
మైసూరు: పర్యాటక రాజధాని మైసూరువాసులకు పాములు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పాములు, అందులోనూ ప్రాణాంతకమైన రక్తపింజర జాతి సర్పాలు కనిపిస్తున్నాయి. నిత్యం ఇవి నగరంలో కనీసం నాలుగైదు చోట్ల ఇళ్లు, బయలు ప్రాంతాల్లో వస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.
ఈ పాములు చాలా ప్రమాదకరమైనవి. కాటేస్తే ప్రాణాలు పోవడమో, లేదా తీవ్ర గాయం మిగిలిపోవడమో జరుగుతుంది. గత నెలలో నగరంతో పాటు జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన పాములు నగరంలోకి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు.
చదవండి: (పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్కి వెళ్లి..)