కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్‌ జారీ | Chirag Paswan Car Challaned In Bihar For Overspeeding | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్‌ జారీ

Published Mon, Sep 2 2024 4:23 PM | Last Updated on Mon, Sep 2 2024 4:37 PM

Chirag Paswan Car Challaned In Bihar For Overspeeding

పట్నా: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ అయింది. మితిమీరిన వేగంతో ఆయన కారు వెళ్లినందుకు బీహార్‌లోని ఓ టోల్‌ ప్లాజా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్‌ సిస్టం చలాన్‌ జారీ చేసింది. కేంద్ర మంత్రి పాశ్వాన్‌ నేషనల్‌ హైవేపై​ హాజీపూర్‌ నుంచి చంపారన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు.. బిహార్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌, ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటివరకు కొత్త ఈ డిటెక్షన్‌ సిస్టం  ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంగఘించిన 16,700 మందికి ఈ-చలాన్‌ జారీ చేసినట్లు  అధికారులు తెలిపారు. ఆ చలాన్ల విలువ సుమారుగా రూ. 9.49కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

కొత్తగా తీసుకువచ్చిన  ఈ డిటెక్షన్‌ సిస్టంను మోటార్‌ వాహన చట్టం కింద రాష్ట్రంలోని 13 టోల్‌ ప్లాజాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ-డిటెక్షన్ సిస్టం వాహనాలను చెక్‌ చేస్తూ.. సరైన పత్రాలు లేనట్లైతే ఆటోమేటిక్‌గా చలాన్‌ జారీ అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement