
ఢిల్లీ: ఐదురోజులు పర్యటనలో భాగంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత్ చేరుకున్నారు. ఆయన సతీమణి షాజిదా మహ్మద్తో కలిసి మొయిజ్జు.. ఆదివారం ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగారు. వారికి కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ద్వైపాక్షిక చర్చల కోసం మొయిజ్జు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి.
A warm welcome to President @MMuizzu of Maldives as he arrives in New Delhi on a State Visit to India.
Received by MoS @KVSinghMPGonda at the airport.
The visit will provide further boost to this long-standing 🇮🇳-🇲🇻 comprehensive bilateral partnership.#NeighbourhoodFirst pic.twitter.com/FHoNN4C0U3— Randhir Jaiswal (@MEAIndia) October 6, 2024
‘‘మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు భారతదేశ పర్యటనలో న్యూ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో మొయిజ్జు దంపతులకు కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్-మాల్దీవులు మధ్య ద్వైక్షిక భాగస్వామ్యానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది’’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
EAM S Jaishankar tweets, "Pleased to call on President Mohammed Muizzu today at the start of his State Visit to India. Appreciate his commitment to enhance the India-Maldives relationship. Confident that his talks with PM Narendra Modi tomorrow will give a new impetus to our… pic.twitter.com/9gTdb11huD
— ANI (@ANI) October 6, 2024
‘‘ఈ రోజు భారతదేశ పర్యటనలో భాగంగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జును రావటం ఆనందంగా ఉంది. భారతదేశం-మాల్దీవుల సంబంధాలను మెరుగుపరచడానికి ఆయన నిబద్ధతను అభినందిస్తున్నాం. రేపు(సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చేపట్టే చర్చలు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయనే నమ్మకం ఉంది’ అని విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ఎక్స్లో పేర్కొన్నారు.