liquor scam
-
లిక్కర్ స్కాం పేరుతో 'కూటమి' భారీ కుట్ర: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపులో భాగంగా లేని లిక్కర్ స్కాంను ఒక పథకం ప్రకారం సృష్టించిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కాం పేరుతో కూటమి ప్రభుత్వమే ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టి, వైఎస్సార్సీపీ నేతలను దానికి బాధ్యులుగా చూపించేందుకు దుర్మార్గమైన ప్రణాళికను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ స్కాం పేరుతో జరుగుతున్న హంగామాను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తోందో తెలుస్తుందన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, సోషల్ మీడియా యాక్టివీస్ట్లను తప్పుడు కేసులు బనాయించి వేధించిన ప్రభుత్వం, తాజా మరో భారీ కుట్రకు తెరతీసింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్ల లిక్కర్స్కాం జరిగిందంటూ ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేస్తోంది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. డెబ్బైశాతం బ్రాండ్లను ఎంపిక చేసిన నాలుగు కంపెనీలకే ఇచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తగ్గించాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటిపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 2023లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అధికారులపై వత్తిడి తెచ్చి ఆ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను పక్కకు పెట్టేయించారు. ఈ కేసుల్లోంచి ఇప్పుడు బయటపడేందుకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎదురుకేసులు నమోదు చేయించేందుకు కూటమి ప్రభుత్వం తెగబడిందికూటమి పెద్దల డైరెక్షన్లోనే ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం పేరుతో కేసులు నమోదు చేసి కక్షసాధించేందుకు కూటమి పెద్దల డైరెక్షన్లోనే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 9.9.2024న వై.వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఈ వ్యక్తి తన లేఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ పాలసీలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా పెద్ద స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారో, ఈ వ్యక్తికి ఉన్న విశ్వసనీతయ ఏమిటో కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.ఈ లేఖను కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్లో అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆగమేఘాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఒక మెమోను జారీ చేశారు. తొమ్మిది రోజుల్లోనే ఈ మెమోను ఆధారం చేసుకుని బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి వచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ, దీనిపై విచారణ జరపాలంటూ ముఖేష్ కుమార్ మీనా 20.9.2024న సీఐడీకి ఫిర్యాదు చేశారు.వెంటనే సీఐడీ అధికారులు దీనిపై 23.09.2024న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే దీనిలో ఎవరిని విచారించారు, ఏ అంశాలను పరిశీలించారు, ఎటువంటి ఫైళ్ళను తనిఖీ చేశారు అనే కనీస సమాచారం కూడా లేదు. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నెం.21/2024లోని కాలమ్ నెంబర్ 7లో ముద్దాయిలు అని ఉన్న చోట 'గుర్తు తెలియని వ్యక్తులు' అని కోట్ చేశారు. అలాగే మొత్తం రూ.4000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇంత మొత్తం ఎలా అవినీతి జరిగిందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు.తెలుగుదేశం వీర విధేయులతో సిట్ ఏర్పాటుసాధారణంగా ఏదైనా భారీ అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అంశాలపై ఆడిట్ రిపోర్ట్లను పరిశీలిస్తారు. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి లేఖ రాస్తే, దానిపై తొమ్మిది రోజుల్లో నివేదిక తెప్పించుకుని, తక్షణం సీఐడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం, రెండు రోజుల్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తేనే దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్న నాటకం అర్థమవుతుంది. అంతేకాదు సీఐడీ ఏకంగా అయిదుగురు అధికారులతో ఈ కేసుపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వీరవిధేయులుగా ఉన్న ఆఫీసర్లను ఏరికోరీ మరీ ఈ సిట్లో నియమించారు.సిట్ను నియమించే సందర్బంలో సుప్రీంకోర్టు సూచించిన ఏ మార్గదర్శకాలను కూడా పాటించలేదు. సిట్కు సంబంధించిన పోలీస్స్టేషన్ను పేర్కొనలేదు. అందులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, స్టేట్మెంట్లు రికార్డు చేసే సమయంలో దానిని చిత్రీకరించాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. బేవరేజెస్ కార్పోరేషన్కు సంబంధించిన ఫైళ్ల రూటింగ్ను పరిగణలోకి తీసుకోలేదు. కార్పోరేషన్ ఉద్యోగులను బెదిరించి, భయపట్టి సిట్ తాము రాసుకున్న స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంది. తాము చెప్పినట్లు కొందరి పేర్లు లిక్కర్ స్కాంలో ఉన్నాయని చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందంటూ బెదిరించారు. సంతకాలు పెట్టిన ఉద్యోగులు తాము సాక్ష్యులమా, లేక ముద్దాయిలమా అని భయాందోళనలు చెందుతున్నారు. అలాగే డిస్టలరీ కంపెనీలను సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలమైన స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.ముందు బురదచల్లడం... తరువాత ముద్దాయిలుగా చూపడంలిక్కర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ముద్దాయిల కాలమ్లో ఎవరి పేర్లు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్రెడ్డి పేరు ఉన్నట్లు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎల్లో మీడియాలో దీనిపై బుదరచల్లేలా ప్రముఖంగా వార్తలు రాయించారు. దర్యాప్తునకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ, తాము ఎవరినైతే ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారో వారిపై తప్పుడు కథనాలను రాయిస్తూ, ఆ తరువాత వారిని ముద్దాయిలుగా చూపే కుట్ర జరుగుతోంది.లిక్కర్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పోరేషన్ పనిచేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఏ డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు పొందిన డిస్టలరీల నుంచే కొనుగోళ్ళు చేసింది. మద్యంను నియంత్రించేందుకు ఒక పారదర్శక విధానాన్ని అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మద్యంపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, ఆయన కుమారుడి చైతన్య భాఘేల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు విషయమై 14 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో, మాజీ సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చి చేరుకున్నారు.ఛత్తీస్గఢ్లో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాజీ సీఎం భూపేశ్ భాఘేల్, ఆయన కుమారుడి నివాసాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ సీఎం బంగ్లాలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | ED raids Congress leader Bhupesh Baghel's premises in Bhilai as part of a money laundering investigation against his son - Chaitanya Baghel - in an alleged liquor scam case.Chaitanya Baghel shares the Bhilai accommodation with his father and hence the premises are being… pic.twitter.com/AdUWic1y26— Press Trust of India (@PTI_News) March 10, 2025కేసు ఇదీ..ఛత్తీస్గఢ్లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్ఎమ్సీఎల్ కమీషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. #WATCH | Chhattisgarh | Enforcement Directorate (ED) is conducting searches at the residence of former Chief Minister and Congress leader Bhupesh Baghel's son in an ongoing money laundering case. (Visuals from Durg) pic.twitter.com/k5Gmgew4K4— ANI (@ANI) March 10, 2025 -
మద్యం దందా టీడీపీ లీడర్ల జేబులు ఫుల్
-
కేజ్రీవాల్కు షాక్..! లిక్కర్ కేసుపై ఎల్జీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత,ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు షాక్ తగిలింది.లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను ప్రాసిక్యూట్ చేసేందుకుగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనుమతిచ్చినట్లు సమాచారం. దీంతో లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్పై ప్రత్యేక కోర్టు విచారణకు ఇక లైన్ క్లియరవనుంది. సీఆర్పీసీ ప్రకారం పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా కావాలి అయితే ఈడీ కేసుల్లో మాత్రం ఈ అనుమతి గతంలో అవసరం లేదు. తాజాగా నవంబర్ 6వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈడీ కేసుల్లో కూడా పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది. దీంతో ఈడీ కేజ్రీవాల్ను విచారించేందుకు ఎల్జీ అనుమతి కోరింది.కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. బయటికి వచ్చిన తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలుండడంతో ప్రస్తుతం ఆయన వాటిపైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎన్నికల కోసం ఆప్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. -
రోజుకో స్కామ్ బయటకి..కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
లిక్కర్ స్కామ్: ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్లో ఛత్తీస్గఢ్,జార్ఖండ్లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్పై ఛత్తీస్గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్గఢ్లో లిక్కర్స్కామ్కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
ఢిల్లీ లిక్కర్ కేసు: విచారణ నవంబర్ 8కి వాయిదా
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్ జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్ హాజయ్యారు. శనివారం సీబీఐ ఛార్జ్ షీట్పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు. తదుపరి కేసు విచారణ నవంబర్ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు -
కర్నాటకలో 90రూ ఉండే మద్యం ఏపీ 99 రూపాయాలు...
-
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం(అక్టోబర్ 4) విచారణ జరిపింది. ఈ విచారణకు హాజరయిన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్గా హాజరయ్యారు.తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 19కి వాయిదా వేసింది. కాగా, లిక్కర్ కేసులో కవిత, మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రధాన నిందితులకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణకు కోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్ -
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్11) ఈ విషయమై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ కోసం లిక్కర్ కేసు నిందితులు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు.లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
కవితకు బెయిల్ సుప్రీం కోర్టు ఆంక్షలు
-
కేజ్రీవాల్ విచారణకు సీబీఐకి అనుమతి
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అవినీతి కేసులోప్రాసిక్యూట్ చేసేందుకు తమకు అనుమతి లభించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సంస్థ వెల్లడించింది. లిక్కర్స్కామ్ అవినీతి కేసులో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్నూ విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. తమకు అనుమతి లభించిన విషయాన్ని సీబీఐ తాజాగా రౌస్ ఎవెన్యూకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్పై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను ఆగస్టు 27న కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. ఛార్జ్షీట్ అనంతరం కేసు విచారణ ముందుకు సాగాలంటే కేజ్రీవాల్ విచారణకు పరిపాలన పరమైన అనుమతి తప్పనిసరి. దీంతో సీబీఐ ఈ మేరకు అనుమతులు తెచ్చుకుంది. మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కేజ్రీవాల్కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కేజ్రీవాల్కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం(ఆగస్టు20) కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో ఆయన తీహార్జైలులో రిమాండ్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్కు ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. -
లిక్కర్కేసు: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) విచారించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్భూయాన్లతో కూడిన బెంచ్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ మీద కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.లిక్కర్కేసులో ఈ ఏడాది మార్చి21న అరెస్టయిన కేజ్రీవాల్కు మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ అవినీతి కేసులో మాత్రం కేజ్రీవాల్ ఇంకా తీహార్జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇదే కేసులో 17 నెలలు రిమాండ్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్సిసోడియాకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
లిక్కర్ స్కాం: మరోసారి కోర్టుకు కవిత.. బెయిల్ వచ్చేనా?
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ విషయమై మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ కవిత సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో డిఫాల్ట్ బెయిల్పై రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల కస్టోడియల్ విచారణ ముగియడంలో కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ ఎదుట హాజరుపర్చారు. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆయనను 14 రోజలపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. కేజ్రీవాల్ను వచ్చే నెల 12వ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్కు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సీఎం,ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ శనివారం(జూన్29) రౌస్ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్ను 3 రోజులు సీబీఐ రిమాండ్కు కోర్టు అప్పగించింది. శనివారం ఈ రిమాండ్ ముగియడంతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్ను జ్యుడీషియల్ రిమాండ్కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
బెయిల్పై సుప్రీంలో పిటిషన్ విత్డ్రా చేసుకున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లిక్కర్స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్26) తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్పై తొలుత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై సుప్రీంలో వేసిన పిటిషన్ను కేజ్రీవాల్ బుధవారం ఉపసంహరించున్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై సుప్రీం కోర్టు బుధవారం ఉదయం విచారణ జరిపింది. ఈ విచారణకు కేజ్రీవాల్ తరపున హాజరైన ప్రముఖ లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మధ్యంతర స్టేపై తాము ఇప్పటికే వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.బెయిల్పై హైకోర్టు తాజాగా ఇచ్చిన తుదీ తీర్పుపై మళ్లీ పిటిషన్ వేస్తామని తెలిపారు. -
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సుధీర్కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఉత్కంఠ: కేజ్రీవాల్ బెయిల్పై తుది తీర్పు రేపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్25) తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో దానిని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.దీనిపై సోమవారం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఏం తేలుస్తుందనేదానిపై ‘ఆప్’ పార్టీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. -
Delhi liquor scam: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ ఏమైనా టెర్రరిస్టా: సునీతా కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు శుక్రవారం(జూన్21) చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సునీత మాట్లాడుతూ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్ను ట్రయల్ కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయకముందే ఈడీ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్ను ఉగ్రవాదిలా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఈడీ దాఖలు చేసిన రద్దు పిటిషన్ను విచారించేదాకా బెయిల్ ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. -
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 3 దాకా కేజ్రీవాల్కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.కేసు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. తన క్లైంట్కు జ్యుడీషియల్ కస్ఠడీ పొడిగించడాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేజ్రీవాల్కు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతో తీహార్ జైలు నుంచి ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.కేజ్రీవాల్తో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న వినోద్చౌహాన్ కస్టడీని కూడా కోర్టు జులై 3 దాకా పొడిగించింది. లిక్కర్ స్కామ్లో ప్రతి అంశం చివరకు కేజ్రీవాల్కే ముడిపడి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు ముందు వాదనలు వినిపించారు. -
కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వెంటనే తొలగించాలని సునీతా కేజ్రీవాల్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్ సంబంధిత వీడియోను డిలీట్ చేయాలని, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సైతం రీపోస్ట్ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునితా కేజ్రీవాల్తో పాటు వీడియో పోస్ట్ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 28 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ను రికార్డ్ చేసిన సునితా కేజ్రీవాల్ ఆ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. కవితను కలిసిన కేటీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్కు తిరుగు పయనం అయ్యారు. -
లిక్కర్ కేసు: కవిత జ్యుడీషియల్ కస్టడీ 21కి పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం(జూన్7) సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు దానిని పరిగణలోకి తీసుకుంది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21 వరకు కోర్టు పొడిగించింది. జైలులో చదువుకోవడానికి తనకు 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరోగా కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించింది. కాగా, కవితపై ఇప్పటికే సీబీఐ ఫైల్ చేసిన ప్రధాన ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేసులో కవిత పాత్ర కీలమని, సౌత్గ్రూపు ఏర్పాటులో ఆమె ముఖ్య పాత్ర పోషించారని ఛార్జ్షీట్లో సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులిచ్చారని అభియోగాలు మోపింది. -
తీహార్ జైల్లో లొంగిపోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జైల్లో ఆయన లొంగిపోయారు. మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏప్రిల్లో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 10న మంజూరు చేసింది. ఆదివారంతో బెయిల్ గడువు ముగిసింది. బెయిల్ పొడిగింపు అభ్యర్థనను కోర్టు నిరాకరించడంతో ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహార్ జైలులో లొంగిపోయారు.కాగా, అంతకుముందు కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇస్తూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతానని తెలిపారు.‘‘మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను. అనంతరం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాను. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి తీహార్కు వెళ్తా. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ సీఎం జైల్లో ఆనందంగా ఉంటాడు’’ అంటూ ట్వీట్ చేశారు. -
రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్..కోర్టులో నో రిలీఫ్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్2) తీహార్ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది. -
ఎల్లుండి లొంగిపోతున్నా.. మీరంతా జాగ్రత్త: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్ గడువు ఎల్లుండి (ఆదివారం)తో ముగుస్తుంది. ఆరోజే కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలులో లొంగిపోనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు.ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొగసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనియకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు.मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు. ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటళ్లలో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్ధించండి. వారి ఆరోగ్యం బాగాలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలి ’’ అని కేజ్రీవాల్ అన్నారు. -
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..
-
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తిరస్కరించిన సుప్రీం
-
కవితపై ఈడీ ఛార్జ్షీట్.. 29న కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్షీట్లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. అభిషేక్ బోయినపల్లి ఇంటరాగేషన్లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది. ముత్తా గౌతమ్ స్టేట్మెంట్ కూడా వీరి పాత్రను బయటపెట్టింది. హవాలా సొమ్ము రవాణాలో చారియట్ మీడియా ఉద్యోగి దామోదరశర్మ పాత్ర కూడా ఉంది. వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు లభించాయి -
కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్పై నేడు విచారణ జరగనుంది. 8000 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసినా ఈడీ.. పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది. కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ను కాగ్నిజెన్స్లోకి కోర్టు తీసుకోనుంది.కవిత సహా ఐదుగురు నిందితులపై ఆరవ చార్జిషీట్ నమోదైంది. ఒక్కొక్క నిందితుడిపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. తొలి రోజు నిందితుడు ప్రిన్స్ కుమార్పై అభియోగాలను పరిశీలించిన కోర్టు.. నేడు కవితపై అభియోగాలను పరిగణలోకి తీసుకోనుంది. మరికొంత కాలం కవితని కస్టడీనే ఉంచాలని ఈడీ కోర్టును కోరుతుంది.చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చట్ట ప్రకారం కస్టడీ అవసరం లేదని కవితను జైల్ నుంచి విడుదల చేయాలని న్యాయవాది నితీష్ రాణా కోరగా, చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై స్పెషల్ కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టనుంది. చార్జిషీట్లో అంశాలపై జడ్జి మరికొంత సమాచారం కోరారు.ఈడి వాదనలు:ఈడీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరించింది. ఐదుగురు నిందితుల్లో కవిత, దామోదర్, ప్రిన్స్కుమార్, అరవింద్ సింగ్ , చరణ్ ప్రీత్ లపై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. ఒక్కొక్క నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు చార్జిషీట్లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిధ్దమవ్వగా, అయితే కవిత పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. దాంతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు ఈడీ వివరించింది.ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల ముడుపులు హవాలా మార్గంలో తరలించడంలో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉంది. హవాలా ఆపరేటర్ ఆర్. కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్కి అందాయి. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నంబర్గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్లు, కాల్ డేటా ఇతర ఆధారాలు సేకరించామని ఈడీ తెలిపింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ మూడు మొబైల్ నెంబర్ వాడినట్లు కోర్టుకు ఈడీ తెలుపగా, మధ్యలో జోక్యం చేసుకొన్న జడ్జి కావేరి బవేజా ఆ మూడు నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను జడ్జి సూచించారు. మరో నిందితుడు అర్వింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని.. 7వ సప్లిమెంటరీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్లు కోరారు. కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది. కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు కేజ్రీవాల్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది. 21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్లో ఉందని, కేజ్రీవాల్ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది. తిహార్ జైలు నుంచి విడుదలసుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. సుప్రీంకోర్టు షరతులివే.. 1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్కు అందజేయాలి. 2. బెయిల్పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు 4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు. 5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు. -
తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి ఆప్ కార్యకర్తలకు అభివాదం చేశాారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు తెలిపింది. మే 25న ఢిల్లీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ప్రచారం కోసం కేజ్రీవాల్కు దేశ అత్యున్నత కోర్టు మధ్యంతర బెయిల్ రూపంలో భారీ ఊరటనిచ్చింది. కాగా, లిక్కర్స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
ఢిల్లీ హైకోర్టు: కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో కవిత సవాల్ చేసింది. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని,కేసు వాస్తవాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కవిత పేర్కొంది. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్లో ఆమె ప్రస్తావించింది.హైపర్ టెన్షన్, గైనిక్ సమస్యలకు చికిత్స అవసరమని పిటిషన్ లో కవిత కోరారు. తాను జైల్లో ఉండడం వల్ల మైనర్ కుమారుడు షాక్ లో ఉన్నాడని పిటిషన్లో వెల్లడించారు.1149 పేజీలతో కవిత న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేశారు. త్వరితగతిన తన పిటిషన్ పై విచారణ జరపాలని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ కేసులో జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై స్పందించారు. సోమవారం కస్టడీ ముగిసిన సందర్భంగా కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారన్నారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలని కవిత కోరారు. లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 14 దాకా పొడిగించింది.కవిత కేసులో ఈడీ దూకుడు.. వారం రోజుల్లో ఛార్జ్షీట్ వేస్తామని వెల్లడిలిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వారంరోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది. మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20దాకా రౌస్ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్కు మధ్యంత బెయిల్ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది. -
సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తిహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ తరఫున ఆప్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తాలతో కూడిన ధర్మానం విచారణ జరుపనుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీం కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మే 3వ తేదీన పేర్కొంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం సమాచారం అందిస్తున్నామని సుప్రీం కోర్టు ఈడీ తరఫు న్యాయవాదికి తెలియజేసింది.దీనికంటే ముందు జరిగిన విచారణలో లోక్సభ ఎన్నికల ముందు సీఎం కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగే మధ్యంతర బెయిల్ విచారణలో సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. -
కేజ్రీవాల్కు బెయిల్ పరిశీలిస్తాం: ‘ఈడీ’కి సుప్రీం షాక్
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు వరుస షాకులిస్తోంది. లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం(మే 3) విచారించింది. ఎన్నికలున్న నేపథ్యంలో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని తాము పరిశీలిస్తామని, దీనిపై వాదన వినిపించేందుకు సిద్ధమై రావాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది.పిటిషన్పై మళ్లీ మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ‘మేం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు. ఇవ్వకపోవచ్చు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని మాత్రం పరిశీలిస్తాం. మా నిర్ణయంపై ఎవరూ ఆశ్చర్యపోవద్దు. ఒకవేళ బెయిల్ ఇస్తే ఎలాంటి షరతులు విధించాలన్నది ఈడీ చెప్పాలి. కేజ్రీవాల్ సీఎంగా ఏవైనా ఫైల్స్పై సంతకం చేయాల్సి ఉందా అన్నదానిని కూడా ఈడీ పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సందర్భంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపైనే శుక్రవారం కోర్టు ప్రధానంగా విచారణ జరిపింది. లిక్కర్స్కామ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం.. సిసోడియా తన భార్యను వారానికి ఒకసారి కస్టడీలో కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది.సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ప్రతి స్పందనలు కోరింది. విచారణను మే 8కి వాయిదా వేసింది.ఇప్పటికే మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ను ఏప్రిల్ 30న రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.ఈ కేసుకులో సీబీఐ, ఈడీలకు ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కావేరీ బవేజా.. మద్యం పాలసీ కేసు విచారణ సమయంలో బెయిల్ ఇవ్వడం సరైందని కాదని, సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయితే ఏప్రిల్ 30 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ, మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు గురువారం బెయిల్ కోరుతూ అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.మనీష్ సిసోడియా మధ్యంతర దరఖాస్తులో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాను వారానికి ఒకసారి చూసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టును కోరారు.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం సిసోడియా పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగిస్తే దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. -
కేజ్రీవాల్ అరెస్టు: ఈడీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తొలిసారి షాక్ తగిలింది. కేజ్రీవాల్ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్30) విచారించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్నాయర్ను ఈడీ 2022లో అరెస్టు చేసిందని, కేజ్రీవాల్ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు.ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనేదానిపై క్లారిటీ లేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ను అరెస్టు చేశారని చెప్పారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి మొదట్లో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, తర్వాతే మాట మార్చారని వాదించారు. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్ను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. తిరిగి మే 7న కేజ్రీవాల్ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ను లిక్కర్ కేసులో మార్చ్ 21న ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా, తనకు ప్రైవేట్ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు -
‘సీఎం కేజ్రీవాల్ను జైల్లో చంపేందుకు కుట్ర’.. వ్యాఖ్యలపై బీజేపీ స్పందన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను జైలులో హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆమ్ ఆద్మీ నేతల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. ఇలాంటి సంచలన ప్రకటనలు చేయడం మానుకోవాలని బీజేపీ హితువు పలికింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. మా కంటే జైలు నిర్వాహణ అధికారులు తమ రోగులను (ఖైదీలు) జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభుత్వం, జైలు నిర్వహణ అధికారులు కేజ్రీవాల్ (క్షీణిస్తున్న) ఆరోగ్య పరిస్థితులకు ఎందుకు బాధ్యత వహించాలని కోరుకుంటారు. ఆయన ప్రాణాలను ప్రమాదంలో పడేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు? ఎవరైనా అలాంటి పనులు ఎందుకు చేస్తారా? అని ప్రశ్నించారు. జైల్లో కేజ్రీవాల్కి ఇన్సులిన్ ఇవ్వలేదన్న అతిషి ఆరోపణను తోసిపుచ్చారు. భారతదేశంలో ఏ జైలు ఇలా చేయదు. మనది చాలా బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ఆప్ నేతలు వ్యాఖ్యలు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా జైల్లో కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అదే పార్టీకి చెందిన ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి సైతం జైల్లో ఉన్న కేజ్రీవాల్కు ఇంటి భోజనం, మధుమేహానికి ఇన్సులిన్ ఇచ్చేలా నిరాకరించడం ద్వారా కేజ్రీవాల్ను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించగా.. ఆమె చేసిన వ్యాఖ్యల్ని జైలు అధికారులు ఖండించారు. -
షారుఖ్ స్టైల్లో సీఎం కేజ్రీవాల్ డైలాగ్.. సెటైర్లు వేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ సందేశం పంపారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్టైల్లో ‘మై నేమ్ ఈజ్ అరవింద్ కేజ్రీవాల్.. ఐయామ్ నాట్ టెర్రరిస్ట్’ అంటూ పంపిన ఆ మెజేస్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు, ఆయన పంపిన మెసేజ్పై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను తాము టెర్రరిస్టుగా పిలవడం లేదని అన్నారు. అతన్ని టెర్రరిస్టు అని ఎవరు పిలుస్తున్నారో? కేజ్రీవాల్, అతని సహచరులు అతన్ని ఉగ్రవాది అని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలియదు. మేము అతనిని అవినీతిపరుడనే అంటున్నాం. ఆయన ఢిల్లీకి శత్రువు అని వ్యాఖ్యానించారు. VIDEO | Here's what BJP leader Manoj Tiwari (@ManojTiwariMP) said reacting to Delhi CM Arvind Kejriwal sending a message to people that he's not a terrorist. "Nobody is calling him a terrorist. We're calling him corrupt. He has made senior citizens cry for pension, poor cry for… pic.twitter.com/fztGHhjCds — Press Trust of India (@PTI_News) April 16, 2024 ఈ సందర్భంగా కేజ్రీవాల్పై మనోజ్ తివారీ సెటైర్లు వేశారు. అతను వృద్ధుల పెన్షన్ కోసం పాటుపడ్డారు. పేదల కోసం పనిచేశారు. రేషన్ కార్డుల కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి అందించేందుకు ప్రజల కోసం కృషి చేశారని ఎద్దేశా చేశారు. దోపిడీకి పాల్పడే ముందు జైలులో సౌకర్యాల గురించి ఆప్ అధినేత ఆలోచించి ఉంటారని తివారీ అన్నారు. జైలు మాన్యువల్ అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది అని ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. देश के बेटे अरविंद केजरीवाल का जेल से देश की जनता को संदेश - मेरा नाम अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं। -@SanjayAzadSln pic.twitter.com/9VpPOpnLXa — AAP (@AamAadmiParty) April 16, 2024 -
ప్రచారం చేస్తా.. బెయిల్ ఇవ్వండి: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు శుక్రవారం(ఏప్రిల్ 12) విచారించింది. ఈ నెల 20లోపు సిసోడియా బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపించింనదున ఆమ్ఆద్మీపార్టీ తరపున ప్రచారం కోసం తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోర్టును సిసోడియా కోరారు. ఈ నెల 20వ తేదీన కోర్టు సిసోడియా మధ్యంతర బెయిల్పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. అనంతరం ఈడీ కూడా సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేయడం గమనార్హం. అరెస్టు అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’ -
సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్
-
లిక్కర్ స్కాం: అరెస్ట్పై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
సాక్షి, ఢిల్లీ: న్యాయ సలహా కావాలని అడిగినా.. కానీ అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోర్టు హాలులో మాట్లాడిన ఆమె.. తన అరెస్ట్ అక్రమం, సీబీఐ చేస్తోంది తప్పు అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని రాత్రి పదిన్నరకు చెప్పారు. మా లాయర్లతో మాట్లాడాలని చెప్పా’’ అని కవిత పేర్కొన్నారు. కవిత వాదనలు కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మాకెలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసింది. కవిత హక్కులను కాపాడాలి. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. అరెస్ట్ను వ్యతిరేకిస్తూ కవిత రెండు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కస్టడీ పిటిషన్పై లంచ్ తర్వాత వాదనలు ప్రారంభం కానున్నాయి. సీబీఐ వాదనలు: ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు. అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161, 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ కేసులో కవిత నిజాలు దాచారు. మా వద్ద ఉన్న సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో దర్యాప్తునకు పిలిచినా హాజరుకాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టారు. ఇదంతా బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో బయటపడింది. మాగుంట రాఘవ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇండొ స్పిరిట్, పెర్నాన్ రిచార్డ్ ద్వారా అక్రమ లాభాలు. ట్రైడెంట్ ద్వారా మహిర వెంచర్ లో భూమి కొన్నట్టు జూలై, ఆగస్టు 2021 డబ్బు చెల్లింపులు చేశారు. అన్ని రికార్డులు వాట్సాప్ లో బయటపడ్డాయి. శరత్ చంద్ర రెడ్డి కవిత బెదిరించారు. -
లిక్కర్ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు తాజాగా మంగళవారం(ఏప్రిల్ 9) దానిని వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ అరెస్టు సబబేనని పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు, సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది. కాగా, లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 దాకా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి..మళ్లీ తీహార్ జైలుకే కవిత -
లిక్కర్ కేసు.. ‘ఆప్’ మరో కీలక నేతకు ‘ఈడీ’ సమన్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ని నీడలా వెంటాడుతోంది. ఏకంగా ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు తగ్గించడం లేదు. ఇదే కేసులో ఈడీ తాజాగా ఆప్ ఎమ్మెల్యే, గోవా ఆప్ ఇంఛార్జ్ దుర్గేష్ పాఠక్కు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది. దుర్గేష్ పాఠక్కు ఈడీ నోటీసులు పంపడం ఇది రెండవసారి. 2022లో కూడా ఇదే కేసు విషయమై పాఠక్కు ఈడీ నోటీసులు పంపింది. అప్పట్లో లిక్కర్ కేసు నిందితుడు ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్నాయర్ ముంబై ఇంట్లో ఈడీ సోదాలు జరిపినపుడు పాఠక్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో విజయ్నాయర్తో ఉన్న సంబంధాలు, డిజిటల్ ఆధారాలపై పాఠక్ను ప్రశ్నించడానికే ఈడీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవితకు దక్కని ఊరట -
Kavitha Bail: ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్
-
కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ
-
కవిత లిక్కర్ కేసు లో దూకుడు పెంచిన సీబీఐ
-
కవిత కొడుకు పరీక్షల భయంలో ఉన్నాడు, బెయిల్ ఇవ్వండి
-
లిక్కర్ కేసు: తీహార్ జైలు నుంచి ‘ఆప్’ ఎంపీ రిలీజ్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం(ఏప్రిల్ 3) రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే సంజయ్సింగ్కు ఆప్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆరు నెలల తర్వాత విడుదలైన తమ నేతపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి సంజయ్సింగ్ మాట్లాడారు. ‘ఇది మనం వేడుక చేసుకునే టైమ్ కాదు. పోరాడాల్సిన సమయం. మన నేతలు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారంతా జైలు తాళాలు బద్దలు కొట్టుకుని బయటికి వస్తారని నాకు నమ్మకం ఉంది’అని సంజయ్సింగ్ అన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే సంజయ్ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ను కలిశారు. #WATCH | After spending six months in jail, AAP MP Sanjay Singh walks out of Delhi's Tihar Jail. He was greeted by party leaders and workers on his release. pic.twitter.com/dTybWdb7C4 — ANI (@ANI) April 3, 2024 ఇదీ చదవండి.. సంజయ్ సింగ్ రాక.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు -
సంజయ్సింగ్కు బెయిల్.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు !
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలు జైలులో మగ్గుతున్న ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి సంజయ్ సింగ్ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లిక్కర్ కేసులో గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్సింగ్ బుధవారం(ఏప్రిల్ 2) సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని తమ పార్టీకి ‘మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హోప్’గా ఆప్ నేతలు అభివర్ణిస్తున్నారు. ఆప్ సీనియర్ నేత అయిన సంజయ్సింగ్కు మంచి ఎన్నికల వ్యూహకర్తగా, వక్తగా పేరుంది. పకడ్బందీ ఎన్నికల వ్యూహాలు రచించి పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మార్చి ఎన్నికల్లో విజయాలు సాధించడంలో సంజయ్సింగ్ది అందె వేసిన చేయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆప్ సాధించిన అన్ని విజయాల్లో సంజయ్సింగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్రస్తుతం పార్టీ కీలక నేతలు జైలులో ఉన్న వేళ లోక్సభ ఎన్నికల ప్రచారం సంజయ్ సింగ్ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లగలరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన -
‘శీష్మహల్ టు తీహార్’.. కేజ్రీవాల్పై బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలు పెట్టింది. ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్మహల్ నుంచి జైలుకు వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోతో ఢిల్లీ బీజేపీ శాఖ తన అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. शराब घोटाले के सरगना - Sheesh Mahal To Tihar pic.twitter.com/MbLH0pn1JA — BJP Delhi (@BJP4Delhi) April 1, 2024 ‘గిల్టీ ఆఫ్ లిక్కర్ స్కామ్.. శీష్ మహల్ టు తీహార్’ అనే క్యాప్షన్ను పోస్టుకు జత చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి బీజేపీ నేతలు శీష్మహల్ అనే పేరు పెట్టి పిలుస్తారు. రూ.45 కోట్లతో ఈ నివాసాన్ని కేజ్రవాల్ సుందరీకరించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి 6 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు సోమవారం( ఏప్రిల్ 1) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి.. మీరు వారితో పోల్చుకోవద్దు.. ఉదయనిధికి సుప్రీం చురక -
లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఐఫోన్ను పరిశీలించనుంది. ఇందుకోసం ఐఫోన్ లాక్ను ఓపెన్ చేయించుందుకు ఈడీ అధికారులు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీని ఆశ్రయించనున్నారు. పలు నివేదికల ప్రకారం.. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత ల్యాప్ట్యాప్, డెస్క్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మరో నాలుగు ఫోన్లను జప్తు చేశారు. ఆ సమయంలో ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. అయితే విచారణ సమయంలో ఆ ఫోన్ల పాస్వర్డ్లను చెప్పేందుకు కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ లాక్లను ఓపెన్ చేయించేందుకు యాపిల్ సంస్థను సంప్రదించనున్నట్లు సమాచారం. విచారణకు సహకరించని కేజ్రీవాల్ గత గురువారం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టును కోరింది. తమ రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ‘కేజ్రీవాల్ నుండి రికవరీ చేసిన మొబైల్ ఫోన్ పాస్వర్డ్ను వెల్లడించలేదు. అతను సహకరించకపోతే, మేం ఆ ఫోన్లను (సాంకేతికంగా) తెరవాల్సి ఉంటుంది. మేం అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి, కేజ్రీవాల్ రిమాండ్ పొడిగించాలని కోర్టును కోరింది. దీంతో కోర్టు ఏప్రిల్ 1వరకు పొడిగించింది. రేపటితో కేజ్రీవాల్ ఈడీ రిమాండ్ ముగియనుంది. కేజ్రీవాల్ ఐఫోన్ చుట్టూ దర్యాప్తు ఈలోపే కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆధారాల్ని సేకరించేందుకు ఈడీ సిద్ధమైంది. కేజ్రీవాల్ ఐఫోన్ పాస్వర్డ్లను ఓపెన్ చేసి ఆధారాల్ని సేకరించేందుకు యాపిల్ సంస్థను ఆశ్రయించింది. ఫోన్లో ఆప్ ‘ఎన్నికల వ్యూహం’ ఎన్నికలకు ముందు పొత్తుల వివరాలను ఈడీ గోప్యంగా ఉంచనుంది. -
నా భర్త ‘సింహం’.. ఆయన్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త అరవింద్ కేజ్రీవాల్ సింహంలాంటి వారని, ఆయన్ను ఎక్కువ కాలం జైల్లో పెట్టలేరని అన్నారు. లోక్తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అంటూ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడంపై విపక్ష కూటమి ఇండియా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ జైల్ నుంచి ఓ సందేశం పంపారంటూ సునీతా కేజ్రీవాల్ మాట్లాడారు. ఆ మెసేజ్ గురించి చదివి వినిపించే ముందు మిమ్మల్ని ఓ మాట అడగాలని అనుకుంటున్నాను. ప్రధాని మోదీ నా భర్త కేజ్రీవాల్ను జైలుకి పంపారు. ప్రధాని చేసింది సరైందేనా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తడు, నిజాయితీ పరుడు అని కొనియాడారు. #WATCH | INDIA alliance rally: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Your own Kejriwal has sent a message for you from jail. Before reading this message, I would like to ask you something. Our Prime Minister Narendra Modi put my husband in jail, did the Prime… pic.twitter.com/aZsdXXvJOO — ANI (@ANI) March 31, 2024 బీజేపీ నేతల వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ.. జైల్లో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు అంటున్నారు. రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ సింహం లాంటి వారు. ఆయన్ను ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరని వ్యాఖ్యానించారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ సభలో చదివి వినిపించారు. ‘కేజ్రీవాల్ అనే నేను నాకు ఓటు వేయాలని మిమ్మల్ని (ప్రజల్ని) కోరడం లేదు. న్యూ ఇండియా కోసం 140 కోట్ల మంది భారతీయుల్ని ఆహ్వానిస్తున్నాను. భారతదేశం వేల సంవత్సరాల నాగరికత కలిగిన గొప్ప దేశం. భారతమాత బాధలో ఉంది. భారత ప్రతిపక్ష కూటమికి ఒక్క అవకాశం ఇస్తే, మేం న్యూ ఇండియాను నిర్మిస్తాం’ అని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని చదివారు. దీంతో పాటు ఇండియా కూటమి తరుపున కేజ్రీవాల్ ఆరుహామీలను ప్రకటించారు. ఆ హామీలను సునీతా కేజ్రీవాల్ ప్రకటించారు. -
లిక్కర్ కేసు.. ఢిల్లీ మంత్రిని 5 గంటలు విచారించిన ఈడీ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఆమ్ఆద్మీపార్టీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఇటీవలే ఈ కేసులో పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసిన ఈడీ తాజాగా ఢిల్లీ ప్రభుత్వంలోని మరో మంత్రి కైలాష్ గెహ్లాట్ను శనివారం(మార్చ్ 30) ఐదు గంటల పాటు విచారించింది. లిక్కర్ స్కామ్ సొమ్మును గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ ఖర్చు చేసిన విషయం తనకు తెలియదని గెహ్లాట్ ఈడీకి సమాధానమిచ్చినట్లు తెలిసింది. కాగా, రద్దయిన వివాదాస్పద లిక్కర్ పాలసీ 2021-22 రూపొందించడంలో కైలాష్గెహ్లాట్ కూడా కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్లో గెహ్లాట్ సభ్యులుగా ఉన్నారు. లిక్కర్ పాలసీని అధికారికంగా వెల్లడించకముందే సౌత్ గ్రూప్నకు పాలసీ డ్రాఫ్ట్ లీకయిందని ఈడీ ఆరోపిస్తోంది. పాలసీ రూపొందిస్తున్న సమయంలో గెహ్లాట్ తన అధికారిక నివాసాన్ని వాడుకోవడానికి ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్నాయర్కు అనుమతిచ్చారని, ఇంతేగాక గెహ్లాట్ తన మొబైల్ నంబర్లను పదే పదే మార్చారని ఈడీ చెబుతోంది. విజయ్నాయర్ తన అధికారిక నివాసంలో ఉన్నాడన్న విషయాన్ని తాను ఒప్పుకుంటున్నట్లు గెహ్లాట్ తాజా విచారణలో ఈడీకి చెప్పినట్లు తెలిసింది. ఇదీ చదవండి.. లిక్కర్స్కామ్లో ఈడీ దూకుడు -
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఫ్యామిలీకి ఎంపీ సీటు..
-
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
Updates ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజులు ఈడీ కోరినా నాలుగు రోజులే కస్టడీ పొడిగింపు. ఏప్రిల్ 1 వరకు కస్టడీలోనే కేజ్రీవాల్ సీబీఐ స్పెషల్ కోర్టులో ముగిసిన వాదనలు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వు. తీర్పును రిజర్వు చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. మరో ఏడు రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ గోవా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లతో కలిపి కేజ్రీవాల్ను విచారించాలన్న దర్యాప్తు సంస్థ నన్ను అరెస్టు చేయడమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్ నిందితుడితో బలవంతంగా నా పేరు చెప్పించారు. నిందితుడు 55 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చారు. ఏ కోర్టు నన్ను దోషిగా పరిగణించలేదు. నా అరెస్టుకు తగిన ఆధారాలు లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పార్టీని నిర్మూలించాలనుకుంటున్నారు. నా పేరు కేవలం నాలుగు సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈడీ వాదనలు: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ 100 కోట్ల లంచం తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదు. ఈడీకి అరెస్టు చేసే హక్కు ఉంది. శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలు బాండ్స్ రూపంలో బీజేపీకి ఇచ్చిన నిధులకు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధం లేదు. ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదు. ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బు ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి కోర్టుకు తీసుకు వెళ్లే సమయంలో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు నా అరెస్ట్ రాజకీయ కుట్ర ఢిల్లీ ప్రజలే గట్టిగా సమాధానం చెబుతారు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ను హాజరుపర్చిన ఈడీ ఢిల్లీ: సీబీఐ స్పెషల్ కోర్టు ముందు కేజ్రీవాల్ను ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు విధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చనుంది. ఈడీ కస్టడీ పొడిగింపు కోరుతుందా? లేదంటే రిమాండ్కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్ను మార్చి 21 ఆయన నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఆయన్ను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టుకు హజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చనుంది ఈడీ. ఒకవేళ కస్టడీ పొడగింపునకు కోర్టు అంగీకరించకపోతే మాత్రం ఆయన్ని తీహార్ జైలుకు తరలిస్తారు మరోవైపు తనను ఈడీ చేసిన అరెస్ట్ అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఆయనకు ఊరట లభించలేదు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
Sunita Kejriwal: కేజ్రీవాల్ నిజాలన్నీ వెల్లడిస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిజాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టులో బయటపెట్టబోతున్నట్లు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ ఆయన్ను అరెస్టు చేసిందంటూ ఆమె బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మంగళవారం కలిసినప్పుడు నా భర్త నాతో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో తాగునీటి సమస్యను నివారించాలని లేఖ ద్వారా పంపిన ఉత్తర్వులను కూడా కేంద్రం వివాదాస్పదంగా మారుస్తోంది. ఢిల్లీ నాశనం కావాలని కోరుకుంటోంది. ఈడీ అధికారులు ఇప్పటిదాకా 250 సార్లు సోదాలు నిర్వహించారు. మా నివాసంలో సోదాలు చేసి కేవలం రూ.73 వేలు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ము ఇంకా దొరకలేదని ఈడీ చెబుతోంది. మద్యం కుంభకోణంలో నిజనిజాలు, ఆ డబ్బు ఎక్కడుందో గురువారం కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్ నాతో చెప్పారు. అందుకు రుజువులు కూడా సమర్పిస్తారు’’ అని వీడియో సందేశంలో సునీత స్పష్టం చేశారు. క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. మధుమేహ బాధితుడైన కేజ్రీవాల్ రక్తంలో చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయని వెల్లడించాయి. కేజ్రీవాల్ బ్లడ్షుగర్ లెవెల్ ఒక దశలో 46 ఎంజీకి పడిపోయిందని డాక్టర్లు చెప్పారని, ఇది చాలా ప్రమాదరమని తెలియజేశాయి. హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన అరెస్టులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తనను ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై ఏప్రిల్ 2వ తేదీలోగా స్పందించాలని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీకి సూచించారు. తదపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు. -
కెజ్రివాల్ భార్య సంచలన ప్రకటన
-
ఈడీ జ్యుడీషియల్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
-
నేటితో ముగిసిన కవిత 10 రోజుల ఈడీ కస్టడీ
-
MLC Kavitha: ముగిసిన వాదనలు తీహార్ జైలుకు కవిత?
-
ఆమె బాధకు కేజ్రీవాలే కారణం: బీజేపీ
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆప్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. అయితే మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. శనివారం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలకు చదివి వినిపించారు. ఈ వీడియో సందేశంపై కూడా బీజేపీ విమర్శలు చేసింది బీజేపీ. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సందేశాన్ని చదివే క్రమంలో ఆయన భార్య సునితా కేజ్రీవాల్ ఎంతో బాధపడ్డారని ఆ బాధకు కేజ్రీవాల్ బాధ్యత వహించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. ‘సునితా కేజ్రీవాల్ ఎంతో బాధతో మాట్లాడారు. దానికి సీఎం కేజ్రీవాల్ బాధ్యత వహించాలి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ సౌకర్యాలు, ఇల్లు, కారు, భద్రత తీసుకుంటున్నప్పుడు ఇలా మీడియా ముందుకు వస్తే బాగుండేది. కేజ్రీవాల్ గ్రాండ్ బంగ్లాలోకి వెళ్లినప్పుడు, ఢిల్లీ పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అయినప్పుడు. ఢిల్లీ యువతకు మద్యం ఉచితంగా ఇచ్చినప్పుడు, కేజ్రీవాల్ ద్వారా రూ. 100 కోట్ల లావాదేవీలు జరిగినప్పుడే సునితా కేజ్రీవాల్ ఇలా మీడియా ముందుకు రావాల్సింది’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో కాంగ్రెస్ ఇబ్బంది పడి.. ప్రస్తుతం మాత్రం ఆప్కు కాంగ్రెస్కు మద్దతు నిలుస్తోంది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఈ లిక్కర్ స్కామ్పై తీవ్ర విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ సైతం.. షిలా దీక్షిత్, సోనియా గాంధీలపై విమర్శలు గుప్పించారు. ఆప్, కాంగ్రెస్ అవినీతి పార్టీలు.. వారి మధ్యే ఎన్నికల పోటీ ఉండాలనుకుంటున్నారు’ అని వీరేంద్ర సచ్దేవా మండిపడ్డారు. సునితా కేజ్రీవాల్ శనివారం ఈడీ కార్యాలయంలో అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు. ఇక..అరవింద్ కేజ్రీవాల్ను మర్చి 28 వరకు ఢిల్లీ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తన అరెస్ట్ రిమాండ్పై ఢిల్లీ హైకోర్టును శనివారం ఆశ్రయించగా అత్యవసరంగా విచారించటం వీలుకాదని పేర్కొంది. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ తొలి ఆదేశాలు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలోని జల మంత్రిత్వ శాఖకు కేజ్రీవాల్ ఈ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల వివరాలు ఆదివారం(మార్చ్ 24) నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ ఆర్థిక, జల వనరుల మంత్రి అతిషి వెల్లడించారు. ‘జైలులో ఉండి కూడా సీఎం తన కుటుంబ సభ్యులైన ఢిల్లీ వాసుల గురించే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఢిల్లీలో నీటి కొరత లేకుండా చూడాలని తనను సీఎం ఆదేశించారు. క్యాబినెట్ పనితీరును సీఎం జైలు నుంచే పర్యవేక్షిస్తున్నారన్నారు’ అని అతిషి చెప్పారు. मुख्यमंत्री अरविंद केजरीवाल जी को जेल से भी अपने परिवार दिल्ली की जनता की चिंता है उन्होंने मुझे जेल से लिखित आदेश भेजा है, जिसे पढ़ते वक्त मेरी आँखों में आँसू थे ऐसा कौन सा मुख्यमंत्री है जो जेल में होने के बावजूद भी अपनी चिंता नहीं कर रहा है बल्कि लोगों के बारे में सोच रहा… pic.twitter.com/6Ht9lNdunN — AAP (@AamAadmiParty) March 24, 2024 కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో మార్చ్ 21న అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనను మార్చ్ 29దాకా ఈడీ కస్డడీకి ఇచ్చింది. జైలు నుంచే తమ నేత సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గ్యాంగులే జైళ్ల నుంచి ఆపరేట్ చేస్తాయని దీనిపై ఇప్పటికే బీజేపీ కౌంటర్ కూడా ఇవ్వడం గమనార్హం. Delhi CM Arvind Kejriwal sends order from ED custody to Water Minister Atishi. https://t.co/FcceGPK5Yx pic.twitter.com/iZs4PzHhhR — ANI (@ANI) March 24, 2024 ఇదీ చదవండి.. కేజ్రీకి ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట -
సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు షాక్ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరెస్ట్, ఈడీ రిమాండ్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా.. ఈడీ మార్చి 28 వరకు తమ క్లైంట్కు ఈడీ కస్టడీ విధించటం చట్టవిరుద్ధమని సీఎం కేజ్రీవాల్ న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే. మార్చి 24 ఆదివారంలోపు తను దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్లో కోరారు. అత్యవసర విచారణ కోసం కేజ్రివాల్ తరపు అడ్వకేట్ ప్రయత్నం చేశారు. కాగా.. ఢిల్లీ హైకోర్టు అత్యవసరణ విచారణకు అనుమతించకపోవటం గమనార్హం. ఇక.. గురువారం ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. నిన్న శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ను కోర్టుకు హాజరుపరిచి.. ఈడీ పదిరోజుల కస్టడీకి కోరింది. దీంతో కోర్టు ఆరు రోజుల పాటు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. చదవండి: కేజ్రీవాలే అసలు కుట్రదారు -
‘సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే’
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ను గురువారం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’, కాంగెస్ తీవ్రంగా ఖండించాయి. అయితే మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ మాత్రం కేజ్రీవాల్కు మద్దతు తెలుపుతునే ఆయన సీఎం పదవిపై ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. ‘ఎల్కే అద్వానీ, మాధవరావు సింధియా, కమాల్నాథ్లపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. వారు తమ పదవులకు రాజీనామా చేశారు. రైలు ప్రమాదానికి బాధ్యత వహింస్తూ.. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ సైతం తన పదవికి రాజీనామా చేశారు. భారత దేశం అంతటి గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉంది. జనవరిలో అరెస్ట్ అయిన హేమంత్సోరెన్సై కూడా అరెస్ట్కు ముందే తన సీఎం పదవి రాజీనామా చేశారు’ అని సంజయ్ నిరూపమ్ అన్నారు. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल अपने जीवन के सबसे बड़े संकट से गुजर रहे हैं। इंसानियत के नाते उनके प्रति सहानुभूति है। कॉंग्रेस पार्टी ने भी उन्हें सार्वजनिक रूप से समर्थन दिया है। लेकिन वे भारतीय राजनीति में नैतिकता की जो नई परिभाषा लिख रहे हैं,उसने मुझे यह पोस्ट लिखने के… — Sanjay Nirupam (@sanjaynirupam) March 23, 2024 ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిజం ఏంటో కోర్టు తేల్చుతుందని అన్నారు. ఒక సీఎంగా అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డారని.. అయినా తన పదవికి రాజీనామా చేయకపోవటం సరికాదన్నారు. ఇది ఎటువంటి నైతికత? అని ప్రశ్నించారు. పార్టీ స్థాపించబడి 11ఏళ్లు అవుతున్నా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యవహరిస్తున్న తీరు చాలా అనైతికమని విమర్శించారు. అవినీతి కేసులో ఇలా.. ఒక సీఎంగా అరెస్ట్ అయిన వ్యక్తి దేశంలో అరవింద్ కేజ్రీవాల్ మొదటివారు. అరెస్ట్ అయినా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారని, కావాలంటే జైలు నుంచే ఆయన పారిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గురువారం ఈడీ... సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన నివాసంలో సుమారు రెండున్న గంటల పాటు విచారించి అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ఆరు రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. -
కవిత అరెస్ట్ పై.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి ఛాలెంజ్
-
ఫోన్ లో డేటా డిలీట్? కవిత రిమాండ్ లో కీలక అంశాలు
-
ఎవరు నిజమైన రాహుల్ గాంధీ?: స్మృతి ఇరానీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ద్వంద వైఖరిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై సంఘీభావం తెలుపుతారు. అదేవిధంగా తెలంగాణలో మాట్లాడినప్పుడు మాత్రం కేజ్రీవాల్ అవినితీ పరుడని అంటారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీ ద్వంద వైఖరిలో మాట్లాడానికి సంబంధించి నేను ఆధారాలు ఇవ్వగలను. కేజ్రీవాల్తో పాటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అవినీతిపరుడని 2, జూలై, 2023లో తెలంగాణ రాహుల్ మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అన్ని విషయాలు దర్యాప్తు సంస్థలకు తెలుసన్నారు. అవినీతి సొమ్మును ఆప్ గోవా ఎన్నికలకు వినియోగించిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. వీరిలో ఎవరు నిజం చెబుతున్నారు?’ అని స్మృతి ఇరానీ నిలదీశారు. Smt. @smritiirani addresses a press conference at party headquarters in New Delhi. https://t.co/jITZyxd3dL — BJP (@BJP4India) March 22, 2024 ఎవరు నిజమైన రాహుల్ గాంధీ? తెలంగాణలో మాట్లాడే రాహుల్ గాంధీ? లేదా ఢిల్లీలో మాట్లాడే రాహుల్ గాంధీ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి, అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎంతటి అవినీతికి పాల్పడతారో అరవింద్ కేజ్రీవాల్ను చూస్తే తెలుస్తోందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావటంతో రాహుల్ శుక్రవారం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేశారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ రిమాండ్లో ఉన్నారు. అదేవిధంగా ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏడురోజుల రిమాండ్ పూర్తి చేసుకోగా... తాజాగా (శనివారం) రౌస్ అవెన్యూ కోర్టు మరో మూడురోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. -
లిక్కర్ స్కాంలో తెరపైకి కొత్త పేరు.. కవిత బంధువుపై ఈడీ ఫోకస్
-
కవిత మేనల్లుడి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
ఢిల్లీ: దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతనెవరో కాదు.. ఇప్పటికే అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత దగ్గరి బంధువు మేకా శరణ్. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో శరణ్ ఫోన్ లభ్యం అయింది. దీంతో సౌత్ గ్రూప్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్దే కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మేకా శరణ్ను ప్రశ్నించేందుకు పిలిస్తే రావడం లేదని ఈడీ చెబుతోంది. ఏడు రోజుల కవిత విచారణకు సంబంధించి పలు కీలక వివరాలను రిమాండ్ పిటిషన్లో వెల్లడించింది. ‘ఏడు రోజుల రిమాండ్లో కవిత.. నాలుగు స్టేట్మెంట్లపై ప్రధానంగా ప్రశ్నించాం. ఫోన్లోని డేటా ఎందుకు డిలీట్ చేశారని అడిగాము. ఆదాయపు పన్ను వివరాలు, బంధువుల వ్యాపారాల వివరాలు అడిగాం. మేకా శరన్ వివరాలు అడిగితే ‘నాకు తెలియదు’అని కవిత చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సంపాదించిన అక్రమ సొమ్మును కవిత బంధువు మేక శరణ్ బదిలీ చేశారు. ఇండోస్పిరిట్ ద్వారా ఈ అక్రమ సొమ్ము సంపాదించారు. కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, సమీర్ మహేంద్ర కలిసి కుట్రపన్ని ఇండో స్పిరిట్ ద్వారా అక్రమ సొమ్ము లావాదేవీలు చేశారు. మేకా శరన్ ఈడీ ముందు హాజరు కావాలని ఫోన్ చేస్తే సహకరించడం లేదు. అందుకే ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో సమీర్ మహేంద్రను కూడా ఇంటరాగేషన్ చేయబోతున్నాం. మేకా శరణ్కు అక్రమ సొమ్ము ఎలా బదిలీ చేశారు, వినియోగించారు అనేది తెలుసుకోవాలి. కొత్తగా వెలుగు చూస్తున్న ఈ విషయాల నేపథ్యంలో కవితను మరింత విచారణ చేయాలి’ అని ఈడీ రిమాండ్ పిటిషన్లోని కీలక విషయాలు వెల్లడించింది. చదవండి: అక్రమ అరెస్ట్లపై కోర్టులో పోరాడుతా: కల్వకుంట్ల కవిత కవిత మేనల్లుడు మేక శరణ్ నివాసంలో ఈడీ సోదాలు కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్ ద్వారా లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానం వ్యక్త చేస్తోంది. మేకా శరణ్ నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మేకా శరణ్ అందుబాటులో లేరు. ముడుపుల చెల్లింపులో శరణ్దే కీలక పాత్రగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. తనను బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టు కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ( శనివారం) రౌస్ అవెన్యూ కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. వాదనలను విన్న కోర్టు.. కవితకు మరో మూడు రోజుల ఈడీ కస్టడీని పొడగించింది. ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీ పొడగిస్తూ.. 26 తేదీ ఉదయం 11.30 గంటలకు కవితను కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కవిత తరపు న్యాయవాది వాదనలు.. ‘ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారు?. కవిత పిల్లలు మైనర్స్.. వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వండి. కస్టడీ పూర్తైన రోజే కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపండి. కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం. బెయిల్ పిటిషన్ వేశాం. బెయిల్ పిటిషన్స్పై ఈడీకి ఆదేశాలు ఇవ్వండి’ అని కోర్టును కోరారు. అనంతరం ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ‘కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదు.మరో ఐదు రోజుల కస్టడీ కావాలి. నలుగురు స్టేట్మెంట్స్ గురించి కవితని అడిగాం. కిక్ బ్యాగ్స్ గురించి అడిగాం. ఫోన్ల డేటా డిలీట్ చేశారు. కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగాం. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మేకా శరణ్కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు. సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీనే. కవితతో కలిపి సమీర్ను విచారించాలి. లిక్కర్ స్కాంలో రూ. వందల కోట్లు చేతులు మారాయి. ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయి. కవితకు వైద్య సూచనల మేరకు మందులు, డైట్ ఇస్తున్నాము’అని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు కవితను మరోమూడు రోజులు ఈడీ కస్టడీ పొడిస్తున్నట్లు ఆదేశించింది. ఇక..ఢిల్లీ మద్యం కేసులో గురువారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు కూడా కోర్టు ఈ నెల 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇవాళ కవితకు మరో మూడు రోజు ఈడీ కస్టడీ పొడగింపుతో ఇద్దరీని ఒకేసారి ఈడీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషియర్ రిమాండ్లో ఉన్నారు. -
బీజేపీ ఖాతాల్లోకే ‘లిక్కర్’ సొమ్ము: ‘ఆప్’ మంత్రులు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్లో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండేళ్లుగా వెతుకుతున్న కోట్ల రూపాయల సొమ్ము ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీ ఖాతాకే చేరిందని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) విమర్శించింది. ఈ మేరకు శనివారం(మార్చ్ 23)ఉదయం ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ‘రెండేళ్ల విచారణ తర్వాత కూడా స్కామ్లో డబ్బులెక్కడికి పోయాయనే ప్రశ్న మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. ఇంత వరకు ఆప్ నేతల నుంచి స్కామ్కు సంబంధించి ఒక్క రూపాయిని కూడా రికవర్ చేయలేకపోయారు. లిక్కర్ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డిని గతంలో విచారించినపుడు కేజ్రీవాల్ను తాను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని ఆయన చెప్పారు. అలా చెప్పిన మరుసటి రోజే శరత్చంద్రారెడ్డిని అరెస్టు చేశారు. అరెస్టయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ మారిపోయింది. కేజ్రీవాల్ను కలిసి డబ్బులిచ్చాను అని చెప్పగానే శరత్చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేజ్రీవాల్ను అరెస్టు చేశామని ఈడీ చెబుతోంది’అని మంత్రులు మండిపడ్డారు. ఇదీ చదవండి.. 26న ఆప్ ప్రధాని ఇంటిని ముట్టడి -
కేజ్రీవాల్ను కలవనున్న రాహుల్ గాంధీ..?
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ను శుక్రవారం(మార్చ్ 22) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కలిసే అవకాశాలున్నాయి. గురువారం రాత్రి కేజ్రీవాల్ అరెస్టయిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు రాహుల్ ఫోన్ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేజ్రీవాల్కు అవసరమైన న్యాయ సహాయంపై చర్చించేందుకే రాహుల్ గాంధీ ఆయనను కలిసేందుకు ప్రయత్నించనున్నట్లు సమాచారం. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆయనను కలవడం సాధ్యపడుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒక వేళ కేజ్రీవాల్ను కలవడం వీలుకాకపోతే కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాహుల్ వారికి భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖండించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేసేందుగాను రెండు పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల పంపిణీ కూడా పూర్తయింది. ఇదీ చదవండి.. లిక్కర్ స్కామ్.. కేజ్రీవాల్ అరెస్ట్ అప్డేట్స్ -
కవిత కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన ఆడిటర్ బుచ్చిబాబు
-
Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు షాక్..!
-
కవిత పిటిషన్కు ఢిల్లీ కోర్టు అనుమతి
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది సెషన్స్ కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వారిలో తల్లి శోభా, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతి లభించింది. ఇక.. శనివారం మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు కవితను ఈడీ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. వారు సుమారు గంటసేపు భేటీ అయి పలు అంశాలుపై చర్చించుకున్నట్లు తెలిసింది.అదేవిధంగా ఇవాళ.. ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దు అంటూ గతేడాది దాఖలైన పిటిషన్ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
వెల్కమ్ టు తీహార్ జైలు అక్కా
-
కవిత అరెస్టు.. ‘ఈడీ’ ప్రకటనపై ‘ఆప్’ ఫైర్
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడుదల చేసిన ప్రకటనపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) స్పందించింది. ఈడీ భారతీయ జనతా పార్టీ విభాగంలా పనిచేస్తోందని ఆప్ నేతలు ఫైరయ్యారు. తమ పార్టీ నేతలకు కవిత రూ.100 కోట్లకుపైగా ముడుపులు చెల్లించారని ఈడీ ఎలా ప్రకటన చేస్తుందని మండిపడ్డారు. ఈడీ తటస్థంగా వ్యవహరించాల్సిందిపోయి బీజేపీ విభాగంలా తయారేఐ తప్పుడు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాల ప్రతిష్ట దెబ్బతీయడానికే ఈడీ తప్పుడు ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. లిక్కర్ స్కామ్లో రూ.100 కోట్ల చెల్లింపులు జరిగాయన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టిపారేసిందని ఆప్ నేతలు గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో 500కుపైగా సోదాలు జరిపిన ఈడీ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయిందని, ఈ నిరాశ, నిస్పృహలతోనే ఈడీ కవిత అరెస్టుపై ఇలాంటి ప్రకటనలు చేస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను ఇటీవలే అరెస్టు చేసిన ఈడీ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కవితకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ -
‘ఈడీ’ ట్విస్ట్.. కేజ్రీవాల్కు ఒకేరోజు రెండు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఆదివారం ఒకే రోజు కేజ్రీవాల్కు రెండు కేసుల్లో ఈడీ సమన్లు పంపడం కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో తొమ్మిదోసారి సమన్లు జారీ చేయగా ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని మరో సమన్లు పంపింది. లిక్కర్ కేసులో మార్చ్ 21 విచారణకు పిలవగా, జల్ బోర్డు కేసులో 18న రావాలని ఈడీ కోరింది. కాగా, లిక్కర్ కేసులో విచారణ కోసం గతంలో ఈడీ పంపిన ఎనిమిది సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. విచారణకు హాజరవలేదు. దీంతో ఈడీ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్పై ఫిర్యాదు కూడా చేసింది. అయితే సమన్లకు స్పందించని కేసులో కేజ్రీవాల్కు శనివారమే(మార్చ్ 16) కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో బెయిల్ తీసుకున్న మరుసటి రోజే లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు ఈడీ మళ్లీ సమన్లు పంపడం గమనార్హం. ఇదీ చదవండి.. ఈడీ కస్టడీలో కవిత -
Delhi excise policy case: కేజ్రీవాల్కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎట్టకేలకు ఊరట లభించింది. మద్యం విధానం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించనందున ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఈడీ కోర్టులో రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, మొదటి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్ శనివారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ రెండో ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు పత్రాలను కేజ్రీవాల్కు అందజేయాలని ఈడీని ఆదేశించింది. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్
న్యూఢిల్లీ: ఈడీ సమన్ల కేసు వ్యవహారంలో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈ కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో ఇవాళ ఉదయం ఆయన రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరవ్వగా.. పూచికత్తుల మీద ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. మార్చి 16న వ్యక్తిగతంగా హాజరవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన సమన్లపై కేజ్రీవాల్ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఇవాళ ఆయన ఢిల్లీ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. అయితే.. వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం రూ.15 వేల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా కేజ్రీవాల్ను ఆదేశించింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా తాము పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆయన్ని ఆదేశించింది. అయితే వర్చువల్గా హాజరవుతానన్న ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. Delhi's Rouse Avenue Court ACMM grants bail to Delhi CM Arvind Kejriwal on a bail bond of Rs 15,000 and a surety of Rs 1 lakh The CM appeared before the court following summons issued to him by the court on the basis of two ED complaints in connection with the Delhi Excise… https://t.co/drMvypVniM — ANI (@ANI) March 16, 2024 ఇదీ చదవండి.. కవితకు వైద్యపరీక్షలు.. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత -
లిక్కర్ కేసు.. కవిత పిటిషన్పై విచారణ 19కి వాయిదా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీం కోర్టులో గతంలోనే సవాల్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ నుంచి కవిత నోటీసులు అందుకున్నారు. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐ, ఈడీలకు కవిత లేఖలు రాశారు. కాగా, లిక్కర్ కేసులో కవిత గత ఏడాది మార్చిలో ఈడీ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సీబీఐ మాత్రం హైదరాబాద్లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది. ఇటీవలే అనూహ్యంగా లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41 ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది. దీంతో కవిత సీబీఐ, ఈడీల ముందు మళ్లీ హాజరవ్వాలా లేదా అన్న విషయంలో సుప్రీంకోర్టులో 19న జరగనున్న విచారణ కీలకంగా మారనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఇటీవల వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈకేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
బయటపడుతున్న టానిక్ అక్రమాలు
-
Delhi: ఈడీకి కేజ్రీవాల్ ఎనిమిదో ‘సారీ’
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఎనిమిదోసారి హ్యాండిచ్చారు. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇటీవలే ఎనిమిదవసారి ఈడీ కేజ్రీవాల్కు సమన్లు పంపింది. ఈ విచారణకు సోమవారం ఈడీ ఎదుటకు రావాల్సి ఉండగా కేజ్రీవాల్ రాలేదు. సోమవారం(మార్చి 4) తాను ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందునే విచారణకు హాజరవడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఈసారి మాత్రం ఈడీకి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. మార్చ్ 12వ తేదీన ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22, జనవరి 3, 2024, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 26, మార్చ్ 4వ తేదీల్లో ఇప్పటికి ఎనిమిదిసార్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఇదీ చదవండి.. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం -
లిక్కర్ కేసు: ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ.. కవిత ఇంట వద్ద స్టేట్మెంట్ తీసుకుంది. ఇక.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసులు పంపింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వటంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరుకాకపోవటం గమనార్హం. ఇక.. ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’!
ఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)విచారణకు గైర్హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం తమ ముందు విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈ నెల 14న ఈడీ కేజ్రీవాల్కు సమన్లు పంపింది. కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంపై ఆప్ స్పందించింది. ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధం అని పేర్కొంది. ‘కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంపై ఈడీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. మళ్లీ మళ్లీ సమన్లు పంపకుండా కోర్టు నిర్ణయం వచ్చేవరకు వేచి చూడాలి’ అని ఈడీకి ఆప్ నేతలు సూచించారు. ఇదీ చదవండి.. జేకేలోనూ ఇండియా కూటమికి ఎదురుదెబ్బ -
కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా గైర్హాజరవడంతో శనివారం తమ ముందు హాజరుకావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై శనివారం సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన బలపరీక్షకు దిగారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
కేజ్రీవాల్పై ఈడీ కీలక పిటిషన్.. కాసేపట్లో విచారణ
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ భవితవ్యం ఇవాళ సాయంత్రం తేలనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికి అయిదుసార్లు ఈడీ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరవలేదు. కోర్టు ఏం చెబుతుందో అనేదానిపై ఆమ్ ఆద్మీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.ఇదే కేసులో ఆమ్ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత ఏడాది అరెస్టయి ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతలే టార్గెట్ -
బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల కేసు విచారణ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'బీజేపీ ఎలాంటి కుట్ర పనైనా చేయగలదు. నేను కూడా గట్టిగానే ఉన్నా. ఎప్పటికీ లొంగిపోను. నన్ను బీజేపీలో చేరమని అడుగుతున్నారు. నన్ను ఒంటరిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో ఎప్పటికీ చేరబోనని చెప్పాను. అది ఎప్పటికీ జరగదు.' అని ఢిల్లీలోని రోహిణిలో పాఠశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆప్ అధినేత మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన బడ్జెట్లో 40 శాతాన్ని పాఠశాలలు, ఆసుపత్రుల కోసం ఖర్చు చేయగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం జాతీయ బడ్జెట్లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉన్న ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ గురించి కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. "ఈరోజు అన్ని కేంద్ర ఏజెన్సీలు మన వెంటే పడుతున్నాయి. మంచి పాఠశాలలను నిర్మించడమే మనీష్ సిసోడియా చేసిన తప్పు. మంచి ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్లు నిర్మించడమే సత్యేంద్ర జైన్ చేసిన తప్పు. పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయకపోతే మనీష్ సిసోడియా జైలుకు వెళ్లేవారు కాదు. బీజేపీ అన్ని రకాల కుట్రలు చేస్తోంది. కానీ మమ్మల్ని అడ్డుకోలేకపోయారు" అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల కేసులో మంత్రి అతిశీకి నోటీసులు అందించేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేడు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె లేకపోయేసరికి చాలా సేపు అక్కడే వేచి ఉన్నారు. కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించాలని అతిశీ కోరినప్పటికీ వారు నిరాకరించారు. ఇదే కేసులో సీఎం కేజ్రీవాల్కు శనివారం నోటీసులు అందించారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్కు ఢిల్లీ పోలీసుల నోటీసులు -
మద్యంకుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. చీకటి జీవోలతో అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టి ఏటా రూ.1,300 కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన తీరుపై కీలక ఆధారాలు సేకరించింది. దాంతో ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120 (బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13 (1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నోట్ ఫైళ్లు, చీకటి జీవోల గుట్టురట్టు: రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన తీరుపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతోపాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనార్హం. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ చేసింది. అంటే కేబినెట్కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించడం గమనార్హం. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదానిని సృష్టించారు. అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. మరోపక్క డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడమే కాకుండా, అప్పటివరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండిపడిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఈ మొత్తం బాగోతంపై గురించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇక నిందితుల విచారణే మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందులో పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు ఉపక్రమిస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంది. ప్రధానంగా నోట్ఫైళ్లు, ఇతర ఆధారాలను సేకరించింది. ఒకే రోజులో పరస్పర విరుద్ధంగా నోట్ఫైళ్లు రూపొందించడం, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన తరువాత కూడా బార్ల యజమానుల పేరిట వినతిపత్రాన్ని రికార్డుల్లో చేర్చిన పన్నాగాన్ని ఛేదించనుంది. అందుకోసం త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. నిందితుల విచారణకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. వారికీ నోటీసులు జారీ చేయనుంది. మద్యం కంపెనీల ప్రతినిధులతోపాటు కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధపడుతోంది. ఆ విచారణ ద్వారా గుర్తించిన అంశాలను సమీక్షించిన తరువాత కేసు దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా
ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరుసగా నాలుగోసారి గైర్హాజరయ్యారు. గడిచిన రెండు నెలల్లో ఈడీ పంపిన నాలుగు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదు. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా కేజజ్రీవాల్ వెళ్లలేదు. ఈడీ నోటీసులపై ఆయన స్పందించారు. ఈడీ తనకు సమన్లు పంపడం చెల్లదని, అవి పూర్తిగా చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా ఆపడానికే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికలలోపే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ నోటీసులన్నీ రాజకీయ కక్ష్యలో భాగమేనని, ఇలాంటి నోటీసులన్నింటినీ కోర్టు ఎప్పటికప్పుడు కొట్టివేస్తూ వస్తోందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ‘నన్ను ఎన్నికలకు రెండు నెలల ముందు విచారణకు ఎందుకు పిలవాలి. ఈడీని బీజేపీయే వెనుక ఉండి నడిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు నన్ను దూరం చేయడమే వారి ఉద్దేశం‘ అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, నాలుగుసార్లు నోటీసులు వస్తే అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ముందుకు ఎందుకు వెళ్లడం లేదు. ఆయన భయపడుతున్నారా అని బీజేపీ నేత గౌరవ్ భాటియా ప్రశ్నించారు. ఇదీచదవండి.. అయోధ్య వాతావరణం.. ఐఎండీ ప్రత్యేక వెబ్పేజీ -
బాబుకి ముందస్తు: ఆ మూడు కేసుల్లో జరిగింది ఇదే!
గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నాం తీర్పు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ(సీఐడీ) చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇసుకను అలా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్ నేతలు అలర్ట్!
ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నేడు ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని అప్ నేతలు తెలిపారు. అరెస్టుకు ముందు కేజ్రీవాల్ ఇంటిపై సోదాలు జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈ విధంగా ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ను ఈడీ నేడు అరెస్టు చేసే అవకాశం ఉందనే వార్తలపై ఈడీ స్పందించింది. కేజ్రీవాల్పై దాడులు జరగట్లేదని స్పష్టం చేసింది. విచారణకు కేజ్రీవాల్ రాకపోవడానికి గల కారణాలను పరిశీలిస్తోంది. మరోసారి సమన్లు జారీ చేస్తామని పేర్కొంది. News coming in that ED is going to raid @ArvindKejriwal’s residence tmrw morning. Arrest likely. — Atishi (@AtishiAAP) January 3, 2024 ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్కు ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఇప్పటికీ కేజ్రీవాల్ నుంచి ఎలాంటి స్పందన లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. BREAKING Sources confirm that ED is going to raid the residence of CM Arvind Kejriwal tomorrow morning. He is likely to be arrested. — Jasmine Shah (@Jasmine441) January 3, 2024 కేజ్రీవాల్ ఇప్పటికే మూడుసార్లు విచారణ కోసం ఈడీ పంపిన సమన్లను దాటవేశారు. చివరిసారిగా జనవరి 3న హాజరుకావడానికి కూడా నిరాకరించారు. నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో ఈడీ ముందు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. నిబంధనల ప్రకారం ఆయనపై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. ఆయన్ని అరెస్టు చేయవచ్చు. सुनने में आ रहा है कल सुबह मुख्यमंत्री केजरीवाल जी के घर ED पहुँच कर उन्हें गिरफ़्तार करने वाली है । — Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) January 3, 2024 ఈడీ సమన్లు ప్రేరేపితమైనవని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో తనను సాక్షిగా పిలుస్తున్నారా? లేదా అనుమానితుడిగా పిలుస్తున్నారా? అనేది స్పష్టంగా తెలియదని చెప్పారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను ఆపాలనే ఈడీ యోచిస్తున్నట్లు ఆరోపించారు. ఇదీ చదవండి: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? -
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలా.. వద్దా?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయితే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా.. వద్దా అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఢిల్లీలో ఇంటింటికీ 'మై బీ కేజ్రీవాల్' సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. స్థానిక మంత్రి గోపాల్ రాయ్ తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. "ఈ రోజు మొదటి రోజు. లక్ష్మీ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించాం. ప్రజలతో మాట్లాడాం. సీఎం కేజ్రీవాల్ ప్రజల కోసం చాలా పని చేశారని వారు చెప్పారు. ఉచితంగా కరెంటు, మంచినీరు, వైద్యం, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు వంటి సౌకర్యాలు కల్పించారని, అందుకే రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు గట్టిగా అభిప్రాయపడ్డారు" అని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ గత నెలలో విచారణకు పిలిచింది. అయితే కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకాలేదు. ఇది "చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం" అంటూ నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. మేం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి అరెస్టు జరిగితే కేజ్రీవాల్ రాజీనామా చేయాలా లేక జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలా అనే విషయాన్ని ప్రజలనే అడిగాం’ అని రాయ్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 2600 పోలింగ్ స్టేషన్లలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 21 నుంచి 24 వరకు మొత్తం 250 వార్డుల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని రాయ్ తెలిపారు. ఏం చేయాలన్నది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారన్నారు. -
సంతకం సాక్షిగా..మద్యంలో ముడుపులు
-
సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణం ద్వారా అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన మాజీ సీఎం చంద్రబాబు నిర్వాకాలు సంతకాలు సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఇన్నాళ్లూ ఆయనకు ఏమీ తెలియదంటూ బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాదనలో ఏమాత్రం నిజం లేదని నోట్ఫైళ్ల సాక్షిగా తేటతెల్లమైంది. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని, గుట్టు చప్పుడు కాకుండా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని నిరూపించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నాడు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్కు తెలియకుండా అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8 శాతం ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీ, బార్లపై ఉన్న 9 శాతం ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీని తొలగిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ఖజానాకు రూ.1,299.64 కోట్ల మేర గండి కొట్టారు. ఈమేరకు సంబంధిత నోట్ ఫైళ్లపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేసినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఖజానాకు తూట్లు పొడిచి సన్నిహితులు, బినామీలకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సాగించిన మద్యం కుంభకోణం ఇలా సాగింది!! ఆర్థిక శాఖ అనుమతి లేదు... కేబినెట్ ఆమోదం లేదు అధికారంలో ఉండగా మద్యం విధానం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడింది. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించింది. కనీసం ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే కథ నడిపించింది. రెండు జీవోలకు కేబినెట్ తీర్మానం చేసి ప్రివిలేజ్ ఫీజు తొలగించే కీలకమైన జీవోను మాత్రం అడ్డదారిలో తేవడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్ను ప్రభుత్వానికి పంపారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని అందులో ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ దృష్టికే తీసుకెళ్లలేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేయగా ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు (ఏ 4 షాపులు) ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ఓ నోట్ పంపారు. మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని అందులో సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈమేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసని తేలిపోతోంది. సాయంత్రం గుట్టుగా జీవో చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ అదే రోజు అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. ఈ జీవో గురించి కేబినెట్లో చర్చించలేదు. అజెండాలో ఆ అంశమే చేర్చలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియచేయలేదు. అనుమతి తీసుకోలేదు. అంటే కేబినెట్కు తెలియకుండా, కనీసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కథ నడిపించాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. బార్లలోనూ అదే బరితెగింపు... మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు అంతటితో ఆగలేదు. తన సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అదే రీతిలో లబ్ధి చేకూర్చారు. ఈమేరకు చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని, అందుకోసం ఎకైŠస్జ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న ఓ సర్కుల్యర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కనికట్టు చేశారు. 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు ఈమేరకు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపడం గమనార్హం. సెప్టెంబరు 9న వినతి పత్రం సమర్పిస్తే దానికి వారం రోజులు ముందుగానే సెప్టెంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యూలర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయించారు. బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. నాటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపారు. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ అసలు ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయం చంద్రబాబుకు కనీసం తెలియదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు రామోజీరావు బుకాయించారు. తీవ్రంగా తప్పుబట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ టీడీపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడాన్ని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఈమేరకు తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. -
ప్రివిలేజ్ ఫీజు తొలగింపుతో టీడీపీ నేతలు లబ్ధి పొందారు
సాక్షి, అమరావతి: మద్యం ప్రివిలేజ్ ఫీజు రద్దు వల్ల టీడీపీ నేతలు పైనుంచి కింది వరకు లబ్ధి పొందారని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు. అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వారి పార్టీ నేతలకు, కావాల్సిన వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చారనేందుకు ఆధారాలున్నాయని తెలిపారు. డబ్బు లావాదేవీల వ్యవహారాలు తదుపరి దర్యాప్తులో బయటకు వస్తాయన్నారు. ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయన డిస్టిలరీకి లబ్ధి చేకూర్చారని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు కొల్లు రవీంద్ర దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గురువారం మరోసారి విచారణ జరిపారు. ఏజీ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగింపు నోట్ ఫైల్ను సిద్ధం చేశారని, దీనికి అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆమోదముద్ర వేశారని తెలిపారు. దీనివల్ల ఖజానాకు రూ.1,299 కోట్ల మేర నష్టం కలిగిందన్నారు. ఈ నష్టాన్ని కాగ్ సైతం ధ్రువీకరించిందని చెప్పారు. ఫైల్ను ఆర్థిక శాఖకు పంపలేదని, మంత్రి మండలిలో, అసెంబ్లీలో చర్చించలేదని తెలిపారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు పూర్తిగా రాజకీయ నిర్ణయమని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు తదితరులకు పీసీ యాక్ట్లోని సెక్షన్ 17ఏ వర్తించదన్నారు. 2018 జూలైకి ముందు నేరం జరిగినందున గవర్నర్ అనుమతి అవసరం లేదన్నారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని, దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ దశలో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ముందుకెళ్లదన్నారు. అంతేకాక 31–10–23న పిటిషనర్లపై సీఐడీ కేసు నమోదు చేసిందని, ఆ వెంటనే వారిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారన్నారు. దర్యాప్తును కొనసాగనివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అనంతరం చంద్రబాబు, రవీంద్రల తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు తొలగింపు ఫైల్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరనేలేదన్నారు. అప్పటి ఎక్సైజ్ మంత్రి, కమిషనర్ స్థాయిలోనే నిర్ణయం జరిగిందని తెలిపారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో జరిగిన పొరపాట్లను క్రిమినల్ చర్యలుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రాతపూర్వక వాదనలను సమర్పించిన తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయనుంది. -
అస్మదీయులకు అడ్డగోలుగా..
-
నేడు ఏపీ హైకోర్టులో లిక్కర్ స్కాం కేసు విచారణ
-
అందరిలో ఒకరిగా ఉండటానికే చీర కట్టు : ఎమ్మెల్సీ కవిత
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వార్తా సంస్థతో తన పర్సనల్, పొలిటికల్ లైఫ్కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు ప్రతిసారి చీరనే ఎందుకు ధరిస్తారన్న ప్రశ్నకు కవిత క్లారిటీ ఇచ్చారు. ‘పొలిటీషియన్గా ఉన్న నేను ఒక పద్ధతి ప్రకారం దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు నన్ను తమలో ఒకరిగా భావించాలంటే వారిలాగే నేనూ ఉండాల్సి ఉంటుంది. అప్పుడే వారు నన్ను కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. డిఫరెంట్ స్టైల్లో నా డ్రెస్సింగ్ ఉంటే వారు నా వద్దకు ఎందుకు వస్తారు’ అని కవిత సమాధానమిచ్చారు. ఇక లిక్కర్ స్కామ్లో విచారణ గురించి అడగ్గా ‘మాది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. దర్యాప్తు సంస్థలు నాకు సమన్లు పంపించినపుడు మా ఇంట్లో వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. ఒక కుటుంబ సభ్యురాలు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు వారికి చాలా కష్టంగా ఉంటుంది’ అని కవిత చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనకు ఇష్టమైన పొలిటీషియన్లని వారి నుంచి నేర్చుకొని రాజకీయ నేతగా ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఇదీ చదవండి..అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం -
జైలు నుంచి ఇంటికి సిసోడియా..అనుమతిచ్చిన కోర్టు
ఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం జైలు నుంచి బయటికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకుగాను మధుర రోడ్లోని తన నివాసానికి వెళ్లారు. భార్యను చూసేందుకు కోర్టు సిసోడియాకు 6 గంటల పాటు ప్రత్యేక అనుమతిచ్చింది. అయితే ఈ ఆరు గంటల్లో మీడియాతో మాట్లాడవద్దని, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేయరాదని షరతు విధించింది. సిసోడియా భార్య మల్టీపుల్ స్క్లిరోసిస్తో బాధపడుతున్నారు. జూన్లో కూడా సిసోడియా తన భార్యను చూసేందుకు కోర్టు అనుమతితో జైలు నుంచి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో సిసోడియా భార్యను చూడకుండానే జైలుకు వెనుదిరిగారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి తీహార్ జైలులోనే రిమాండ్లో ఉంటున్నారు. ఆయన బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు రిజెక్ట్ చేశాయి. -
వర్క్ ఫ్రమ్ జైల్ చేయండి: కేజ్రీవాల్తో ఆప్ ఎమ్మెల్యేలు!
న్యూ ఢిల్లీ : ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొనున్నారు. ఒకవేళ ఆయన గనుక అరెస్ట్ చేస్తే సీఎంగా వర్క్ ఫ్రమ్ జైల్ (జైలు నుంచే పని) చేస్తారని ఢిల్లీ మంత్రి ఆతిషి చెబుతున్నారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు ఈడీ సమన్ల నేపథ్యంలో కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, ఇందుకే మీరు జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయవద్దని ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ను కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ అరెస్ట్ అయితే పదవికి రాజీనామా చేయొద్దని.. జైలు నుంచే సీఎంగా పని చేయాలని కేజ్రీవాల్ మీటింగ్లో విజ్ఞప్తి చేసినట్లు ఆతిషి వెల్లడించారు. జైలులోనే కేబినెట్ మీటింగ్ పెట్టుకునేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకుంటామని చెప్పారు. లిక్కర్ స్కామ్లో ప్రశ్నించేందుకుగాను ఈ నెల 2న తమ ముందు హాజరవ్వాలని కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ విచారణకు కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియా తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చింది టిడిపి ప్రభుత్వమేనని మరోసారి స్పష్టం చేసిన మంత్రి
-
లిక్కర్ స్కాంలో నవంబర్ 28 తర్వాత బాబు అరెస్ట్...
-
టీడీపీ అడ్డగోలు మద్యం వ్యవహారంపై మరో కేసు
-
చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ
-
Oct 31st 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions, Court Hearings And Political Updates 07:05 PM, అక్టోబర్ 31, 2023 52 రోజుల ప్రస్థానం ఇది - టైంలైన్ ►రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు ►సెప్టెంబరు 9న స్కిల్ స్కాంలో అరెస్టు, అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ ►రిమాండ్ ఖైదీగా సెప్టెంబరు పది అర్ధరాత్రి ఒంటిగంటన్నరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు ►జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా స్నేహా బ్లాక్ కేటాయింపు ►కోర్టు ఆదేశాల మేరకు ప్రతి రోజూ భోజనం, మందులు ఇంటినుంచే అందించే వెసులు బాటు ►సెప్టెంబరు 22 వరకు రిమాండ్, రెండురోజులపాటు సీఐడీ కస్టడీ విచారణ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు సీఐడీ అధికారులు విచారణ, తెలియదు, గుర్తులేదు అన్న చంద్రబాబు ►జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచిఉందని పచ్చమీడియా విపరీతమైన ప్రచారం ►సెప్టెంబరు 24న మరోసారి చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు, అక్టోబరు ఐదువరకూ రిమాండ్ కొనసాగింపు ►చంద్రబాబుకు చర్మ వ్యాధి ఉందంటూ పచ్చమీడియా విపరీత ప్రచారం, ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు ►కోర్టు ఆదేశాలమేరకు చంద్రబాబుకు టవర్ ఏసీ ఏర్పాటు ►చంద్రబాబుకు రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు ►ఒక వైద్య పరీక్షలో ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు ►చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు, అక్టోబరు 5నుండి 19వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు ►వారానికి రెండుసార్లు చంద్రబాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి, లోకేష్ ,బ్రాహ్మణి ►చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం, ఐదు కిలోలు బరువు తగ్గారంటూ ఆందోళన ►చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినపుడు 66 కిలోలు ఉండేవారని, ఇపుడు 67 కిలోలు ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు ►విడుదల సమయానికి మరో అరకిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నచంద్రబాబు ►అక్టోబరు 19 నుండి నవంబరు ఒకటి వరకూ చంద్రబాబు జ్యుడిషియర్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తన కుడికంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయాలని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు ►జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు 06:45 PM, అక్టోబర్ 31, 2023 రాజమండ్రిలో టిడిపి అతితో గందరగోళం ►రెండు గంటలయినా రాజమండ్రి దాటని చంద్రబాబు కాన్వాయ్ ►దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు కాన్వాయ్ ►భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు ►టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోటెత్తడంతో రాజమండ్రి అస్తవ్యస్తం ►చంద్రబాబు కాన్వాయ్కు పోటీగా వందలాది వాహనాలను తీసుకొచ్చిన టీడీపీ నేతలు ►వందలాది వాహనాలు రావడంతో స్తంభించిపోయిన రాజమండ్రి ►తెలుగుదేశం ప్రైవేట్ వాహనాల రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ ►దివాన్ చెరువు వద్ద వాహనాలను నిలపడానికి పోలీసుల ప్రయత్నం ►పోలీసుల ఆదేశాలను ధిక్కరించి ట్రాఫిక్కు అడ్డు తగులుతోన్న టిడిపి కార్యకర్తలు ►వేమగిరి,రావులపాలెం,పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్,గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు 06:20 PM, అక్టోబర్ 31, 2023 బాబు లాయర్ల పిటిషన్ కొట్టివేత ►చంద్రబాబు లాయర్ల పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు ►సీఐడీ అధికారుల కాల్డేటా స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►సీఐడీ తరపున వివేకానంద వాదనలు ►చంద్రబాబు తరపున దమ్మాలపాటి వాదనలు ►ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ►పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 05:49 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ సరే, నిజం గెలవాలి సంగతేంటీ? : మంత్రి కొట్టు సత్యనారాయణ ►విజయవాడలో మాట్లాడిన డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ పిసి ►చంద్రబాబుకు మధ్యంతర బెయిలు వచ్చింది కాబట్టి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటారా? ►టీడీపీ జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది...అలాంటి పార్టీ తెలంగాణాలో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం ఏమిటి? ►తెలంగాణాలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తేలిపోయినట్టేనా? ►సైబర్ సిటినీ తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబు తెలంగాణా ఎన్నికల్లో ఎందుకు చేతులెత్తేసారు? ►ఏపీలోనూ సొంతంగా పోటీ చేసే సత్తా లేక జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జాతీయ పార్టీగా అని ఎలా చెప్పుకుటుంది? ►ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు ఎంతవరకూ నిలబడుతుందని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.! ►మేముంటేనే మీరని జనసేన-టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.! ►చంద్రబాబును జైల్లో పెడితే రోడ్డుపై పడుకుని పవన్ కల్యాణ్ నానా విన్యాసాలు చేశారు 05:42 PM, అక్టోబర్ 31, 2023 షరతులు బేఖాతరు ►తూర్పుగోదావరి జిల్లా : మధ్యంతర బైలుకు సంబంధించి హైకోర్టు విధించిన షరతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ►జైలు బయటికి వచ్చిన వెంటనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ►నిబంధనలకు విరుద్ధంగా జైలు గేటు వరకు బారికెడ్లను తోసుకొంటూ వచ్చిన టిడిపి కార్యకర్తలు ►ర్యాలీగా రాకూడదని హైకోర్టు అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోకుండా జైలు బయట గేటు వద్ద నుండి కార్యకర్తల సమూహంతో రోడ్డుపైకి వచ్చిన చంద్రబాబు ►రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే రూటును బ్లాక్ చేసిన టిడిపి కార్యకర్తలు 04:40 PM, అక్టోబర్ 31, 2023 బయటకు రాగానే మైక్ అందుకున్న బాబు ►హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కేసిన చంద్రబాబు ►రాజకీయ ర్యాలీలు చేయొద్దని స్పష్టంగా చెప్పిన హైకోర్టు ►ర్యాలీల్లో ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు చెప్పినా.. పట్టించుకోని చంద్రబాబు ►తనకు సంఘీభావం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు ►ప్రత్యేకంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు : చంద్రబాబు 04:30 PM, అక్టోబర్ 31, 2023 కాసేపట్లో బెజవాడకు బాబు ►కాసేపట్లో విజయవాడకు బయల్దేరనున్న చంద్రబాబు ►రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లనున్న చంద్రబాబు ►రేపు సాయంత్రం తిరుమలకు వెళ్లాలని నిర్ణయం ►ఎల్లుండి ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్న చంద్రబాబు ►అనంతరం హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకోవాలని చంద్రబాబు యోచన 04:15 PM, అక్టోబర్ 31, 2023 జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల ►జైలు గేటు వద్ద తెలుగుదేశం నేతల కేకలు, అరుపులు ►జైలు ముందు చంద్రబాబు కోసం కుటుంబసభ్యులు, టిడిపి నేతలు ►చంద్రబాబును కలిసేందుకు నాయకుల పోటాపోటీ ►టిడిపి జెండాలు, ఫ్లెక్సీలతో జైలు ప్రాంగణాన్ని నింపేసిన టిడిపి నేతలు ►అందరిని పక్కకు జరిపి చంద్రబాబును అలింగనం చేసుకున్న అచ్చెన్నాయుడు 04:13 PM, అక్టోబర్ 31, 2023 తెలుగుదేశం నేతల ఓవరాక్షన్తో చంద్రబాబుకు మరిన్ని ఆంక్షలు ►రేపటి దాకా చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ►ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు ►రేపటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దు : హైకోర్టు ఆదేశాలు 04:03 PM, అక్టోబర్ 31, 2023 జైలుకు చంద్రబాబు కాన్వాయ్ ►రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్ ►జైలు లోపలికి వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ ►కాసేపట్లో విడుదల కానున్న చంద్రబాబు ►సెంట్రల్ జైలు దగ్గర భారీ స్థాయిలో మోహరించిన టీడీపీ శ్రేణులు ►చంద్రబాబును చూసేందుకు భారీగా రావాలని కార్యకర్తలకు టీడీపీ పిలుపు ►పలు చోట్ల వాహనాలను ఏర్పాటు చేసి మరీ జనాలను తెస్తోన్న టీడీపీ 04:00 PM, అక్టోబర్ 31, 2023 జైలులో జరుగుతున్న బెయిల్ ప్రక్రియ ►రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►చంద్రబాబును కలిసిన లోకేష్, బ్రాహ్మణి ►విజయవాడ వరకు ఎలా వెళ్దాం? ఏం చేద్దాం? ►బయటకు తీసుకొచ్చే విషయంపై చర్చలు ►బాబు బెయిల్ కాపీలను తీసుకుని లోనికి వెళ్లిన లాయర్లు ►జైల్లో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్న లాయర్లు 03:55 PM, అక్టోబర్ 31, 2023 జైలు వద్ద భారీగా మోహరించిన తెలుగుదేశం కార్యకర్తలు ► రాజమండ్రి జైలు వద్ద నెలకొన్న పరిస్థితిపై పోలీసులు సీరియస్ ► రాజకీయాలకు జైలును అడ్డా ఎలా చేస్తారని ఆగ్రహం ► రాజమండ్రి జైలు చుట్టూ భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ► జాతీయ రహదారి లాలాచెరువు నుంచి సెంట్రల్ జైలు వరకు రహదారిని మూసివేత ► జైలు వద్ద ఏ ఒక్కరు అతి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం ► శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోబోమంటున్న అధికారులు 03:45 PM, అక్టోబర్ 31, 2023 టిడిపి తీరే అంత.! తొలి రోజే నిబంధనలు ఉల్లంఘిస్తారా? ► రాజమండ్రి జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న తెలుగుదేశం శ్రేణులు ► చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు ► చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దృష్ట్యా తెలుగుదేశం కొత్త వ్యూహం ► రాజమండ్రికి భారీగా కార్యకర్తలను తరలిస్తోన్న తెలుగుదేశం నేతలు ► ప్రతీ నియోజకవర్గం నుంచి ఇంత మంది అంటూ లెక్కలేసుకొని మరీ తరలింపు ► రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ర్యాలీ చేయాలని ప్రణాళిక ► ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ► బెయిల్ ఊరేగింపు అడ్డు పెట్టుకుని ఏం చేయబోతున్నారు? 03:15 PM, అక్టోబర్ 31, 2023 నిబంధనలను పెంచండి : CID పిటిషన్ ► ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు మధ్యంతర బెయిల్లో మరో 5 నిబంధనలు చేర్చాలని పిటిషన్ 1. రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టొద్దు, 2. మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు 3. కేవలం వైద్యం కోసమే బెయిల్ను ఉపయోగించాలి 4. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడొద్దు 5. ఇద్దరు DSP స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలి ఈ ఐదు షరతులు చేర్చాలని కోరుతూ సీఐడీ పిటిషన్ 03:10 PM, అక్టోబర్ 31, 2023 బాబు జెడ్ ప్లస్కు ఏర్పాట్లు ► రాజమండ్రి జైలు నుంచి కరకట్ట నివాసం దాకా భద్రత ►రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి విజయవాడ కరకట్ట నివాసానికి వచ్చేందుకు ఏర్పాట్లు 03:01 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులోనూ చంద్రబాబుకు ఊరట ►మద్యం కేసులోనూ చంద్రబాబుకు హైకోర్టులో ఊరట ►చంద్రబాబును అరెస్ట్ చేయబోమని తెలిపిన ఏజీ ►హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని కోర్టుకు తెలిపిన ఏజీ ►అడ్వకేట్ జనరల్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు ►విచారణ నవంబర్ 21కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 03:00 PM, అక్టోబర్ 31, 2023 జైలుకు చేరిన రిలీజ్ ఆర్డర్ ►రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ ►కండిషన్స్ ను చంద్రబాబుకు చదివి వినిపించనున్న జైలు సూపరింటెండెంట్ ►కాసేపట్లో జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు 03:00 PM, అక్టోబర్ 31, 2023 రిలీజ్ ఆర్డర్ తీసుకున్న TDP నేతలు ►విజయవాడ : ACB కోర్టు దగ్గర బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో ఏసీబీ కోర్టుకు ష్యూర్టీలు సమర్పించాం ►వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చాం ►చంద్రబాబు రిలీజ్ ఆర్డర్లను జైలు అధికారులకు కోర్టు మెయిల్ చేశారు ►పర్సనల్ ఆర్డర్ కూడా మేం తీసుకున్నాం ►రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా హైకోర్టు బెయిల్ ఆర్డర్, ఏసీబీ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందాయి ►సుప్రీం కోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్పై నిర్ణయం రావాల్సి ఉంది ►మరో గంటన్నరలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావొచ్చు 02:50 PM, అక్టోబర్ 31, 2023 రిలీజ్ ఆర్డర్ ఇది ►చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ACB కోర్టు రిలీజ్ ఆర్డర్ ►CrPL No.7951/2023 ప్రకారం చంద్రబాబును విడుదల చేయాలని ఉత్తర్వులు ►ప్రస్తుతం రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691గా ఉన్న చంద్రబాబు 02:30 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులోనూ బెయిలివ్వండి : చంద్రబాబు లాయర్లు ►హైకోర్టులో చంద్రబాబు లాయర్ల లంచ్ మోషన్ పిటిషన్ ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ ►మద్యం కేసులో చంద్రబాబు ఏ3 02:30 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు వచ్చింది కండీషనల్ బెయిలే : సజ్జల ►కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు చంద్రబాబుకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది ►టీడీపీ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదు ►స్కిల్ కేసులో షెల్ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా? ►వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తే చంద్రబాబు బయటకు వస్తారా? ►చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలి ►స్కిల్ కేసులో రూ.240 కోట్లు దారి మళ్లాయి ►రాజమండ్రి నుంచి రోడ్ షో చేస్తామంటున్నారు ►రోడ్ షోతో జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ►లయన్ ఈజ్ బ్యాక్ అని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది ►చంద్రబాబు ఏమైనా వీర యోధుడా? ►చంద్రబాబు ఇంతకాలం వ్యవస్థల్ని మ్యానేజ్ చేశారు ►చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంటే విజయయాత్ర ఎందుకు? ►చంద్రబాబు విషయంలో ప్రభుత్వానికి కక్షసాధింపు లేదు ►చంద్రబాబు బయట ఉంటేనే పొలిటికల్ ఫైట్ నడుస్తుంది ►నిజం గెలిచిందని ఉపన్యాసాలు చేస్తుంటే జనం ఏమనుకుంటారు? 01:43 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ ప్రాసెస్ ఎక్కడివరకు వచ్చిందంటే.? ►విజయవాడ : ఎసిబి కోర్టులో హైకోర్టు ఇచ్చిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీని అందజేసిన చంద్రబాబు న్యాయవాదులు ►ACB కోర్టుకు ష్యూరిటీలు సమర్పించిన టిడిపి నేతలు దేవినేని ఉమ, బోండా ఉమ ►చెరో రూ. లక్ష పూచీకత్తు సమర్పించిన టీడీపీ నేతలు ►మధ్యంతర బెయిల్ ఆర్డరుతో పాటు అఫిడవిట్లని ఏసీబీ కోర్టుకు సమర్పించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►తదుపరి ఆదేశాలను రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా పంపుతామన్న ఏసీబీ కోర్టు ►ప్రొసీజర్ అంతా పూర్తయితే ఈ సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం 01:35 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ వచ్చినా ఆగని ములాఖత్లు ►రాజమండ్రి జైల్లో మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబుతో నారా లోకేశ్ ములాఖత్ ►లోకేశ్తో పాటు చంద్రబాబును కలవనున్న బ్రాహ్మణి ►జైల్లో చంద్రబాబును కలవనున్నతెలుగుదేశం ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి 01:25 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ షరతులతో మాత్రమే : వెల్లంపల్లి ►కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నందునే ►ప్రపంచంలో ఉన్న రోగాలన్ని చంద్రబాబుకు ఉన్నట్టు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు ►చంద్రబాబుకు ఇచ్చింది కండీషన్డ్ బెయిల్ మాత్రమే.. ►తిరిగి చంద్రబాబు మరలా జైలుకు వెళ్లాల్సిందే ►చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు ►అనారోగ్య కారణాలతో చంద్రబాబు కు మద్యంతర బెయిల్ వచ్చింది చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు ►కాసాని జ్ఞానేశ్వర్ ను ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి మోసం చేసారు ►కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు ►బిసిలను మరోసారి చంద్రబాబు మోసం చేశాడు ►తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా జెండా పీకేసిన వ్యక్తి చంద్రబాబు ►2024 లో ఏపిలోనూ టిడిపి జెండా పీకేస్తారు ►పవన్ టీడీపీతో కలిసినా ప్రయోజనం లేదు తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్టు ►విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చుకదా.. ఎందుకు వెళ్ళలేదు..? ►లోకేష్ అసమర్ధుడని వాళ్ళ క్యాడర్ భావిస్తుంది ►ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరికి చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉంది ►బిజెపి అధ్యక్షురాలిగా టిడిపి కి స్పోక్ పర్సన్ పురందేశ్వరి కొనసాగుతున్నారు ►అమిత్ షా వద్దకు లోకేష్ ను పురందేశ్వరి తీసుకెళ్లలేదా ►చంద్రబాబు ను కాపాడడానికి పురందేశ్వరి కంకణం కట్టుకున్నారు ►చంద్రబాబును జైలు నుంచి తేవాలన్నదే పురందేశ్వరి లక్ష్యం 01:15 PM, అక్టోబర్ 31, 2023 నిజం గెలవాలి యాత్ర అబద్ధమేనా? ►చంద్రబాబు విడుదలతో మారిన తెలుగుదేశం వ్యూహం ►నిజం గెలవాలి యాత్రను నిలిపివేసే యోచనలో భువనేశ్వరీ ►చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉంది: నారా భువనేశ్వరి ►నిజం గెలవాలి యాత్ర పై ఇంకా ఆలోచించలేదు : నారా భువనేశ్వరి 01:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబు బెయిల్ అనగానే పవన్ కళ్యాణ్లో తెగ ఉత్సాహం ►యూరప్ నుంచే ప్రెస్ నోట్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు విడుదల కోసం ఎదురుచూస్తున్నామన్న పవన్ శ్రీ @ncbn గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Hd1xjBsOCS — JanaSena Party (@JanaSenaParty) October 31, 2023 12:55 PM, అక్టోబర్ 31, 2023 విడుదల ఎప్పుడంటే..! ►ACB కోర్టు ద్వారా జైలుకు అందనున్న హైకోర్టు ఉత్తర్వులు ►జైలు అధికారులకు కోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత ప్రారంభం కానున్న ప్రొసీడింగ్స్ ►చంద్రబాబు NSG సెక్యూరిటీ పరిధిలో ఉండడంతో SPకి సమాచారం ఇవ్వనున్న జైలు అధికారులు 12:45 PM, అక్టోబర్ 31, 2023 నవంబర్ 28న మళ్లీ జైలుకు ►చంద్రబాబు బెయిల్ గడువు నవంబర్ 28 వరకు ►నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాయంత్రం 5గంటల్లోగా సరెండర్ కావాలి 12:40 PM, అక్టోబర్ 31, 2023 ష్యూరిటీలు సమర్పించిన బొండా, దేవినేని ►చంద్రబాబు బెయిల్ కోసం బొండా, దేవినేని ష్యూరిటీలు విజయవాడ కోర్టులో షూరిటీ సమర్పించిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు 12:32 PM, అక్టోబర్ 31, 2023 జైలు నుంచి చంద్రబాబు ఎక్కడికంటే.? ► సాయంత్రం రాజమండ్రి నుంచి అమరావతికి చంద్రబాబు ► రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన అమరావతికి చంద్రబాబు ► అమరావతి నుంచి రేపు లేదా ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ► తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత హైదరబాద్ కు చంద్రబాబు ► ఆ తర్వాత హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స ► హైదరాబాద్లోనే స్కిన్ డాక్టర్తో ట్రీట్మెంట్ 12:28 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ ఇచ్చింది ఎందుకంటే.. : మంత్రి అంబటి ►చంద్రబాబు బెయిల్ పై అంబటి రాంబాబు స్పందన ►కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు ►స్కిల్ స్కాంలో చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారు ►కంటి ఆపరేషన్ చేయించుకొన్న తర్వాత జైలుకు రావాల్సిందే ►కేసు దర్యాప్తు కొనసాగుతోంది ►రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదు ►తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు ►ఇతర పార్టీ కోసం పార్టీని తాకట్టుపెట్టడం అనైతికం ►కాసాని జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది ►చంద్రబాబును నమ్ముకున్న ఎవరికైనా వెన్నుపోటు తప్పదు 12:20 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులో బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ ►మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారన్న సీఐడీ అధికారుల కేసు పై హౌస్ మోషన్ పిటిషన్ ►పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు 12:15 PM, అక్టోబర్ 31, 2023 తొలిరోజే షరతుల ఉల్లంఘనకు ప్రణాళిక ►రాజమండ్రి చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి ►కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్ ►బెయిల్ రావడంతో సాయంత్రం 4గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ►ఎయిర్ పోర్టు వరకు భారీ ర్యాలీకి టీడీపీ ఏర్పాట్లు ►హైకోర్టు సూచించినా.. దానికి విరుద్ధంగా ర్యాలీకి ఏర్పాట్లు చేస్తోన్న టిడిపి 12:10 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్ కేవలం అనారోగ్య కారణాల వల్లే ►కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు ►నవంబర్ 28, 2023 మంగళవారం రోజున సా.5 గంటలకు సరెండర్ కావాలని ఆదేశం ►నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామన్న కోర్టు ►ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదన్న కోర్టు ►మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న కోర్టు 12:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్లో షరతులు ఇవే ►చంద్రబాబుకు ఐదు షరతులతో మధ్యంతర బెయిల్ 1. రూ.లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరి షూరిటీలు సమర్పించాలి 2. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవచ్చు 3. చికిత్స, ఆస్పత్రి వివరాలు సరెండర్ సమయంలో సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు సమర్పించాలి 4. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు 5. నవంబర్ 28, 2023 సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి సరెండర్ కావాలి 12:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్కు ష్యూరిటీలు వీళ్లే ►హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు ఇవ్వనున్న ఇద్దరు ►రూ.లక్ష బాండ్, 2 ష్యూరిటీలను ఇవ్వనున్న బోండా ఉమ, దేవినేని ఉమ ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న బోండా ఉమ, దేవినేని ఉమ 12:00 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్ ►ఐదు షరతులతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ►సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ►హైకోర్టు ఉత్తర్వులు ఏసీబీ కోర్టు ద్వారా రాజమండ్రి జైలుకు ►బెయిల్ కాపీతో రాజమండ్రి జైలుకు రానున్న చంద్రబాబు లాయర్లు ►ప్రొసీడింగ్స్ పూర్తైన తర్వాత ఎస్పీకి సమాచారమివ్వనున్న జైలు అధికారులు ►జైలు దగ్గరికి రానున్న జిల్లా పోలీసులతోపాటు NSG బృందం ►ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు 11:45 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్పై పురందేశ్వరీ స్పందన ►చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం ►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచి పరిణామం : పురంధేశ్వరి 11:38 AM, అక్టోబర్ 31, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని.. సీఐడీ అధికారుల కేసుపై లంచ్ మోషన్ పిటిషన్ ►సీఐడీ నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన హైకోర్టు ►మధ్యాహ్నాం 2గం.15కి పిటిషన్ను విచారించనున్న హైకోర్టు ►టీడీపీ అడ్డగోలు మద్యం వ్యవహారాలపై కేసు ►తన హయాంలో కావాల్సిన కంపెనీలకు దోచిపెట్టిన చంద్రబాబు ►కావాల్సిన డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులు ►క్విడ్ప్రోకోలో భాగంగా ఎక్సైజ్ పాలసీనే మార్చేసిన నాటి ప్రభుత్వం ►రెండు బేవరేజ్లు, మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు ►ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం ►ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్.. అనుమతించిన న్యాయస్థానం ►ఏ–1గా ఐఎస్ నరేష్, ఏ–2గా కొల్లు రవీంద్ర, ఏ–3గా చంద్రబాబు 11:12 AM, అక్టోబర్ 31, 2023 స్కిల్డ్ దొంగ చంద్రబాబే! ►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు ►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి ►2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం ►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం ►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్టెక్ సంస్థలు ఒప్పందం ►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం ►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ►ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ►ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్తో కొనసాగుతున్న చంద్రబాబు ►తాజాగా.. ఇవాళ నాలుగువారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు 11:12 AM, అక్టోబర్ 31, 2023 బాబు బెయిల్పై అంబటి సెటైర్ ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ►కంటి శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని కోర్టు హెచ్చరిక ►నిజం గెలిచి కాదు.. చంద్రబాబుకి కళ్లు కనిపించట్లేదని కోర్టు బెయిల్ ఇచ్చిందన్న అంబటి ►ఎక్స్లో బాబు బెయిల్పై అంబటి సెటైర్ నిజం గెలిచి కాదు బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్! — Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023 11:01 AM, అక్టోబర్ 31, 2023 నవంబర్ 10న చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►నవంబర్ 10వ తేదీన వాదనలు వింటామన్న ఏపీ హైకోర్టు ►మధ్యంతర బెయిల్ పిటిషన్పై కాసేపటి కిందట తీర్పు ►నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు ►కంటి సర్జరీ కోసమే బెయిల్ ఇచ్చినట్లు వెల్లడి ►చంద్రబాబుకు కోర్టు పలు షరతులు ►రాజకీయ, మీడియా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు ►కేవలం ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి ►నవంబర్ 24వ తేదీ సాయంత్రం సరెండర్ కావాలి ►కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు ►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక 10:39 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు ►స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు ►నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీల్ని సమర్పించాలని ఆదేశం ►నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ ►కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ►షరతులు ఉల్లంఘిస్తే మరుక్షణమే బెయిల్ రద్దవుతుందని హెచ్చరిక 10:15 AM, అక్టోబర్ 31, 2023 కాసేపట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు ►స్కిల్ స్కామ్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై కాసేపట్లో తీర్పు ►కంటికి శస్త్రచికిత్స అవసరం అంటూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►ఇప్పటికిప్పుడు శస్త్రచికిత్స అవసరం లేదని సీఐడీ తరపు లాయర్ల వాదన ►ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్లు ►చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికలు కోర్టుకు సమర్పించిన సీఐడీ ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, పైగా బరువు పెరిగారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సీఐడీ లాయర్లు 09:52 AM, అక్టోబర్ 31, 2023 సీడీఆర్ పిటిషన్ తీర్పు నేడు ►సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు కేస్ అప్ డేట్ ►సీఐడీ అధికారుల కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డ్ ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఉందంటూ బాబు లాయర్ల వాదన ►ఇతర వ్యక్తుల డైరెక్షన్లోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వాదన ►కాల్ డేటా పిటిషన్ అసలు విచారణ అర్హత లేదని వాదించిన సీఐడీ తరపు న్యాయవాదులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలుగుతుందన్న సీఐడీ లాయర్లు ►అరెస్ట్లో ఎవరి ప్రమేయం లేదని సీఐడీ లాయర్ల వాదన ►వాదనలు పూర్తి.. నేడు తీర్పు వెల్లడించనున్న ఏసీబీ జడ్జి 09:22 AM, అక్టోబర్ 31, 2023 ఇంటి భోజనంతో బరువు పెరిగిన చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►బాబు ఆరోగ్యంపై ప్రతిరోజూ హెల్త్ బులెటిన్ విడుదల ►మరోవైపు చంద్రబాబు ఆరోగ్యాన్ని సాకుగా చూపించి మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు న్యాయవాదులు ►హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ వెలువడనున్న తీర్పు ►చంద్రబాబుకు రోజూ ఇంటి భోజనం ►జైల్లో చంద్రబాబు బరువు పెరిగారని స్పష్టం చేసిన అధికారులు ►జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం 67.5 కిలోలు ఉన్నారని వెల్లడి ►చంద్రబాబు కుడి కంటి క్యాటరాక్ట్ సర్జరీ అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►ప్రస్తుతం ఇమ్మెచ్యూర్డ్ కాటరాక్ట్ ఉందని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన రిపోర్టును సమర్పించిన జైలు అధికారులు 08:45 AM, అక్టోబర్ 31, 2023 లోకేష్ బేబీని వదలని ఆర్జీవీ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ అండ్ కోను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న దర్శకుడు రాం గోపాల్ వర్మ ►తాజాగా నారా లోకేష్ను బేబీ అంటూ టీజింగ్ ►సీఎం జగన్పై నారా లోకేష్ ఎక్స్లో అడ్డగోలు వ్యాఖ్యలు ► గుడ్ నైట్ బేబీ అంటూ సింపుల్గా లోకేష్కు రిప్లై ఇచ్చిన ఆర్జీవీ 08:32 AM, అక్టోబర్ 31, 2023 నారా వారి లిక్కరు స్కామ్ ►చంద్రబాబుపై లిక్కర్ స్కామ్ కేసు నమోదు చేసిన సీఐడీ ►గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపనల నేపథ్యంలో కేసు నమోదు ►ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు ►ఐపీసీ సెక్షన్ 166,167,409,120(B), రెడ్ విత్ 34 మరియు సెక్షన్ 13(1)(d) రెడ్ విత్ 13(2) పిసి యాక్ట్, 1968 గా కేసు నమోదు ►కేసులో A-3 గా చంద్రబాబును చేర్చిన సీఐడీ అధికారులు ►చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు మెమో రూపంలో తెలిపిన సీఐడీ అధికారులు ►మద్యం షాపులు, మద్యం కంపెనీల కు అక్రమ దారుల్లో లబ్ది చేకూర్చిన చంద్రబాబు ప్రభుత్వం ►మద్యం షాపులు (a4) ప్రివిలైజ్ ఫీజు తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రతి ఏటా రూ.1,300 కోట్లు ప్రభుత్వానికి నష్టం ►2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి దాదాపు రూ.2900 కోట్ల ఆదాయం ►తెలంగాణలో ఉన్న ప్రివిలైజ్ ఫీజు.. ఏపీలో తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ►అప్పట్లో లిక్కర్ సిండికేట్ తో కుమ్మక్కై తగ్గించేసిన చంద్రబాబు ప్రభుత్వం ►టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి సంస్థ ఎస్పీ వై ఆగ్రో ఇండస్ట్రీకి లబ్ది చేకూరుస్తూ వడ్డీ తగ్గింపు ►హైకోర్టు ఆదేశాలని అమలు చేయకుండా ఏకపక్షంగా వడ్డీ తగ్గింపు ►కేబినెట్ ఆమోదం లేకుండానే వడ్డీ తగ్గించిన చంద్రబాబు ప్రభుత్వం ►ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత హడావిడిగా లిక్కర్ కంపెనీలకు భారీగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►టీడీపీ నేతల లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►త్రిసభ్య కమిటీ సిఫార్సులు కి విరుద్ధంగా లిక్కర్ కంపెనీలకు అనుమతులు ►మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందిన పీఎంకే డిస్టీలరీస్కి అనుమతి ►మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టీలరీస్కి అనుమతి ►అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►2019 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొన్ని బ్రాండ్ల కు హడావుడిగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►సరఫరా కంపెనీలకు భారీ లబ్ది చేకూర్చేందుకు అనుమతులు ►అన్ని వ్యవహరల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించిన సీఐడీ ►బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన సీఐడీ ►ఈ కేసులో ఏ-1గా అప్పటి ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాస నరేష్, ఏ-2గా మాజీమంత్రి కొల్లు రవీంద్ర, ఏ-3గా చంద్రబాబు నాయుడు ►రెండు బేవరేజ్ లు, మూడు డిస్టిలరీలకి లబ్ది చేకూర్చడానికి క్విడ్ ప్రోకి పాల్పడినట్లు ఆరోపణలు ►2012 లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీని 2015 లో మార్చి అడ్డుకోలుగా ఈ కంపెనీలకి మేలు చేసినట్లు ఆధారాలు 07:57 AM, అక్టోబర్ 31, 2023 స్కిల్ స్కాంలో బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ ► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ పై విచారణ వాయిదా ► విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు ► ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్తో పాటు అనుబంధ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►కంటికి శస్త్రచికిత్స అవసరమని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి ► వాదనలు పూర్తి, ఇవాళ తీర్పు 07:35 AM, అక్టోబర్ 31, 2023 పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►కాసాని జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ►మరి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? ►ట్వీట్తో పవన్కు చురకలంటిన మంత్రి అంబటి రాంబాబు ►టీటీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చంద్రబాబు ఆదేశం ►నారా లోకేష్ కనీసం స్పందించలేదని రాజీనామా లేఖలో కాసాని విమర్శలు జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ! పవన్ ఎప్పుడు పరిపక్వమౌతాడో ?@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 30, 2023 07:13 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ ►పదుల కొద్దీ పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►వరుసగా ఎదురు దెబ్బలు.. ఎక్కడా దక్కని ఊరట ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ ►ఆపై ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు ►తాజాగా వెలుగులోకి మరో అవినీతి బాగోతం ►కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ►మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చినందుకు చంద్రబాబుపై మరో కేసు నమోదు ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►చంద్రబాబుకు లేని రోగాలను అంటగడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు ►తెలంగాణ బరి నుంచి ఓటమి భయంతో తప్పుకున్న తెలుగుదేశం ఇదీ చదవండి: IRR Case.. తోడు దొంగల రింగ్ 06:59 AM, అక్టోబర్ 31, 2023 ఖేల్ ఖతం.. దుకాణం బంద్ ►తెలంగాణలో టీడీపీ బిగ్ షాక్ ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►నారావారి తీరుపై రాజీనామా లేఖలో తీవ్ర అసంతృప్తి వెల్లగక్కిన కాసాని ►తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పకపోతే ఎలా?: కాసాని ►బాలకృష్ణ తెలంగాణలో నేనుంటా అన్నడు.. ఇప్పుడు ఏమైందో తెలియదు ►లోకేశ్ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థంకాదు.. 20సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ►లోకేష్ ఎవరికి దొరకరు ►హైదరాబాద్ లోనే ఉన్నా లోకేష్ పట్టించుకోలేదు ►లోకేష్ ఇక్కడ పెత్తనం ఎందుకు చేస్తున్నారు ►తెలంగాలో పోటీ చేయవద్దని లోకేష్ ఎలా చెబుతారు ? ►ఆంధ్రాలో టీడీపీకి బీజేపీ కావాలట.. తెలంగాణలో వద్దట.. ఇదేం పద్ధతి.. ►పార్టీలో చేరినప్పుడు రామ్మోహన్రావుకు రూ.11 లక్షలు ఇచ్చా.. ►కాంగ్రెస్కు ఓటేయాలని పార్టీలోని కమ్మ వాళ్లు ప్రచారం చేస్తున్నారు 06:43 AM, అక్టోబర్ 31, 2023 మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు ►స్కిల్ స్కామ్లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ పిటిషన్కు అనుబంధ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►చంద్రబాబు కంటి శస్త్రచికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ ►పిటిషన్పై సోమవారం కొనసాగిన విచారణ.. ఇరువైపులా వాదనలు వినిపించిన లాయర్లు ►రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసు అని బాబు తరపు లాయర్ల వాదన ►52 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు.. సీఐడీ దర్యాప్తును సాగదీస్తోంది: బాబు లాయర్లు ►అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలి: బాబు లాయర్లు ►న్యాయస్థానం ఇచ్చిన గత ఆదేశాల మేరకు చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాం: సీఐడీ తరపు లాయర్లు ►పిటిషనర్కు జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం:సీఐడీ తరపు లాయర్లు ►కంటికి శస్త్రచికిత్స తక్షణం అక్కర్లేదు: సీఐడీ తరపు లాయర్లు ►చంద్రబాబుకున్న సాధారణ అనారోగ్య సమస్యలను పెద్దవి చేసి చూపుతున్నారు: సీఐడీ తరపు లాయర్లు ►వైద్య నివేదిక ప్రకారం బరువు విషయంలో పెద్ద తేడా లేదు: సీఐడీ తరపు లాయర్లు ►మధ్యంతర బెయిలు ఇవ్వొద్దు: సీఐడీ తరపు లాయర్లు ►పిటిషన్పై సోమవారం ముగిసిన వాదనలు ►తీర్పు రిజర్వ్.. నేడు వెల్లడించనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:24 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుపై సీఐడీ మరో కేసు ►వెలుగులోకి నారావారి లిక్కర్ స్కామ్ ►చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ► గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ ► అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై కేసు ► మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో A-3 గా చంద్రబాబు ► చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపిన సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు ► పిటిషన్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు ► కేసుకు FIR నంబర్ - 18/2023 కేటాయింపు 06:15 AM, అక్టోబర్ 31, 2023 జైల్లో చంద్రబాబు @52వ రోజు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► రేపటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►స్నేహా బ్లాక్లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు ఇదీ చదవండి: ఫైబర్ నెట్ కుంభకోణం సూత్రధారి బాబే -
నారా వారి లిక్కరు స్కాం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో ఏ–3గా చంద్రబాబు పేరును చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్–1988ల ప్రకారం 166, 167, 409, 120 (బి), రెడ్విత్ 34, 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్లతో సీఐడీ ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ శ్రీనరేష్, ఏ–2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. డిస్టిలరీస్, బేవరేజెస్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. అయినవారి కోసం అడ్డదారులు..: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కి, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కి చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసింది. టర్నోవర్పై 8 శాతం వ్యాట్తో పాటు అదనంగా 6 శాతం పన్నులను తీసేసింది. 6 నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులనూ బేఖాతరు చేసింది. ఈ విధంగా రెండు బేవరేజ్లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కోకి పాల్పడినట్లు సీఐడీ తన ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని కోర్టుకు వివరించింది. కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా నిర్ణయాలు.. నిజానికి.. ఎక్సైజ్ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి, లైసెన్సులకు ప్రయోజనం చేకూర్చేలా క్రిడ్ ప్రో కో జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతటితో ఆగక.. అందుకు సంబంధించిన వాస్తవాలపై లోతుగా అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ఎల్ఓఐ ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. డీటీ నోటిఫికేషన్ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు. సరఫరాదారులు కుట్రపూరితంగా, లైసెన్స్లతో కుమ్మక్కై, కొన్ని ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారు. తద్వారా కార్పొరేషన్కు తప్పుడు అంచనాలు ఇచ్చారు. అలాగే, 2015–2019 కాలానికి సంబంధించిన వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా, పరిమాణాల వెరిఫికేషన్ కోసం ఎలాంటి యంత్రాంగం లేదు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. అంతేకాక.. అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు స్పష్టమైంది. అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఉల్లంఘన ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే విషయం తేటతెల్లమైంది. దీంతో తగిన ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ వివరించింది. కేబినెట్ ఆమోదం లేకుండా నచ్చినట్లు పాలసీ..: 2015–2017 ఎక్సైజ్ సంవత్సరాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, కొనుగోళ్ల వార్షిక లైసెన్సు రుసుం కంటే పది రెట్లు మించి ఉంటే మాత్రమే ప్రివిలేజ్ రుసుం విధించే థ్రెషోల్డ్ టెండర్ పరిమితిని పెంచాలని మొదట ప్రతిపాదించారు. కానీ, అది అమల్లోకి రాలేదు. తెలంగాణలో అమలులో ఉన్న ఈ ఫీజులు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. షాపుల కోసం పాలసీని కూడా తమకు నచ్చినట్లు ఎటువంటి చర్చలు లేకుండా, ఆర్థిక చిక్కుల గురించి ఆలోచించకుండా కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఖరారు చేసేశారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు అనుకూలంగా నిర్ణయాలు.. ఇక ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధిచేకూర్చింది. వాయిదా పద్ధతిలో లైసెన్స్ ఫీజు చెల్లించడానికి అనుమతించింది. ఈ ఫీజులో బకాయిలపై వడ్డీని కేవలం 18 శాతం (రూ.15 కోట్లు) మాత్రమే వసూలుచేయడానికి అనుమతించింది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, లైసెన్స్ ఫీజు బకాయిలపై అంతకుముందు కాలానికి చెల్లించాల్సిన వడ్డీని కూడా సడలించింది. నిజానికి ఇలా వడ్డీని వదిలేయడానికి, పరోక్షంగా మాఫీ చేయడానికి, తర్వాత చెల్లించేలా అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవు. డిస్టిలరీ మంజూరుకు అనుమతి.. ఇక 2014 నవంబర్లో జీఓ నెంబర్ 993 ప్రకారం.. రెవెన్యూ (ఎక్సైజ్–2) డిపార్ట్మెంట్ ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, మరో మూడు ప్రైవేటు డిస్టిలరీస్కు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది సరఫరాదారులు..డిస్టిలరీలపై ప్రేమ.. కుట్రలో భాగంగా కొంతమంది సరఫరాదారులు, డిస్టిలరీలపై టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమితమైన ప్రేమ కనబర్చింది. వారితో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించింది. వాటికి మార్కెట్ డిమాండ్ లేకపోయినా ఉన్నట్లుగా చూపించింది. వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా ధ్రువీకరణకు ఎలాంటి యంత్రాంగం కూడా లేదు. దీనివల్ల 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు జరిగాయి. బ్రాండ్లకు అడ్డగోలు అనుమతులు.. మరోవైపు.. 2019లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా, ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకపోయినా సరే అనేక బ్రాండ్లకు ఆమోదం తెలిపి తద్వారా వాటి సరఫరాదారులకు ఎక్కడలేని ప్రయోజనం చేకూర్చింది. వ్యక్తులు, సంస్థలకు ప్రయోజనాలను అందించడంవల్ల రాష్ట్ర ఖజానాకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. లోతుగా విచారణ జరపాలి : సీఐడీ ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, లైసెన్సీలకు చట్టవిరుద్ధంగా ఆర్ధిక లాభం చేకూర్చడంపై విచారణ జరగాల్సి ఉందని సీఐడీ ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరపాలని, బాధ్యులైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. -
లిక్కర్ స్కాంలో ఆప్ నేత మనీష్ సిసోడియాకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. మనీష్ సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలను వినిపించారు. రూ. 338 కోట్ల బదిలీకి సంబంధించి సందేహాస్పదమైన కొన్ని అంశాలున్నందవల్లే బెయిల్ను తిరస్కరించామని జస్టిస్ ఖన్నా అన్నారు. విచారణ నెమ్మదిగా సాగితే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. తాజా తీర్పుతో సిసోడియాకు మరో ఆరు నెలల పాటు జైలులోనే ఉండనున్నారు. అయితే, ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సిసోడియా బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తన తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో విచారణకు ఎంత సమయం పడుతుందని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్యం కుంభకోణంలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. అరెస్టయిన సమయంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ఫిబ్రవరి 28న క్యాబినెట్కు రాజీనామా చేశారు. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా ♦ ఈ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారులుబదులుగా కొంతమంది వ్యాపారులకు మద్యం లైసెన్స్లు మంజూరు చేసేందుకు సహకరించారనే ఆరోపణలు ♦ కొందరు మద్యం విక్రయదారులకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఎక్సైజ్ పాలసీని మార్చారని అభియోగాలు ♦ ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ ♦ ఎక్సైజ్ శాఖతో సహా 18 పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తున్న సిసోడియా ఫిబ్రవరి 28న క్యాబినెట్కు రాజీనామా ♦ మనీలాండరింగ్ కేసులో మార్చి 9న తీహార్ జైలులో విచారించిన తర్వాత ఈడీ అరెస్టు చేసింది. ♦ "హై ప్రొఫైల్" వ్యక్తి అంటూ మే 30న సీబీఐ కేసులోబెయిల్ నిరాకరించిన హైకోర్టు ♦ జూలై 3న మనీలాండరింగ్ కేసులో కూడా బెయిల్ను తిరస్కరణ ♦ సిసోడియాను సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు, ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి- సుప్రీం ♦ విశ్లేషణలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ తిరస్కరించినట్టు తాజాగాపేర్కొన్న సుప్రీంకోర్టు Supreme Court dismisses the bail plea of former Delhi Deputy CM Manish Sisodia in connection with cases related to alleged irregularities in the Delhi Excise Policy case. pic.twitter.com/3gAYUMGW9I— ANI (@ANI) October 30, 2023 -
ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్!
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అక్కడి పాలక పార్టీ ఆప్ను మరిన్ని సమస్యలు చుట్టుముట్టేలా కని్పస్తున్నాయి. దీనికి సంబంధించిన అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో ఆప్ను కూడా నిందితుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచన చేస్తున్నట్టు సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. వాటి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు సోమవారం సుప్రీంకోర్టుకు ఈ మేరకు నివేదించారు. అవినీతి వ్యతిరేక చట్టం, నగదు అక్రమ తరలింపు (నిరోధక) చట్టంలోని సెక్షన్ 70 ప్రకారం ఈ చర్య తీసుకోదలచినట్టు వివరించారు. అయితే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఆప్పై ప్రత్యేక అభియెగాలు మోపుతారా అన్న విషయమై మంగళవారం స్పష్టత ఇవ్వాల్సిందిగా ఆయనకు ధర్మాసనం సూచించింది. మద్యం విధానం కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా ఏఎస్జీ ఈ మేరకు ప్రకటన చేశారు. -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. అరెస్టైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు కూడా సమన్లు జారీ చేసింది. సంజయ్ సింగ్కు అతి సన్నిహితులైన వివేక్ త్యాగి, సర్వేశ్ మిశ్రాలను శుక్రవారం ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ సింగ్పై దర్యాప్తులో భాగంగా ఆప్ అధికార ప్రతినిధి సర్వేశ్ మిశ్రా పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంజయ్ సింగ్ తరుపున సర్వేశ్ మిశ్రా కోటి రూపాయలు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్తో పాటు సర్వేశ్ మిశ్రా, వివేక్ త్యాగిలను కూడా ఈడీ ప్రశ్నించనుంది. మద్యం కుంభకోణం కేసులో సంజయ్ సింగ్ అక్టోబర్ 10 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారిలో ఈయన మూడో వ్యక్తి. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లు అరెస్టయ్యారు. బుధవారం 10 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత సంజయ్ సింగ్ను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆయన ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు కూడా చేసింది. నిందితుడు దినేశ్ అరోరా నుంచి సంజయ్ సింగ్ రూ.2 కోట్లు అందుకున్నాడనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు -
ఆప్కు కాంగ్రెస్ చురకలు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మద్దతునిస్తూనే ఆప్కు కాంగ్రెస్ చురకలంటించింది. ఇండియా కూటమి భాగస్వామైన ఆప్ను కాపాడుకుంటూనే పంజాబ్లో తమ నేతలను అరెస్టు చేయడంపై విరుచుకుపడింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టుపై స్పందించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. బీజేపీ ప్రతికార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశంలో దర్యాప్తు సంస్థలు రాజకీయ లక్ష్యాల కోసం పనిచేస్తున్నాయని కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. బీజేపీ ప్రతికార రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు పూర్తి మద్దతుగా నిలుస్తామని అన్నారు. అదే క్రమంలో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై ఆప్ను నిందించారు. AAP MP Sh. @SanjayAzadSln ji's arrest by the ED takes the BJP's vendetta politics to another level. We stand in complete solidarity with him and reject the use of law enforcement agencies to settle political scores. For this reason, we also oppose the arrests of All India… — K C Venugopal (@kcvenugopalmp) October 5, 2023 పంజాబ్లో 2015నాటి డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైరాను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మఖ్యమంత్రి ఓపీ సోనీని కూడా అరెస్టు చేశారు. పంజాబ్లో ఆప్ అధికారంలో ఉన్న నేపథ్యంలో తమ నేతలను అరెస్టు చేయడం పట్ల కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నేతల అరెస్టులు న్యాయబద్ధంగా జరలేదని ఆరోపించారు. కూటమిలో పోరు: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్కు మద్యం కుంభకోణం కేసులో మద్దతుగా నిలుస్తోంది. అటు.. పంజాబ్లో సొంత అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లో ఆప్, కాంగ్రెస్కు మధ్య సీట్ల షేరింగ్లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. అవినీతి మయమైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆప్ నేతలు అంటున్నారు. కూటమిలో ఆప్ భాగస్వామిగా ఉంటుందని పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం: మద్యం కుంభకోణంలో అక్రమాలకు పాల్పడి ఆ డబ్బును పార్టీ ప్రచారాల కోసం వినియోగించారని ఈడీ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే జైలు పాలయ్యారు. తాజాగా మరో ఆప్ నేత సంజయ్ సింగ్ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇదీ చదవండి: వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా? -
లిక్కర్ స్కామ్ నిందితుల జాబితాలో ఆప్!
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఆప్ను నిందితుల జాబితాలో ఈడీ చేర్చనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ ధనాన్ని ఆప్ ఎన్నికల ప్రచారాల కోసం కేటాయించారని ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆప్ను నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో ఆప్ను కూడా నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనలను విచారించిన సుప్రీంకోర్టు.. మద్యం పాలసీ వల్ల పార్టీ లాభపడిందనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆప్ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే.. ఆప్ని నిందితుల జాబితాలో చేర్చడంపై ఈడీ న్యాయసలహాలు తీసుకోనుంది. తదనంతరం ధర్మాసనానికి సమగ్ర సమాచారం ఇవ్వనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. ఆయన మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపిస్తూ దాదాపు 10 గంటలపాటు ఢిల్లీలోని ఆయన నివాసంలోనే ప్రశ్నించింది. ఈ పరిణామాలు రాజకీయంగా సంచలనంగా మారాయి. కేంద్రంలోని బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు కొనసాగాయి. మరోవైపు.. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్న సందర్భంగా ఆప్ ఎంపీ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను విచారించిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు రావాలని కూడా ఇటీవలే నోటీసులు ఇచ్చింది. ఇదీ చదవండి: Lumbini and Pokhara Airport Issue: చైనా ఆటలకు నేపాల్లో భారత్ కళ్లెం! -
వెయ్యి సార్లు వెతికినా చిల్లిగవ్వ దొరకదు: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ 1000 సార్లు దాడులు చేసినప్పటికీ లిక్కర్ స్కాంలో కేసులో అక్రమంగా సంపాదించినట్లు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. "Nothing will be found at his residence," Arvind Kejriwal reacts to ED's raid on Sanjay Singh Read @ANI Story | https://t.co/oTADiHIxnP#ArvindKejriwal #EDRaid #SanjaySingh pic.twitter.com/txzXtqdGgQ — ANI Digital (@ani_digital) October 4, 2023 'ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లోనూ ఏమీ లభించలేదు. గత ఏడాది నుంచి లిక్కర్ స్కాం అంటూ దర్యాప్తు చేస్తున్నారు. అయినా.. లిక్కర్ స్కాం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వెయ్యి సార్లు సోదాలు చేశారు.. కానీ ఏమీ లభించలేదు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీకి పరాజయం తప్పదు. ఇదే వీరికి చివరి అవకాశం' అంటూ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు ఆప్ ఎంపీ(రాజ్యసభ) సంజయ్ సింగ్కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో బుధవారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి ఈయన ఈడీ నజర్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. ఆయన ఇంట్లో కీలక పత్రాల కోసం ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీశ్సిసోడియాకు కలిపించాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. బీజేపీ ఫైర్ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా మండిపడింది. దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఆప్ నేతలకు ఎందుకు భయమైతుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. లిక్కర్ స్కాం కేసులో ఏడు నెలలుగా ఆప్ నేత మనీష్ సిసోడియా జైలులోనే గుడుపుతున్నారు.. త్వరలో మరో నేత జైలు కెళ్లబోతున్నారని ఆప్ భయపడుతోందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కేజ్రీవాలే కింగ్ పిన్ అని ఆరోపించారు. ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇదీ చదవండి: Delhi Liquor Policy Case: ఆప్ కోసం లిక్కర్ స్కామ్ డబ్బులు.. అందుకే సంజయ్ సింగ్ ఇంట సోదాలు? -
అన్ని లెక్కలూ తేలుస్తాం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టారో, ఎంతమంది బినామీ బిల్డర్లతో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరుకు చెందిన బిల్డర్లపై చదరపు గజానికి రూ.50 చొప్పున పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ విధిస్తోందని, ఆ డబ్బులన్నింటినీ తెలంగాణకు తరలించాలని చూస్తోందని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు రేవంత్ ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి తండ్రికి చలిజ్వరం పట్టుకుంటే, కొడుకు పూర్తిగా మతి తప్పి మాట్లాడుతున్నారని, నిండా అవినీతిలో మునిగి నిద్రలో కూడా కమీషన్ల గురించి కలవరించే బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ గురించి మాట్లాడతారా అని రేవంత్ రీట్వీట్ చేశారు. పక్క రాష్ట్రం గురించిన మాటలను పక్కనపెడితే తెలంగాణలోని కల్వకుంట్ల ‘స్కామిలీ’గురించి చెప్పాలని, దళితబంధులో 30 శాతం కమీషన్ల గురించి, లిక్కర్స్కామ్లో కవిత వెనుకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న రూ.300 కోట్ల ఆరోపణల గురించి, భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడవడం లేదని కాగ్ కడిగేసిన విషయాల గురించి చెప్పాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను అడ్డుకోవడం కేటీఆర్ వల్ల కాదని ఆ ట్వీట్లో రేవంత్ స్పష్టం చేశారు. -
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..!
-
బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే మోదీతో కేసీఆర్కు లోపాయికారీ ఒప్పందం
మహబూబ్నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్కు ప్రధాని నరేంద్రమోదీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.60 వేల కోట్ల వరకు దోపిడీ చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకే జాగో తెలంగాణ పేరుతో ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి చైతన్యం చేస్తున్నామని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేసి గల్లీకొక బెల్టు షాపు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఇసుక, మట్టి, ల్యాండ్, లిక్కర్ మాఫియాలు చెలరేగుతున్నాయని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భయంకరమైన అవినీతి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వి నర్ రాఘవాచారి మాట్లాడుతూ పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమకాలంలో ఎలా ఉందో ప్రస్తుతం అలాగే ఉందని, వలసలు ఏమాత్రం ఆగలేదన్నారు. పాలమూరు రాజకీయ నేతల బానిసత్వం కూడా పోలేదన్నారు. సమావేశంలో జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధులు ఖలీదా ఫరీ్వన్, ప్రొఫెసర్ వినాయకరెడ్డి, ప్రొఫెసర్ పద్మజాషా, జావిద్ ఖాద్రి పాల్గొన్నారు. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ అదనపు చార్జిషీటు దాఖలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అదనపు చార్జిషీటు దాఖలు చేసింది. చారియల్ ప్రొడక్షన్స్ మీడియా అధినేత రాజేష్ జోషి, ఉద్యోగులు దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్, చన్ప్రీత్సింగ్పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఐదుగురు నిందితులు హవాలా మార్గంలో గోవాకు రూ. 44.54 కోట్లు తరలించినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ఎల్-1 లైసెన్స్దారులకు అనుచితంగా లబ్ధి చేకూర్చి ఆప్ నేతలు ముడుపులు పొందినట్లు చార్జిషీట్లో పేర్కొంది. -
అవినీతే కాంగ్రెస్ ఊపిరి
రాయ్పూర్/గోరఖ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఊపిరి, ముఖ్య సిద్ధాంతం అవినీతేనని పేర్కొన్నారు. అవినీతి లేకుండా ఆ పార్టీ బతకలేదని విమర్శించారు. శుక్రవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్గఢ్ అభివృద్ధిని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ ఏటీఎంలా మార్చేసుకుందని వ్యాఖ్యానించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, అవినీతి పరులపై చర్యలకు తనదీ గ్యారెంటీ అని అన్నారు. ‘కుంభకోణాల్లో మునిగిన కాంగ్రెస్ ప్రభుత్వం దుష్పరిపాలనకు ఆదర్శంగా మారింది. అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచింది. ప్రజల హక్కుల్ని లాగేసుకుని, రాష్ట్రాన్ని లూటీ చేసి, నాశనం చేసేందుకు పూనుకుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’అని ప్రధాని నిప్పులు చెరిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మద్య నిషేధం తదితర 36 వాగ్దానాలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయింది. మద్య నిషేధానికి బదులుగా కోట్లాది రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడింది. ఈ డబ్బంతా కాంగ్రెస్ ఖాతాలోకే చేరింది. ఒక్క మద్యానికే కాదు. ప్రతి శాఖలోనూ అవినీతే. అవినీతి కాంగ్రెస్కు ఊపిరిగా మారింది. అది లేకుండా ఆ పారీ్టకి శ్వాస ఆడదు. అవినీతే కాంగ్రెస్ ముఖ్య సిద్ధాంతం’అని అన్నారు. కాంగ్రెస్ అవినీతికి గ్యారెంటీ అని నేను విమర్శిస్తే కొందరు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానర్థం, అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లే. కాంగ్రెస్ అవినీతికి గ్యారెంటీ అయితే, అవినీతిపై చర్యలకు మోదీ గ్యారెంటీ’అని ఆయన స్పష్టం చేశారు. అవినీతి పరులు, గతంలో పరస్పరం దూషించుకున్నవారు ఇప్పుడు దగ్గరవుతున్నారంటూ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. ఇటువంటి వాటికి భయపడేది లేదన్నారు. ‘తప్పుడు పనుల్లో మునిగి తేలేవారు తప్పించుకోలేరు. నా దగ్గర ఉన్నదంతా మీరు (ప్రజలు), ఈదేశం ఇచి్చనవేనని ధైర్యంగా చెబుతున్నా. నాపై కుట్రలు పన్నుతున్న వారికి, నా సమాధి తవ్వాలని చూస్తున్న వారికి భయపడను. భయపడితే మోదీనే కాను’అని ప్రధాని చెప్పారు. రాష్ట్రం నుంచి నక్సలిజంను లేకుండా చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని తెలిపారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 70కి తగ్గిపోయిందన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు రాయ్పూర్లో రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంకేర్ జిల్లా అంతగఢ్– రాయ్పూర్ రైలుకు వర్చువల్గా జెండా ఊపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కార్డులను పంపిణీ చేశారు. దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న వారికి ఆధునిక సౌకర్యాలు కలి్పంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శంకుస్థాపన చేసిన రాయ్పూర్– ధన్బాద్ ఎకనామిక్ కారిడార్, రాయ్పూర్–విశాఖపట్టణం ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులతో ఈ ప్రాంత రూపురేఖలే మారనున్నాయన్నారు. గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని శుక్రవారం ప్రధాని మోదీ గోరఖ్పూర్లో పర్యటించారు. గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతా ప్రెస్ కేవలం పుస్తకాలను ముద్రించే ముద్రణాలయం కాదు, ప్రజల విశ్వాసం, దేవాలయమని పేర్కొన్నారు. మహాత్మాగాం«దీకి గీతా ప్రెస్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గీతా ప్రెస్ ఆధ్వర్యంలో నడిచే కల్యాణ్ మేగజీన్ కోసం ఆయన వ్యాసాలు రాసే వారని చెప్పారు. ప్రధాని రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. అక్కడ రూ.12 వేల కోట్ల 29 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. గత ప్రభుత్వాలహయాంలో ఏసీ గదుల్లో కూర్చుని సంక్షేమ పథకాలను తయారు చేసే, ప్రభావం ఏమిటనే దానిపై అప్పటి నాయకులకు అవగాహన లేదని ప్రధాని అన్నారు. -
లిక్కర్ స్కాం కేసు బలపడుతోంది
పెర్కిట్(ఆర్మూర్): లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయమని జిల్లా ఎంపీ అర్వింద్ అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నందిపేట మండలం డొంకేశ్వర్, నికాల్పూర్ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లిక్కర్ స్కాం కేసు ఆలస్యమవుతుందని తెలంగాణ ప్రజలు నిరుత్సాహపడనవసరంలేదన్నారు. ఎంత ఆలస్యమయితే కేసు అంత బలోపేతం అవుతుందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎలాగైనా ఓడిస్తామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను సాగనివ్వమన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ఏ విషయంలో బాగుపడిందో చెప్పాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అవినీతితో బ్రష్టుపట్టిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కరువయ్యారన్నారు. ఖరీఫ్ సీజన్లో నార్లు వేసుకుని నిరీక్షిస్తున్న రైతులకు వర్షాలు రాక ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ వరకు రివర్స్ పంపింగ్ ద్వారా సాగు నీరందిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం చుక్క నీటిని వదలడం లేదన్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో డీజిల్, పెట్రోల్లో మిలిథం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే.. వరిని విరివిగా సాగు చేసే తెలంగాణలో మాత్రం ఒక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణలో 17 ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో వరి ధాన్యం సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా తరుగు పేరు తో రూ.12 వందల కోట్ల స్కాం జరిగిందన్నారు. ప్రఽ దాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో రాబోయే కామన్ సివిల్ కోడ్ ప్రయోజనం వల్ల ముస్లిం మహిళలు సైతం నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాలెపు రాజు, సాయి రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జైలు వద్ద లొంగిపోయిన మాగుంట రాఘవ
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాగుంట రాఘవ.. తీహార్ జైలు వద్ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్అధికారులకు లొంగిపోయాడు. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈడీ. మధ్యంతర బెయిల్ పరిమితిని కుదించి లొంగిపోవాలని రాఘవను ఆదేశించింది సుప్రీంకోర్టు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాఘవ జైలువద్ద ఈడీకి లొంగిపోయాడు. -
కేజ్రీవాల్ పై సీబీఐ ప్రశ్నల వర్షం
-
సెంట్రల్ ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు
-
లిక్కర్ స్కామ్లో సీబీఐ విచారణకు హాజరైన కేజ్రీవాల్
-
సీబీఐ వందసార్లు పిలిచినా వెళ్లి సమాధానం ఇస్తా: కేజ్రీవాల్
-
అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు.. ఆదివారం విచారణకు రావాలని ఆదేశాలు
-
సుఖేష్ చంద్రశేఖర్ చాట్స్పై స్పందించిన కవిత
-
లిక్కర్ స్కాం లో మరో సంచలన లేఖ విడుదల చేసిన సుకేష్
-
మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్ విచారణ వాయిదా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మార్చి 25కి వాయిదా పడింది. ఈ మేరకు సిసోడియా బెయిల్ పిటిషన్పై ఈడీకి నోటీసులు జారీ చేసింది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. అలాగే సీబీఐ పిలుపు మేరకు దర్యాప్తుకి వచ్చానని, పైగా తాను ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సమాజంలో అత్యున్నత హోదాలో ఉన్నానని పిటిషన్లో తెలిపారు. అంతేగాదు ఈ కేసులో అరెస్టయిన వారందరికీ బెయిల్ మంజూరు అయిన విషయాన్ని కూడా పిటిషన్లో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, వాస్తవానికి మార్చి 20వ తేదితో సిసోడియా జ్యూడీషియల్ కస్టడీ ముగియనుండగా..ఈడీ తన రిమాండ్ను పొడిగించాలంటూ మరోసారి పిటీషన్ దాఖలు చేసింది. అంతేగాదు వాదనల సందర్భంగా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ఈడీ. ఆయన లిక్కర్స్కాం సమయంలో ఫోన్ని నాశనం చేశారు కాబట్టి మరోసారి విచారించాలని ఈడీ పట్టుబట్టింది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా, మార్చి9న మనీ లాండరింగ్ కేసులో సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ ఆయన్ను సుమారు 11 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. (చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..) -
లిక్కర్ స్కాంపై ఫిర్యాదు చేసింది మేమే
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కాంపై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, తమ పార్టీ పోరాటం కారణంగానే ఈ స్కాంలో కదలిక వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ఖేరా అన్నారు. లిక్కర్ స్కాంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈ స్కాంలో నిందితులకు ఎందుకు మద్దతు తెలుపుతుందని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్లతో కలసి మీడియాతో మాట్లాడుతూ తమ పోరాటం కారణంగానే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపిందని అన్నారు. ‘శంషాబాద్లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్లలో కేవలం కవిత మాత్రమే కనిపిస్తున్నారు. బీఆర్ఎస్లో ఇంకో మహిళా నాయకురాలు లేరా? కవితకు మహిళల సాధికారత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?’అని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు మహిళల హక్కుల గురించి కవిత ఎన్ని పోరాటాలు చేశారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్ప ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పక్షాన సర్పంచ్ కూడా గెలవడని, అలాంటి పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. మాణిక్రావ్ ఠాక్రే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల డబ్బులు కొల్లగొట్టి ఎన్నికల కోసం డబ్బులు సిద్ధం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, బీజేపీతో పోరాడుతున్నామంటూ బీఆర్ఎస్ కలరింగ్ ఇస్తోందని విమర్శించారు. -
కవిత నోటీసులతో మాకేం సంబంధం: కిషన్ రెడ్డి
సాక్షి, మహబూబ్నగర్: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు నేతలు స్పందించారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు. కాగా, కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈడీ నోటీసులతో మాకు సంబంధం లేదు. చట్టం ముందు అందరూ ఒక్కటే. కవితకు ఈడీ నోటీసులిస్తే తప్పేంటి?. దర్యాప్తు సంస్థల విషయంలో మేము జోక్యం చేసుకోము. అవినీతి అంశాన్ని తెలంగాణ సమాజంతో ముడిపెట్టి రెచ్చగొడుతున్నారు. ఈడీ కేసు విషయంలో నీతివంతులైతే గగ్గోలు ఎందుకు పెడుతున్నారు?. కవితను తలవంచమని ఎవరు చెప్పటం లేదు. తప్పు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవాలి. తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబం ఒక్కటేనా?. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఢిల్లీకి వెల్లి లిక్కర్ వ్యాపారం చేసింది, సెల్ ఫోన్ పోన్లు పగల కొట్టింది, అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. తమ తప్పిదాలు, అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం నాటకాలు చేస్తోంది. బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్ చేసి నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతోంది. పోలీసులు.. భూముల సెటిల్మెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్లో వ్యాపారులను బెదిరించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రభుత్వం నిర్భంధంలో ఉన్నారు. వారికి స్వేచ్చ లేదు. తెలంగాణలో ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా.. ప్రజలను శాసిస్తోంది. పాదయాత్రలు, బహిరంగ సభలపై నిర్బంధం విధిస్తున్నారు. కొనుగోలు చేయడంలో కేసీఆర్ దిట్ట. మహిళ అనే గౌరవం లేకుంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఆరోపణలు చేయడం విడ్డూరం. శాసనసభ ప్రగతిభవన్ కనుసన్నల్లో నడుస్తోంది. గతంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వాలు లేవు’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. -
తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి అత్యవసర పిలుపు.. అందుకేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలపై బీజేపీ దృష్టి సారించింది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో జరిగే రాష్ట్ర మినీ కోర్కమిటీ భేటీలో ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన రెండోరోజే ఈ సమావేశం ఉండటంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ చేపట్టిన ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ చివరి రోజున మంగళవారం 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించాలని నాయకత్వం ఆదేశించింది. అయితే పార్టీకి సంస్థాగతంగా కీలకమైన రోజునే రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఢిల్లీకి అత్యవసరంగా పిలిపించడం గమనార్హం. మనకూ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ప్రకంపనలు తెలంగాణ రాజకీయాలను కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు తాకుతాయా, ఒకవేళ ఆ దిశలోనే చర్యలుంటే అవి ఏ రూపంలో ఉంటాయన్న దానిపైనా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలపై విచారణ, దర్యాప్తు సంస్థలు ఏవైనా చర్యలు తీసుకుంటే వాటి పర్యవసానాలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్బోధను రాష్ట్ర ముఖ్యనేతలకు నాయకత్వం చేయొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది కర్ణాటక, తెలంగాణసహా వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అమిత్షా ఢిల్లీ నుంచి పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికల తయారీలో అమిత్షా బిజీ షెడ్యూల్ కారణంగా ఢిల్లీలో ఈ భేటీని నిర్వహిస్తున్నారని పార్టీవర్గాలు వెల్లడించాయి. సునీల్ బన్సల్ నివేదిక కీలకం ఇప్పటికే వారంరోజులు రాష్ట్రంలో బసచేసిన ఆ పార్టీ సంస్థాగత ఇన్చార్జీ సునీల్ బన్సల్ స్ట్రీట్కార్నర్ మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి, నేతల పనితీరు ఎలా ఉంది, వాటికి ప్రజల స్పందన ఎలా ఉందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, చక్కదిద్దుకోవాల్సిన అంశాలపై బన్సల్ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకునే ఈ భేటీలో అమిత్షా రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. భేటీకి సునీల్ బన్సల్, తరుణ్చుగ్, బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీజాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయకార్యవర్గసభ్యులు మురళీధర్రావు, పొంగులేటి సుధాకర్రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి తదితరులు పాల్గొంటున్నట్టు పార్టీవర్గాల సమాచారం. -
'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత?: వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?'
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో తనపై వచ్చిన ఆరోపణలన్నీ బోగస్, అసత్యాలేనన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ స్పందించారు. ఆ స్కాంతో ఎలాంటి సంబంధం లేకపోతే.. ఆ కుంభకోణంలో ఉన్న నిందితులు కవిత ఇంటికి ఎందుకు వచ్చారో ఆమె ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో ఛుగ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశాల్లో నిందితులతో కవిత జరిపిన చర్చల వివరాలను ఈడీ ఎందుకు చార్జిషీట్లో ప్రస్తావించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సంబంధం లేకపోతే కవిత పేరును అన్నిసార్లు ఎందుకు ఈడీ పొందుపరిచిందని ప్రశ్నించారు. ఫోన్ను ఎందుకు మార్చారు? ‘కవిత తన ఫోన్ను పదిసార్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత అవసరం ఏముంది.? సమీర్ మహేంద్రుతో కవితకు ఏం సంబంధం? ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడిది?’అని ఛుగ్ నిలదీశారు. ఫోన్లు మాటిమాటికీ మార్చాల్సినంత మాఫియా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీలపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆ చెక్కుల వెనుక లిక్కర్ కుంభకోణం? పంజాబ్ రైతులకు కేసీఆర్ పంపిణీ చేసిన చెక్కుల వ్యవహారం వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని తరుణ్ ఛుగ్ ఆరోపించారు. లిక్కర్ వ్యవహారంలో భాగంగానే ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లను కేసీఆర్ కలిశారని అన్నారు. చదవండి: నిధుల ‘పంచాయితీ’.. బిల్లులు పెండింగ్తో సర్పంచ్ల గగ్గోలు.. -
Delhi liquor scam: ఆదివారం కవిత ఇంటికి సీబీఐ!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ మహిళా నేత, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారణ చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం(డిసెంబర్ 11వ తేదీన) ఆమె నివాసానికి వెళ్లనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఆర్పీసీ 160 కింద ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చింది సీబీఐ. అంతకు ముందు.. పలానా తేదీల్లో తాను విచారణకు అందుబాబులో ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీబీఐకు మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సమయంలో ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయనున్నారు సీబీఐ అధికారులు. -
హైదరాబాద్లో హైటెన్షన్.. కవిత సీబీఐ విచారణపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ మరోసారి రసవత్తరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, తాజాగా ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ విచారణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు(మంగళవారం) కవితను విచారిస్తామని గతంలో సీబీఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపించారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో తాను మంగళవారం అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. మరోవైపు.. విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు కోఠిలోని ఆఫీసుకు ఇప్పటికే చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతిలేదని ఇప్పటికే సర్కార్ జీవో 56 విడుదల చేసింది. ఈ తరుణంలో కవితను విచారించాలంటే సీబీఐ అధికారులు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో, కవిత విచారణ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సీబీఐకి రాసిన లేఖలో కవిత.. ఈనెల 11, 12, 14, 15 తేదీన విచారించేందుకు సమయం కోరారు. సీబీఐ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. -
ఎమ్మెల్సీ కవిత విచారణపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. విచారణకు రాను!: కవిత
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించాను, అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు కవిత. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందని సమాధానమిచ్చారు. దాంతో తాను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తేదీని ఖరారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికిగానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు. ఇదీ చదవండి: సీబీఐ స్పందన తర్వాతే..! -
తగ్గేదేలే.. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు.. శుక్రవారం 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపించారు. కాగా, ఆ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు. ఇక, ఆ లేఖలో సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటుగా ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కవిత కోరారు. వీటిని సాధ్యమైనంత త్వరగా తనకు ఇవ్వాలని కవిత కోరారు. సంబంధిత అనుబంధ కాపీలను కూడా అందించాలని కవిత లేఖలో స్పష్టం చేశారు. తన వివరణకు ముందే రెండు డాక్యుమెంట్లను ఇవ్వాలని లేఖ కోరారు. డాక్యుమెంట్లు పంపిన తర్వాతే వివరణ తేదీని ఫిక్స్ చేసి హైదరాబాద్లో కలుద్దామని తెలిపారు. అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. హైదరాబాద్లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. -
కవితను ఎందుకు విచారించట్లేదు.. ఇదే ట్విస్ట్ అంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తవించడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా, తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు. లిక్కర్ స్కాంలో మిగతా వారిని విచారించి కవితను మాత్రం అనుమతి కోరుతున్నారు. ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోంది. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలి. గతంలో ఎన్నికల సంఘానికి నేను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదు. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందకు లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఎల్ సంతోష్, ఎమ్మెల్సీ కవితలను అరెస్ట్ చేయాలన్నారు. బీఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు. అలాగే, బీఎల్ సంతోష్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. లిక్కర్ స్కాం కేసులో కవిత పేరును చేర్చినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. -
HYD: 30 టీమ్స్తో స్పీడ్ పెంచిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. పలుచోట్ల మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు బయలుదేరారు. బుధవారం ఉదయం నుంచే కేంద్ర బలగాలు పెద్ద సంఖ్యలో నగరంలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నాయి. కరీంనగర్, హైదరాబాద్లో ఈడీ సోదాలు నిర్వహించేందుకు బయలుదేరాయి. కాగా, బుధవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో దాదాపు 30 బృందాలు, 10 వాహనాల్లో సోదాలు నిర్వహించేందుకు ఈడీ కార్యాలయం నుంచి అధికారులు బయలుదేరాయి. వాటిలో కొన్ని బృందాలు కరీంనగర్వైపు వెళ్లగా.. మరికొన్ని బృందాలు హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు.. కేంద్ర బలగాల్లో మహిళా అధికారులు కూడా ఉన్నారు. కాగా, కొద్దిరోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈడీ అధికారులతోపాటు ఐటీ అధికారులు కూడా సోదాలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. సోమాజీగూడ, అత్తాపూర్లో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో, కరీంనగర్లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులే లక్ష్యంగా ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక, గతంలో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తక్కువ పరిమాణం చూపి విదేశాలకు ఎక్కువ ఎగుమతులపై ఈడీ ఆరా తీస్తోంది.