30 కిలోల ఆహారంతో ఇంటిపై కూలిన డ్రోన్‌! | Drone Going To Deliver Food Fell On House In Gurugram, Details Inside - Sakshi
Sakshi News home page

Gurugram: 30 కిలోల ఆహారంతో ఇంటిపై కూలిన డ్రోన్‌!

Feb 17 2024 8:07 AM | Updated on Feb 17 2024 9:25 AM

Drone Going to Deliver Food Fell on House - Sakshi

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆహారాన్ని తరలిస్తున్న   ఒక డ్రోన్‌ కలకలం సృష్టించింది. సౌత్ సిటీలోని జి బ్లాక్‌ మీదుగా ఆహారాన్ని తీసుకువెళుతున్న ఆ డ్రోన్‌  హఠాత్తుగా ఒక ఇంటిపై పడిపోయింది. 

ఈ ఘటనలో సుమారు 30 కిలోల బరువున్న ఆహార పదార్థాలు ఆ ఇంటిపై పడటంతో పాటు ఇంటి బాల్కనీ, డిష్ యాంటెన్నా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఇంటి బాల్కనీలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అకస్మాత్తుగా హౌస్‌ నంబర్ జి-68 పైనుండి పెద్ద శబ్దం వచ్చింది.   ఇంటి యజమాని బయటకు వచ్చి చూసేసరికి డ్రోన్ శిథిలాలు, మరికొన్ని వస్తువులు అక్కడ పడి ఉన్నాయి. 

ఆహార సరఫరా కోసం డ్రోన్ల ట్రయల్ జరుగుతున్నదని. ఇందుకోసం అధికారుల నుంచి  అనుమతులు కూడా తీసుకున్నట్లు ఆ కంపెనీ ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. ఇంటికి జరిగిన నష్టానికి పరిహారం అందజేస్తామని ఆ కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ ప్రాంతంలో  ప్రధాని పర్యటన సందర్భంగా డ్రోన్‌లను ఎగురవేయడంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇదే సమయంలో డ్రోన్లను ఎగురవేసేందుకు ఆ కంపెనీకి అనుమతి ఎలా లభించిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. 

అయితే నిషేధ ఉత్తర్వుల గురించి తెలుసుకున్న డ్రోన్‌ పైలట్ ఈ భవనంపై అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉదంతంపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం డ్రోన్‌లోని సాంకేతిక లోపం కారణంగా అది కూలిపోయింది. ఈ ఘటనపై సెక్టార్ 50 పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ పాడైన డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నమన్నారు. అలాగే సదరు కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement