
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అదనపు చార్జిషీటు దాఖలు చేసింది. చారియల్ ప్రొడక్షన్స్ మీడియా అధినేత రాజేష్ జోషి, ఉద్యోగులు దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్, చన్ప్రీత్సింగ్పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
ఐదుగురు నిందితులు హవాలా మార్గంలో గోవాకు రూ. 44.54 కోట్లు తరలించినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ఎల్-1 లైసెన్స్దారులకు అనుచితంగా లబ్ధి చేకూర్చి ఆప్ నేతలు ముడుపులు పొందినట్లు చార్జిషీట్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment