ్చి పటోలే పాదాల్ని శుభ్రం చేశారు.ఇదే కాంగ్రెస్ సంస్కృతిపార్టీ కార్యకర్త తన బురద పాదాలను కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో నానా పటోలేపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే కాంగ్రెస్ సంస్కృతి అంటూ ముంబై బీజేపీ ట్వీట్లను షేర్ చేసింది. ‘దురదృష్టకరం ఏమిటంటే, పార్టీ కోసం ప్రాణాలను అర్పించే కార్యకర్తలను పదేపదే అవమానిస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కార్యకర్తతో తన బురదకాళ్లను కడిగించుకోవడం సిగ్గుచేటు ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి? అని ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ చర్యను షేర్ చేస్తూ కాంగ్రెస్ నాయకులది నవాబీ, ఫ్యూడల్ మనస్తత్వం అని దుయ్యబట్టారు.Congress has a Nawabi Feudal Shehzada mindset Maharashtra Congress president Nana Patole's gets his leg and feet washed by a party worker in Akola...They treat Janta and workers like Ghulam & themselves like Kings & QueensImagine how they treat people without coming to… pic.twitter.com/dmzeSUNZxB— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) June 18, 2024 కాంగ్రెస్ది ఫ్యూడల్ మనస్తత్వంకాంగ్రెస్ది ఫ్యూడల్ మనస్తత్వం. వారు ఓటర్లను, కార్యకర్తలను బానిసల్లాగా చూస్తారు. తాము రాజులమనుకుంటారు. అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తిస్తే ఒక వేళ అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటారో ఆలోచించండి. అందుకే కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి’ అని పూనావాలా అన్నారు.నేను రైతు బిడ్డని కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్న ఘటన వివాదం కావడంతో నానా పటోలే స్పందించారు. నేను రైతు బిడ్డను. బురద నాకు కొత్తేం కాదు. కాళ్లకు అంటిన బురద కడుక్కునేందుకు నీళ్లు కావాలని అడిగా.మా కార్యకర్త నీళ్లు తెచ్చారు. ఆయన నీళ్లు పోస్తే నేనే నాకాళ్లను కడుక్కున్నాను’ అని మీడియా సమావేశంలో వెళ్లడించారు. -
షీనాబోరా హత్యకేసులో బిగ్ ట్విస్ట్
ముంబై : 12 ఏళ్ల క్రితం జరిగిన హీనాబోరా హత్య కేసులో బిగ్ ట్విస్ట్. కేసులో కీలకంగా ఉన్న షీనాబోరా అస్థికలు (ఎముకలు) మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హత్య అనంతరం రాయగఢ్ పోలీసులు షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా అస్థికలు కనిపించడం లేదని సీబీఐ అధికారులు ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపారు.2012,మే 21న మహరాష్ట్రలోని రాయిఘడ్కు చెందిన గణేష్ ఎగ్డే తనకెంతో ఇష్టమైన మామిడి పండ్ల సీజన్ వచ్చేసిందని సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు రాయిఘడ్ అడవుల్లో దొరికే రుచికరమైన మామిడి పండ్ల కోసం బయలు దేరాడు. అయితే అడవిలోకి వెళ్తుండగా.. ఓ చెట్టు సమీపంలో పెద్ద సూట్కేస్ గణేష్ కంటపడింది. అంతే ఆ సూట్కేసులో ఏముందో అని చూసిన ఆయన షాక్ తిన్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన సంఘటన గురించి వివరించాడు. క్షణాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ సూట్కేస్లో కాలిన మృతదేహం కనిపించింది.కట్ చేస్తే షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్ను విచారించగా.. షీనా బోరా హత్య గురించి బయటపెట్టాడు.షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని, ఆ తర్వాత షీనాబోరాను కాల్చివేసి ఆమె అస్థికల్ని రాయ్ఘడ్లోని గాగోడే-ఖుర్ద్ గ్రామ సమీపంలోని అడవుల్లో పడేసినట్లు చెప్పాడు. అప్రమత్తమైన షీనాబోరా కేసును విచారిస్తున్న అధికారులు స్థానిక రాయ్ఘడ్ పెన్ పోలీసుల సహకారంతో షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు.ఆ ఎముకల్ని పరీక్షించి అవి షీనాబోరావేనని సర్ జేజే హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ జెబా ఖాన్ తేల్చారు. మే 7న కోర్టు విచారణలో సీబీఐ తరపున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీజే నాండోడ్ కేసు విచారణలో షీనాబోరా అస్థికల్ని జెబాఖాన్కు చూపించి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.ఇందులో భాగంగా గురువారం (జూన్ 13) షీనాబోరా అస్థికల గురించి ఆరా తీయగా అవి మాయమైనట్లు సీబీఐ అధికారులు కోర్టుకు వెల్లడించారు. విచారణలో ఆధారాలు (ఎముకలు) ఉన్న రెండు మార్క్ ప్యాకెట్లను గుర్తించలేకపోయామన్నారు. అస్థికలు లేకున్నా షీనా బోరా కేసు విచారణ కొనసాగించాలని సీబీఐ భావించింది. అందుకు డిఫెన్స్ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. -
‘ఖతర్నాక్ కోడలు’.. చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే
ముంబై : రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో అత్యంత సాధారణ రకాలు హిట్ అండ్ రన్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక వ్యక్తిని ఢీ కొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో? పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినప్పుడు దాన్ని హిట్-అండ్-రన్గా పరిగణిస్తారు. తాజాగా, హిట్-అండ్-రన్ ప్రమాదంలో మృతి చెందిన 82 ఏళ్ల పురుషోత్తం కేసులో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం..నాగపూర్ సిటీలో అర్చనా మనీష్ పుట్టేవార్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మనీష్ పేరున్న డాక్టర్. టౌన్ ప్లానింగ్ అధికారిణిగా నగరంలో తనకున్న పేరు పలుకుబడితో భారీ ఎత్తున ఆస్తుల్ని పోగేశారు. అయినప్పటికీ మామ పూరుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్నేసింది. ఆయనకున్న రూ.300 కోట్ల ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం అర్చన తన క్రిమినల్ మైండ్కు పదును పెట్టింది. తన మామను కారుతో ఢీకొట్టి అది ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. హత్య చేయించేందుకు ఆమె భర్త డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్లకు కోటి రూపాయిలకు సుపారీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే?అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్ప్రత్రికి వెళ్లారు. తిరిగి వస్తున్న ఆయనను ప్లాన్లో భాగంగా కారుతో ఢీకొట్టిచ్చింది.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో స్థానికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పురుషోత్తంకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీపుటేజీని నిశితంగా పరిశీలించగా..అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పురుషోత్తంకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, హిట్-అండ్-రన్ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ కారులో ప్రయాణిస్తున్న బాగ్డే, నీరజ్,సచిన్లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా.. కోడలు అర్చన భాగోతం బట్ట బయలైంది. ఆస్తి కోసమే అర్చన తన మామ పురుషోత్తంను హతమార్చేందుకు సిద్దపడినట్లు తేలడంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పురుషోత్తం 15 రోజుల పాటు పోరాడి చివరికి ప్రాణాలొదిలినట్లు పోలీసులు తెలిపారు. -
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
లోక్సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా నగదు పంపిణీ చేశారంటూ మహరాష్ట్ర అజిత్ పవార్ (ఎన్సీపీ) వర్గంలోని ఐదుగురి మద్దతు దారులపై పోలీసులు నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశారు.మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ స్థానం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్) వర్గం నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే ఎన్సీపీ( ఎస్పీ) గ్రూపు నుంచి పోటీ చేస్తున్నారు. మంగళవారం మహరాష్ట్రలోని మొత్తం 48 లోక్సభ స్థానాల్లో మూడవ దశలో 11 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్కు ముందు రోజు అంటే సోమవారం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు బారామతి లోక్సభ పోలింగ్కు ముందు జిల్లాలోని భోర్ పట్టణంలోని ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఎన్న్సీపీ (శరద్ పవార్) ఆరోపించింది. దీంతో పూణే పోలీసులు నిందితులపై నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తన పార్టీపై, పార్టీ మద్దతుదారులపై వస్తున్న ఆరోణల్ని కొట్టిపారేశారు. -
రంజుగా మారిన రాజకీయం.. ప్రధాని మోదీకి ఎంఎన్ఎస్ భేషరతుగా మద్దతు
లోక్సభ ఎన్నికల తరుణంలో మహరాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంఎన్ఎస్ నేత రాజ్ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజ్ థాకరే బీజేపీ, ఏక్నాథ్ షిండే - శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పక్షాల కూటమి ‘మహాయుతి’లో చేరవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్థాకరే కీలక ప్రకటన చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్ థాకరే ప్రసంగిస్తూ లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేయదని తెలిపారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మద్దతు కోరారు. నాకు పదవులొద్దు నాకు రాజ్యసభ, విధానసభ పదవులు వద్దని ఫడ్నవీస్తో చెప్పాను. అంతేకాదు నేను ఎటువంటి అంచనాలు, షరతులు లేకుండా ప్రధాని మోదీతో పాటు మహాయుతి కూటమికి మద్దతిస్తున్నానని రాజ్ థాకరే అన్నారు. కాగా, ఎంఎన్ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు. -
అలాంటి వాళ్లతో సావాసమా?, ఆదిత్య ఠాక్రేపై విమర్శలు
ముంబై : ముంబై బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే శివసేన నేత, మాజీ కేబినేట్ మంత్రి ఆదిత్య థాకరేపై విమర్శలు చేశారు. ఓ మహిళను వేధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తికి ఆదిత్య ఠాక్రే రక్షణ కల్పిస్తున్నారని రాణే ఆరోపించారు. రాణే మాట్లాడుతూ, ‘వార్డ్ నంబర్ 106లో యూబీటీ శివసేన నేత అమోల్ సంసారే అనే వ్యక్తి ఆస్తి కోసం మహిళలను వేధించినందుకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం బైయిల్పై ఉన్న ఆయన ఆదిత్య ఠాక్రేని కలిశారని అన్నారు. దీని బట్టి మహిళని హింసించిన అమోల్ సన్సారేకు ఆదిత్య ఠాక్రే మద్దతు పలుకుతున్నట్లే కాదా అని రాణే ప్రశ్నించారు. కాగా, నితీష్ రాణే యూబీటీ నాయకులపై విమర్శలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేల పేర్లను ప్రస్తావించకుండానే కోవిడ్-19 కాలంలో జరిగిన అన్నీ కుంభకోణాల వెనుక ఉన్నవారు త్వరలో కటకటాల వెనుకకు వస్తారు అని వ్యాఖ్యానించారు. అందుకు యూబీటీ నేత సంజయ్ రౌత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఈడీ, సీబీఐ మూసివేసిన కేసుల్ని తిరిగి విచారణ జరిపిస్తాం. కాబట్టి అనవసర రాద్ధాంతం చేసే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని హెచ్చరించారు. #WATCH | Nitesh Rane Alleges Aaditya Thackeray Planning To Meet #ShivSenaUBT Worker Accused Of Harassing Woman#Mumbai #Maharashtra #BJP pic.twitter.com/AJc49QfmuA — Free Press Journal (@fpjindia) April 7, 2024 -
మహరాష్ట్ర అభివృద్దికి ప్రధాని మోదీ ఆశీర్వాదమే కారణం
సాక్షి,ముంబై : లోక్సభ ఎన్నికల తరుణంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహరాష్ట్ర వేగంగా అభివృద్ది చెందడానికి ప్రధాని మోదీ మద్దతు, ఆశీర్వామే కారణమన్నారు. మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగింది. ఈ 1.5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయడంలో విజయం సాధించాం. అందుకు ప్రధాని మోదీ ఆశీర్వాదమే కారణం. ప్రధాని మా ప్రభుత్వానికి పూర్తి బలం, మద్దతు ఇచ్చారు. ఎన్ని పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించారో మీరందరూ చూశారు. ఈ 1.5 ఏళ్లలో ప్రభుత్వం ఎన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంది. అదంతా ప్రధాని మోదీ వల్లే సాధ్యమైందని అన్నారు. -
వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో?
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్ధులుగా మారి కయ్యానికి కాలుదువ్వనున్నారు. ముఖాముఖీ తలపడనున్నారు. గత 55 సంవత్సరాలుగా కుటుంబం హవా కొనసాగుతుండగా..రాజకీయ వైరంతో కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ పడనున్నారు. మరి ఈ ఎన్నికల పోరులో ప్రత్యర్ధులైన వదినా, మరదళ్లలో గెలుపెవరిదో ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్ పవర్..తన భార్యను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నారు. అందులోనూ దిగ్గజ నేత, తన బాబాయ్ ఎన్సీపీ అధినేత శరద్పవర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రీయా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి నుంచే బరిలో దింపుతున్నారు? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం)ల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ-అజిత్ పవర్ వర్గ కార్యకర్తలు బలమైన నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు అని పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తట్కరే అన్నారు. బారామతిలో అధికార కూటమి నుంచి పోటీ చేసేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉంది. కూటమి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సునేత్ర పవార్ బారామతి నుండి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని అన్నారు. 2009 నుంచి ప్రస్తుతం బారామతి లోక్సభ నుంచి గెలుస్తూ వస్తున్న శరద్ పవర్ కుమార్తె సుప్రీయా సూలే ప్రత్యర్ధిగా సునేత్ర పవార్ అవుతారు. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కనా వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! బాబాయితో మనస్పర్థలు ఎందుకు? అజిత్ పవార్ తండ్రి అనంతరావు పవార్. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్ సినిమా రంగంవైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబాయ్ శరద్ పవార్ మార్గాన్ని ఎంచుకున్నారు. తన సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్సభకు ఎన్నికయ్యారు.అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగతూ వచ్చారు. కానీ శరద్ పవర్ కుమార్తె సుప్రియా సూలే రాకతో అజిత్ పవర్ రాజకీయం మొత్తం మారిపోయింది. అంతా తానై శరద్ పవార్కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్లో స్థిరపడ్డారు. 2009 నుంచి బారామతి స్థానం లోక్సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచినా..ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్ పవార్ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్ రాజకీయ వారసుడు అజిత్ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం కూడా లభించింది. బాబాయ్పై తిరుగుబాటు అయితే, 2019లో జరిగిన వరుస పరిణామాలతో బాబాయి, ఎన్సీపీ అధినేత శరద్పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించారు. నాటి ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీకి మద్దతు పలికి డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలేను ఓడించాలనే ఉద్దేశంతో తన భార్య సునేత్రతో పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు అజిత్ పవర్ -
కొలిక్కిరాని ‘మహా’ సీట్ల పంచాయతీ!
ముంబై : మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం)ల మధ్య ఫలు దఫాలుగా జరిగిన సీట్ల పంపకం కొలిక్కి రాలేదు. తమ పార్టీ ఎక్కువ సీట్లు కావాలని శివసేన షిండే వర్గం పట్టుబడుతుంటే..తామే అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ తెగేసి చెబుతోంది. పైగా విమర్శలు..ప్రతి విమర్శలతో నాయకులు మహరాష్ట్ర రాజకీయాన్ని మరింత హీటుపుట్టిస్తున్నారు. బీజేపీ గొప్పతనం వల్లే బీజేపీ, శివసేన (షిండే వర్గాల)ల మధ్య సీట్ల పంపకాల చర్చలు అడ్డంకిగా మారాయి. బీజేపీ గొప్పతనం వల్లే సేన అధికారంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలకు సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ ఉద్ధవ్ ఠాక్రేపై షిండే తిరుగుబాటు చేయకుంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉండి ఉండేదని బదులిచ్చారు. తమకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందుకే (ఏక్నాథ్ షిండేని ఉద్దేశిస్తూ) ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్నథ్ షిండే తిరుగుబాటు చేయకుంటే 105 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండి ఉండేవారని, షిండే వల్లే తాము అధికారంలోకి వచ్చామని శిర్సత్ అన్నారు. బెదిరింపులు తగదు అంతకుముందు బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేశామని ఫడ్నవీస్ అన్నాంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫడ్నవీస్ వ్యాఖ్యలకు.. షిండే వర్గాన్ని బెదిరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, సొంత ఖర్చుతోనే మరిన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ఏక్నాథ్ షిండే సన్నిహితుడు రాందాస్ కదమ్ అన్నట్లు కథనాల్లో తెలిపాయి. విభేదాలు ఎందుకంటే? శివసేనకు బీజేపీ కేవలం 8 లోక్సభ సీట్లను ఆఫర్ చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం శివసేన ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కనీసం నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోంది. అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీ కూడా తమకు కేవలం 3 సీట్లు మాత్రమే ఆఫర్ చేసిందని మండిపడుతోంది. సీట్ల పంపకాల సమస్యల పరిష్కారానికి మూడు పార్టీల నేతలు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. మరి ఈ సారైనా సీట్ల పంపకం కొలిక్కి వస్తుందా? రాదా? అనేది వేచి చూడాల్సి ఉంది. -
రంగంలోకి ట్రబుల్ షూటర్.. నేతలతో అమిత్ షా రహస్య మంతనాలు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహరాష్ట్ర రాజకీయం వేడెక్కింది. లోక్సభలో ప్రాతినిధ్యం వహించే రెండవ అత్యధిక పార్లమెంట్ (48) స్థానాలున్న మహరాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం సంక్షిష్టంగా మారింది. బలాబలాలు తమకే ఎక్కువ ఉన్నాయని, కాబట్టే మాకే ఎక్కువ సీట్లు కేటాయించాలని శివసేన (షిండే వర్గం), అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పట్టుబడుతుంది. అయితే, ఈ సీట్ల పంపకాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కీలక నేతలతో అమిత్ షా వరుస భేటీలతో సీట్ల పంపంకం సానుకూలంగా జరిగే అవకాశం ఉందని పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక అమిత్ షా మంగళవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మొదటి 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం ఆ ఇద్దరు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తర్వాత మరో 50 నిమిషాల పాటు హోంమంత్రి, ముఖ్యమంత్రి షిండే మధ్య చర్చలు జరిగాయి. ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
నెలల చిన్నారితో అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
-
మహారాష్ట్ర : బల్లార్షా రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం
-
బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు
సురేష్, రమేష్ ఇద్దరు స్నేహితులు. ఆదివారం సెలవు రోజు కావడంతో తమకు నచ్చిన బిర్యానీని ఆరగించేందుకు సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. అలా వెళుతున్న ఆ ఇద్దరికి సడెన్గా రోడ్డు పక్కనే తాటికాయంత అక్షరాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆకర్షించింది. రెండు పార్శిళ్లు బిర్యానీ ఆర్డర్ ఇవ్వండి. ఒక బిర్యానీ పార్శిల్కే బిల్ కట్టండి' అంటూ ఫ్లెక్సీలోని ప్రకటన సారాంశం. అంతే డిస్కౌంట్లో బిర్యానీ వస్తుందని ఏమాత్రం ఆలోచించకుండా బిర్యానీ ఆర్డర్ చేశారు. సీన్ కట్ చేస్తే.. పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నరేగాన్ (Naregaon) అనే ప్రాంతంలో థామస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే థామస్ కు స్థానికంగా ప్రాచుర్యం పొందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వెజ్, నాన్ వెజ్లో బిర్యానీతో పాటు పలు వంటకాలపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలుసుకున్నాడు. అంతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. అలా ఆర్డర్ ఇచ్చాడో లేదో అకౌంట్లో ఉన్న రూ.89,000 మాయమయ్యాయి. దీంతో థామస్ కంగారు పడుతూ ఎంఐడీసీ(Maharashtra Industrial Development Corporation) స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), ఐటీ యాక్ట్ పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ..బాధితుడు తన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడని, అనంతరం ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైనట్లు తెలిపారు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుంది. మనిషి జీవన విధానాన్ని సమూలంగా మార్చేస్తుంది. అయితే ఈ టెక్నాలజీతో లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. లేదని ఏ మాత్రం అశ్రద్ధ వహించిన బ్యాంక్ అకౌంట్ల ఉన్న సొమ్ము క్షణాల్లో మాయం అవుతుందని హెచ్చరిస్తున్నారు. లేదని లైట్ తీసుకుంటే మోసపోతారని సూచిస్తున్నారు. సైబర్నేరాల్ని గుర్తించడం చాలా కష్టం. వెబ్సైట్/యాప్, బ్యాంక్/కార్డ్ డీటెయిల్స్ అడిగినప్పుడు, అది ఒరిజనల్లా లేదంటే ఫేకా అనే విషయాల్ని గుర్తించాలని అంటున్నారు. ముఖ్యంగా కొత్త వెబ్సైట్లు/యాప్లను ఉపయోగించే సమయంలో అలర్ట్గా ఉండాలని, సీవీవీ, కార్డ్ వివరాల్ని షేర్ చేయొద్దని సలహా ఇస్తున్నారు. చదవండి: నా తమ్ముడి ఫోన్ పేలింది సార్..! ట్వీట్ చేసిన అన్న -
పొంచి ఉన్న ‘మహా’ ముప్పు!
సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్/బోధన్ రూరల్ (బోధన్)/నిజామాబాద్ అర్బన్/ కాళేశ్వరం: పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్ భయం నెలకొంది. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో అక్కడి వారు తెలంగాణలోకి వస్తుండటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి సరిహద్దుల్లో లాక్డౌన్ సమయంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. ఇప్పుడు అలాంటి చర్యలేవీ లేకపోవడంతో రాష్ట్ర పోలీసు, వైద్య శాఖలు అప్రమత్తమవ్వాల్సిన అవసరమేర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆనుకుని ఉన్న నాందేడ్, యావత్మల్, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల పరిధిలో పట్టణాలకు, అటు ఉమ్మడి నిజామాబాద్కు సరిహద్దునున్న ప్రాంతా లకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగ నదీ వద్ద 44వ జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్న వాహనాలు మరోవైపు రైల్వే మార్గాలతో పాటు మూడు జాతీయ రహదారులు, ఇతర రోడ్డు మార్గాల గుండా జనాలు వ్యాపార, వాణిజ్యంతో పాటు బంధుత్వ కారణాలతో వస్తూపోతుంటారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు నిత్యం మహారాష్ట్రకు వెళ్లి వస్తుంటాయి. నిర్మల్ జిల్లాలో భైంసా మీదుగా మహారాష్ట్రలోని భోకర్, ఆదిలాబాద్ జిల్లా మీదుగా యావత్మల్, నాగ్పూర్ వైపు, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మీదుగా బల్లర్షా, చంద్రాపూర్ వైపు, నాగ్పూర్, మంచిర్యాల జిల్లా కోటపల్లి మీదుగా సిరోంచ, పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు నాలుగు వైపులా ప్రధాన దారులున్నాయి. ఈ సరిహద్దుల గుండా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇక తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో పెన్గంగా నది వద్ద జాతీయ రహదారిపై రోజూ వేలాది వాహనాలు వెళ్తుంటాయి. గతేడాది మార్చిలో కరోనా మొదలైన తర్వాత ఇక్కడ పోలీసు శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టు ఏర్పాటు చేసి శాశ్వతంగా ఓ షెడ్ను నిర్మించారు. కరోనా కేసులు తగ్గిన తర్వాత షెడ్ అలాగే ఉన్నప్పటికీ రాకపోకలు సాధారణమయ్యాయి. తెలంగాణ, మహారాష్ట్రను కలిపే నిర్మల్ జిల్లా తానూరు మండలం పరిధిలో జాతీయ రహదారి అక్కడి ప్రయాణికులకు టెస్టులు.. ఇటు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర, ఖండ్గావ్ చెక్పోస్ట్ వద్ద సాలూర పీహెచ్సీ వైద్య సిబ్బంది మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికులకు మాస్కులు, శానిటేషన్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం నుంచి బస్సుల్లో, ఇతర వాహనాల్లో వచ్చిన వారికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. మంగళవారం సాలూర చెక్ పోస్ట్ వద్ద మెడికల్ ఆఫీసర్ రేఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది 23 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటెవ్ వచ్చింది.. కాగా, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పక్బందీగా చెక్పోస్ట్ల వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. బోధన్ మండలంలోని హెల్త్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో రెండు టీంలను ఏర్పాటు చేసి సాలూర, ఖండ్గావ్ చెక్పోస్ట్ల వద్ద తనిఖీ, పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాళేశ్వరంలోని అంతర్ రాష్ట్ర వంతెన కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద యథేచ్చగా.. కాళేశ్వరం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం బస్టాండ్లో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేశారు. కానీ జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఎలాంటి వైద్య శిబిరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. -
వైరల్: జ్యూస్ షాప్గా మారిన ఏటీఎం
ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఒక జ్యూస్ షాప్ యజమాని చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ యజమాని ఏటీఎంనే ఏకంగా జ్యూస్ షాప్గా మార్చేశాడు. సాధారణంగా ఏటీఎం లోపల ఒక వ్యక్తి ఉంటేనే మరో వ్యక్తిని లోనికి అనుమతించరు. అలాంటిది ఏటీఎం మిషన్ను ఒక మూలకు నెట్టి మరీ అతను లోపల కుర్చీలు వేసేశాడు. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బలు విత్డ్రా చేసుకోవడానికి వచ్చిన వారిని కుర్చీలో కూర్చోండి అంటూ మర్యాదలు కూడా చేస్తున్నాడు. చాలా మంది అక్కడ కూర్చొని ఉండగానే కస్టమర్లు వారి ఏటీఎం లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని బట్టి ఏటీఎంలు ఎంత రిస్క్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీ ఏటీఎం పిన్లను, ఓటీపీలను ఎవరికి తెలియనివ్వద్దు అంటూ బ్యాంకులు ప్రతిసారి మెసెజ్లు పంపుతూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటిది ఈ వ్యక్తి ఏటీఎంను జ్యూస్ షాప్గా మార్చడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. ఇది పూర్తిగా బ్యాంక్ ఏటీఎం నిబంధనలకు విరుద్ధం. ఏటీఎం రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి లోపల ఉంటే మరో వ్యక్తి అక్కడ ఉండటానికి వీలు లేదు. సాధారణంగా ప్రతి ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అయితే ఈ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ ఎందుకు లేదో తెలియడం లేదు. అంతేకాకుండా బ్యాంకు అధికారులు ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదైనా సాంకేతిక లోపలు తలెత్తినప్పుడు అధికారులు అక్కడికి వచ్చే ఉంటారు. అప్పుడు కూడా వారు జ్యూస్ యజమానిని ఎందుకు హెచ్చరించలేదు? అసలు ఆ వ్యక్తిపై బ్యాంక్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ వీడియో చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో సదరు వ్యక్తిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. వైరల్: జ్యూ స్ షాప్గా మారిపోయిన ఏటీఎం Autoplay ONOFF చదవండి: ఇటలీని షేక్ చేస్తున్న ప్రభాస్ మేనియా -
భారత్లో మరో వ్యాధి, మహారాష్టలో హై అలర్ట్
ముంబాయి: ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా కేసుల నమోదుతో అతలకుతలం అవుతున్న మహారాష్ట్రపై మరో పిడుగు పడింది. మహారాష్ట్ర జిల్లాలో అతి భయంకరమైన కాంగో జ్వరం వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని పాల్ఘర్ పరిపాలన విభాగం మంగళవారం అధికారులను ఆదేశించింది. సాధారణంగా కాంగో జ్వరం అని పిలువబడే క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్), పేలు ద్వారా మానవులలో వ్యాప్తిచెందుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దీని గురించి మాట్లాడుతూ, ఇది పశువుల పెంపకందారులు, మాంసం విక్రేతలు, పశుసంవర్ధక అధికారులకు ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దీనికి సరైన వ్యాక్సిన్ లేదా మందులు, చికిత్స అందుబాటులో లేని కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని వారు సూచించారు. పాల్ఘర్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డి కాంబ్లే ఒక సర్క్యులర్లో సిసిహెచ్ఎఫ్ గుజరాత్లోని కొన్ని జిల్లాల్లో కనుగొనబడిందని, ఇది మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. పాల్ఘర్ గుజరాత్లోని వల్సాద్ జిల్లాకు దగ్గరగా ఉంది. ఇప్పటికే వల్సాద్ జిల్లాలో కొన్ని కేసులు నమోదయ్యాయని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని నివారణ చర్యలు అమలు చేయాలని అధికారులను సంబంధిత శాఖ విభాగం హెచ్చరించింది. ఈ వ్యాధి ఒక నిర్దిష్ట రకం పేల ద్వారా ఒక జంతువు నుంచి మరొక జంతువుకు వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన జంతువుల రక్తం ద్వారాగానీ, వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినడం ద్వారా గానీ మానవులకు వ్యాపిస్తుందరి అందుకే జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్రలో ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఈ వ్యాధిని నిర్ధారించి, చికిత్స చేయకపోతే 30 శాతం మంది రోగులు మరణిస్తారు. సీసీహెచ్ఎఫ్ అనేది బున్యావిరిడే కుటుంబానికి చెందిన టిక్-బర్న్ వైరస్ (నైరోవైరస్) వల్ల కలిగే ఒక వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఈ వ్యాధికి గురయితే తీవ్రమైన జర్వం వస్తుంది. ఈ వ్యాధికి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సూదల పునర్వినియోగం, వైద్యసామాగ్రి కలుషితం కావడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చదవండి: మరో వైరస్..! ఐసీఎంఆర్ హెచ్చరిక -
ఆ రాష్ట్రంలో33,000 మంది పిల్లలకు కరోనా!
ముంబై: కరోనా వైరస్ (కోవిడ్–19)కు మహారాష్ట్ర కేంద్రంగా మారుతోంది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 42 లక్షలు దాటగా ఒక్క మహారాష్ట్రలోనే 9 లక్షలు దాటడం గమనార్హం. మరోవైపు మృతుల సం ఖ్యను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి సుమారు 70 వేలమంది మరణించగా మహారాష్ట్రలో మృతుల సంఖ్య 27 వేలకు చేరువైంది. రాష్ట్రంలో జూలై ఆఖరి వరకు పరి స్థితి కొంత మెరుగుపడుతుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కరోనా తీవ్రత పెరగడం కలకలం సృష్టిస్తోంది. గత వారం పది రోజులుగా కేసుల స్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా వరుసగా ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య 20 వేలు దాతుతోంది. 33 వేలమంది పిల్లలకు కరోనా.. రాష్ట్రంలో కొన్ని రోజులుగా మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా పిల్లలను కూడా వదలడం లేదు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు నవజాత శిశువుల నుంచి 10 ఏళ్లలోపు 33 వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో సుమారు నాలుగు శాతం. మరోవైపు 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసున్న కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో ఏడు శాతానికి పైగా ఉంది. కరోనా బాధితుల సంఖ్య ఓ వైపు పెరుగుతుండగా రికవరి రేటు కూడా గణనీయంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 72 శాతం దాటింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ముంబైలో 1.55 లక్షలకు చేరిన కరోనా కేసులు రాష్ట్రంలో కరోనా కేసులు తొమ్మిది లక్షలు దాటగా వీటిలో ఒక్క ముంబైలోనే 1.55 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యంత డేంజర్ జోన్గా ఉంది. అసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారావిలో కరోనా నియంత్రణకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం కాగా మరోవైపు ముంబైలో కూడా నిలకడగా కనబడింది. అయితే గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసుల సంఖ్య 17 వేల నుంచి 19 వేలు దాటుతోంది. దీంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ముంబైలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య సెప్టెంబరు 6వతేదీ నాటికి 1,55,622 కాగా యాక్టీవ్ కేసుల సంఖ్య 23,939 ఉంది. మరోవైపు మరణాల సంఖ్య 7,869కి చేరింది. ప్రపంచంలోనే 5వ స్థానంలో! మహారాష్ట్ర ఒక దేశంగా భావించినట్టయితే ప్రపంచంలోనే అయిదవ స్థానంలో ఉండేది. అత్యధిక కేసులతో ముందుండే చైనా, కెనడా, ఇటలీ, జర్మనీ తదితరాలను మహారాష్ట్ర ఎప్పుడో అధిగమించింది. తాజాగా ప్రస్తుతం అమెరికా అనంతరం 2వ స్థానంలో ఇండియా ఉండగా బ్రెజిల్ 3వ స్థానంలో, రష్యా 4వ స్థానంలో 10.30 లక్షల కరోనా కేసులతో ఉంది. అయితే 5వ స్థానంలో ఉన్న పేరు దేశంలో కేవలం 6.89 లక్షల కేసులుండగా ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసులు తొమ్మిది లక్షలకుపైగా నమోదయ్యాయి. థానే పోలీసు కమిషనర్కు కరోనా థానే పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సల్కర్కు కరోనా సోకింది. లాక్డౌన్ సమయంలో కోవిడ్ సోకిన థానే పోలీసులను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న పోలీసు కమిషనర్కు స్వయంగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. నాలుగైదు నెలలుగా కొనసాగిన లాక్డౌన్ సమయంలో పోలీసులు రాత్రింబవళ్లు కరోనాను నియంత్రించేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లపై తిరిగేవారిపై చర్యలు చేపట్టడంతోపాటు వలస కార్మికులను వారి వారి స్వగ్రామాలకు తరలించేందుకు తమ వంతు కృషి చేశారు. ఇలా ఎంతో ధైర్యంగా విధులు నిర్వహించిన పలువురు పోలీసులకు కరోనా సోకింది. అయితే వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుని వారి పై అధికారిగా అండగా నిలిచిన వివేక్ ఫన్సల్కర్కూ కరోనా సోకింది. దీంతో ఆదివారం రాత్రి ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు థానేలో 129 పోలీసు అధికారులు, 1,176 మంది పోలీసు సిబ్బంది ఇలా మొత్తం 1,305 మందికి కరోనా సోకింది. వీరిలో 1,664 మంది కరోనాను జయించి విముక్తి పొందారు. అయితే 18 మంది పోలీసులు మృతి చెందారు. ప్రస్తుతం ఇంకా 141 మంది వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చదవండి: రెండో స్థానంలోకి భారత్ -
ఆటోడ్రైవర్ల ఫోన్లు మాత్రమే దొంగిలిస్తాడు!
ముంబై: మహారాష్ట్రలోని పుణేలో ఒక వ్యక్తి కేవలం ఆటో డ్రైవర్ల ఫోన్లు మాత్రమే కొట్టేస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. 70కి పైగా స్మార్ట్ ఫోన్లను దొంగిలించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను దొంగతనం చేయడం వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతడు ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. తన ప్రియురాలు తనని మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని ఒక ఆటో డ్రైవర్తో వెళ్లిపోయిందని తెలిపాడు. దాంతో ఆటో డ్రైవర్ల మీద కక్ష తీర్చుకోవడం కోసమే వారి ఫోన్లను దొంగిలిస్తున్నట్లు తెలిపాడు. అహ్మదాబాద్కు చెందిన ఆసిఫ్ అకా భురభాయ్ ఆరిఫ్ షేక్ ఒక రెస్టారెంట్ను నడుపుతుండే వాడు. అయితే అతను అక్కడి నుంచి తన 27 ఏళ్ల ప్రేయసితో కలిసి పుణే వచ్చి ఒక బిజినెస్ ప్రారంభించాలనుకున్నాడు. అక్కడికి వచ్చిన రెండు రోజుల తరువాత అతని వద్ద ఉన్న డబ్బు తీసుకొని ఆమె ఒక ఆటో డ్రైవర్తో వెళ్లిపోయినట్లు ఆరిఫ్ షేక్ తెలిపాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆరీఫ్ దగ్గర నుంచి 20 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. చదవండి: దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు -
కరోనా: 38 శాతం ఐదు రాష్ట్రాల నుంచే!
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్రయోజనం ఉండటం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు మిలియన్లు దాటిపోయింది. 10 లక్షల కరోనా కేసులు దాటిన రోజు నుంచి వచ్చిన కొత్త కేసులలో దాదాపు 38 శాతం ఐదు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అవి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్. ఈ రాష్ట్రాలలో జూలై 16కి ముందు 19 శాతం కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదయిన మొదటి 10 లక్షల కేసులలో దాదాపు 12 శాతం కేసులు ఢిల్లీ నుంచి నమోదు అవ్వగా, రెండవ మిలియన్లో మాత్రం 3 శాతం కన్నా తక్కువ కేసులు వచ్చాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే కరోనా వ్యాప్తి గత మూడు వారాల్లో భౌగోళికంగా ఎలా మారిందో అర్థం అవుతుంది. ప్రస్తుతం ‘బిగ్ త్రీ’ - మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కువ వ్యాప్తి చెందుతోంది. జూలై 16న భారతదేశంలో కరోనా కేసులు మిలియన్ మార్కును దాటినప్పుడు నమోదయిన మొత్తంలో 56 శాతం ‘బిగ్ త్రీ’ నుంచి వచ్చాయి. వీటిలో 28.3 శాతం (284,281) కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. తమిళనాడులో 15.6 శాతం (1,56,369 ), ఢిల్లీలో 11.8 శాతం (1,18,645) కేసులు నమోదయ్యాయి. జూలై 16 తరువాత, దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొదటి మిలియన్ కేసులలో 11.8 శాతం ఢిల్లీ నుంచి నమోదుకాగా తరువాత మిలియన్ కేసులలో ఢిల్లీ నుంచి కేవలం 2.2 శాతం మాత్రమే వచ్చాయి. జూలై 16 తర్వాత నమోదైన కేసులలో దాదాపు ఐదవ వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. తరువాత దాదాపు 16 శాతం కేసులతో ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానం నుంచి రెండవ స్థానానికి చేరుకుంది. జూలై 16 నుంచి 122,775 కేసులతో, తమిళనాడు రెండవ మిలియన్ (12.1%) లో మూడవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా పరీక్షలు చేస్తుండటం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మొదటి మిలియన్ కరోనా కేసుల నమోదులో 19 శాతం కన్నా తక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలలో జూలై 16 నుంచి దాదాపు 42% కొత్త కేసులు వచ్చాయి. చదవండి: కరోనా రికార్డు: భారత్లో కొత్తగా 62 వేల కేసులు -
డాక్టర్ను పొడిచిన కరోనా రోగి బంధువులు
సాక్షి, ముంబై: కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో డాక్టరే కళ్లేదుట కనిపించే దేవుళ్లలా మారారు. ప్రాణాలకు తెగించి 24 గంటలు కష్టపడి సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ వారి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని లాతూరులో కరోనా రోగి బంధవులు డాక్టర్పై దాడి చేసి అతనిని కత్తితో పొడిచారు. కరోనా సోకిన ఒక వృద్ధ మహిళను లాతూర్లోని ఆల్ఫా సూపర్ స్పెషలిటీ హాస్పటల్లో చేర్పించారు. ఆమె వయసు రీత్యా కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. అయినా చికిత్స అందించాలని రోగి తరుపు బంధువులు అభ్యర్థించారు. కొన్ని రోజుల తరువాత ఆ మహిళ చనిపోయింది. ఆసుపత్రిలో గొడవ చేసిన రోగి బంధువులు దినేష్ వర్మ అనే డాక్టర్పై కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన ఛాతికి, గొంతుకు, చేతికి గాయాలయ్యాయి. ఆయనను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మెడికల్ ఆసోసియేషన్ సీరియస్గా తీసుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆదేశించింది. చదవండి: వైద్యురాలిపై ఉమ్మివేసిన కరోనా పేషెంట్లు -
దూకుడు పెంచిన దేవేంద్ర ఫడ్నవిస్
-
అక్కడ మరోసారి పూర్తి లాక్డౌన్!
ముంబాయి: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఇక మహారాష్ట్ర కరోనా వైరస్ కేసుల సంఖ్యలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య చైనాలోని కరోనా కేసులను కూడా దాటేశాయి. ఇప్పుడు మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 11 రోజుల పాటు పుణె, వాటి పరిసర ప్రాంతంలో పూర్తి లాక్డౌన్ను విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూలై 13-23వరకు ఈ ప్రాంతాలలో పూర్తి లాక్డౌన్ను విధించనున్నారు. గురువారం ఒక్కరోజే ఈ జిల్లాలో 1803 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసులు 34,399కి చేరుకోగా, చనిపోయిన వారి సంఖ్య 978కు చేరుకుంది. ఈ ప్రాంతంలో లాక్డౌన్ విధించిన 11రోజుల పాటు నిత్యవసర సరుకుల దుకాణాలు మినహా ఇంకేమీ పనిచేయమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ లాక్డౌన్ ద్వారా ఈ కరోనా వైరస్ చైన్ను వీడదీయవచ్చు అని ఆయన చెప్పారు. చదవండి: (కరోనా: యూపీ సర్కార్ కీలక నిర్ణయం) -
విధ్వంసం సృష్టించిన సేన సైనికులు, కారణం?
ముంబాయి: శివసేన కార్యకర్తలు బుధవారం మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలోని ఒక ఎలక్ట్రిక్ షాపులో విధ్వంసం సృష్టించారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రేను, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ శరద్ పవార్ను, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని విమర్శించినందుకు శివసేన కార్యకర్తలు షాపును నాశనం చేశారు. సోమవారం సోషల్మీడియాలో శివసేనకు వ్యతిరేకంగా పోస్ట్లు పెట్టడంతో శివసేన సైనికులు షాపు యజమానిపై ఫిర్యాదు చేశారు. ఇక్కడితో ఆగకుండా బుధవారం అతని షాపును నాశనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కొంత మంది పోలీసులు సమక్షంలోనే షాపులోకి ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువులను నాశనం చేశారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ నారాయణ్ రాణే సోమవారం గవర్నర్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కరోనాని కట్టడి చేసే సామర్థ్యం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను కోరారు. ఇక మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పడంతో ప్రభుత్వ వైఫల్యల నుంచి కాంగ్రెస్ తప్పించుకొని నింద మొత్తం శివసేన మీద వేయడానికి చూస్తోందని ఆరోపించారు. ఇలా పరస్పర ఆరోపణల క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కెయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ యుద్దం ముదిరి అభిమానులు మహావికాస్అఘాడిపై ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో శివసేన సైనికులు సదరు వ్యక్తి షాపును ధ్వంసం చేశారు. (లాక్డౌన్ 5.0 : ఆ నగరాలపై ఫోకస్) -
మేయరమ్మ నీకు వందనం!
ముంబాయి: 58 ఏళ్ల వయస్సులో ముంబాయి మేయర్ కిషోరీ పెడ్నేకర్ 18 సంవత్సరాల తరువాత తిరిగి నర్స్ డ్రెస్ వేసుకున్నారు. సోమవారం బీవైఎల్ నైర్ హాస్పటల్ని సందర్శించిన కిషోరీ తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వారిలో స్ఫూర్తి నింపడానికి తానను మళ్లీ నర్స్గా పనిచేయాలనుకుంటున్నట్లు కిషోరీ తెలిపారు. ప్రతి రోజు మూడు గంటల పాటు కరోనా రోగులకు సేవలందిస్తూ ఆమె విధులు నిర్వర్తించనున్నారు. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రి ఉద్ధవ్ఠాక్రే కరోనాపై పోరాటంలో అందరూ చేతులు కలపాలని పిలుపినిచ్చారు. ఈ నేపథ్యంలోనే నేను మళ్లీ నర్స్గా పనిచేసి కరోనా రోగులకు సేవలందించడానికి ముందుకు వచ్చాను. ఇది కొంచెం ప్రమాదంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇలాంటి సమయంలో భయంతో విధుల నుంచి తప్పుకోవడంలో అర్థం లేదు. నాకు చాలా మంది నర్సింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి తమ పిల్లల్ని కోవిడ్-19 విధుల్లో వేయ్యొద్దు అని అడుగుతున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. ఈ వృత్తి అంటేనే రిస్క్తో కూడుకున్నది. ఈ వృత్తిలో ఉన్న వారు హెచ్ఐవి, టీబీ లాంటి రోగులకు కూడా సేవలందిస్తారు. అది కూడా ప్రమాదకరమే. కానీ ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు రిస్క్ చేయక తప్పదు అని చెప్పాను’ అని కిషోరీపేర్కొన్నారు. మూడుసార్లు ముంబాయి మేయర్గా గెలిచిన కిషోరీ రాజకీయాల్లోకి రాకముందు 16 సంవత్సరాలు నర్స్గా పనిచేశారు. 24 సంవత్సరాల వయస్సులో మహారాష్ట్రలోని రాయ్ఘర్లో నర్స్గా కేరీర్ మొదలుపెట్టారు. రాజకీయాల్లోకి వెళ్లినా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఇలా నర్స్గా మారడంతో అందరూ కిషోరీని అభినందిస్తున్నారు. (‘మిలటరీ క్రమశిక్షణతో లాక్డౌన్ సడలించండి’) -
‘మిలటరీ క్రమశిక్షణతో లాక్డౌన్ సడలించండి’
ముంబాయి: ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మహారాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టాలంటే దశల వారీగా లాక్డౌన్ను సడలించాలన్నారు. ఈ విషయం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఆలోచించాలని కోరారు. కరోనా ప్రభావం లేని, తక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్డౌన్ను సడలించాలని, అయితే అక్కడ కరోనా విజృంభించకుండా ఉండేందుకు మిలిటరీ రూల్స్ని పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, అలాంటి నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోలేమన్నారు. అయితే సామాజిక దూరాన్ని అందరూ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటూ మిలిటరీ క్రమశిక్షణను అమలు చేయగలిగితే కరోనా వ్యాప్తిని లాక్డౌన్ సడలించినప్పటికీ అరికట్టవచ్చన్నారు. (వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి) లాక్డౌన్ సడలింపులకు సంబంధించి కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. దుకాణదారులు, చిన్న చిన్న పరిశ్రమల వారు, చిరువ్యాపారులు కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. అటువంటి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ప్రస్తుత పరిస్థితులను ఎలా అధిగమించాలో ఆలోచించాలన్నారు. తాను ఇది సరదా కోసం చెప్పడం లేదన్న ఆమె, కొన్ని నిబంధనాలు, మార్గదర్శకాలు పాటించడం ద్వారా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వీలవుతుందన్నారు. ఇంట్లో ఉంటే మన సమస్యలు తీరవని అందుకోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కొన్ని దేశాల్లో లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిందని అలాంటి సమస్యలు మన దేశంలో రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూలే సూచించారు. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర) మహారాష్ట్రలో ఉద్ధవ్ఠాక్రే ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని సూచించారు. ప్రజలెవరూ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ని నమ్మవద్దని సూలే విజ్ఞప్తి చేశారు. అధికారులు ప్రజలకు వండ్డిన భోజంన పెట్టడం కంటే వారికి నిత్యవసర సరుకులు అందిస్తే బాగుంటుందన్నారు. అదేవిధంగా విద్యార్ధులందరూ లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉండి వారి పరీక్షలకు సంబంధించి చదువుకోవడం ఉత్తమమన్నారు. లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మే3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ డ్యాన్స్