ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. | Chhattisgarh Encounter: 9 Maoists Killed In Encounter With Security Forces In Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..

Published Wed, Sep 4 2024 3:10 AM | Last Updated on Wed, Sep 4 2024 3:10 AM

Chhattisgarh Encounter: 9 Maoists Killed In Encounter With Security Forces In Chhattisgarh

9 మంది మావోయిస్టులు మృతి

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ –బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్‌ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ దళాల జవాన్లు ఉదయం 6 గంటల నుంచి కూంబింగ్‌ చేపట్టారు.

ఆక్రమంలో 10.30 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్‌ గెరిల్లా లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్‌ఎల్‌ఆర్, 303 రైఫిల్, 12 బోర్‌ రైఫిల్, 315 బోర్‌గన్లతోపాటు బారెల్‌ గన్‌ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement