
బెంగళూరు: లాక్డౌన్తో కార్మికులు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారో తేటతెల్లం చేసే సంఘటన ఇది. జిల్లా ఇన్చార్జి మంత్రి జగదీశ్ శెట్టర్ కారులో వెళ్తుండగా ఓ కార్మికుడు కారు వద్దకు వచ్చి పార్ బూట్ పాలిష్ చేస్తా అంటూ వెట్టర్ను ప్రాధేయపడ్డాడు. నగరంలోని కిమ్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మంత్రి డబ్బులు ఇవ్వపోగా..‘నేను బిక్షగాడిని కాదు.. మిమ్మల్ని బిక్షం అడగడం లేదు.. మాకు ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి సార్’ అని ప్రాధేయపడ్డాడు. చివరకు మంత్రి రూ. 500 నగదు ఇచ్చి ఇతనికి శాంతపరిచి పంపారు.