Mysore
-
నీతా అంబానీ ధరించిన ఈ లాకెట్ స్పెషాల్టీ తెలిస్తే... ఆశ్చర్యపోతారు!
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (nita ambani) ఫ్యాషన్కి పెట్టింది పేరు. ప్రతీ సందర్భంలోనూ తన స్టైల్తో ఆకట్టుకుంటుంది. అది ట్రెడిషనల్ లుక్ అయినా మెడ్రన్ లుక్ అయినా అందరి దృష్టినీ ఆకర్షించాల్సిందే. అది అత్యంత విలువైన చీర అయినా, ఖరీదైన డైమండ్ నగలైనా దానికొకి స్పెషాల్టీ ఉంటుంది. ఫ్యాషన్ (Fashion) నిపుణులు కూడా ఫ్యాఆమెను ప్రశంసలతో ముంచెత్తేలా చేస్తుంది. తాజాగా ఆమె ధరించిన హారంలోని పెండెంట్ విశేషంగా నిలుస్తోంది.నీతాఅంబానీఅందమైన దుస్తులు, విలాసవంతమైన ఆభరణాలతో అభిమానులను ఆశ్చర్యపర్చడం కొత్తేమీదు. 20 ఏళ్ల నాటి చిలుక లాకెట్టు (Parrot Pendant) ఇపుడు హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఇది మైసూర్ మహారాజా యదువీర్ తన పెళ్లి రోజున ధరించిన దానితో పోలీ ఉండటం విశేషం. ప్రాముఖ్యత కూడా చాలానే ఉంది .అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ప్రైవేట్ విందు కోసం నీతా అంబానీ రెండు శతాబ్దాల నాటి, ప్యారెట్ లాకెట్తోపాటు, బ్లాక్, పర్పుల్, గ్రీన్ కలర్ కాంచీపురం చీరలో మెరిసారు. ఈ చీరలో 100 కంటే ఎక్కువ ముఖ్యమైన సాంప్రదాయ నమూనాలు ఉన్నాయి. ముఖ్యంగా న కాంచీపురంగొప్ప దేవాలయాల ప్రేరణ, చారిత్రక ,ఆధ్యాత్మిక సారాంశం కలయికలో దీన్ని తయారు చేశారు. ఈ చీరకున్న గ్రీన్, పర్పుల్ అంచులు మొత్తం చీర రూపాన్ని హైలైట్ చేశాయి. అలాగే దీనికి మ్యాచింగ్గా స్వదేశ్ నుండి వచ్చిన మణికట్టు మీద నిగనిగలాడే అంచులతో పూర్తి చేతుల బ్లౌజ్తో ధరించారు. చిన్న నల్ల హ్యాండ్బ్యాగ్ను కూడా దీనికి జతచేసింది. ప్యారెట్ పెండెంట్ఈ విందులో నీతా అంబానీ ధరించిన పచ్చ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. వజ్రాలు, కెంపులు , పచ్చలతో ముత్యాలతో పొదిగిన చిలుక ఆకారపు లాకెట్. దీని మధ్యలో పొదిగిన రూబీ హార్ట్ హైలైట్ అని చెప్పవచ్చు.దీన్ని మొదట దక్షిణ భారతదేశంలో తయారు చేశారు. దీన్ని మైసూర్ మహారాజు యదువీర్ చామరాజ వడియార్, యువరాణి త్రిషికా కుమారితో తన వివాహ సమయంలో ఇలాంటి రకమైన చిలుక లాకెట్టును ధరించాడు. లాకెట్టుకు లోతైన ప్రాముఖ్యత ఏంటంటే.. లాకెట్టులోని పక్షి బొమ్మ వాస్తవానికి కామదేవుడి వాహనము (ప్రేమ దేవుడు).అంతకుముందు నీతా అంబానీ మొఘల్ కాలం పురాతన ఆభరణాలను ఎంచుకున్నారు. గత ఏడాది నీతా అంబానీ మిస్ వరల్డ్ పోటీలో కనిపించారు. బ్లాక్ టోన్ సారీ, క్లాసీ బాజుబంద్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బాజుబంద్ వాస్తవానికి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కల్గి అట. దీని ధర రూ. 200 కోట్లు అట.అత్యంత అందమైన ఆభరణాలలో మరొకటి మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ డైమండ్ రింగ్. అనంత్ అంబానీ మంగళ్ ఉత్సవ్ వేడుకలో ఆమె దీనిని ధరించింది. ఈ ఉంగరం బరువు 52.58 క్యారెట్లు, టేపర్డ్ బాగెట్-కట్ వజ్రాలను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 53 కోట్లు అని తెలుస్తోంది. -
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి (ఫొటోలు)
మైసూరు: ప్రేమ ఎల్లలు దాటింది. మైసూరుకు చెందిన యువతి, నెదర్లాండ్కు చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఫలించింది. దీంతో పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నగరంలోని హూటగళ్లికి చెందిన విద్య, నెదర్లాండ్కు చెందిన యువకుడు రుటైర్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియపరచగా వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో నగరంలోని కల్యాణ మండపంలో చెన్నగిరి తాలూకాలోని పాండోమట్టి విరక్త మఠం డాక్టర్ గురుబసవ స్వామీజీ నేతృత్వంలో విద్యా మెడలో రుటైర్ తాళి కట్టాడు. అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి శుభాశీస్సులు పలికి విందు భోజనం ఆరగించారు. -
కర్ణాటకలో ప్రారంభమైన కుంభమేళా
మైసూరు: కర్ణాటకలో 13వ చరిత్రాత్మక కుంభమేళా ప్రారంభమైంది. మైసూరు జిల్లా టి.నరసిపురలోని కావేరి, కపిల, స్పటికా సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళా మొదలైంది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, సాధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లడానికి బదులుగా కర్ణాటకలో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని భక్తులను కోరారు. ‘‘త్రివేణి సంగమంలో భాగమైన గంగా, యమున, సరస్వతి నదులకు ఎలాగైనా దైవత్వం, స్వచ్ఛత ఆపాదించారో కావేరి నదికి సైతం అంతే ప్రాశస్త్యం ఉందని మన పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ప్రయాగ్రాజ్ మహాకుంభ్కు వెళ్లి అక్కడ కిక్కిరిసన జనం మధ్య ఇబ్బందులు పడే బదులు కర్ణాటకలో దక్షిణభారత ప్రయాగ్రాజ్గా వినతికెక్కిన టి.నరసిపుర త్రివేణి సంగమ స్థలికి విచ్చేయండి. పుణ్యస్నానాలు ఆచరించండి. అత్యంత పటిష్టవంతంగా, భక్తులకు సౌకర్యవంతంగా ఇక్కడ కుంభమేళాకు ఏర్పాట్లుచేశాం’’అని భక్తులకు శివకుమార్ పిలుపునిచ్చారు. -
డబ్బులు ఇచ్చి.. భర్త కాళ్లు విరగ్గొట్టించిన భార్య
వివాహేతర సంబంధాలు సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. వైవాహికేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఆలుమగల నైతిక విలువల పతనం మొత్తం కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఇలాంటి వార్తలను మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక (Karnataka)లో వెలుగులోకి వచ్చింది. తనను కాదని మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఓ మహిళ తన భర్త కాళ్లు విరగొట్టిచ్చింది. కిరాయి మనుషులకు డబ్బులిచ్చి మరీ ఆమె ఘనకార్యానికి పాల్పడడం గమనార్హం. బండారం బయట పడడంతో ఆమెతో పాటు ముగ్గురు నిందితులు కటకటాల పాలయ్యారు.కలబుర్గి (kalaburagi)లోని అత్తార్ కాంపౌండ్ ప్రాంతంలో చోటుచేసుచేసుకున్న ఈ ఘటన వివరాలను మీడియాకు పోలీసులు వివరించారు. వెంకటేష్, ఉమాదేవి భార్యాభర్తలు. వెంకటేష్ మరో మహిళతో వివావహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఉమాదేవికి తెలియడంతో చాలాసార్లు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఎన్నిసార్లు చెప్పినా వెంకటేష్ తన వైఖరి మార్చుకోకపోవడంతో ఉమాదేవి విసిగిపోయింది. ఏదోటి చేసి భర్తను తన దారికి తెచ్చుకోవాలని అనుకుంది. కాళ్లు విరగ్గొడితే ఇంటి పట్టునే ఉండి తన దారికి వస్తాయని అనుకుంది.తన ప్లాన్ అమలు చేయడానికి ఆరిఫ్, మనోహర్, సునీల్ అనే వ్యక్తులను సంప్రదించింది. తన భర్త కాళ్లు విరగ్గొడితే 5 లక్షల రూపాయలు ఇస్తానని వారితో చెప్పింది. ఆఫర్ నచ్చడంతో రంగంలోకి దిగిన ముగ్గురు పని పూర్తి చేశారు. దోపిడీ పథకం వేసి వెంకటేష్ రెండు కాళ్లతో పాటు చేయి విరగొట్టారు.. అయితే బాధితుడి కుమారుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బ్రహ్మపురి పోలీసులు కూపీ లాగడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. దీంతో ఉమాదేవితో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యే తన కాళ్లు విరగ్గొట్టించిందని తెలియడంతో వెంకటేష్ ఆవేదనకు గురయ్యాడు. కాగా, వెంకటేష్, ఉమాదేవి ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం.ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష మైసూరు: భర్త ఆత్మహత్యకు కారణమైన భార్య, ఆమె ప్రియుడు, ఆమె సోదరుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.25 లక్షల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. మైసూరు (Mysore) జిల్లా నంజనగూడు తాలూకా బిళిగెరె గ్రామంలో కుమార, జ్యోతి దంపతులు నివాసం ఉండేవారు. జ్యోతికి చిక్కాటి గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది.కుమారకు ఈ విషయం తెలిసి భార్యను మందలించాడు. నడత మార్చుకోవాలని పలుమార్లు సూచించాడు. అయినా ఆమె పెడచెవిన పెట్టింది. అంతేగాకుండా ప్రియుడు, తన సోదరుడితో కలిసి కుమార్ను దుర్భాషలాడి బెదిరించింది. దీంతో మనో వేదనకు గురైన కుమార 2018 జనవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు.చదవండి: ఫిర్యాదు చేసేందుకు వస్తే.. గర్భవతిని చేశాడుబిళిగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జ్యోతి, ఆమె ప్రియుడు ప్రసన్నకుమార్, ఆమె సోదరుడు మంజునాథ్పై కేసు నమోదు చేశారు. అదనపు జిల్లా కోర్టులో ఈకేసు విచారణకు వచ్చింది. దోషుల నేరం నిరూపితం కావడంతో ముగ్గురికీ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.భాగ్య తీర్పు వెలువరించారు. -
ఇన్ఫోసిస్లో 300 మంది ఫ్రెషర్ల తొలగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించింది. మైసూరులోని క్యాంపస్లో వీరికి ప్రాథమిక శిక్షణ ఇవ్వగా, అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియల్లో మెరుగైన పనితీరు చూపించలేకపోయినట్టు, మూడు విడతలు అవకాశం ఇచ్చినప్పటికీ ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ, వాస్తవానికి ఇలా తొలగించిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని ఐటీ ఉద్యోగుల సంఘం నైటెస్ తెలిపింది. కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కంపెనీపై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై మీడియా సంస్థలు వివరణ కోరగా.. ‘‘ఇన్ఫోసిస్లో కఠినమైన నియామక ప్రక్రియను అనుసరిస్తాం. మైసూరు క్యాంపస్లో విస్తృతమైన ప్రాథమిక శిక్షణ అనంతరం అంతర్గత మదింపు ప్రక్రియల్లో ఫ్రెషర్లు (ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందిన వారు) విజయం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి ఒక్కరి మూడు విడతలుగా అవకాశం కల్పిస్తాం. అయినప్పటికీ విఫలమైతే వారు సంస్థతో కలసి కొనసాగలేరు. ఉద్యోగ కాంట్రాక్టులో ఈ నిబంధన కూడా ఉంటుంది. రెండు దశాబ్దాల నుంచి ఇదే ప్రక్రియ అమల్లో ఉంది. మా క్లయింట్ల అవసరాలను తీర్చే అత్యుత్తమ నైపుణ్యాలు ఉండేలా చూడడమే ఇందులోని ఉద్దేశ్యం’’అని ఇన్ఫోసిస్ సంస్థ వివరణ ఇచ్చింది. మూడు నెలల క్రితమే చేరిక తాజాగా తొలగింపునకు గురైన వారి సంఖ్య గణనీయంగా ఉంటుందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (నైటెస్) పేర్కొంది. వీరిని 2024 అక్టోబర్లో నియమించుకున్నట్టు తెలిపింది. ‘‘ఆఫర్ లెటర్లు అందుకున్న తర్వాత వీరంతా రెండేళ్లపాటు నిరీక్షించారు. నైటెస్, బాధిత అభ్యర్థులు కలసి చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాతే వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు’’అని ప్రకటించింది. -
‘ముడా’ స్కాంలో ‘ఈడీ’ దూకుడు.. సీఎం భార్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కునేలా కనిపిస్తోంది.ఈ కేసులో తాజాగా సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేష్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ గతేడాది అక్టోబర్లో దర్యాప్తు ప్రారంభించింది.ముడా భూముల కేటాయింపు అక్రమాల్లో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆమె సోదారుడు బీఎం మల్లికార్జునస్వామి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఇదివరకే సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది.ఈకేసులో ఈడీ గతంలో లోకాయుక్తకు లేఖ రాయడం వివాదాస్పదమైంది. ముడాకు చెందిన రూ.700 కోట్ల భూమిని అక్రమంగా డీ నోటిఫై చేశారని ఆరోపించింది. ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈడీ రాజకీయ దురుద్దేశాలతో తన పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ముడాస్కాం వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. ఒకే కేసులో లోకాయుక్త, సీబీఐ ఎలా విచారిస్తాయని ప్రశ్నించారు. దీని వెనుక కేంద్రం రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఏ కేసులోనూ రెండు దర్యాప్తు సంస్థలు అవినీతి అంశంపై విచారించకూడదని ఆయన తెలిపారు. -
ఆర్సెడో సిస్టమ్స్తో సైయంట్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ సొల్యూషన్స్ అందించే ఆర్సెడో సిస్టమ్స్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సైయంట్ డీఎల్ఎం వెల్లడించింది. దీని ప్రకారం, సైయంట్ డీఎల్ఎంకి చెందిన మైసూర్ యూనిట్లో ఆర్సెడో 500 కేడబ్ల్యూపీ సామర్ద్యం గల రూఫ్టాప్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.ప్లాంటు డిజైన్, ఇంజినీరింగ్, ఇన్స్టాలేషన్, నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఇందులో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్ను సైయంట్ డీఎల్ఎం కొనుగోలు చేస్తుంది. విద్యుత్ వ్యయాలను గణనీయంగా తగ్గించుకునేందుకు, పర్యావరణ అనుకూల విధానాల వినియోగాన్ని పెంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని సైయంట్ డీఎల్ఎం సీఈవో ఆంథోనీ మోంటల్బానో, ఆర్సెడో సిస్టమ్స్ సీఈవో సందీప్ వంగపల్లి తెలిపారు. -
ఎర్ర ఆకులతో అరటి చెట్టు.. ఎక్కడైనా చూశారా?
ఎర్ర అరటి పండు మనకు అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే, ఎర్ర ఆకులతో కూడిన అరటి చెట్టు అరుదనే చెప్పాలి. దీని ఆకు మాదిరిగానే కాయ కూడా ఎర్రగానే ఉంటుంది. కర్ణాటకలోని సిర్సికి చెందిన రైతు ప్రసాద్ కృష్ణ హెగ్డే ఈ అరుదైన అరటి వంగడాన్ని సంరక్షిస్తున్నారు. దీనితో పాటు ఆయన మరో 80 అరటి రకాలను తన పొలంలో పెంచుతూ అరటి పంటల్లో వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. ప్లాస్టిక్ బనానా అనే మరో రకం కూడా ఈయన దగ్గర ఉంది. దీని ఆకులను భోజనం చేయటానికి వాడతారట. మైసూరులో ఇటీవల 3 రోజుల పాటు సహజ సమృద్ధ, అక్షయకల్ప ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘అరటి పండుగ’ సందర్భంగా ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. 550 అరటి రకాలను సంరక్షిస్తున్న కేరళకు చెందిన వినోద్ నాయర్ 75 రకాల అరటి పండ్లను ఈ ఉత్సవంలో ప్రదర్శించటం మరో విశేషం. వినోద్ నాయర్తో పాటు 100 దేశీ అరటి రకాలను సంరక్షిస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్ను సైతం ఘనంగా సత్కరించారు.ఆహార నిపుణురాలు, రచయిత్రి రత్న రాజయ్య అరటి పండుగలో మాట్లాడుతూ ఏదో ఒకే రకం అరటిని సాగు చేయటం ప్రమాదకరమని, ఏదైనా మొండి తెగులు సోకిందంటే మొత్తం ఆ అరటి రకమే అంతరించిపోతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం అరటి రకాల్లో జీవవైవిధ్యాన్ని మన తరం పరిరక్షించుకోవాలని పలుపునిచ్చారు.ఎర్ర అరటి జగత్ప్రసిద్ధంసహజ సమృద్ధ ఎన్జీవో డైరెక్టర్ జి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘అరటి బంగారంతో సమానం. అరటి ప్రపంచం పెద్దది. వందలాది వంగడాలున్నాయి. మానవ జీవితంలో పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు అనేక సందర్భాల్లో, ఆచార వ్యవహారాల్లో అరటి పండు సాంస్కృతిక అవసరం ఉంటుంది. ప్రతి రకం రుచి, రంగు, సైజు, చెట్టు ఎత్తులో వైవిధ్యభరితంగా ఉంటాయ’న్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి అరటి రకాలున్నాయి. ఆఫ్రికన్ జంజిబార్ స్ప్రౌట్ లాంగ్ బనానా, ఇండోనేషియా జావా బ్లూ బనానా, హవాయికి చెందిన తెల్ల చారల అరటితో పాటు దక్షిణాసియాకు సంబంధించి ఎర్ర అరటి రకాలు జగత్ప్రసిద్ధి గాంచాయన్నారు.చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!అరటికి భారతదేశం పుట్టిల్లు. ఇక్కడ ఎన్నో వందల రకాల అరటి వంగడాలు కనిపిస్తాయి. భింకెల్ అనే రకం అరటి చెట్టు ఎత్తయిన దూలం మాదిరిగా ఉంటుంది. కేరళకు చెందిన పొడవాటి రకం అరటి గెలకు వెయ్యి కాయలుంటాయి. ప్రపంచంలోకెల్లా ఇదే అతి పొడవైన అరటి రకం. కొడిగుడ్డు అంత చిన్న అరటి కాయ రకం కూడా ఉంది అన్నారు కృష్ణప్రసాద్. కర్ణాటకకు ప్రత్యేకమైన అరటి రకాలు ఉన్నాయన్నారు. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న కావెండిష్ బ్రీడ్ల అరటి పంటలను సాగు చేయటం ప్రారంభమైన తర్వాత దేశీ వంగడాలు మరుగున పడిపోయాయంటున్నారు కృష్ణప్రసాద్. ఒకే రకం అరటి సాగు చేస్తే పనామా కుళ్లు తెగులు సోకే ముప్పు ఉందని చెబుతూ, ఈ తెగులు సోకిందంటే పంటంతా తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నారు.కార్డమమ్, నెండ్ర ఆర్గానిక్ సాగుకు అనుకూలంసేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన అరటి పండ్లకు ఈ రోజుల్లో అధిక డిమాండ్ ఉందన్నారు కృష్ణప్రసాద్. సేంద్రియంగా సాగు చేయటం వల్ల భూమి కరువు బారిన పడకుండా ఉంటుంది. రసాయనాలకు ఖర్చుపెట్టే డబ్బు ఆదా అవుతుంది అన్నారాయన. కార్డమమ్, నేండ్ర అరటి రకాలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటానికి అనువైనవే కాక, మార్కెట్ డిమాండ్ రీత్యా కూడా ఇవి మేలైనవని దేశీ విత్తన నిపుణుడు కూడా అయన కృష్ణప్రసాద్ వివరించారు. అరటి సాళ్ల మధ్యన ముల్లంగి, ఆకుకూరలు, గుమ్మడి, బీన్స్, పసుపు, చిలగడదుంప పంటలను సాగు చేసుకోవచ్చని కృష్ణప్రసాద్ వివరించారు. ఇతర వివరాలకు.. 94821 15495. -
మైసూర్లో రామ్చరణ్,జాన్వీకపూర్ ప్రయాణం
హీరో రామ్చరణ్ ఓ వైపు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్సీ 16’(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు ఈ నెలలో మైసూర్ వెళ్లనున్నారాయన. తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్చరణ్తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు ‘ఆర్సీ 16’ ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన శివ రాజ్కుమార్ పవర్ఫుల్ రోల్ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్లో మొదలవుతుందని సమాచారం. రామ్ చరణ్తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారట బుచ్చిబాబు. అక్కడ నాన్స్టాప్గా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
విద్రోహచర్య కారణంగానే భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం !
న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అక్టోబర్ 11న జరిగిన మైసూర్–దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర దాగి ఉందని ముగ్గురుసభ్యుల రైల్వే సాంకేతిక బృందం అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన చోట పట్టాలకు ఎలాంటి బోల్ట్లు లేకపోవడం, పట్టాలను ఎవరో బలవంతంగా అపసవ్య దిశలోకి సుత్తితో కొట్టిన గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 15 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడిన విషయం తెల్సిందే. సవ్యదిశలో నేరుగా వెళ్లాల్సిన రైలు లూప్లైన్లోకి హఠాత్తుగా వచ్చి ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొనడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో రైల్వే సిగ్నల్, టెలికం, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ బృందం ఆదివారం కవరపేట స్టేషన్లోని ఘటనాస్థలిలో దర్యాప్తు మొదలెట్టింది. ‘‘రైల్వేపట్టాల ఇంటర్లాకింగ్ వ్యవస్థలోని భాగాలను విడదీశారు. వీటి గురించి బాగా అవగాహన ఉన్న ఆగంతకులే ఈ పని చేశారు. ఇటీవల కవరపేట స్టేషన్ సమీపంలో ఇలాంటి దుశ్చర్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడ మాత్రం సఫలమయ్యారు. ఘటన జరగడానికి నాలుగు నిమిషాల ముందే ఇదే పట్టాల మీదుగా ఒక రైలు వెళ్లింది. అది వెళ్లి మైసూర్–దర్భంగా రైలువచ్చేలోపే బోల్ట్లు, విడిభాగాలు విడతీశారు’’ అని అధికారులు వెల్లడించారు. -
తమిళనాడులో గూడ్స్ రైలును ఢీ కొన్న మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్... రెండు బోగీల్లో మంటలు... పట్టాలు తప్పిన 13 కోచ్లు.. ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
-
దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!
మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్లో జరిగే ఉత్సవాలు. ఇదీ ఒక్కమాటలో చెప్పాలంటే మైసూర్ టూర్. వడయార్ రాజకుటుంబీకులు మైసూర్ ప్యాలెస్లో సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా పబ్లిక్ను ప్యాలెస్లోకి అనుమతిస్తారు. ప్యాలెస్ లోపల వడయార్ కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులు, నాటి హస్తకళాఖండాలుంటాయి. దర్బార్ హాల్లో బంగారు సింహాసనాన్ని చూడవచ్చు. ఆ రోజుల్లో అందంగా అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలో ప్రత్యేకాకర్షణ. పది రోజుల పాటు ప్యాలెస్ ఆవరణలో సంగీత, నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. మైసూర్ ప్యాలెస్ని చూసిన తర్వాత కరంజి లేక్లో బోట్ షికారు చేసి, వన్యప్రాణుల మధ్య విహరించాలి. జయచామరేంద్ర ఆర్ట్ గ్యాలరీ, ఫిలోమినా చర్చ్ కోసం కూడా కొంత టైమ్ కేటాయించుకోవాలి. ఇక మైసూరు వంటలను రుచి చూడడంతోపాటు మైసూర్ సిల్క్ చీరలను కొనడంతో ట్రిప్ పరిపూర్ణమవుతుంది. పిల్లలతో వెళ్లిన వాళ్లు తప్పకుండా రైల్ మ్యూజియాన్ని కవర్ చేయాలి.ఉదయాన్నే చూడాలి..!మైసూర్ ప్యాలెస్లోకి పదిగంటలకు పర్యాటకులను అనుమతిస్తారు. ఆ సమయానికి పది నమిషాల ముందే చేరినట్లయితే జనం తక్కువగా ఉంటారు. పదిన్నర తర్వాత ప్రతి అరగంటకు జనసమ్మర్దం గణనీయంగా పెరుగుతుంది. తొమ్మిదింటికే చేరగలిగితే సూర్యకిరణాలకు మెరిసే ప్యాలెస్ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు. ప్యాలెస్ లోపల ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. కెమెరాకు టికెట్ తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రమే అనుమతిస్తారు పర్యాటకుల వస్త్రధారణ ప్యాలెస్ నియమాలకు లోబడి ఉండాలి. దుస్తులు భుజాలను కవర్ చేస్తూ, మోకాళ్ల కింద వరకు ఉండాలి ∙ ప్యాలెస్ లోపల కొన్ని చోట్లకు పాదరక్షలను అనుమతించరు. ఈ కాలం నేల చల్లగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సాక్స్ వేయడం మంచిది పెద్దవాళ్లు ప్యాలెస్ మొత్తం నడుస్తూ చూడడం కష్టమే. సిద్ధంగా ఉంచిన వీల్ చైర్లను వాడుకోవచ్చు. గైడ్ చెప్పే ఆసక్తికరమైన, హాస్యపూరితమైన కథనాలను ఎంజాయ్ చేయవచ్చు ఆడియో గైడ్ సౌకర్యం ఉంది. దానికి చార్జ్ ఎక్కువనిపించినప్పటికీ తప్పకుండా ఆడియోలో ప్యాలెస్ గురించిన వివరాలను వింటూ తిలకించాలి రాత్రి లైట్ షో కూడా చూడాలి. ఆ షోకు కూడా ముందుగా వెళ్తే షో బాగా వీక్షించే అవకాశం ఉంటుంది. (చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
మైసూర్ ప్యాలెస్లో మొదలైన దసరా ఉత్సవాలు..(ఫొటోలు)
-
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
విచారణకు భయపడను: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు:మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్లో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. విచారణకు భయపడటం లేదన్నారు.ఈ విషయమై సిద్ధరామయ్య బుధవారం(సెప్టెంబర్25) సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ముడా స్కామ్పై బెంగళూరు ప్రత్యేక కోర్టు బుధవారం విచారణకు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తునకు అనుమతించింది.మూడు నెలల్లో ముడా స్కామ్పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్ పోలీసులను ఆదేశించింది.ఈ కేసులో సిద్ధరామయ్యకు మంగళవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్లో తనను విచారించేందుకుగాను గవర్నర్ అనుమతి మంజూరు చేయడంపై సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. -
నేడు కర్ణాటకలో కాంగ్రెస్ నిరసనలు
బెంగళూరు: మైసూరులో భూకేటాయింపుల వివాదంలో కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ అనుమతించడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం ప్రకటించారు. ‘‘ ఏం లేకున్నా గవర్నర్ దీన్నొక కేసులా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నిరసన బాటలో పయనిస్తుంది. తాలూకా, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ మెమొరాండం అందజేస్తారు’’ అని నిరసన కార్యక్రమ వివరాలను డీకే వివరించారు. 22న సీఎల్పీ భేటీగవర్నర్ నిర్ణయాన్ని ఐకమత్యంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని చాటేందుకు 22వ తేదీన సీఎల్పీ భేటీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ‘‘ ముడా భూకేటాయింపుల అంశంపై ఈ భేటీలో చర్చిస్తారు. చట్టబద్ధంగా ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నామో ఆయన వివరిస్తారు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాదించనున్న సింఘ్వీ, సిబల్ !మైసూరు భూకేటాయింపుల కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం సిద్ధరామయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ వాదించే అవకాశముంది. ఈ మేరకు వీరిద్దరూ నేడు బెంగళూరుకు వస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. -
నాలుక అబద్ధం చెప్పదు..
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్ను విజిట్ చేసేవాళ్లు.స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్కి గవాస్కర్, సచిన్ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.టూర్లో ‘టేస్ట్’ చూస్తాను..ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్. -
చెన్నై–మైసూర్ మధ్య హైస్పీడ్ రైలు
సాక్షి, అమరావతి : దక్షిణ భారతదేశంలో చెన్నై–మైసూర్ మధ్య తొలి హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మీదుగా ప్రత్యేక కారిడార్ను నిరి్మంచాలని జాతీయ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 463 కి.మీ. మేర ఈ కారిడార్ను నిర్మిస్తారు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ 83 కి.మీ.మేర నిరి్మంచనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్ను రైల్వేశాఖ సూత్రప్రాయంగా ఆమోదించి భూసేకరణ ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఖరారు చేయనుంది. మూడు రాష్ట్రాల మీదుగా.. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా నిర్మిస్తారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూర్ వరకు నిరి్మస్తారు. మొత్తం 463 కి.మీ. పొడవైన ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్లో 83 కి.మీ. మేర ఉంటుంది. తమిళనాడులో 122 కి.మీ, కర్ణాటకలో 258 కి.మీ. మేర నిరి్మస్తారు. రెండు దశలుగా చేపట్టే ఈ ప్రాజెక్టును మొదటి దశ కింద చెన్నై నుంచి బెంగళూరు వరకు 306 కి.మీ., రెండో దశ కింద బెంగళూరు నుంచి మైసూర్ వరకు 157 కి.మీ. మేర నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇక అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ హైస్పీడ్ కారిడార్లో భాగంగా ఏలివేటెడ్ కారిడార్, ఎట్ గ్రేడ్, టెన్నెల్, గ్రీన్ఫీల్డ్ సెగ్మెంట్లుగా నిర్మించాలని డిజైన్ను ఖరారుచేశారు. ఈ కారిడార్లో భాగంగా 30 కి.మీ.మేర సొరంగాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. చెన్నైలో 2.8 కి.మీ, చిత్తూరులో 11.8 కి.మీ., బెంగళూరు రూరల్లో 2 కి.మీ., బెంగళూరులో 11 కి.మీ. మేర వీటిని నిర్మిస్తారు. మొత్తం 11 స్టేషన్లు.. ఏపీలో చిత్తూరులో హాల్ట్.. ఇక ఈ హైస్పీడ్ రైలుకు చెన్నై–మైసూర్ మధ్య 11 చోట్ల హాల్ట్లు కల్పిస్తారు. ఏపీలో ఒక్క చిత్తూరులోనే ఉంటుంది. దీంతోపాటు చెన్నై, పూనమల్లి, కోలార్, కొడహళ్లి, వైట్ఫీల్డ్, బైయపనహళ్లి, ఎల్రక్టానిక్స్ సిటీ, కెంగేరీ, మాండ్య, మైసూర్లలో ఎలివేటెడ్ రైల్వేస్టేషన్లను నిరి్మస్తారు. భూసేకరణ ప్రక్రియపై కసరత్తు.. హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 303 గ్రామాలు, పట్టణాల మీదుగా నిరి్మంచాల్సి ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. అందుకోసం తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రామనగర, మాండ్య, మైసూర్ జిల్లాల్లో 2,905 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 2,660 ఎకరాలు ప్రైవేటు భూములే. ప్రస్తుతం రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు.. భూసేకరణ ప్రక్రియపై ప్రాథమిక కసరత్తు చేపట్టింది. అనంతరం డీపీఆర్ను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. 2025–26 ఆరి్థక సంవత్సరంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నది రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ట వేగం గంటకు 350 కి.మీ..ఇక ఈ హైస్పీడ్ రైల్ గంటకు గరిష్టంగా 350 కి.మీ. వేగంతో దూసుకపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని నిర్వహణ వేగం గంటకు 320 కి.మీ.గా నిర్ణయించారు. సగటు వేగం గంటకు 250 కి.మీ. ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. మొత్తం 730 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. -
మైసూరు మహారాజు వడయార్ ఘన విజయం
లోక్సభ ఎన్నికల్లో మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఘన విజయం సాధిచించారు. మైసూరు లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వడయార్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 1,39,262 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.ఈ ఎన్నికల్లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మొత్తం 7,95,503 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణకు 6,56,241 ఓట్లు వచ్చాయి. మైసూరు రాజ్యాన్ని వడయార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్ర్యం అనంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1974లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ రాజు అయ్యారు.1984-1999 లో కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందిన ఆయన 2013లో కన్నుమూశారు.శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ మరణం తర్వాత మైసూరు 27వ రాజుగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషిక్తుడయ్యారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2016లో దుంగార్పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు. -
Thayamma: వెట్టి నుంచి విముక్తి వరకు
మైసూరు చుట్టుపక్కల చెరుకు తోటల్లో వెట్టి పాలేర్లను పెట్టుకోవాలని చూస్తారు కొంతమంది. అప్పులిచ్చి వాళ్లను పాలేర్లుగా మారుస్తారు. తాయమ్మ కూడా ఒక వెట్టి పాలేరు. కానీ, ఆమె వెట్టి నుంచి బయట పడింది. సొంత ఉపాధి పొందింది. అంతే కాదు అప్పులపాలై వెట్టికి వెళ్లే దిగువ వర్గాల స్త్రీల విముక్తికి పోరాడుతోంది. మైసూరుకు చెందిన తాయమ్మ ఒక యోధురాలు. ధీర.‘అదంతా ఎలా తట్టుకున్నానో. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది’ అంటుంది తాయమ్మ. 33 ఏళ్ల ఈ ముగ్గురు పిల్లల తల్లి చేసిన నేరం ఏదైనా ఉంటే వెనుకబడిన వర్గాల్లో పుట్టడం. పేదరికంలో ఉండటం. ‘మా పేటల్లో సరైన ఇళ్లు ఉండవు. పరిశుభ్రత ఉండదు. మా కాలంలో మమ్మల్ని చదివించకుండా పొలాల్లో పని చేసే కూలీలను చేశారు. నేనూ నా భర్త మూర్తి ఇద్దరం పాలేరు పనులు చేస్తూనే పెళ్లి చేసుకున్నాం. ముగ్గురు పిల్లల్ని కన్నాం. వారి భవిష్యత్తు కోసం ఆరాట పడటమే మేము చేసిన నేరం’ అంటుంది తాయమ్మ.మైసూరు జిల్లాలోని లోపలి ్రపాంతమైన హన్సూర్ అనే ఊరిలో చెరకు పండిస్తారు. రోజువారీ కూలీల కంటే వెట్టి కూలీలుగా కొందరిని పెట్టుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తారు. దిగువ వర్గాల వారి ఆర్థికస్థితిని అవకాశంగా తీసుకుని వారి చేత వెట్టి చేయించుకుంటారు. ‘నా భర్త మూర్తి మాకున్న కొద్ది స్థలంలో ఒక చిన్న ఇల్లేదైనా వేసుకుందామని అనుకున్నాడు. మా ముగ్గురు పిల్లల్ని శుభ్రమైన వాతావరణంలో పెంచాలని అనుకున్నాము. అందుకు 60 వేలు అప్పు తీసుకున్నాం. ఆ కొద్ది అప్పు వడ్డీతో కలిసి మా జీవితాలను తల్లకిందులు చేసింది. అప్పు తీర్చలేకపోవడం వల్ల నేను, నా భర్త వెట్టికి వెళ్లాల్సి వచ్చింది. 2015 నుంచి 2017 వరకు మూడేళ్ల పాటు నేను, నా భర్త చెరుకు తోటల్లో వెట్టి చాకిరీ చేశాం. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మాకు పని ఉండనే ఉండేది. నేను నా చిన్న కొడుకును వీపున కట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని, కూడు నెత్తిన పెట్టుకుని పనికి వెళ్లేదాన్ని. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోయినా ఒకరు పొలంలో ఉండి ఒకరు ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అంత ఘోరమైన వెట్టి అది. నా పిల్లలు బాగా చదువుకుంటేనే ఇలాంటి వెట్టి నుంచి బయటపడగలరనుకున్నాను. మూడేళ్లు కష్టపడి పని చేసినా మాకు విముక్తి రాకపోయేసరికి ఎవరో అధికారులకు చెప్పి మాకు విముక్తి కలిగించారు.’ అని చెప్పింది తాయమ్మ.స్వేచ్ఛ పొందిన తాయమ్మ, ఆమె భర్త వాళ్లకు ఉన్న ఒక కొబ్బరి చెట్టు కాయలతో చిన్న షాప్ పెట్టుకున్నారు. కర్నాటకలో వెట్టి పాలేర్ల విముక్తి కోసం పని చేసే ‘ఉదయోన్ముఖ ట్రస్ట్’ తాయమ్మకు లోన్ ఇప్పించింది– కుట్టు మిషన్ల కోసం. తాయమ్మకు కుట్టు పనిలో ఉన్న ్రపావీణ్యం ఇప్పుడు ఆమెనే కాదు, ఆమెలా వెట్టి నుంచి విముక్తి పొందిన మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కలిగిస్తోంది.‘ఇంటిని ముందుకు నడపడంలో స్త్రీ కీలకం. ఆమె ఓడిపోకూడదు. కుటుంబం కోసం పోరాడాలి. అడ్డంకులను అధిగమించాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఈ హక్కు అందరు పిల్లలకు దొరకాలి. వలస వచ్చే కూలీలు, దిగువ కులాల పేదలు వెట్టిలో చిక్కుకుంటున్నారు. వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వారి పిల్లలకు సరైన చదువు అందేలా ప్రభుత్వాలు పని చేయాలి’ అంటోంది తాయమ్మ. -
ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత?
మైసూర్: ఎన్నికలు మొదలయ్యాయంటే.. బెట్టింగులు, కోట్లాది రూపాయల డబ్బుల ఖర్చు, తాయిలాలు, ఆకర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బేరసారాలు, అలకలు, కులుకులు.. అన్నీ మామూలే. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ నాయకులు తమవంతు ప్రయత్నాలు భారీగానే చేస్తారు. ఇప్పటికే దేశం మొత్తం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. భారీ నగదు, లేదా లిక్కర్ తరలించడం చట్టరీత్యా నేరం. పలు ప్రాంతాల్లో లెక్కకు మించిన డబ్బు పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో భారీ లెవల్లో ఇల్లీగల్ లిక్కర్ పట్టుబడినట్లు తెలుస్తోంది. చామరాజనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మైసూర్ జిల్లా నంజనగూడు తాలూకాలోని తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం ఆకస్మికంగా సందర్శించింది. ఈ ఆపరేషన్లో మైసూర్ డివిజన్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భారీ అక్రమ మద్యం నిల్వలు ఘటన పెద్ద సంచలంగా మారింది. ఇప్పటికే సుమారు 14 వేలకు పైగా బాక్సులు కేరళకు చేరుకున్నాయని, 7,000 బాక్సులు మాత్రమే సోదాల్లో కనుగొన్నారని తెలుస్తోంది. అక్రమ రవాణా & హోర్డింగ్ వంటి వాటికి పాలపడిన కారణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. Based on a tip-off, excise department officials made a high-stakes raid on United Breweries Limited in Nanjangud taluk of #Mysuru, unearthing an astonishing stash of illegal liquor valued at a jaw-dropping Rs. 98.52 crore. This shocking discovery, coinciding with the fervor of… pic.twitter.com/Q1QjgA4Hbb — Karthik K K (@Karthiknayaka) April 4, 2024 -
బరిలోకి మైసూరు మహారాజు.. సిట్టింగ్ ఎంపీకి బీజేపీ షాక్
బెంగళూరు: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. తొలి జాబితాలో దేవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా.. నేటి జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కలిపించింది. ఇక ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండు లిస్ట్లు కలిపి ఇప్పటి వరకు మొత్తం 267 స్థానాలకు అభ్యర్థులను కాషాయ పార్టీ ప్రకటించింది. ఇక తాజా లిస్ట్లో కర్ణాటకలోని మైసూర్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహాకు బీజేపీ షాక్ ఇచ్చింది. మైసూరు రాజ వంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజను బరిలోకి దింపింది. గతేడాది పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం వివాదంలో మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా కేంద్రబిందువుగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డిసెంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతుండగా లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి దూకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టియర్గ్యాస్ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ కేసులో నిందితులిద్దరూ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా ద్వారానే విజిటర్స్ పాస్లు పొందినట్లు అధికారులు గుర్తించారు. చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులు వీళ్లే పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని, ప్రతాప్ సింహాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే బీజేపీ ప్రతాప్ సింహాకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ ఇవ్వకుంటే తన మద్దతుదారులు, అభిమానులు ఎలాంటి నిరసనలు చేపట్టరాదని ఈ రోజు ఉదయమే మైసూర్ ఎంపీ కోరారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రధాని మోదీనే కారణమని.. ఆయనకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మోదీ కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతేగాక బీజేపీ రెండో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వెంటనే మైసూర్ రాజ వంశాన్ని సింహా అభినందించారు. మహారాజా యదువీర్కి అభినందనలు తెలిపారు. -
12 ఏళ్లుగా భార్యను గదిలో బంధించిన భర్త.. ఎందుకంటే!
బెంగళూరు: కట్టుకున్న భార్యపట్ల అమానవీయంగా ప్రవర్తించాడో భర్త. అర్థం లేని అనుమానాలతో ఆమెను గృహ నిర్బంధంలో బంధించాడు. కనీసం వాష్రూమ్ సదుపాయం లేని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. తన పిల్లలను కూడా కలవనివ్వలేదు. ఒకటి కాదు రెండు దాదాపు గత 12 ఏళ్లుగా భార్యను ఇలాగే వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు శాడిస్టు భర్త. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణం చుట్టు పక్కల వాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళకు బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు. భర్త ఏ పనిమీద బయటకు వెళ్లినా తనను ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్తాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా, పదే పదే కొట్టేవాడని చెప్పింది. గత 12 ఏళ్లుగా మానసిక క్షోభకు గురి చేశాడని, ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని పేర్కొంది. చాలా కాలంగాచి ఈ బాధతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది. విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ఈ విషయమై కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై అతడికి విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటానని తెలిపింది. కాగా అతడికి బాధితురాలు మూడో భార్య మొదట రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతడి వేధింపులకు తాళలేక వారిద్దరూ వదిలేసి వెళ్లిపోయారు. వీరికి ఇద్దరు పిల్లల -
చలో మైసూర్
హీరో రామ్చరణ్ కొన్ని రోజులు మైసూర్కు మకాం మార్చనున్నారట. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసిందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ నెల చివర్లో జరగనున్న ఈ షెడ్యూల్లో రామ్చరణ్పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా శంకర్ ప్లాన్ చేశారట. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘గేమ్చేంజర్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
మైసూర్లో నా సామిరంగ
హీరో నాగార్జున కొన్ని రోజులు మైసూర్కు మకాం మార్చారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్లో ప్రారంభమైందని సమాచారం. నాగార్జున, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆషికా రంగనాథన్ , మిర్నా మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. -
మహిష దసరా వివాదం ఏమిటి? బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
కర్నాటకలోని మైసూరులో అక్టోబరు 13 నుంచి మహిష దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఇవి రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దసరా నేపథ్యంలో సాంస్కృతిక నగరమైన మైసూర్ అందంగా ముస్తాబైంది. ప్యాలెస్ భవనంలో నూతన బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తున్నారు. కాగా మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ స్నేహమహి కృష్ణ అనే వ్యక్తి మైసూర్ 8వ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం మహిష దసరా ఆచారణ కమిటీ చైర్మన్కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై విచారణ అక్టోబర్ 11వ తేదీకి వాయిదా పడింది. 2015 నుంచి దళిత అనుకూల సంస్థలు, అభ్యుదయవాదులు మైసూర్లో మహిష దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిష దసరా వేడుకల నిర్వహణకు అవకాశం కలగలేదు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక మహిష దసరా వేడుకల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. మహిష దసరా వేడుకలపై ఎంపీ ప్రతాపసింహ తదితరులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మహిష దసరా వేడుకలు జరగనివ్వబోమని ఆయన అన్నారు. కాగా ఈసారి 50 ఏళ్ల మహిష దసరా వేడుకలు జరుపుకుంటున్నట్లు మహిష దసరా వేడుకల కమిటీ పోస్టర్ను విడుదల చేసింది. మహిష దసరా సెలబ్రేషన్ కమిటీ, మైసూర్ యూనివర్సిటీ పరిశోధకుల సంఘం అక్టోబర్ 13న మహిష దసరా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాయి. చాముండి కొండను మహిష కొండగా పేర్కొంటూ ఆహ్వాన పత్రికను కూడా విడుదల చేశారు. ఈ నేపధ్యంలో మహిష దసరా వివాదాస్పదమయ్యింది. మహిష దసరా వేడుకలను వ్యతిరేకించాలని బీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మహిషుని పేరుతో ఉత్సవాలు నిర్వహించడమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే మహిష దసరా కమిటీ దీనిపై స్పందిస్తూ ‘మహిషను రాక్షసునిగా తప్పుగా అభివర్ణించారన్నారు. మైసూరు రాజు మహిష పరిపాలనను నాటి ప్రజలు ఎంతో ఇష్టపడేవారన్నారు. అందుకే మహిష దసరా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
రివర్స్ గేర్లో 2 కి.మీ.లు
మైసూరు: అటవీ ప్రాంతంలో ప్రసవం కోసం గర్భిణిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా అడవి ఏనుగు అడ్డువచ్చి దాడికి యతి్నంచింది. అంబులెన్స్ డ్రైవర్ చాకచక్యంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కు తీసుకెళ్లి గర్భిణిని కాపాడాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటెలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. జీఎం హళ్ళి గ్రామానికి చెందిన లంబాడి మహిళ సుచిత్ర నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చి హెచ్డికోటె ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఒక అడవి ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడింది. సుమారు 15 నిమిషాల పాటు గజరాజు కదలకుండా అలాగే ఉంది. డ్రైవర్ శరత్ అంబులెన్స్ను ముందుకు పోనివ్వగా ఏనుగు అంబులెన్స్ మీదకు దూసుకొచ్చింది. దీంతో డ్రైవర్ రివర్స్ గేర్ వేసి సుమారు 2 కిలోమీటర్ల దూరం వెనక్కు ప్రయాణించాడు. ఏనుగు కొంతదూరం వెంబడించి నిలిచిపోయింది. అంబులెన్స్లో ఉన్న ఆశా కార్యకర్త సావిత్రిబాయి గర్భిణికి కాన్పు చేసింది. తరువాత మరో మార్గంలో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. -
ప్రాణం పోతున్నా ఎవరూ పట్టించుకోరే?
కర్ణాటక: మైసూరులో రైలు ఎక్కిన ప్రయాణికునికి ఫిట్స్ (మూర్ఛ) వచ్చి కింద పడి గిలగిలాకొట్టుకున్నాడు. కానీ చికిత్స మాత్రం దొరకలేదు. చివరకు అభాగ్యుడు రైల్లోనే మరణించాడు. ఈ ఘటనలో రైల్వే అధికారుల నిర్లక్ష్యముందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైసూరు రైల్వేస్టేషన్లో నిర్లక్ష్యం ఫిట్స్తో గంట పాటు వృద్ధుని ప్రయాణం చికిత్స అందక కన్నుమూత వివరాలు.. మైసూరు రమాబాయి నగరకు చెందిన పి.స్వామి (83) అనే వృద్ధుడు బెంగళూరుకు వెళ్లేందుకు మైసూరు రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైలు ఎక్కాడు. రైలు మైసూరు స్టేషన్లో కదలడానికి ముందే అతడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వెంటనే సహ ప్రయాణికులు ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు. రైల్వేస్టేషన్లో ఉన్న నర్సు వచ్చి పరీక్షించి ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత రైలు బయలుదేరి ముందుకు కదిలింది. మార్గమధ్యలో శ్రీరంగపట్టణ, పాండవపుర రైల్వేస్టేషన్లో అస్వస్థతకు గురైన స్వామిని చికిత్స కోసం పంపించకుండా రైల్వే పోలీసులు తాత్సారం చేశారు. దీంతో పాండవపుర రైల్వే స్టేషన్లో ప్రయాణికులు గొడవ చేశారు. అనంతరం చిక్కబ్యాడరహళ్లి రైల్వే స్టేషన్కు రైలు చేరుకున్న తర్వాత రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో తోటి ప్రయాణికులు ఇక తమ గొడవను పెద్దగా చేశారు. ముందు వచ్చే యలియూరు రైల్వే స్టేషన్కు అంబులెన్స్ వస్తుందని, అప్పుడు స్వామిని తరలిస్తామని రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే రైలు యలియూరు స్టేషన్కు వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి అంబులెన్స్ కనిపించలేదు. ఇదంతా జరిగి అప్పటికే గంట సమయం వృథా అయింది. దీంతో స్వామి రైలులోనే ఎంతో ఇబ్బంది పడుతూ మృతి చెందాడు. మండ్యలోనూ అదే తంతు మధ్యాహ్నం 3.40 గంటలకు మండ్య రైల్వే స్టేషన్కు రైలు వచ్చినప్పుడు పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చికిత్స లభించక స్వామి మరణించాడని ప్రయాణికులు ఆరోపించారు. తోటి ప్రయాణికుల సహాయంతో స్వామి మృతదేహాన్ని ఇతర ప్రయాణికులు రైలు నుంచి కిందకి దించి ప్లాట్ఫారమ్పై ఉంచారు. సుమారు 45 నిమిషాల పాటు మృతదేహం ప్లాట్ఫారమ్పైనే ఉంది. తరువాత మృతదేహాన్ని జిల్లాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి చొక్కాలోని ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైసూరు రమాబాయినగర నివాసి అని గుర్తించారు. స్వామి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టమ్ నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. చికిత్స చేసి ఉంటే బతికేవాడు నేను పాండవపుర పోలీసు స్టేషన్లో రైలు ఎక్కాను.. ఒక ప్రయాణికుడు కుప్పకూలిపోయి ఇబ్బంది పడుతున్నాడు. స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. పోలీసుల హామీ మేరకు యలియూరు రైల్వే స్టేషన్లో ఎదురు చూసినా అంబులెన్స్ రాలేదు. మైసూరులోనే అంబులెన్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించి ఉంటే బతికేవాడేమో.. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఒక ప్రాణం పోయింది. –పుష్పలతా, రైలు ప్రయాణికురాలు, బెంగళూరు -
ఘోర ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు ఇన్నోవా కారును ఢీకొట్టిన ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు జిల్లాలోని కొల్లేగల - టీ నర్సిపుర ప్రధాన రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బళ్లారికి చెందిన వారని, మలే మాదేశ్వరుని దర్శించుకుని మైసూరు నగరానికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయి తీవ్రంగా చితికిపోయినట్లు కనిపించాయి. చదవండి: పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే -
గేమ్ ఛేంజర్: మైసూర్ వెళ్లనున్న రామ్చరణ్
‘గేమ్ చేంజర్’ మూమెంట్స్ కోసం మైసూర్ వెళ్లనున్నారు రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, ఎస్జే సూర్య, జయరాం, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా భారీ క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్లో జరిగింది. కాగా ‘గేమ్ చేంజర్’ నెక్ట్స్ షెడ్యూల్ మైసూర్లో జరగనున్నట్లు తెలిసింది. జూన్ మొదటివారంలో రామ్చరణ్, శంకర్ అండ్ కో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం మైసూర్ ప్రయాణం కానున్నారని సమాచారం. దాదాపు పది రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. జపాన్లో మేజిక్ జరిగింది: రామ్చరణ్ భార్య ఉపాసన గర్భవతి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం తనకు ఏడో నెల అని శ్రీనగర్లో జరిగిన ‘జీ 20’ కార్యక్రమంలో పాల్గొన్న రామ్చరణ్ అన్నారు. ఇదే వేదికపై జపాన్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అది ఇప్పుడు ఇంకా స్పెషల్ అని, ఎందుకంటే జపాన్లోనే ఈ మేజిక్ (భార్య ప్రెగ్నెన్సీ గురించి) జరిగిందనీ రామ్చరణ్ పేర్కొన్నారు. -
కర్నాటక: ఎన్నికల సిత్రం.. మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటకలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశాయి. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమచారం మేరకు ఐటీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, మైసూర్లోని సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం గమనించారు. వాటిని తీసి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేశారు. వాటి విలువ కోటి రూపాయలు ఉన్నట్టు తెలిపారు. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. రాయ్ పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు కావడం విశేషం. ఇప్పటిదాకా రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఈసీ సీజ్ చేసింది. ఇందులో ఒక్క బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకుంది. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటకలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో, సరైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించరాదు. ఇక, కర్నాటకలో ఈనెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఇది కూడా చదవండి: యువకుడిని చితకబాదిన మంత్రి, సిబ్బంది.. వీడియో వైరల్ -
భారీ అగ్ని ప్రమాదం..మూడు కిలోమీటర్ల వరకు..
ఓ బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్లు మేర దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్ పార్క్లోని ఓ ప్రైవేటు గోడౌన్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ గోడౌన్లో క్రాకరీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అందులో కోట్లాది రూపాయలు విలువ చేసే క్రాకర్లను నిల్వ ఉంచారు. ఈ క్రమంలో అనూహ్యంగా గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో బాణాసంచాలన్ని ఒక్కసారిగా పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 50కి పైగా భవనాలు త్రీవంగా దెబ్బతిన్నాయి. ఐతే ఈ గోడౌన్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు 14 అగ్నిమాపక యంత్రాలు వచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టాయి. భవనంలో పలువురు పౌరులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి మూడు కిలోమీటర్లు దూరం వరకు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: ఆ హీట్ స్ట్రోక్ హీట్ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగా కార్యక్రమాలు..) -
కర్ణాటకలో ఆసక్తికరంగా పాత మైసూరు పోరు
-
IPL 2023:షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాపులర్ జట్లలో ఒకటి కోల్కతా నైట్ రైడర్స్ .రెండుసార్లు( 2012 , 2014లో) ఐపీఎల్ టైటిల్ను దక్కించుకుని క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగించింది. తాజాగా ఐపీఎల్ 2023 పోరు నడుస్తున్న సందర్భంగా, షారుక్ ఖాన్ కుడిభుజం లాంటివాడు, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ నెట్వర్త్ తదితర విషయాలపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ కేకేఆర్ యజమాని, బాలీవుడ్ స్టార్హీరో షారుక్ ఖాన్ దేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనరు కూడా. అలాగే కేకేఆర్ సీఈవోఅయిన వెంకీ రెడ్ చిల్లీస్ సీఈవో కూడా కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ చిల్లీస్కు సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు వెంకీ . అనుభవజ్ఞుడైన వ్యాపార నిపుణుడు రెడ్ చిల్లీస్కు సీఈవోగా ఉండడం చాలా ఆనందంగా ఉందని,కేకేర్లో అద్భుతంగా పనిచేసిన వెంకీ రెడ్ చిల్లీస్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెడతానే నమ్మకం ఉందని షారుక్ ఖాన్ ప్రకటించారు. అనేక గ్లోబల్ మార్కెట్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమలో 25 సంవత్సరాలు, అమెరికా, కెనడా, ఆసియాలో అనేక సీనియర్ నాయకత్వ స్థానాల్లో పనిచేసిన అనుభవం వెంకీ సొంతం.క్రికెటర్ అవ్వవాలనుకున్న వెంకీ క్రికెట్ జట్టు సీఈవోగా అవతరించాడం విశేషం. ప్రస్తుతం కేకేఆర్, రెడ్ చిల్లీస్ బాధ్యతలను చూస్తున్న వెంకీ మైసూర్ నికర విలువ మీడియా కథనాల ప్రకారం దాదాపు రూ.14 కోట్లు. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కర్ణాటకలోని మైసూర్లో పుట్టారు వెంకీ. క్రికెటర్గా రంజీ ట్రోఫీకి చేరాలని కలలుకన్న వెంకీ తండ్రి కోరికనుమన్నించి క్రికెట్ నుండి తప్పుకుని మద్రాస్ విశ్వవి ద్యాలయంలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ పూర్తి చేశారు. (గుడ్ ఫ్రైడే ఆఫర్: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)) కేకేఆర్లో చేరడానికి ముందు వెంకీ మైసూర్కు బీమా పరిశ్రమలో పెద్ద పేరే ఉంది. 2010లో, వెంకీ మైసూర్ మెట్లైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో, అన్నింటినీ విడిచిపెట్టి, షారుక్ ఖాన్ కేకేఆర్ ఫ్రాంచైజీలో చేరారు. అసలు కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్బాగో నైట్ రైడర్స్ను కొనుగోలు ప్లాన్ వెనుక వెంకీ ఉన్నట్టు క్రీడా వర్గాలు నమ్ముతారు. బెంగుళూరులోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. వెంకీ భార్య పేరు వీణ, ముగ్గురు పిల్లలున్నారు. కాగా ఐపీఎల్ 2022లో పేలవ ప్రదర్శనపై వెంకీపై విమర్శలొచ్చాయి. అలాగే టీం సెలక్షన్లో జోక్యం చేసుకుంటు న్నాడంటూ కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోపణలు వీటికి మరింత ఆజ్యం పోసాయి. అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్ లాంటిది కాదు. ఓనర్లుప్రత్యక్షంగా పాల్గొనక పోయిన సమయంలో తమ అభిప్రాయాలను సీఈవో ద్వారా లేదా ప్రధాన కోచ్తో నేరుగా మాట్లాడతారని ఫ్రాంచైజీ తిప్పికొట్టింది. కేకేఆర్ విజయపథంలో నడిపిండం ద్వారా అనేక లాభాలను తెచ్చిపెట్టారు వెంకీ. ఫోర్బ్స్ ప్రకారంకేకేఆర్ నికర విలువ 1.1 బిలియన్లు డాలర్లు, ఆదాయం 41.2 మిలియన్ డాలర్లు. 2004లో స్థాపించిన డ్రీమ్జ్ అన్లిమిటెడ్ సంస్థను కొనుగోలు చేసిన ఎస్ఆర్కే, గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్గా మార్చారు. రెడ్ చిల్లీస్ పది చిత్రాలకు నిర్మాతగా, ఐదు చిత్రాలకు సహనిర్మాతగా ఉంది. -
మైసూర్ కాఫీపై సెబీ జరిమానా
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్(ఎంఏసీఈఎల్)పై రూ. కోటి జరిమానా విధించింది. రూ. 3,535 కోట్ల నిధులను అక్రమ బదిలీ చేసేందుకు ప్రయివేట్ రంగ కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీడీఈఎల్)ను ప్రేరేపించిన కేసులో ఫైన్ వేసింది. 45 రోజుల్లోగా జరిమానాను చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఈ రెండు సంస్థలూ దివంగత వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ, ఆయన కుటుంబ సభ్యుల అజమాయిషీలో ఉన్న కంపెనీలు కాగా.. సీడీఈఎల్ అనుబంధ సంస్థల నుంచి నిధుల అక్రమ బదిలీకి ఎంఏసీఈఎల్ సహకరించినట్లు సెబీ పేర్కొంది. తద్వారా సెబీ చట్టం, పీఎఫ్యూటీపీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలియజేసింది. -
వైభవంగా శ్రీ గణపతి సచ్చిదానంద సహస్ర చంద్రదర్శన వేడుకలు
మైసూరు :అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశం నలుమూలల నుండి అనేక మంది చతుర్వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ్య స్వామీజీ వారు విశేషంగా భక్తులకు తమ అనుగ్రహ సందేశం అందించారు. గత 50 సంవత్సరాల నుండి పూజ్య స్వామీజీ జన్మదినోత్సవ వేడుకలలో వివిధ శాఖలకు చెందిన వేదపండితులు, అర్చకులను గౌరవించే ఆనవాయితీ క్రమంలో నేడు అనేక మంది చతుర్వేద పండితులను, ఆలయ అర్చకులను గౌరవించారు. వేదవిద్యను అందరూ ప్రోత్సహించాలని అన్నారు. ఆలయ అర్చకులను అందరూ గౌరవించాలి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి అన్నారు. అర్చకులను గౌరవించక పోతే ధర్మం క్షీణిస్తుంది, అర్చకులను పోషిస్తే దేశం సుభిక్షాంగా ఉంటుంది అన్నారు. ఆలయాలను రక్షించడంలో అర్చకులు పోషిస్తున్న ప్రధానపాత్రను కొనియాడారు. భారతీయులమైన మనం అర్చకులను తప్పనిసరిగా ప్రోత్సహించి వారికి కావలసిన వసతులు కల్పించటం మన బాధ్యతగా అందరూ ఆచరించాలి అని సూచించారు. -
కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం!
సాక్షి, కర్ణాటక: మైసూరు జిల్లాలో ఇప్పటికే చిరుత పులులు అనేకమందిని పొట్టనపెట్టుకుంటూ ఉంటే, మరోవైపు పెద్ద పులులు కూడా జనం మీద పడుతున్నాయి. ఓ పులి యువకున్ని చంపిన సంఘటన మైసూరు జిల్లాలో హెచ్డీ కోటె పరిధిలో డీబీ కుప్ప వద్ద నాగరహోళె అడవుల్లోని బళ్ళె ప్రాంతంలో ఆదివారం జరిగింది. మరణించిన యువకుడిని మంజుగా (18) గుర్తించారు. వివరాలు... అటవీ శాఖకు చెందిన వసతి గృహాల వెనుక భాగంలో ఉన్న అడవిలో మంజు స్నేహితులతో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అటువైపు వచ్చిన పులి మంజు పైన దాడి చేసింది. తల వెనుకాల భాగంలో కొరికి, పంజాలతో చీల్చడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. అతని వెంట వచ్చిన మరికొంత మంది యువకులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. అంతకుముందు మంజు అరుపులకు సమీపంలోని అటవీ సిబ్బంది వచ్చారు. వారిని చూసిన పులి మంజును వదిలి వెళ్ళిపోయింది. అటవీ సిబ్బంది వెంటనే మంజు మృతదేహాన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అంతరసంత పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల ధర్నా.. క్వార్టర్స్ వెనుకలే పులి తిరుగుతున్నా అటవీ సిబ్బంది పట్టించుకోలేదని, అందుకే యువకుడు బలయ్యాడని స్థానిక ప్రజలు అటవీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు– చామరాజనగర రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసు, అటవీ ఉన్నతాధికారులు చేరుకుని రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
చిరుత దాడి.. ఇంటికి వస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన వైనం
సాక్షి, బెంగళూరు: గత కొద్ది రోజులుగా మైసూరు జిల్లాలో చిరుత దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. శుక్రవారం రాత్రి చిరుత దాడిలో ఓ వృద్ధురాలు బలైన ఘటన టి.నరిసిపుర తాలుకాలో మరిచిపోక ముందే మరోఘటన అదే తాలూకాలో చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలుడు చిరుత దాడిలో బలయ్యాడు. ఇంటికి వస్తుండగా ఈడ్చుకెళ్లిన చిరుత.. హోరళహళ్లి గ్రామానికి చెందిన దశకంఠ కుమారుడు జయంత్ (11) శనివారం సాయంత్రం అత్త ఇంటికి వెళ్లి బిస్కెట్ తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పొదల మాటున నక్కిన చిరుత ఒక్కసారిగా దాడి చేసి జయంత్ను అడవిలోకి ఈడ్చుకుని వెళ్లింది. బాలుడిని చంపి కొంత తినేసింది. గ్రామస్తులు వెంటనే స్పందించి రాత్రి దాకా గాలించారు. ఎక్కడ కనిపించలేదు. ఆదివారం తెల్లవారుజామున కిలోమీటరు దూరంలో బాలుడి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుతలకు బలి కావాల్సిందేనా అంటూ మండిపడ్డారు. టి నరసిపుర తాలూకాలో ఇప్పటి వరకు చిరుతల దాడిలో నలుగురు మృతి చెందారని, చిరుతను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది. చదవండి: కన్నతల్లితో మరో వ్యక్తి సహజీవనం.. సన్నిహితంగా నటించి -
టార్గెట్ స్యాంట్రో రవి..నాలుగో భార్య ఫిర్యాదు
సాక్షి, మైసూరు: రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రముఖ నేరారోపి స్యాంట్రో రవిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏడీజీపీ అలోక్కుమార్ తెలిపారు. మంగళవారం మైసూరుకు వచ్చిన అలోక్ కుమార్ పోలీసు కమిషనర్ రమేశ్ కార్యాలయంలో స్యాంట్రో రవి కేసుల తనిఖీ గురించి పోలీసు అధికారులతో చర్చించారు. స్యాంట్రో రవి ఆర్థిక వ్యవహారాలు, అత్యాచార కేసులను సమగ్రంగా తనిఖీ చేయాలని ఏడీజీపీ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ గీతా, ఎస్పీ సీమా లట్కర్, ఏసీసీ శివశంకర్, ఇన్స్పెక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై నాలుగో భార్య ఫిర్యాదు కాగా, ఏడీజీపీ ఎదుట స్యాంట్రో రవి నాలుగో భార్య, ఆమె చెల్లెలు హాజరయ్యారు. వారిద్దరిని ఏడీజీపీ సుమారు గంటకు పైగా విచారించారు. ఈ సమయంలో రవితో పాటు బెంగళూరు కాటన్పేట ఏడు మంది పోలీసులు తనను వేధించిన తీరు, అలగే గూగుల్ పే ద్వారా ఆ పోలీసు అధికారులకు చెల్లించిన డబ్బుల వివరాలు ఏడీజీపీకి ఆమె తెలిపారు. తనను వేధించిన పోలీసులను సస్పెండ్చేయాలని, రవిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాటన్పేట సీఐ ప్రవీణ్ సస్పెండ్ స్యాంట్రో రవి కేసులో బెంగళూరు కాటన్పేట ఇన్స్పెక్టర్ ప్రవీణ్ను డీజీపీ ప్రవీణ్ సూద్ సస్పెండ్ చేశారు. స్యాంట్రో రవికి మద్దతుగా ఇద్దరు మహిళలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారనే ప్రవీణ్పై ఆరోపణలువవచ్చాయి. హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆదేశాలతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నారు. దోపిడీ కేసులో వారి పాత్ర లేకపోయినా రవి భార్య, ఆమె సోదరిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని తేలింది. రవిపై నిఘా ఉంచాం మీడియాతో అలోక్ కుమార్ మాట్లాడుతూ స్యాంట్రో రవి కేసు విచారణ నిమిత్తం మైసూరుకు వచ్చినట్లు , అతనిపై రేప్, అట్రాసిటీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అతని ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. బెంగళూరు రాజరాజేశ్వరి లోని రవి మరో భార్య వనజాక్షిని కూడా విచారించినట్లు చెప్పారు. స్యాంట్రో రవి ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. రవి ప్రస్తుతం మొబైల్ వినియోగించడం లేదన్నారు. అతి త్వరగా అతన్ని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తొదరలోనే పట్టుకుంటాం: హోంమంత్రి శివాజీనగర: పలు నేరారోపణలు ఉన్న స్యాంట్రో రవి అరెస్ట్కు ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించినట్లు, త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడిన ఆయన, రవి కదలికలపై నిఘా ఉంది, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడతాం. అన్నివిధాలా గాలింపు జరుగుతోంది. త్వరలోనే రవి అరెస్ట్ అవుతారని చెప్పారు. అతనిపై ఉన్న అన్ని కేసులపై విచారణ చేస్తామన్నారు. అంతేకాకుండా మహిళపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడంపై స్పందిస్తూ తప్పుడు కేసులు వేసి అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నివేదిక సిద్ధంగా ఉంది. ఇందులో ఏ అధికారి ఉన్నా కూడా వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వమే రవిని దాచిపెట్టిందన్న జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపణపై మాట్లాడుతూ కుమారస్వామి మాటలకు సమాధానం చెప్పను అన్నారు. (చదవండి: హాట్ టాపిక్గా స్యాంట్రో రవి..రెండో భార్య వద్ద ఉన్న ల్యాప్టాప్లో ఏముంది?) -
Mysuru: పక్కా ప్లాన్తో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
సాక్షి, మైసూరు: మైసూరు భుగతహళ్లి శివార్లలోని వెంకటగిరి లేఔట్లో ఉన్న ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులు శ్రీధర్ రెడ్డి, సందీప్లను అరెస్ట్ చేసి ఓ మహిళను రక్షించారు. ఓ వ్యక్తి పరారయ్యాడు. మైసూరు మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. చదవండి: (ఉపాధ్యాయ వృత్తికే మచ్చ.. విద్యార్థి తల్లితో సన్నిహితంగా ఉంటూ..) -
తల్లి వివాహేతర సంబంధం.. సమాజంలో తలెత్తుకుని తిరగలేమని..
సాక్షి, మైసూరు: పరాయి పురుషుడితో కన్నతల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మైసూరు జిల్లా నంనగూడు తాలూకా హుణసనాలు గ్రామంలో చోటుచేసుకుంది. మహాదేవశెట్టి దంపతుల కుమారుడు మహేంద్ర (27). ఇదిలా ఉంటే మహాదేవశెట్టి భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంగా దంపతుల మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. భార్య మాట వినకపోవడంతో ఈ విషయాన్ని తండ్రి, కుమారుడి దృష్టికి తెచ్చాడు. అతను కూడా తల్లితో మాట్లాడాడు. అయితే ఆమెలో మార్పు కనిపించలేదు. సమాజంలో తలెత్తుకుని తిరగలేమని భావించిన మహేంద్ర సోమవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకున్నాడు. నంజనగూడు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు, కూతురు) -
జాగ్రత్తగా నడపమన్నందుకు... కారుతో ఢీకొట్టారు
మైసూరు: కారును ఇష్టానుసారంగా నడుపుతుండటంతో జాగ్రత్తగా నడపాలని చెప్పిన ముగ్గురు యువకులను అదే వాహనంతో ఢీకొట్టిన ఘటన మైసూరు నగరంలోని టీకే లేఔట్లో చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో ప్రజ్వల్, రాహుల్, ఆనంద్ అనేవారు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు... మంగళవారం ఉదయం వాసు, అతని తండ్రి దర్శన్ ఫార్చునర్ కారులో రోడ్డుపై అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడంతో అక్కడే ఉన్న ప్రజ్వల్, రాహుల్, ఆనంద్ వారిని మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన వాసు, అతని తండ్రి కారుతో వెనక్కి వచ్చి ప్రజ్వల్, రాహుల్, ఆనంద్లను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రజ్వల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సరస్వతీ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ఏడు నెలల క్రితమే పెళ్లి.. వివాహేతర సంబంధం కారణంగా..) -
నూతన జంట జలసమాధి.. ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం
మైసూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాద ఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలు... మైసూరు తాలూకా శాదనహళ్లి గ్రామానికి చెందిన శివకుమార్ (29), కవిత (25) ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీరంగ పట్టణంలోని మేగరళ్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం కేఆర్ఎస్ సమీపంలో ఉన్న వరుణ కాలువ కట్ట వద్ద కూర్చొని కవిత బట్టలు ఉతుకుతుండగా కాలువలోకి జారి పడింది. అక్కడే ఉన్న శివకుమార్ కాలువలో దూకి ఆమెను కాపాడే యత్నంలో అతను కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డుపై చిరుత కలకలం... భయపెట్టించేలా పరుగు తీసింది
మైసూర్లో ఒక రహదారిపై చిరుత హల్చల్ చేసింది. పలువురిని భయబ్రాంతులకు గురిచేసేలా పరుగులు పెట్టించింది. అందుకు సంబంధించిన వీడియో ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో చిరుత రోడ్డుపై వెళ్తున బైకర్ని కిందపడేసి, పిచ్చిపట్లినట్లు కలయ తిరిగింది. ఆ చిరుతను నియంత్రించేందుకు వస్తున్న ప్రభుత్వ ఉద్యోగికి దూరంగా పరుగులు పెట్టింది. చివరికి అటవీశాఖ అధికారులు ఆ చిరుతను ఏదోరకంగా శాంతింప చేసి లొంగదీసుకున్నారు. అది కాస్త ఒత్తిడికి గురైందని, అందువల్లే రోడ్డుపై ఉన్న జనాలను భయపెట్టించి పరుగులు పెట్టించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజన్లు చిరుత రక్షింపబడిందని ఆనందం వ్యక్తం చేయగా, కొంతమంది మానవులు ఆగడాలు ఎక్కువైపోవడం వల్లే అవి రోడ్లపైకి వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. Disturbing visuals from Mysore.The crowd is only adding to the already stressed leopard. Latest, it has been safely tranquilised by the forest Department officials. It’s only mistake was that it was seen. After which the people became wild & the real wild struggled for safety. pic.twitter.com/F4dXNsAYvT — Susanta Nanda (@susantananda3) November 4, 2022 (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి
సాక్షి, మైసూరు: కట్టుకున్న భార్య ఇల్లు విడిచి వెళ్లి ప్రియుడిని పెళ్లి చేసుకుందని మనోవేదనకు గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుణసూరు తాలూకా కొయమత్తూరు కాలనీ గ్రామంలో జరిగింది. దీంతో ఓ కుటుంబం వీధినపడింది. పరారై ప్రియునితో పెళ్లి గ్రామానికి చెందిన కృష్ణేగౌడ కుమారుడు సురేశ్ కుమార్ (37), భార్య నేత్ర. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. సురేశ్ కుమార్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నేత్ర హుణసూరులోని స్పిన్నింగ్ ఫ్యాక్టరీలో పనికి వెళుతోంది. ఇటీవల నేత్రా కనిపించకుండా పోవడంతో దీంతో భర్త హణసూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు శివమొగ్గలో ఉన్న నేత్రను గుర్తించారు. భర్తతో ఉండడం ఇష్టం లేక వచ్చేశానని ఆమె తెలిపింది. శివమొగ్గ జిల్లా సొరబ తాలూకా హోళెజోళ గ్రామంలోని గోమంతేశ్వర దేవస్థానంలో ప్రియున్ని పెళ్లి కూడా చేసుకున్నట్లు చెప్పింది. ఇందుకు రుజువుగా తమ వివాహ ఫోటోలను భర్త మొబైల్కు కూడా నేత్ర పంపించింది. ఆ ఫోటోలను చూసిన సురేశ్ జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చదవండి: (పోలీసు కస్టడీకి హనీట్రాప్ ముఠా.. మరింత మంది స్వాములకు యువతి వల?) -
నాగ చైతన్య, కృతిశెట్టి మైసూర్ షెడ్యూల్ కంప్లీట్
మైసూర్కు నాగచైతన్య బై బై చెప్పారు. దర్శకుడు వెంకట్ ప్రభు, హీరో నాగచైతన్య కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్స్క్రీన్ పతాకంపై పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దాదాపు 25రోజుల క్రితం మైసూర్లో ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్ ముగిసినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ షెడ్యూల్లో నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ చిత్రీకరణపై త్వరలో ఓ ప్రకటన రానుంది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్కుమార్, ప్రేమ్ జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తండ్రీ కొడుకులైన ఇళయ రాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
‘షూ’లో నక్కిన నాగు పాము.. తస్మాత్ జాగ్రత్త!
బెంగళూరు: పని మీద వెళ్తున్నప్పుడు గమనించకుండానే చెప్పులు, షూ ధరిస్తుంటారు చాలా మంది. అయితే, వాటిల్లో విష పురుగులు ఉంటే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఓసారి చూసి ధరించటం మంచింది. ఓ సారి ఈ సంఘటన చూడండి. షూలో భారీ నాగు పాము నక్కింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా పడగ విప్పి బుసలు కొడుతోంది. కర్ణాటకలోని మైసూర్లో జరిగిన ఈ సంఘటన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్గా మారింది. ఓ వ్యక్తి రోజూ మాదిరిగానే షూ ధరించేందుకు వెళ్లగా అందులో నాగు పాము కనిపించి షాక్కు గురయ్యాడు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి పామును షూ నుంచి తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ పాము పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి హెచ్చరికగానే చెప్పాలి. షూ ధరిస్తున్నప్పుడు కచ్చితంగా దానిని పరిశీలించిన తర్వాత వేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. Shocking video of cobra #snake in Mysore, Karnataka hiding inside the shoe. #ViralVideo #Cobra #Rescued #Shoes #Karnataka pic.twitter.com/rJmVN5W1ne — Bharathirajan (@bharathircc) October 10, 2022 ఇదీ చదవండి: 10 ఏళ్ల వయసులో జైలుకు.. 53 ఏళ్లప్పుడు నిర్దోషిగా విడుదల -
'అసలు ధోనిలానే లేడు.. ఎవరు తయారు చేశారో కానీ!'
టీమిండియాకు రెండు వరల్డ్కప్లు అందించిన ఎంఎస్ ధోని ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయిన ధోని టీమిండియాలో మంచి ఫినిషర్గానూ రాణించాడు. ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు కావొస్తున్నా క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. టీమిండియా కెప్టెన్గా విజయాలు చవిచూసిన ధోని.. ఐపీఎల్లో సీఎస్కేను విజయపథంలో నడిపించాడు.. నడిపిస్తున్నాడు. అలాంటి ధోనికి దేశంలో ఎక్కడికెళ్లినా అభిమానులుంటారు. తాజాగా ధోనికి సంబంధించిన మైనపు విగ్రహం అభిమానులను షాక్కు గురి చేసింది. కర్నాటకలోని మైసూరు మ్యూజియంలో ధోని మైనపు విగ్రహాaన్ని తయారు చేశారు. అయితే అది చూడడానికి కాస్త వింతగా ఉంది. ధోని ముఖకవళికలు తేడాతో ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ధోనిలా కనిపించినప్పటికి దగ్గరకెళ్లి చూస్తే ధోని ఆకారాన్ని గుర్తుచేయడం లేదు. ఈ విగ్రహంపై ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు.'' ఈ విగ్రహాన్ని ఎవరైతే తయారు చేశారో కానీ.. ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ కూడా అతనే చేసి ఉంటాడు.. ధోని భయ్యా ఎక్కడా.. అసలు ఈ విగ్రహం ఎవరిది.. ధోని విగ్రహం అని చెప్పి వేరేది తయారు చేశాడా ఏంటి?'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: దీపక్ చహర్కు గాయం..! MS Dhoni wax statue in Mysore. pic.twitter.com/KdsKcPLsaM — Mufaddal Vohra (@mufaddal_vohra) October 7, 2022 -
Bharat Jodo Yatra: వల్లెవేయడం తేలికే..ఆచరణ కష్టం
మైసూరు: గాంధీజీ ఆశయాలను వల్లెవేయడం అధికారంలో ఉన్న వారికి తేలికే కానీ, వాటిని అనుసరించడం కష్టమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఆదివారం మైసూరు సమీపంలోని బదనవాలు గ్రామంలోని ఖాదీ గ్రామోద్యోగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాన్ని గాంధీజీ 1927, 1932 సంవత్సరాల్లో సందర్శించడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన గాంధీజీ జయంతి వేడుకల్లో రాహుల్ పాల్గొన్నారు. ఆ కేంద్రంలో చేనేత ఉత్పత్తులను పరిశీలించి, మహిళా కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. గాంధీజీని పొట్టనబెట్టుకున్న సిద్ధాంతంతోనే గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో అసమానతలు, విభేదాలను వ్యాపింప జేస్తున్నారంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న హింస, అసత్య రాజకీయాలకు వ్యతిరేకంగా అహింస, స్వరాజ్య భావనను పెంచేందుకే జోడో యాత్ర చేపట్టామన్నారు. బదనవాలు గ్రామంలో వీరశైవ, దళితులతో కలిసి రాహుల్ భోజనం చేశారు. ప్రముఖ శ్రీ నంజుండేశ్వర (శ్రీకంఠేశ్వర) ఆలయంలో పూజలు చేశారు. తర్వాత పాదయాత్ర మైసూరు ప్యాలెస్ మైదానం ఎదురుగా ఉన్న వస్తు ప్రదర్శన ఆవరణకు చేరుకుంది. ఆరున యాత్రలో సోనియా కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఈనెల ఆరో తేదీన సోనియా గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో యాత్ర 511 కిలోమీటర్ల పొడవునా 21 రోజులపాటు కొనసాగనుంది. వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చిన సోనియా తొలిసారిగా యాత్రలో పాలుపంచుకోనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న కర్ణాటకగుండా ప్రస్తుతం యాత్ర కొనసాగుతుండటం గమనార్హం. బీజేపీపాలిత రాష్ట్రం గుండా యాత్ర కొనసాగడం ఇదే తొలిసారి. బదనవాలులో ఖాదీ గ్రామోద్యోగ్ కేంద్రంలో మగ్గాన్ని పరిశీలిస్తున్న రాహుల్ -
రాష్ట్రపతిగారూ మైసూరు దసరాకు రారండి!
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దసరా మహోత్సవ సమితి ఆహ్వానం పలికింది. గురువారం ఇన్చార్జ్ మంత్రి ఎస్.టి.సోమశేఖర్, ఎంపీ ప్రతాపసింహ, మంత్రి శశికళ జొల్లె తదితరులు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరురాలిని ఆహ్వానించారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.45 గంటల నుంచి 10.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో చాముండిబెట్ట పైన ఉన్న చాముండేశ్వరి దేవి అమ్మవారికి పూజలు చేయడం ద్వారా ఉత్సవాలకు నాంది పలుకుతారు. కాగా దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించనుండడం ఇదే మొదటిసారి. సాధారణంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా సంబరాలకు శ్రీకారం చుట్టేవారు. వారంపాటు సాంస్కృతిక ప్రదర్శనలు అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో బృహత్ వేదికపై సెప్టెంబర్ 26వ తేది నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు వారంపాటు వైభవంగా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ఇందులో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి నృత్య, గాన తదితర రంగాల కళాకారులు పాల్గొని ఆహూతులను అలరిస్తారు. 26న సీఎం బొమ్మై ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారు. ఫల పుష్ప ప్రదర్శన మైసూరు వర్సిటీ ఉద్యాన వన విభాగం ఆధ్వర్యంలో 26 నుంచి ఫల పుష్ప ప్రదర్శన కనువిందు చేయబోతోంది. నగరంలోని కుక్కరహళ్లి చెరువు వద్ద ఏర్పాటవుతుంది. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. దీనికి తోడు ప్యాలెస్ ఆవరణలోనూ ఫల పుష్ప అలంకరణ నిర్వహిస్తారు. త్వరలో 3 స్పెషల్ రైళ్లు మైసూరు దసరా ఉత్సవాలకు వచ్చే యాత్రికుల కోసం రైల్వే శాఖ మూడు ప్రత్యేక రైళ్లను నడపనుంది. సెపె్టంబరు 30వ తేదీన చామరాజనగరకు రాకపోకలు సాగించే రైలు సర్వీసు ఆరంభమవుతుంది. అలాగే అక్టోబరు 5వ తేదీన బెంగళూరుకు రెండు రైలు సర్వీసులను ఆరంభిస్తారు. కాగా, చాముండి కొండ పైన ఉన్న మహిష విగ్రహం వద్ద సెపె్టంబర్ 25వ తేదీన మహిష దసరాను నిర్వహిస్తామని మాజీ మేయర్ పురుషోత్తం తెలిపారు. గత మూడేళ్లుగా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఈసారి ఎవరు అడ్డుకున్నా జరిపి తీరుతామని అన్నారు. (చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనపై సుప్రీం) -
వజ్ర సింహాసన వైభవం
మైసూరు: స్వచ్ఛమైన బంగారం, అపురూపమైన వజ్రాలు, రత్నాలు పొదిగిన సింహాసనాన్ని చూడాలంటే మైసూరు ప్యాలెస్కు వెళ్లాల్సిందే. దసరా మహోత్సవాలకు నగరం హంగులు అద్దుకుంటుండగా, ప్యాలెస్లోనూ ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ప్యాలెస్లో ఉన్న దర్బార్ హాల్లో ఉన్న బంగారు సింహాసనాన్ని జోడించారు. వృశ్చిక లగ్నంలో పూజలు చేసి మంగళవారం ఉదయం 10.45 గంటల నుంచి 11.05 గంటల మధ్య శుభ వృశ్చిక లగ్నంలో పూజలు చేసి జోడింపు ప్రారంభించారు. మొదట వేద పండితుల సమక్షంలో గణపతి హోమం, చాముండి పూజ, శాంతి హోమం చేశారు. రాజవంశీకుడు యదువీర్ పాల్గొన్నారు. ప్యాలెస్లో కింది గదిలో ఉన్న స్ట్రాంగ్ రూంలో విడివిడిగా ఉన్న బంగారు, వజ్రఖచిత భాగాలను పోలీసు బందోబస్తు మధ్య దర్బార్ హాల్లోకి తీసుకొచ్చారు. పురాతన కాలం నుంచి సింహా సనం ఉంచే స్థలంలో జోడించారు. ఈ కార్యక్రమంలో గెజ్జగెహళ్లి గ్రామస్తులు, రాజమాత ప్రమోదాదేవి పాల్గొన్నారు. జోడింపు పూర్తయ్యాక మళ్లీ పూజలు చేసి తెల్లని వస్త్రంతో కప్పిఉంచారు. సెప్టంబర్ 26వ తేదీన దసరా నవరాత్రి ఉత్సవాల రోజున యదువీర్ ఈ సింహాసనాన్ని అధిష్టిస్తారు. (చదవండి: వధువు స్పెషల్ ఫోటో షూట్... ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు) -
భార్య ప్రాణాలు తీసిన భర్త సోమరితనం
సాక్షి, బెంగళూరు: భర్త సోమరిగా మారడంతో ఇల్లు గడవక, పిల్లలకు పూటకు ఇంత తిండి పెట్టలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాలలో చోటు చేసుకుంది. ముడిగండ లేఔట్లో రియాజ్, ఉమైజైబా(22) నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఎలాంటి పనులకు వెళ్లకుండా కుటుంబ పోషణను పట్టించుకోలేదు. కనీసం వంట వండుకునేందుకు కూడా సరుకులు లేవని, పిల్లలకు ఆహారం ఎలా పెట్టాలని భర్త వద్ద వాపోయినా ఫలితం లేకపోయింది. దీంతో మనో వేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కొళ్లెగాల పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రియుడితో భార్య షికారు.. వెంబడించి రెడ్హ్యండెడ్గా పట్టుకున్న భర్త -
ఫిరంగి శబ్ధం.. తొణకని గజం
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ దసరా ఉత్సవాల కోసం మైసూరులో గజరాజులు వివిధ రకాల శిక్షణలో నిమగ్నమయ్యాయి. 14 ఏనుగుల తాలీము జోరుగా కొనసాగుతోంది. సోమవారం కుశాల తోపులో గజరాజులు, గుర్రాల ముందు ఫిరంగి పేలుళ్లను నిర్వహించారు. దసరా రోజున జంబూసవారీ ఊరేగింపులో ఫిరంగులను పేలుస్తారు, వాటి శబ్ధాలకు అలవాటు పడేలా ఇప్పటినుంచే శిక్షణ ఆరంభించారు. 30 మంది పోలీసు సిబ్బంది 7 ఫిరంగుల్లో మందుగుండును కూర్చి పేల్చారు. పెద్ద ఎత్తున పొగ, శబ్ధం వచ్చినా ఏనుగులు, గుర్రాలు ఏమాత్రం బెదరలేదు. 21 సార్లు పేలుళ్లు జరిపారు. (చదవండి: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..సంతోషం ఆవిరి) -
రాజ్ కుటుంబాన్ని వెంటాడుతున్న గుండె జబ్బులు
మైసూరు: కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులందరికీ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, బెంగళూరు జయదేవ హృద్రోగ, పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్. సీఎస్. మంజునాథ్ తెలిపారు. శుక్రవారం మైసూరు నగరంలో ఆయన గుండెకు సంబంధించిన సమస్యలపై మీడియాతో మాట్లాడారు. పునీత్రాజ్కుమార్, అతని సోదరులు రాఘవేంద్ర రాజ్కుమార్, శివరాజ్కుమార్ ఇద్దరికీ కూడా గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని, అది వారికి వంశపారం పర్యంగా ఉందన్నారు. ఆ సమస్యతోనే ఇటీవల పవర్స్టార్ పునీత్ గుండెపోటుతో మృతి చెందారని గుర్తు చేశారు. బెంగళూరు నగరంలో మరో వారం రోజుల్లో జయదేవ హృద్రోగ సంస్థ మరో యూనిట్ను ప్రారంభిస్తామని చెప్పారు. మైసూరు జయదేవలో ప్రతి నెల 1000 మందికి ఆంజియోగ్రామ్ చికిత్స చేస్తున్నామని, అదే విధంగా నెలరోజుల వ్యవధిలో హుబ్లీలో ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. చదవండి: (‘ఆ అమ్మాయి నా కూతురే కాదు’) -
హెలికాప్టర్ సర్వీస్ అని రూ.17 వేలు టోపీ
మైసూరు: మైసూరు నగరంలో ఆన్లైన్ మోసాలకు హద్దు లేకుండా పోతుంది. ప్రతిరోజూ ఒకరో ఇద్దరో వంచనకు గురవుతున్నారు. జమ్ముకశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం దర్శనం కోసం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెబ్సైట్లో గాలించి రూ. 17,000 పోగొట్టుకున్నాడు. మైసూరు గాయత్రి పురంలో నివాసం ఉంటున్న జీ బసవణ్ణ (32) వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం జమ్ములో నుంచి ఆలయం వరకు హెలికాప్టర్ సర్వీసు ఉన్నదని, బుక్ చేసుకోవచ్చని హిమాలయ హెలిప్యాడ్ అనే సంస్థ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయుడు వెబ్సైట్ ద్వారా రూ. 17,000 చెల్లించాడు. ఆ తరువాత ఎన్నిరోజులైనా స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు మైసూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: వరదలపై సమీక్ష సమావేశం... నిద్రపోయిన మంత్రి) -
ఈ కాలేజీలో అన్నీ అక్రమాలే.. వీడియో తీసి విద్యార్థిని...
మైసూరు: మైసూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల్లో చదువుకుంటున్న విద్యార్థిని ఒకరు చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనకు ముందు ఆమె ఒక వీడియో రికార్డు చేసి అందులో తన ఆత్మహత్యకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది కారణమని తెలిపింది. తనకు కళాశాల్లో ప్రతి రోజూ ఇబ్బంది ఎదురవుతోందని, విద్యార్థుల పట్ల తారతమ్యం చూపిస్తున్నారని, రోజూ క్లాసులకు వెళ్తున్నా కూడా గైర్హాజరు వేస్తున్నారని వీడియోలో వాపోయింది. హాల్ టికెట్లు ఇవ్వడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే హాల్టికెట్లు ఇవ్వడం లేదని తెలిపింది. ఫీజులు కట్టినదానికి రసీదులు ఇవ్వడం లేదని, హాల్ టికెట్ సమస్యపై ప్రిన్సిపాల్ వద్ద ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. విద్యార్థిని చెయ్యి కోసుకుని, నిద్ర మాత్రలు మింగగా, కొందరు గమనించి ఆస్పత్రిలో చేర్చారు. జయలక్ష్మి పురం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి: (బెంగళూరు అతలాకుతలం) -
కన్నుపడితే లూటీ ! 40 ఏళ్లుగా దొంగతనాలే వృత్తి
బనశంకరి: 40 ఏళ్లకు పైబడి దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను శనివారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్చేశారు. దొంగ ప్రకాష్ (54), కోలారు, శివమొగ్గ బళ్లారిలో మొత్తం మూడు వివాహాలు చేసుకోగా ఇతడికి 7 మంది సంతానం. ఇప్పటి వరకు ఇతనిపై 160 కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, కోలారు, బళ్లారి, శివమొగ్గ, చిత్రదుర్గ, గుల్బర్గా తో పాటు గోవా, కేరళలో చోరీలకు తెగబడ్డాడు. 20 సార్లకు పైగా జైలుకెళ్లి వచ్చాడు. 10 ఏళ్ల వయసులో తొలిసారి 1978లో ప్రకాష్ 10 ఏళ్ల బాల్యంలోనే తొలి చోరీ చేశాడు. తరువాత సహోదరుడు వరదరాజ్, పిల్లలు బాలరాజ్, మిథున్, అల్లుడు జాన్ కలిశారు. ఈ నెల 22 తేదీన రాజాజీనగరలో ప్రకాష్ చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. కేజీల కొద్దీ పసిడి దోపిడీ 1978–1986 వరకు 100 ఇళ్లలో చోరీలు చేశాడు. అప్పట్లో ప్రకాష్ కేరళ కొట్టాయంలో 2.5 కిలోల బంగారం చోరీ, శేషాద్రిపురంలో బంగారు దుకాణం గోడ కు కన్నం వేసి రెండున్నర కిలోల బంగారు నగల ఆభరణాలు దోపిడీ, మరో బంగారు షాపునకు కన్నం వేసి 4 కిలోల పసిడి నగలు లూటీ, 20 కిలోల వెండి చోరీకి పాల్పడ్డాడు. అనుచరులైన జోసెఫ్, ఆనందన్, బాషా సహకరించారు. దోచుకున్న నగదును పంచుకుని జల్సాలు చేసేవారు. వైరముడి, నాగేశ్ అనే అనుచరులతో కలిసి ప్రకాష్ 1989లో మైసూరులో 20 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 1992 లో నాగేశ్ తో కలిసి మహారాష్ట్ర కొల్హాపురలో రెండు బంగారు దుకాణాలకు కన్నంవేసి 17 కిలోల బంగారు ఆభరణాలు దోపిడీచేశారు. 1992లో శివమొగ్గ ఫైనాన్స్ కార్యాలయం నుంచి రూ.3 కోట్లు నగదు దోపిడీకి పాల్పడ్డాడు. 1997లో గోవాలో 7 కిలోల స్వర్ణాభరణాలను ఎత్తుకెళ్లాడు. 2006 నుంచి ప్రకాష్ తన పిల్లలైన మిథున్, బాలరాజ్ తో పాటు అల్లుడు, అతని పిల్లలతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విలాసవంతమైన ఇళ్లు, జ్యువెలరీ దుకాణాలు, ఫైనాన్స్ కార్యాలయాలను ఎంచుకుని కొల్లగొడతాడు. ప్రతిసారి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినప్పటికీ బయటికి వచ్చి కొత్త ముఠాను ఏర్పాటు చేసుకునేవాడు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!) -
Kalyan Sivasailam: స్నేహితుడి అనారోగ్యం.. చికిత్స రిపోర్టు ఆలస్యం.. ఆ ఘటనతో..
సమస్య ఎదురైనప్పుడు నిట్టూర్చేవారు బోలెడు మంది. ఆ సమస్యను నిట్టనిలువునా నిలదీసి, విశ్లేషించి పరిష్కారం సాధించేవారు కొద్దిమంది. వీరినే విజేతలు అంటారు. కల్యాణ్ శివశైలం ఈ కోవకు చెందిన యువకుడు. క్లౌడ్–బేస్డ్ ప్లాట్ఫామ్ ‘5సి నెట్వర్క్’తో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న కల్యాణ్ గురించి... అవసరాల నుంచి ఆవిష్కరణలు పుడతాయి... అనే మాటను కల్యాణ్ శివశైలం విషయంలో మరోసారి గట్టిగా నమ్మవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం కల్యాణ్ స్నేహితుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాడు. ఎంఆర్ఐ రిపోర్ట్ కోసం రెండు రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. చికిత్సలో రిపోర్ట్ కీలకం కదా! ‘ఎందుకు ఈ ఆలస్యం?’ అనే ఆలోచనకు కల్యాణ్లో ఆరోజే బీజం పడింది. అది ఒక రూపం తీసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. స్నేహితుడు అహ్మద్తో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘5సి నెట్వర్క్’ పేరుతో హెల్త్టెక్ స్టార్టప్ స్టార్ట్ చేశాడు. ఊహించినట్లుగానే సూపర్హిట్ అయింది. ఈ క్లౌడ్బేస్డ్ ప్లాట్ఫామ్ 42 నిమిషాల్లోనే రేడియాలజీ టెస్ట్ రిజల్ట్ను తెలియజేస్తుంది. ఈ రిజల్ట్ను మరో రేడియాలజిస్ట్ క్రాస్ చెక్ చేస్తాడు. కచ్చితమైన ఫలితాల కోసం ఏఐ మోడల్ను ఉపయోగిస్తారు. ‘5సి నెట్వర్క్’ దేశవ్యాప్తంగా ఎన్నో హాస్పిటల్స్, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఎంతో మంది రేడియాలజిస్ట్లతో అనుసంధానమై పని చేస్తుంది. దేశంలో ఎంతమంది రేడియాలజిస్ట్లు ఉన్నారు అనే విషయం కంటే, సమర్థవంతమైన రేడియాలజిస్ట్లతో కలిసి పనిచేయడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చింది 5సి నెట్వర్క్. ‘యాక్సెస్ టు క్వాలిటి రేడియాలజిస్ట్’ను తన విధానంగా ఎంచుకుంది. ‘5సి నెట్వర్క్’ వల్ల గతంతో పోల్చితే రేడియాలజిస్ట్లు రెండింతలు ఎక్కువ సంపాదించే అవకాశం ఏర్పడింది. చిన్న క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో నెలకు 26 రేడియాలజీ రిపోర్ట్లు వెలువరించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వేలలో ఉంది. తమ తొలి క్లయింట్ మైసూర్లోని సీఎస్ఐ హాస్పిటల్. పే–పర్–యూజ్ బిజినెస్ మోడల్తో నిర్వహించబడుతున్న ‘5సి నెట్వర్క్’ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలనేది భవిష్యత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో కంపెనీకి అనువైన వాతావరణం ఏర్పడింది. మంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుకున్న కల్యాణ్కు ‘సమస్య’ గురించి విచారించడం కంటే విశ్లేషించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు. విశ్లేషణలోనే అతనికి పరిష్కారాలు దొరికేవి. అది ఇంటికి సంబంధించిన చిన్న సమస్యలు కావచ్చు. చదువుకు సంబంధించినవి కావచ్చు. ఇప్పుడు అదే ఫార్ముల తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలా చేసింది. పాతికేళ్ల వయసులో స్టార్టప్కు శ్రీకారం చుట్టాడు కల్యాణ్. ‘కుర్రాడు ఏదో చెబుతున్నాడు. రిస్క్ ఎందుకులే’ అని అవతలి వాళ్లు అనుకునే వయసు అది. మరి ఆ వయసులోనే పెద్ద పెద్ద ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరపడం, చేయి తిరిగిన రేడియాలజిస్ట్లతో చేయి కలపడం, తన ప్రాజెక్ట్ను ఓకే చేయించుకోవడం అంత తేలికైన విషయం కాదు. నిర్ల్యక్ష్యం, అసహనం...మొదలైనవి తనకు ఎదురయ్యే ఉంటాయి. అయితే వాటి గురించి కల్యాణ్ ఎక్కడా ప్రస్తావించలేదు. విజయాల్లో హాయిగా తేలిపోతున్నప్పుడు, ఆ బరువు ఎందుకు అనుకున్నాడేమో! బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా చదువుకున్న కల్యాణ్కు శాస్త్రీయ విషయాలపైనే కాదు న్యాయసూత్రాలపైన కూడా మంచి అవగాహన ఉంది. ఇది తన వ్యాపారానికి ప్లస్ అవుతుంది కూడా. ప్రతి సంస్థకు తనదైన యుఎస్పీ ఉంటుంది. మరి ‘5సి నెట్వర్క్’ యుఎస్పీ ఏమిటి? కల్యాణ్ శివశైలం మాటల్లోనే చెప్పాలంటే... ‘కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ, సుపీరియర్ సర్వీస్ లెవెల్స్’.. ‘5సి’ పరుగు చూస్తుంటే అది అక్షరాలా నిజమే అనిపిస్తుంది! చదవండి: Manasi Chaudhari: ‘పింక్ లీగల్’.. మహిళలకు న్యాయ సమాచారం.. ఏ డౌట్ వచ్చినా.. -
రూ.30 లక్షలు, 1.67 కోట్ల నగలు చోరీ
మైసూరు: మైసూరు జిల్లాలోని టి.నరిసిపుర పట్టణంలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయల విలువైన బంగారు నగలు, నగదును దుండగులు లూటీ చేశారు. శ్రీనిధి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో ఆహార, ఔషధ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఓజీ శ్రీనివాస్ ఇంటిలో సోమవారం దొంగలు పడి సుమారు రూ. 30 లక్షల నగదు, రూ. 1.67 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. లాకర్ను బద్ధలుకొట్టి శ్రీనివాస్ తల్లిదండ్రుల వైద్య చికిత్స కోసం మైసూరు నగరానికి వెళ్లి, రాత్రి సుమారు 9.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం చూశాడు. నగలు, నగదు కనిపించలేదు, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వెనుక వాకిలిని బద్ధలు కొట్టి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. దుర్భేధ్యమైన డిజిటల్ లాకర్ను పగలగొట్టి అందులోని నగదు, 1 కిలో బంగారం, 10 కిలోల వెండి , 70 గ్రాముల నెక్లెస్లను తీసుకున్నారు. మహావీర్ జైన్ అనే కుదువ వ్యాపారి తన నగలను శ్రీనివాస్ ఇంట్లో లాకర్లో పెట్టగా అవి కూడా పోయాయి. (చదవండి: భార్య సహకారం.. యువతిని భయపెట్టి ఐదేళ్లుగా అఘాయిత్యం) -
మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..
బనశంకరి: మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను అడ్డుపెట్టుకుని నగ్నచిత్రాలను తీయడం మొదలుపెట్టాడో సైకో. వాటిని చూపి బెదిరిస్తున్న కామోన్మాదిని ఈశాన్య విభాగ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పై కెమెరా వినియోగించి ఈ దందాకు పాల్పడుతున్న వ్యక్తి మైసూరు జిల్లా టీ.నరసిపురకు చెందిన మహేశ్. ఇన్స్టా ద్వారా వేధింపుల పర్వం ఒక యువతి ఫిర్యాదుతో ఇతని బాగోతం బయటపడింది. ఆ యువతి ఇన్స్టా అకౌంట్కు మహేశ్ నుంచి మెసేజ్ రాగా, ఎవరో అపరిచితుడు అని బ్లాక్ చేసింది. మళ్లీ వేరే ఇన్స్టా ఖాతా నుంచి మెసేజ్లు చేసి, తనతో చనువుగా చాట్ చేయాలని డిమాండ్ చేశాడు. లేకపోతే మీ నగ్న వీడియో తన వద్ద ఉందని బెదిరించాడు. ఆమె పట్టించుకోలేదు. దీంతో దుండగుడు నిజంగానే ఒక వీడియోను ఆమెకు పంపాడు. అది చూసి బాధితురాలు భయభ్రాంతురాలైంది. ఎందుకంటే ఆ వీడియో ఆమె ప్రైవేటు రూమ్లో చిత్రీకరించినట్లు తెలుసుకుని ఈశాన్య విభాగ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీఈఎన్ పోలీసులు తీవ్రంగా గాలించి మైసూరులో మహేశ్ ను శనివారం అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి స్పై కెమెరా, ల్యాప్టాప్, రెండు మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్, రెండు సెల్పోన్లను స్వాదీనం చేసుకున్నారు. ఎలా చేశాడంటే.. నిందితుడు మహేశ్, ఫిర్యాదురాలికి పరిచయస్తుడు కాగా ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె రూమ్లో మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చాడు. ఇంకా ఎన్ని చోట్ల ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనేదానిపై విచారణ ప్రారంభించారు. ఈశాన్య విభాగం డీసీపీ అనూప్ ఏ.శెట్టి, సీఐ సంతోష్ రామ్ ఈ కేసును దర్యాప్తు చేశారు. (చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత ) -
రూ.20పై మూడేళ్ల పోరాటం.. రిటైర్డు టీచర్కు దక్కిన విజయం
మైసూరు: సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాల్లో వస్తువులను విచ్చలవిడి ధరలకు అమ్ముతుంటారు. గత్యంతరం లేక జనం కొంటూ ఉంటారు. కానీ ఎంఆర్పీ ధర కంటే వ్యాపారి రూ.20 అదనంగా తీసుకోవడంపై రిటైర్డు ఉపాధ్యాయుడు మూడేళ్లు న్యాయ పోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. ఈ సంఘటన మైసూరులో జరిగింది. వివరాలు.. సత్యనారాయణ 2019లో హనుమంతరాజు షాపులో 3 శారీ ఫాల్స్ను కొన్నాడు. ఒక్కోటి రూ.30 కాగా మొత్తం రూ.90 అవుతుంది. కానీ హనుమంతరాజు రూ.110 వసూలు చేశాడు. ఇందుకు బిల్లు కూడా ఇచ్చాడు. ఎందుకు ఎక్కువ తీసుకున్నావని సత్యనారాయణ ప్రశ్నించగా అతడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో సత్యనారాయణ జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి వ్యాపారి నిర్వాకానికి గాను రూ.61 వేల పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు. ఇప్పటివరకు విచారణ కొనసాగింది. వ్యాపారి చేసింది తప్పని నిర్ధారణ కావడంతో ఫోరం అతనికి రూ.6,020 జరిమానా విధిస్తూ, ఆ సొమ్మును బాధితునికి ఇవ్వాలని తెలిపింది. చదవండి: (Chandana: పుట్టిన రోజు నాడే డెత్ నోట్ రాసి..) -
Chandana: పుట్టిన రోజు నాడే డెత్ నోట్ రాసి..
మైసూరు: కళాశాల హాస్టల్లో అధ్యాపకురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగరలో చోటుచేసుకుంది. నగరంలోని జేస్ఎస్ కళాశాలలో సైన్స్ లెక్చరర్గా పనిచేస్తున్న చందన (26) ఆత్మహత్య చేసుకుంది. అవివాహిత అయిన చందన ఇక్కడి కళాశాల హాస్టల్లో ఉంటోంది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో హాస్టల్ గది నుంచి బయటకు రాకపోవడంతో విద్యార్థులు కిటికి నుంచి చూడగా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. తన చావుకు ఎవరూ కారణం కాదని చందన డెత్నోట్ రాసింది. అదే రోజు ఆమె పుట్టిన రోజు కావడం విశేషం. చందన తాలూకాలోని అంబళె గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మహాదేవ స్వామి కుమార్తె. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..) -
రైలు ఢీ కొని విద్యార్థి మృతి.... అధికారుల తప్పిదమే అంటూ నిరసనలు
బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక విద్యార్థి రైలు ఢీ కొని మృతి చెందింది. ఐతే ఈ ఘటన రైల్వే అధికారుల నిర్లక్యం కారణంగానే జరిగిందంటూ ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ప్రీతి పుట్టస్వామి అనే విద్యార్థి ప్రభుత్వ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చివరి సంవత్సరం చదువుతుంది. ఆమె తండ్రి ఆటోలో రైల్వే పట్టాల వద్ద దింపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె రైలు పట్టాలు దాటుతుండగా జారిపడటంతో అటుగా వేగంగా వస్తున్న రైలు ఢీ కొనడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. ఐతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు విద్యార్థులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేప్టటారు. ఇది ముమ్మాటికి రైల్వే అధికారుల తప్పిదమేనని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టాల్సిందేనంటూ...నిరసనలు చేశారు. ఈ మేరకు నిరసనకారులు హాసన్-మైసూరు హైవేను దిగ్భందించడమే కాకుండా తీవ్ర ఆగ్రహంతో టైర్లను తగలబెట్టడం వంటి పనులు చేశారు. వాస్తవానికి ఇలా రైలు పట్టాలను దాటవద్దంటూ హెచ్చరించడమే కాకుండా, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఐతే కళాశాలకు, మార్కెట్కు సమీపంలో ఉన్నందున నివాసితులు సులభంగా ఉంటుందని తరుచుగా ఈ రైల్వే ట్రాక్లను దాటి అవతలి వైపుకు వెళ్లిపోతుంటారు. ఇలా నిర్లక్య ధోరణితో రాంగ్రూట్లో రైలు పట్టాలను క్రాస్ చేసి ప్రాణాల పైకి తెచ్చుకోవడం బాధకరం. (చదవండి: శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది!) -
పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..
మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు సార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని కోరితే కులం పేరుతో తిరస్కరించాడు. మూడేళ్ల క్రితం విజయనగరకు చెందిన యువతికి, స్థానికుడైన గణేశ్ అనే యువకునికి పరిచయమై ప్రేమ ఏర్పడింది. ఇటీవల యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని కోరింది. ప్రియుడు అబార్షన్ చేయించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి విజయనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గణేశ్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఒక నెల జైలు వాసం తర్వాత బెయిల్పై వచ్చిన నిందితుడు యువతికి మళ్లీ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. యువతి తిరిగి గర్భం దాల్చగా ఈసారైనా పెళ్లి చేసుకుందామని అడిగింది. దీంతో అతడు కోపంతో ఆమె కడుపు మీద తన్నడంతో గర్భస్రావం కూడా జరిగింది. గణేశ్తో తనకు పెళ్లి చేయకపోతే బతకనని యువతి చెబుతోంది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఆ ఇంట్లో అద్దెకు దిగడమే వారి పాలిట శాపం) -
అమ్మ కోసం.. లక్షకుపైగా జీతం వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి!
సాక్షి, తిరుపతి: కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దక్షిణామూర్తి క్రిష్ణకుమార్ అమ్మ కోసం రూ.లక్షకు పైగా జీతం వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. ఓ యాత్రికుడిగా మారాడు. అమ్మకు గైడ్గా మారాడు. తల్లి చిన్నప్పటి నుంచి చూడాలని తపించిన దేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటినీ స్వయంగా ఓ స్కూటర్పైనే తిప్పుతూ చూపిస్తున్నాడు. 2018లో ఈ యాత్రను మొదలుపెట్టారు. మధ్యలో 2020లో కోవిడ్ రావడంతో కొంతకాలం విరామం ఇచ్చారు. మళ్లీ ఆర్నెల్ల నుంచి యాత్రను మొదలుపెట్టి ఇప్పుడు తిరుమల తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకునేందుకు.. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. తండ్రి జ్ఞాపకంగా మిగుల్చుకున్న పాత బజాజ్ చేతక్ స్కూటర్పై 2018 జనవరి 16వ తేదీన భారతదేశ పుణ్యక్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టానన్నారు. ఇప్పటికి దాదాపు 57 వేల కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసుకున్నామని వివరించారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కోల్కతా, అరుణాచల్ ప్రదేశ్తో పాటు నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలు సందర్శించామని చెప్పారు. శక్తి ఉన్నంత కాలం.. భగవంతుడు తమకు అవకాశం ఇచ్చినంత కాలం ఈ యాత్ర కొనసాగిస్తామని దక్షిణామూర్తి తెలిపారు. చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల టికెట్లు ఎప్పుడంటే..) -
ఉద్యోగ విరమణ రోజే దారుణ హత్య
మైసూరు: ఉద్యోగ విరమణ పొందిన రోజే వర్సిటీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు ఈ ఘటన మైసూరు నగరంలోని విద్యారణ్యపురలోని బూతాల్ మైదానంలో చోటు చేసుకుంది. మైసూరు వి.విలో ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కృష్ణేగౌడ(60) గురువారం ఉద్యోగ విరమణ చెందాడు. సాయంత్రం బూతాల్ మైదానంలో వాకింగ్కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతుకోసి ఉడాయించారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య యశవంతపుర: మూడున్నరేళ్ల చిన్నారికి ఉరి వేసిన తల్లి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆర్ఆర్నగర పరిధిలోని మంత్రి అల్టియాన్ అపార్ట్మెంట్లో దీపా, ఆదర్శ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారం రోజులుగా జ్వరం, కడుపునొప్పితో బాధ పడుతున్న దీపా తన కుమార్తె రియాను పడక గదిలో ఫ్యాన్కు ఉరివేసింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. గదిలో ఒక సూసైడ్ నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని దీపా రాసినట్లు ఉందని పోలీసులు తెలిపారు. (చదవండి: రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..) -
భర్తకు దూరంగా ఒంటరి జీవితం.. అతడితో జల్సాలు.. చివరకు..
మైసూర్: వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారునపడేస్తున్నాయి. క్షణికావేశాల కారణంగా వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లలున్న వ్యక్తి.. వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్తా ప్రాణాలను తీసింది. ఈ ఘటన కర్నాటకలో చేసుకుంది. వివరాల ప్రకారం.. మైసూర్కు చెందిన టి. నరసీపుర తాలూకాలోని తలకాడుకు చెందిన సుమిత్ర(26)కు రవిశంకర్తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కాగా, కుటుంబ కలహాల వల్ల సుమ్రిత.. తన భర్తకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మైసూర్కు చెందిన సిద్దిరాజుతో సుమిత్రకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి సంబంధం విషయం సిద్దిరాజు భార్యకు తెలియడంతో ఆమె.. భర్తను నిలదీసింది. పెద్దల సమక్షంతో పంచాయితీ పెట్టించింది. అనంతరం.. విడాకులు ఇస్తానని బెదిరించింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా సిద్దరాజు.. సుమిత్రతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. సీక్రెట్గా సుమిత్రను కలుస్తూ.. వారిద్దరూ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో విహారయాత్రలకు వెళ్లి జల్సా చేశారు. ఇంతలో తలకాడు కావేరి నది సమీపంలోని నిసర్గధామా ప్రాంతంలో సుమిత్రా శవమై కనిపించింది. సుమిత్రా శవం పక్కనే ప్రియుడు సిద్దరాజు కూడా ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. అయితే, సిద్దరాజు చనిపోయే ముందు.. అతని స్నేహితుడికి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపించాడు. మెసేజ్లో సుమిత్రా చనిపోయింది.. ఆమె లేని జీవితం నాకు వద్దు, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి.. -
అసమాన యోగయజ్ఞం
మైసూరు: ప్రపంచానికి యోగా శాంతిని బోధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం ఉదయం ప్రఖ్యాత మైసూరు అంబా విలాస్ ప్యాలెస్ ఆవరణలో ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. వేలాది మంది యోగ సాధకులతో కలిసి మోదీ పలు యోగాసనాలను ఆచరించారు. బాలలు, యువత పెద్దసంఖ్యలో తరలిరావడంతో వేడుక కళకళలాడింది. సుమారు నలభై నిమిషాల పాటు వేలాది మంది ఎంతో దీక్షగా ఆసనాలను వేశారు. మోదీ అందరికీ అభివాదం చేస్తూ పలకరిస్తూ రావడంతో జనం ఉత్సాహంగా స్పందించారు. ప్యాలెస్లో మోదీకి అల్పాహార విందు యోగా కార్యక్రమం తరువాత ప్యాలెస్లో రాజ కుటుంబీకులు యదువీర్ ఒడెయర్– త్రిషిక దంపతులు, రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్లను మోదీ కలిశారు. మసాలా దోసె, మసాలా వడ, సాంబార్, మైసూరు పాక్ లతో కూడిన అల్పాహార విందును ప్రధాని ఆరగించారు. ప్రమోదాదేవి మాట్లాడుతూ తమ ప్యాలెస్లో అల్పాహారాన్ని స్వీకరించాలని ప్రధాని మోదీకి ముందే లేఖ రాయగా, ఆయన అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు ఏ వంటకాలు ఇష్టమైనప్పటికీ, తాము దక్షిణాది వంటకాలనే వడ్డించామని ఆమె చెప్పారు. యోగా ఎగ్జిబిషన్ ప్యాలెస్ ఆవరణలోని ఉన్న దసరా వస్తు ప్రదర్శనశాలలో యోగాకు సంబంధించిన ఆయుష్ డిజిటల్ ఎగ్జిబిషన్ స్టాల్స్ను ప్రధాని వీక్షించారు. సుమారు 15 నిమిషాల పాటు వివిధ స్టాళ్లలోని ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ముగిసిన పర్యటన మోదీ రెండురోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్యాలెస్లో అల్పాహారం స్వీకరించిన అనంతరం ఆయన మండకళ్లి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. గవర్నర్ గెహ్లాట్, సీఎం బసవరాజ బొమ్మై తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు (చదవండి: కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా? నేరమా?) -
మైసూర్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
-
‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి
Actress Chaitra Hallikeri Lodges FIR On Her Husband: తన భర్త వల్ల ప్రాణ హాని ఉందని ప్రముఖ నటి చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు తన భర్త, మామ కలిసి తన బ్యాంక్ అకౌంట్ను మిస్ యూస్ చేశారని ఆమె మైసూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చైత్ర భర్త బాలాజీ పోత్రాజ్, మామపై(చైత్ర భర్త తండ్రి) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. చైత్ర హల్లీకెరీ పలు కన్నడ సినిమాల్లో నటించింది. ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంతో మంగళవారం(మే 24న)భర్త బాలజీ పోత్రాజ్, మామ కలిసి తన బ్యాంక్ ఖాతాను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆరోపించింది. చదవండి: Viral Video: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు.. తనకు తెలియకుండానే ఆమె పేరుతో బ్యాంక్ నుంచి గోల్డ్ తీసుకున్నారని చైత్ర ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు వీరికి సౌత్ ఇండియా బ్యాంక్ మేనేజర్ సహకరించినట్లు చెప్పింది. ఈ విషయం తెలిసి వారిని నిలదీసినందుకు భర్త బాలజీ తనని హింసించినట్లు ఆమె పేర్కొంది. అంతేకాదు తన భర్త, మామ వల్ల ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని చైత్ర కోరినట్లు పోలీసులు తెలిపారు. ఇక చైత్ర ఫిర్యాదు మేరకు ఆమె భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 468,406, 409, 420, 506 కింద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బయటకు రాగానే యాంకర్ శివ రచ్చ, క్లాస్ పీకిన మహిళ పోలీస్ -
ప్రేమ పేరుతో లైంగికంగా దగ్గరై.. ఆ దృశ్యాలను వీడియో తీసి
మైసూరు: యువతులను ప్రేమించినట్లు నటించి లైంగికంగా దగ్గరై నగ్న దృశ్యాలను వీడియో తీసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న వంచకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా బసవటిక గ్రామానికి చెందిన గురుసిద్దప్ప కుమారుడు బీ.జీ. శివప్రకాశ్.. గూగుల్ మీట్, ఫేస్బుక్ద్వారా యువతులకు రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నట్లు నటించేవాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకునేవాడు. ఆ సమయంలో యువతులకు తెలియకుండా వీడియోలు తీసేవాడు. డబ్బు ఇవ్వకపోతే నగ్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించేవాడు. బాధిత యువతులు ఇచ్చిన ఫిర్యాదుతో మైసూరు నగర మహిళా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: (ప్రియురాలికి హాయ్ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ) -
వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..
మైసూరు: మూడేళ్ల కిందట మైసూరులో అదృశ్యమైన నాటు వైద్యుడు షాబాద్ షరీఫ్ (48) హత్యకు గురైనట్లు తెలిసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సరస్వతీ పురం పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. షరీఫ్ పూర్వీకులు ఎంతోకాలం నుంచి పైల్స్, ఫిస్టులాకు వైద్యం చేసేవారు. ఇందులో రహస్యం తెలుసుకోవాలని కేరళ మలప్పురం జిల్లా నీలాంబూర్కు చెందిన షైబీన్ అష్రఫ్, మరికొందరు కలిసి తమవారికి పైల్స్ ఆపరేషన్ చేయాలని చెప్పి 2019 ఆగస్టులో షరీఫ్ను కారులో కేరళకు తీసుకెళ్లారు. అతన్ని సుమారు యేడాదిన్నరపాటు ఒక గదిలో బంధించి పైల్స్, ఫిస్టులా చికిత్సా రహస్యాలను చెప్పాలని హింసించారు. కానీ ఫరీఫ్ నోరు విప్పలేదు. దీంతో దుండగులు అతన్ని ముక్కలుగా నరికిచంపి ప్లాస్టిక్ కవరులో కట్టి నదిలో పడేశారు. ఈ కేసు మిస్టరీ అనుకోకుండా వీడింది. నీలాంబూర్లో నిందితుడు అష్రఫ్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో నాటు వైద్యుని హత్య కేసు వివరాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి పోలీసులు మైసూరుకు వచ్చి మరింత దర్యాప్తు చేసి నిర్ధారించారు. నలుగురిని అరెస్టు చేశారు. చదవండి: నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి -
తండ్రి మైనపు విగ్రహం పక్కనే.. డాక్టర్ అపూర్వతో యతీష్ వివాహం
సాక్షి, మైసూరు: దివంగతులైన తండ్రికి మైనపు విగ్రహం చేయించి ఆప్రతిమ ఎదురుగానే తాను ఇష్డపడిన యువతిని పెళ్లి చేసుకున్నాడు తనయుడు. ఈ అపూర్వ ఘట్టం మైసూరు జిల్లా నంజనగూడు పట్టణంలోని సంతాన గణపతి కల్యాణమండపంలో శనివారం చోటు చేసుకుంది. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అజ్జంపుర గ్రామానికి చెందిన రమేష్ కరోనా సెకండ్వేవ్లో మృతి చెందారు. ఈయన కుమారుడు యతీష్ మైసూరులో ఆయుర్వేద వైద్య కళాశాలలో ఎండీ కోర్సు చేస్తున్నాడు. నంజనగూడు తాలూకా మేల్కుండి గ్రామానికి చెందిన డాక్టర్ అపూర్వతో యతీష్కు వివాహం నిశ్చయమైంది. తండ్రి ఎదుటనే వివాహం చేసుకోవాలని భావించిన యతీష్.. మైనపు విగ్రహం చేయించాడు. శనివారం విగ్రహాన్ని కల్యాణమండపానికి తీసుకొచ్చి ఆయన కళ్లెదుటే అపూర్వ మెడలో తాళి కట్టాడు. అనంతరం తండ్రి మైనపు విగ్రహం పక్కనే ఆసనం వేసి అందులో తల్లిని కూర్చోబెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. చదవండి: (ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్కిటెక్చర్ దుర్మరణం) -
ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్కిటెక్చర్ దుర్మరణం
మైసూరు: నగరంలోని పోలీస్ లేఔట్లో నివాసముంటున్న బీఎస్ఎన్ఎల్ రిటైర్డు ఉద్యోగి కూతురు లత (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఆర్కిటెక్చర్గా పనిచేస్తున్న లత శుక్రవారం స్కూటర్లో ఆఫీసుకు వెళ్తోంది. రింగ్ రోడ్డులో బండిపాళ్య వద్ద వేగంగా వచ్చిన మరో స్కూటర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లత తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. సిద్ధార్థ నగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ) -
మద్యానికి డబ్బివ్వలేదని ఉన్మాదం
మైసూరు: తాగుడుకు బానిసైన వ్యక్తి మద్యానికి కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదని ఉన్మాదిగా మారాడు. మహాభారత కాలంలో కంసుడు చేసినట్లుగా చెల్లెలి 8 నెలల బిడ్డను గోడకు కొట్టి హత్య చేసిన దురాగతం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. కనకగిరిలోని 5వ క్రాస్లో నివాసం ఉంటున్న సిద్దమ్మ అనే మహిళ కుమారుడు రాజు (30) ఈ ఘోరానికి పాల్పడినవాడు. ఇతడు చిన్నా చితకా పనులు చేస్తూ ఆ డబ్బుతో మద్యం తాగుతుంటాడు. శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి మద్యం డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. తన వద్దలేవని చెప్పగా ఇంటిలో ఉన్న చెల్లెలిని అడిగాడు. ఆమె కూడా లేవని చెప్పడంతో రాజు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఇంట్లో ఉన్న టీవీని పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా ఊయల్లో పడుకున్న 8 నెలల శిశువును తీసుకుని గోడకు విసిరికొట్టడంతో చిన్నారి ప్రాణాలు విడిచింది. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక విద్యారణ్యపుర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి రాజు కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: నాకు ప్రియుడే ముఖ్యం.. భార్య ఏం చేసిందంటే..? ) -
ఎస్ఐ స్కాం: అవును, బ్లూటూత్ వాడాను
బనశంకరి: బ్లూటూత్ పరికరం ఉపయోగించి పరీక్షలో సమాధానాలు రాశాను. ఇందుకోసం రూ. 40 లక్షలను ముట్టజెప్పాను అని ఎస్ఐ పోస్టుల స్కాంలో పట్టుబడిన అభ్యర్థి సునీల్ చెప్పాడు. అతన్ని సీఐడీ అధికారులు విచారించగా అక్రమాలను బయటపెట్టాడు. ఆర్డీ పాటిల్ బ్లూటూత్ పరికరం ద్వారా సమాధానాలు చెప్పాడని, ఇందుకోసం రూ.40 లక్షలు తీసుకున్నాడని సునీల్ చెప్పాడు. ఈ పరీక్షలో సునీల్ ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. అదనపు డీజీపీపై బదిలీ వేటు ఎస్ఐ ఉద్యోగాల భర్తీలో భారీ కుంభకోణం ఐపీఎస్లకు ఇబ్బందిగా మారింది. పోలీస్ నియామక విభాగం అదనపు డీజీపీ అమృత్పౌల్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఆంతరిక భద్రత విభాగానికి పంపించింది. ఇందుకు స్కామే కారణమని సమాచారం. త్వరలో మరికొందరు ఐపీఎస్లనూ బదిలీ చేయవచ్చని సమాచారం. అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు ఇటీవల మైసూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కర్ణాటక విశ్వవిద్యాలయం జియాగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్ ను బుధవారం మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే అరెస్టైన గెస్ట్ లెక్చరర్ సౌమ్య విచారణలో ఇచ్చిన సమాచారంతో నాగరాజ్ను అరెస్టుచేశారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం) -
ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు
మైసూరు: ఒకే కాన్పులో ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలు పుట్టారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మి అనే మహిళ గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు 7 నెలలు. ప్రసవ వేదన రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారు. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య నిపుణురాలు డాక్టర్ లీలావతి తెలిపారు. కాగా, శిశువులు కొంత బరువు పెరిగేవరకూ 20 రోజులు ఐసీయూలో ఉంచుతామన్నారు. తల్లి లక్ష్మి మాట్లాడుతూ స్కానింగ్లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసి ఆందోళన చెందానని, పిల్లలు క్షేమంగా ఉండడంతో సంతోషంగా ఉందని చెప్పారు. చదవండి: (Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం) -
హీరో కార్తీతో రాశీ ఖన్నా స్టెప్పులు
‘సర్దార్’తో స్టెప్పులేస్తున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్’. ఈ చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. కార్తీ, రాశీ ఖన్నాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించే ప్లాన్లో ఉంది యూనిట్. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ రెండు పాత్రలు చేస్తున్నారు. ఆఫీసర్ అయిన కొడుకు పాత్రకు జోడీగా రాశీ ఖన్నా కనిపిస్తారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. ఇక రాశీ ఖన్నా తెలుగులో నటించిన ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. -
వివాహితపై కామాంధుల సామూహిక అత్యాచారం.. స్పృహ కోల్పోయి
సాక్షి, మైసూరు: మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలో ఒక వివాహితపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 35 సంవత్సరాల వయసున్న బాధితురాలు ఈనెల 11న గొర్రెలను తీసుకొని మేతకు వెళ్లింది. అక్కడ తొలుత రాజు అనే నిందితుడు ఆమెపై బలత్కారానికి యత్నించాడు. ఆమె తీవ్రంగా అడ్డుకుంది. అనంతరం అక్కడే ఉన్న పుట్టణ్ణ, రవిలు రాజుకు తోడయ్యారు. అనంతరం ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. పశువుల్లా మీదపడి అకృత్యానికి పాల్పడటంతో ఆమె స్పృహ కోల్పోయింది. గొర్రెల మంద ఇంటికి వచ్చినా భార్య రాకపోవడంతో భర్త వెళ్లి పరిశీలించారు. అస్వస్థతకు గురైన ఆమెను మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం ఆ రోజు జరిగిన ఉదంతాన్ని భర్తకు వివరించింది. మరుసటి రోజు భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు రాజును శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం.. రూ.40వేలు డబ్బులు డ్రా చేయించి..) -
పండుగ కోసం సొంతూరికి.. తమ్ముడి ప్రేమ వ్యవహారంలో..
మైసూరు: తమ్ముని ప్రేమ వ్యవహారానికి అన్న బలి అయ్యాడు. ఈ ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె పట్టణంలోని హొసూరు లేఅవుట్లో జరిగింది. వివరాలు.. చిక్కరాజు (30) అనే వ్యక్తి బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఉగాది పండుగ కోసం సొంతూరికి వచ్చాడు. చిక్కరాజు తమ్ముడు తమ కూతురిని ప్రేమిస్తున్నాడని ఆమె తండ్రి మహదేవ నాయక్, సోదరులు కిరణ్, అభిషేక్లు చిక్కరాజుతో గొడవపడ్డారు. చిక్కరాజును కత్తితో పొడవడంతో అక్కడే మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. గుండ్లుపేటె పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. బైక్ ప్రమాదంలో టెన్త్ విద్యార్థి మృతి తుమకూరు(బెంగళూరు): పరీక్ష రాసేందుకు బైక్ పై వెళ్తున్న ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ సంఘటన కుణిగల్ తాలుకా హుందనగర గేట్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ఒకే బైక్పై వెళ్తూ అదుపు తప్పి ప్రహరీను ఢీకొంది. ప్రమాదంలో నవీన్ గౌడ (15) మృతి చెందాడు. దర్శన్, శరత్గౌడ అనే ఇద్దరు గాయపడ్డారు. ఆ ఇద్దరినీ ఆదిచుంచునగిరి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: భార్యతో విడాకులు.. ఆమె ఫ్రెండ్తో సాన్నిహిత్యం.. రవికిరణ్ అదృశ్యం.. కారణం అదేనా? -
ప్రేమజంటపై పెద్దల దాష్టీకం.. పెళ్లైన రెండు రోజులకే..
మైసూరు(బెంగళూరు): రెండేళ్లపాటు ప్రేమించుకున్న ప్రేమ జంట పెళ్ళి జరిపించాలని పెద్దలను కోరగా ససేమిరా అన్నారు. దీంతో ఆ జంట పోలీసుల సహాయంతో పెళ్లి చేసుకోగా పెద్దలు వచ్చి విడదీశారు. హుణసూరులో ఈ సంఘటన జరిగింది. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కదబహళ్లికి చెందిన అభిషేక్, చోళెనహళ్లివాసి అనన్య ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు వ్యతిరేకించారు. దాంతో హుణసూరు పోలీసులను సంప్రదించి మంగళవారం ఒక ఆలయంలో మూడుముళ్లు వేసుకున్నారు. ఇది తెలిసి అనన్య తల్లిదండ్రులు, బంధువులు బుధవారం మైసూరులో ఆ జంట ఒక కెఫేలో ఉండగా దాడి చేసి కొట్టారు. అనన్యను బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో భర్త హుణసూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో.. మహిళ ఆత్మహత్య హోసూరు: మతి స్థితిమితం కోల్పోయిన మహిళ ఉరివేసుకొన్న ఘటన మంగళవారం రాత్రి బాగలూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని జి.మంగలం గ్రామానికి చెందిన తోపయ్య భార్య శశికళ (55) ఆరు నెలలుగా మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో ఉండేది. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. బాగలూరు పోలీసులు శవాన్ని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: Extramarital Affair: పక్కింటి మహిళ ఇంట్లోకి రావడంతో.. -
గేమ్ ఆడుతూ ప్రేమ.. ఎవరికి తెలియకుండా పెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన పేరెంట్స్
మైసూరు: ఆన్లైన్లో పరిచయమైన ఒడిశా యువతిని ప్రియుడు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. యథా ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమ లేదు, పెళ్లీ లేదు అని యువతిని తమతో తీసుకెళ్లారు. దీంతో ప్రియుడు కమ్ భర్త.. తన భార్య కావాలని పోలీసులను ఆశ్రయిచాడు. వివరాలు.. మైసూరు సిటీకి చెందిన మహ్మద్ అఖిబ్ అనే యువకుడు ఆన్లైన్లో గేమ్ ఆడుతున్న సమయంలో ఒడిశాకు చెందిన ప్రియాత్ రావత్ అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుతూ ప్రేమించుకున్నారు. తరువాత అఖిబ్ ఒడిశాకు వెళ్ళి యువతిని మైసూరుకు తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాడు. తమ కుమార్తె కనిపించక పోవడంతో యువతి తల్లిదండ్రులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైసూరులో ఉన్నానని, పెళ్లి చేసుకున్నానని ప్రియాత్ తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులతో వచ్చి మాట్లాడాలని చెప్పి కూతురిని పిలిపించుకుని ఒడిశాకు తీసుకెళ్లారు. అఖిబ్ భార్య కావాల్సిందేనని మైసూరు నగరంలోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
వ్యభిచార గృహంపై దాడి.. ఒక మహిళ.. మరో ఇద్దరు యువతులను..
సాక్షి, మైసూరు: వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న మహిళను మైసూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ మహిళ చెరలో ఉన్న మరో ఇద్దరు యువతులను రక్షించారు. విజయనగర నాల్గో ఫేజ్లోని ఒక ఇంటిపై సోదాలు జరిపి మహిళను అరెస్టు చేసి రూ. 31,500 నగదు, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..
సాక్షి, మైసూరు: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువజంట ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా సింగర మారనహళ్లిలో జరిగింది. హుణసూరు తాలూకా బిళికెరె హోబళి సింగరమారనహళ్లి గ్రామానికి చెందిన అర్చన (18), రాకేశ్ (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను కాదని ఐదు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి వేరోచోట పెళ్లి చేసుకున్నారు. మైసూరులో కాపురం పెట్టారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదనివారి తల్లిదండ్రులు సెప్టెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అర్చన, రాకేశ్లు మంగళవారం రాత్రి సింగరమారనహళ్లి గ్రామానికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో బుధవారం ఉదయానికి ఊరు శివార్లలోని పొలంలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. బిళికెరె ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?) -
మద్యం మానిపించేందుకు యత్నించిందని భార్యను గొంతునులిమి చివరికి...
మైసూరు: రోజూ మద్యం తాగి వచ్చి ఇంటిలో గొడవ చేస్తున్న భర్తకు బుద్ధి మాటలు చెప్పిన భార్య శవమై తేలింది. వివరాలు.. మైసూరు నగరంలోని క్యాతమారనహళ్లిలో సంధ్య (25), భర్త కిరణ్ (27) 4 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక కుమార్తె ఉంది. కిరణ్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ పోరు తట్టుకోలేక సంధ్య తన భర్తను మద్యం మాన్పించే ఆశ్రయ కేంద్రంలో చేర్పించింది. మూడు నెలలపాటు అక్కడ ఉండి వచ్చిన కిరణ్.. నన్ను మందు మాన్పించడానికి పంపిస్తావా? అని భార్యతో పోట్లాటకు దిగి ఆమెను గొంతుపిసికి హత్య చేశాడు. ఉదయగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. ఏఎస్ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష
మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతరసనహళ్లి వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు. ఒంటరి యువతిని చూసి.. 2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజు ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలికి అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి. దోషి ఉమేశయ్య -
అరుదైన నల్ల చిరుతని ఎప్పుడైనా చూశారా..?
మైసూరు(కర్ణాటక): వన్యజీవుల ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి సందర్శకులకు కనువిందు చేసింది. మైసూరు జిల్లాలో ఉన్న హెచ్డీ కోటె తాలూకాలో నాగరహొళె అభయారణ్యంలోని దమ్మనకట్టి రేంజిలో సోమవారం సఫారీకి వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చింది. దీంతో సందర్శకులు తమ కెమెరాలకు పనిచెప్పారు. అరుదైన నల్ల చిరుత ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. చాలా అరుదుగా నల్ల చిరుత బయటకు వస్తూ ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: ఆ ఫొటోలు మైనర్కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని.. -
యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?
మైసూరు (కర్ణాటక): మైసూరులోని సాతగళ్లి లేఔట్లో నివాసం ఉంటున్న సంతోష్(26), భవ్య(22) అనే యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బుధవారం స్థానికులు వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అన్నంలో పురుగుల మందు కలిపి తిన్నట్లు తేలింది. అప్పుల బాధతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) -
కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్
మైసూరు: పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న హెడ్మాస్టర్ నీచ ఉదంతమిది. ఈ ఘటన మైసూరు జిల్లా హెచ్డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు వాట్సప్లో వ్యాప్తి చెందడంతో ఆ హెచ్ఎంపై ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరువ్యాప్తంగా ఆ వీడియోలు వైరల్ కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: (మొదటి భార్య నాలుగో కూతురు.. రెండో భార్య కొడుకు మధ్య ప్రేమ..) -
పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా.. ప్రియునితో ప్రేమాయణం, భర్తకు తెలిసి
సాక్షి, మైసూరు (కర్ణాటక): పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ, యువకుని ప్రేమాయణంపై గ్రామపెద్దలు కన్నెర్రజేశారు. ఆమెను మందలించి, ప్రియునికి దేహశుద్ధి గావించారు. నంజనగూడు తాలూకాలోని హళ్ళిదిట్టి గ్రామంలో ఇది జరిగింది. కొంతెగాల గ్రామానికి చెందిన మహేష్ కుమార్, పొరుగున మసగే గ్రామానికి చెందిన యువతి పీయూసీలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇది తెలిసి ఆమె తల్లిదండ్రులు మరో హళ్లిదిడ్డికి చెందిన యువకునితో పెళ్లి జరిపించారు. భర్తతో కలిసి సంసారం చేసి ఇద్దరు పిల్లలున్న ఆమె ప్రియున్ని మరిచిపోలేదు. అతడూ తరచూ ఆమె ఇంటికి చాటుగా వచ్చి వెళ్తుండేవాడు. దాంతో మహిళ భర్తకు ఈ విషయం తెలిసి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. ఇంతలో గురువారంనాడు గ్రామానికి వచ్చిన మహేష్ ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే పెద్దలు, గ్రామస్తులు పట్టుకుని కొట్టి బుద్ధిమాటలు చెప్పారు. -
ఆ మహిళకు పదేపదే ఫోన్లు.. భర్తకు తెలిసి..
మైసూరు (కర్ణాటక): ఫోన్ కాల్స్ గొడవ యువకుని ప్రాణాలు తీసింది. నగరంలోని యరగనహళ్ళిలో ఉండే ప్రజ్వల్ (19) ఒక హోటల్లో పని చేసేవాడు. ఒక మహిళకు పదేపదే ఫోన్లు చేస్తుండేవాడు. దీంతో ఆమె భర్త, మరికొందరు కలిసి ప్రజ్వల్ ఇంటికెళ్లి గొడవ చేశారు. మళ్లీ హోటల్కు వచ్చి ప్రజ్వల్ను నిలదీసి అతని లాక్కెళ్లసాగారు. దాంతో భయపడి ప్రజ్వల్ హోటల్ భవనంపైకి పరిగెత్తి కిందికి దూకడంతో మృత్యువాత పడ్డాడు. దేవరాజ్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో..) -
దేవుడు పూనుతున్నాడని చెప్పి కన్నతల్లి దాష్టీకం.. సొంత కొడుకునే దారుణంగా..
సాక్షి, మైసూరు: కన్నబిడ్డని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన మాతృమూర్తి మృగంగా మారింది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెచ్.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ కొడుకు శ్రీనివాస్(4)ను వేట కొడవలితో నరికి చంపింది. ఆమెకు భర్త శంకర్ ఉన్నాడు. కొంతకాలంగా తనకు దేవుడు పూనుతున్నాడని చెప్పుకునేది. ఆమె విపరీత ధోరణిని చూసి భర్త కూడా దూరంగా ఉంటున్నాడు. 15 రోజుల కిందట భర్త దగ్గర ఉన్న కొడుకు శ్రీనివాస్ను పుట్టింటికి తీసుకెళ్లింది. సోమవారం రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ వేట కొడవలిలో చిన్నారిని భయానకంగా నరికి చంపింది. ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలున్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హెచ్.డి.కోటె పోలీసులు భవానీని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రియుడి వేధింపులతోనే సుగుణ ఆత్మహత్య? -
Mysore: ఎక్కడ చూసినా పాములు.. కంటి మీద కునుకు లేకుండా
మైసూరు: పర్యాటక రాజధాని మైసూరువాసులకు పాములు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పాములు, అందులోనూ ప్రాణాంతకమైన రక్తపింజర జాతి సర్పాలు కనిపిస్తున్నాయి. నిత్యం ఇవి నగరంలో కనీసం నాలుగైదు చోట్ల ఇళ్లు, బయలు ప్రాంతాల్లో వస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ పాములు చాలా ప్రమాదకరమైనవి. కాటేస్తే ప్రాణాలు పోవడమో, లేదా తీవ్ర గాయం మిగిలిపోవడమో జరుగుతుంది. గత నెలలో నగరంతో పాటు జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన పాములు నగరంలోకి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. చదవండి: (పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్కి వెళ్లి..) -
పెళ్లై ఇద్దరు పిల్లలు.. యువతితో ప్రేమాయణం.. గర్భం దాల్చడంతో
సాక్షి, బెంగళూరు: మైసూరుకు చెందిన జేడీఎస్ నాయకుడు శివమూర్తి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు భాగ్య దంపతుల కుమారుడు ప్రదీప్(32)ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని మరటిక్యాతనహళ్లిలోని అపార్ట్మెంట్లో ఈఘటన చోటు చేసుకుంది. ప్రదీప్కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మైసూరు నగరంలో పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న అవివాహితతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమెకు ఇటీవల గర్భం రావడంతో వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. చదవండి: ఐస్ క్రీం విక్రయించనందుకు మొత్తం స్టాక్నే పాడు చేశాడు!! తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నందున పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. మద్యం మత్తులో గురువారం ఇంటికి చేరుకొని తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇవాళ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కేపీహెచ్బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి -
బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..
సాక్షి, మైసూరు: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని ప్రియునితో వెళ్లిపోవడంతో తట్టుకోలేని తండ్రి రోడ్డుపైనే ఆమెపై దాడి చేశాడు. కుమార్తె మెడలో ఉన్న తాళిబొట్టును తెంచివేసి జుట్టు పట్టుకొని తండ్రి ఈడ్చుకెళ్తుండగా జనం అడ్డుకున్నారు. వివరాలు... నంజనగూడు తాలూకాలోని హరతళె గ్రామానికి చెందిన చైత్ర, హల్ళెర గ్రామానికి చెందిన మహేంద్ర సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు. చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం) యువతి తల్లిదండ్రులు దీనిని అంగీకరించలేదు. దాంతో ప్రేమజంట ఈ నెల 8వ తేదీన ఒక గుడిలో మూడుముళ్లు వేసుకుని, ఆ పెళ్ళిని రిజిస్టర్ చేసుకోవాలని సోమవారం సాయంత్రం 4 గంటలప్పుడు నంజనగూడుకు రాగా, చైత్ర తండ్రి బవసరాజు నాయక్ అడ్డుకున్నాడు. కుమార్తె మెడలోని తాళిని తెంచి, ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లసాగాడు. చైత్ర కాపాడండి అని అరవడంతో స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే తండ్రి నుంచి విడిపించుకుని భర్తను చేరుకుంది. స్థానికుల సహాయంతో ఆమె నంజనగూడు పోలీస్ స్టేషన్కు వెళ్ళి తండ్రిపై ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తమకు భద్రత కల్పించాలని కోరింది. ఈ తతంగమంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. -
ప్రేమపెళ్లిపై పెద్దల పగ.. నవ వధువు ఆత్మహత్య
సాక్షి, మైసూరు: ప్రేమ పెళ్లిపై గ్రామపెద్దలు నానా రాద్ధాంతం చేయడం ఒకరి ప్రాణాలనుతీసింది. నగరంలోని మానసగంగోత్రిలో ఒక నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నంజనగూడు తాలూకా హడెతలె గ్రామానికి చెందిన శివణ్ణ నాయక కుమార్తె మంజుల (28)గా గుర్తించారు. హెమ్మరగాల గ్రామానికి చెందిన డ్రైవర్గా పనిచేసే సూర్యకుమార్ అనే యువకుడు మే నెలలో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదవండి: (16 ఏళ్లకే నూరేళ్లు నిండిన ఓ ఆడబిడ్డ ఆక్రందన ఇది..!) ఇద్దరి కులాలు వేరు కావడంతో రెండు గ్రామాల పెద్దలు పంచాయతీ పెట్టారు. గ్రామంలో ప్రజల అందరి ముందు క్షమాపణలు కోరాలని పట్టుబట్టారు. తామేం తప్పు చేయలేదని, క్షమాపణ ఎందుకు కోరాలని మంజుల తిరస్కరించి మానస గంగోత్రిలోని ఇంటికి వచ్చేశారు. గ్రామంలో జరిగిన అవమానంతో విరక్తి చెంది ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలు వివరిస్తూ డెత్నోట్ను రాసి ఉంచింది. సరస్వతిపురం పోలీసులు పరిశీలించి కేసు నమోదుచేశారు. చదవండి: (Hyderabad: నగరంలో వివాహిత అదృశ్యం..) -
కన్నతల్లి కర్కశత్వం: రెండేళ్ల పాపను నీటి బకెట్లో ముంచి.. ఆపై..
మైసూరు: రెండేళ్ల కుమార్తెను కన్నతల్లి నీటి బకెట్లో ముంచి కర్కశంగా హతమార్చి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని గట్టివాడి గ్రామంలో శుక్రవారం చోటు చేíసుకుంది. వివరాలు... గట్టివాడి గ్రామానికి చెందిన మహాదేవ ప్రసాద్, అన్నపూర్ణ (22) భార్యభర్తలు. రెండేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. వీరికి ఓ పాప. ఇంటిలో తరచూ గొడవలు వస్తుండటంతో విసిగిపోయిన అన్నపూర్ణ తన కుమార్తెను నీటి బకెట్లో ముంచి హత్య చేసి ఆపై తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో.. హత్యగా తేల్చిన శవపరీక్ష నివేదిక బనశంకరి: ఓ వ్యక్తి మృతి కేసులో శవపరీక్ష నివేదికలో హత్య అని తేలడంతో విచారణ చేపట్టిన కొడిగేహళ్లి పోలీసులు రెండు నెలల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలు... మత్తికెరెలో కర్ణాటక ఫోర్క్స్టాల్లో షంషీర్ అనే వ్యక్తి పనిచేసేవాడు. అక్టోబర్లో 17న ప్రదీప్ యాదవ్ దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో షంషీర్, ప్రదీప్ మధ్య గొడవ జరిగింది. షంషీర్ తూకం రాయితో ప్రదీప్పై దాడి చేశాడు. అక్కడే ఉన్న దుకాణం యజమాని సోదరుడు ఆటోలో ప్రదీప్ను కేసీ ఆస్పత్రి తరలించారు. డాక్టర్లు పరీక్షించి నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లాడు. 20న ఇంట్లో ఉండగా ప్రదీక్యాదవ్ కిందపడి పోయాడు. కుటుంబ సభ్యులు బాప్టిస్ట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడి డాక్టర్లు ప్రదీప్ గాయంకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి షంషీర్ను అరెస్ట్ చేశారు. -
చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుని.. కాలువలో దూకి..
మైసూరు: ప్రేమజంట కేఆర్ఎస్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను మైసూరు నగరంలోని మేటెగళ్లి లేఔట్లోని హళె పోలీస్ స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న నవీన్(20), నిసర్గ(19)గా గుర్తించారు. మృతులు ఇద్దరూ బంధువులే. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియకుండా గుట్టుగా ఉంచారు. చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..) ఈక్రమంలో గతనెల 20న చామరాజనగర సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన యువకుడితో నిసర్గకు వివాహం జరిపించారు. నిసర్గ డిసెంబర్ 1న ఇంటినుంచి బయటకు వెళ్లి నవీన్ను కలిసింది. బైక్పై కేఆర్ఎస్ వద్దకు వెళ్లారు. నిసర్గ తన చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుంది. ఇద్దరూ కలిసి కాలువలో దూకారు. రెండు రోజులుగా బైక్ నిలిపి ఉంచడంపై అనుమానం రావడంతో కేఆర్ఎస్ పోలీసులు వచ్చి ఆరా తీయగా ప్రేమజంట సంచరించినట్లు గుర్తించారు. కాలువలో గాలించగా శుక్రవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు బయట పడ్డాయి. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (మీర్పేట్లో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్) -
తాగుబోతు మారణహోమం.. ఇద్దరిని హతమార్చి, మరో నలుగురిని..
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకా నవిలూరు గ్రామంలో ఓ తాగుబోతు మారణహోమానికి పాల్పడ్డాడు. వేట కొడవలిని తీసుకుని ఎదురింట్లో ఉండే వృద్ధ దంపతులను హతమార్చి, మరో నలుగురిని గాయపరిచాడు. మద్యానికి బానిసైన ఇతడు తరచూ ఇరుగుపొరుగుతో గలాటాలు పడేవాడు. బుధవారం రాత్రి నిందితుడు ఈరయ్య (38)కు, ఎదురింటి మాదయ్య (60), భార్య నింగమ్మ (50)తో గొడవ జరిగింది. ఈరయ్య ఇంట్లోని వేట కొడవలిని తీసుకుని మాదయ్య, నింగమ్మలను నరికి చంపాడు. చదవండి: ('లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తాం'.. ఐటీ ఉద్యోగిని..) అడ్డుకోబోయిన ఈరయ్య భార్య మహాదేవమ్మ, తల్లి, తండ్రితో పాటు మరో వ్యక్తి సురేష్ పైనా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లి గౌరమ్మ, సురేష్లను బెంగళూరుకు తరలించారు. భార్య మహాదేవమ్మను గర్భవతి అని కూడా చూడకుండా గాయపరిచాడు. దీంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టి ఇళ్ళకు తలుపులు వేసుకున్నారు. నంజనగూడు పోలీసులూ ఈరయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిని చేతన్, డీఎస్పి గోవిందరాజు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..) -
కలిసి మద్యం తాగారు.. ఊపిరి ఉండగానే పాతేశారు
మైసూరు: తాగిన మైకంలో స్నేహితులు గొడవపడి ఒకరిని అమానుషంగా హత్య చేశారు. హనగోడిలోని బీసీ కాలనీలో ఈ ఘటన జరిగింది. మూడురోజుల కిందట కృష్ణ (33)ని అతని స్నేహితులు గోపాల, అశోక్లు ఫోన్ చేసి మారమ్మ గుడి వద్దకు పిలిపించారు. మద్యం తాగి ఏదో విషయమై ఘర్షణ పడ్డారు. కృష్ణను మిగతావారు కొట్టడంతో స్పృహ తప్పాడు. జేసీబీతో అక్కడే గుంతను తవ్వి ఊపిరి ఉండగానే కృష్ణను పాతిపెట్టారు. మరుసటి రోజున భర్త కనబడకపోవడంతో భార్య గ్రామపెద్దలకు ఫిర్యాదుచేయగా నిందితులు పరారయ్యారు. హుణసూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా గోపాల, అశోక్ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని తీయించి పోస్టుమార్టం జరిపించారు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్లో రూం తీసుకొని..) -
ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్లో రూం తీసుకొని..
మైసూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని విరక్తి చెందిన ప్రేమికులు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన మైసూరులో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీశ్ (21), వరలక్ష్మి (20) అనే ఇద్దరు మృతులు. వీరు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్తో పెళ్లికి వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాతనే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తామని తెలిపారు. బీఏ చదివిన సతీశ్ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నర్సింగ్ చదువుతోంది. కాగా, సతీశ్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం తెచ్చుకో అని ప్రియురాలి తండ్రి సిద్ధలింగ తేల్చి చెప్పడంతో ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. మైసూరుకు వచ్చిన జంట మంగళవారం సాయంత్రం లాడ్జ్లో రూం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. లాడ్జ్ యజమాని లష్కర్ ఏరియా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ) నదిలో దూకిన మరో ప్రేమజంట మైసూరు: తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని ప్రేమజంట కపిలా నదిలోకి దూకింది. నంజనగూడు తాలూకా ముడికట్టె వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా సోమవారపేట గ్రామ నివాసి అభి (19), చామరాజనగరకు చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. బాలిక కాలేజీలో చదువుకుంటుండగా, అభి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బుద్ధిగా ఉండాలని మందలించారు. దీంతో యువ జంట ఆవేదనకు గురై కపిలా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. నదిలో తెప్పలు నడుపుతున్నవారు ప్రేమ జంటను రక్షించడంతో గండం తప్పింది. ఇద్దరిని నంజనగూడు ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. -
తీరొక్క పంటలు
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని రైతులు కొత్త సాగుబాట పట్టారు. సంప్రదాయ వరి పంటకు ప్రత్నామ్యాయంగా భిన్నరకాలను పండిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసుకుంటున్నారు. తమకున్న పొలంలో రకరకాల పంటమార్పిడులతో ప్రయోగాలు చేస్తున్నారు. చేతికందిన పంటకు తామే సొంతంగానే మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. పురుగుమందులు వాడకుండా సేంద్రియ పద్ధతులు అనుసరిస్తుండటంతో వీరి ఉత్పత్తులకు డిమాండ్ పలుకుతోంది. కోదాడరూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో రైతు వెంకటేశ్వరావు ఎకరంలో మైసూర్ మల్లిక అనే దేశవాళి వరి రకాన్ని సాగుచేస్తున్నాడు. నాలుగేళ్లుగా సేంద్రియ పద్ధతిలో ఈ రకం వరితోపాటు, కూరగాయలు, ఆకుకూరలు, చెరకు కూడా పండిస్తున్నాడు. తన పొలంలో వచ్చిన ఉత్పత్తులను కోదాడ పట్టణంలో సొంతంగా దుకాణం పెట్టుకుని అమ్ముతున్నాడు. ఆయన ఉత్పత్తులు, పంటలపై వినియోగదారులకు కూడా నమ్మకం కలగడంతో వెంటనే అమ్ముడుబోతున్నాయి. వెంకటేశ్వర్రావు జహీరాబాద్ నుంచి మైసూర్ మల్లిక విత్తనాలను తెప్పించి నారు పెంచాడు. పురుగు, దుక్కి మందులు వాడలేదు. అవసరమైనప్పుడు వేరుశనగ చెక్కను డ్రమ్ము నీటిలో నానబెట్టి దానిని బావిలో వదిలి ఆ నీటిని పంటకందించాడు. పైరు మూడు నుంచి మూడున్నర అడుగుల ఎత్తుకు పెరిగింది. ప్రస్తుతం వరి కోతకు వచ్చిందని దిగుబడి 20 బస్తాలు (14 – 15 క్వింటాళ్లు) వస్తుందని అంచనా. ఈ రకం బియ్యం కేజీ రూ.100 నుంచి రూ.120 వరకు అమ్ముడుబోతోంది. ఎకరాకు 14–15 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. వాటిని మిల్లుపట్టిస్తే క్వింటాకు 65 కేజీల బియ్యం వస్తాయి. అటుఇటుగా 10 క్వింటాళ్ల బియ్యం వస్తుంది. క్వింటా బియ్యం రూ.10వేల చొప్పున అమ్మినా రూ.లక్ష వస్తుందని, పెట్టుబడికి రూ.20 వేలు ఖర్చయినా.. రూ.80 వేల నికర ఆదాయం ఉంటుందని రైతు చెబుతున్నాడు. కాగా, ఈయన మరో రెండున్నర ఎకరాల్లో చెరకు సాగుచేస్తున్నాడు. దీన్ని తన షాప్లోనే జ్యూస్తీసి విక్రయిస్తున్నాడు. పంటల్లో తెగుళ్ల నివారణకు బియ్యం కడిగిన నీళ్లు, ఎర్రమట్టి నీళ్లు, పొగాకు కాడలు నానబెట్టి తీసిన నీళ్లు, అల్లం వెళ్లుల్లి పేస్ట్, నత్తల గవ్వలు కరగబెట్టిన నీటిని డ్రిప్ ద్వారా అందిస్తున్నాడు. పల్లీసాగు తీరే వేరు హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం కోమటిపల్లికి చెందిన రైతుకు భూక్యా మోహన్నాయక్కు వేరుశనగ సాగు కలిసొచ్చింది. కోమటిపల్లిలో ఆయనకు మూడెకరాల పొలం ఉంది. ఏడాది నుంచి వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ వేస్తున్నాడు. ఆయన అనుసరించిన మేలైన సాగు విధానాలతో ఎకరాకు 5.50 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడెకరాల్లో ఖర్చులుపోను రూ.1.2 లక్షల వరకు మిగిలింది. ప్రస్తుతం మార్కెట్లో నూనెకు డిమాండ్ ఉన్నందున మళ్లీ ఈ పంటే వేశాడు. పల్లి క్వింటా రూ.6,190 నుంచి రూ.6,917 పలుకుతోందని, మూడు నెలల్లో పంట చేతికొస్తుందని, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలు పొందొచ్చని మోహన్ అంటున్నాడు. బొప్పాయి ‘పండు’గ ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన చెరుకూరి రామారావుకు వ్యవసాయంపై మక్కువ. ఈయన పదేళ్ల క్రితం నుంచే పండ్ల తోటలు, కూరగాయల పంటలు సాగుచేస్తున్నాడు. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో కండక్టర్ ఉద్యోగాన్ని వదిలేసి 2005లో వారసత్వంగా వచ్చిన ఐదెకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు సాగుచేశారు. ఆ తర్వాత తనకో ప్రత్యేకత ఉండాలని కూరగాయలు, పండ్ల తోటలను ఎంచుకున్నారు. జామ, బొప్పాయి, అరటి, నిమ్మ, చెరకు, సీతాఫలం, పుచ్చ వంటి పంటలతో పాటు కూరగాయల పంటలు తీగజాతి పంటలు బీర, సొర, కాకర, బోడ కాకర, వంగ, బెండ, దోస వంటి అనేక పంటలతో మార్పిడి చేస్తూ సాగు చేస్తుంటారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం మరో ప్రత్యేకత. వ్యవసాయంలో ఆదాయంతో ఐదెకరాల నుంచి నేడు 20 ఎకరాలకు ఎదిగారు. కాగా, ఆయన సాగుచేసే పంటల్లో బొప్పాయి ప్రత్యేకం. దీని సాగుకు ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చవుతుండగా 30 టన్నుల దిగుబడి సాధిస్తూ రూ.3 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. -
మొదటిసారి ప్రయోగాత్మకంగా.. తగ్గేదే లేదంటున్న కర్ణాటక మహిళా పోలీసులు
మైసూరు(బెంగళూరు): రాత్రి గస్తీలో పురుష పోలీసులకు దీటుగా తాము కూడా పనిచేయగలమని మహిళా పోలీసులు నిరూపించారు. ఈమేరకు బుధవారం రాత్రి మైసూరులోని నంజనగూడు పోలీస్ ఉప విభాగం పరిధిలో మహిళా పోలీసులు రాత్రి గస్తీ విధులు నిర్వహించారు. బుధవారం రాత్రి 9 గంటలనుంచి గురువారం తెల్లవారుజామున 6 గంటలవరకు విధులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా మహిళా పోలీసులను రాత్రి గస్తీ విధులకు పంపగా వారు ధైర్యంగా విధులు నిర్వహించారన్నారు. మరో ఘటనలో.. బిడ్జి మరమ్మతులకు ప్రతిపాదన కేజిఎఫ్: ఇటీవల కురిసిన వర్షాలకు తాలూకాలోని రామసాగర చెరువు మరువపోయి పాలారు నదికి అడ్డుగా నిర్మించిన బ్రిడ్జి తెగిపోయిందని, దీనికి మరమ్మతులకు గాను రూ. 2 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. గురువారం బాపనేహళ్లి వద్ద తెగిపోయిన బ్రిడ్జిని ఆమె పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఏఈఈ శేషాద్రి తదితరులు ఉన్నారు. చదవండి: నా భర్త నాకు కావాలి.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు -
బంగార్రాజు: మైసూర్లో నాగ చైతన్య, కృతిల లవ్ట్రాక్
మైసూర్లో బంగార్రాజు సందడి సరదాగా సాగుతోంది. నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీశెట్టి ప్రధాన పాత్రల్లో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్లీ వచ్చా డు’ అనేది ట్యాగ్లైన్. ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్లో జరుగుతోంది. నాగచైతన్య, కృతీశెట్టి కాంబినేషన్లో వచ్చే లవ్ బ్యాక్డ్రాప్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. చదవండి: కేబీఆర్ పార్క్ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం ‘బంగార్రాజు’ లొకేషన్లోని చైతూ, కృతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైసూర్ షెడ్యూల్ పూర్తికాగానే తర్వాతి షెడ్యూల్ను హైదరాబాద్లో స్టార్ట్ చేస్తారట ‘బంగార్రాజు’ అండ్ కో. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. కాగా 2016లో వచ్చిన హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయానా’ చిత్రానికి ప్రీక్వెల్గా ‘బంగార్రాజు’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ బాధలో డిప్రెషన్కు వెళ్లిపోయా: శివాని రాజశేఖర్ -
మైసూర్లో సందడి చేయబోతోన్న ‘థ్యాంక్యూ’ టీం!
ప్రస్తుతం ‘లవ్స్టోరీ’ సక్సెస్ను ఆస్వాదిస్తున్న అక్కినేని హీరో నాగచైతన్య అదే జోష్తో థ్యాంక్యూ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. మనం(2014) తర్వాత దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో చైతూ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్లు హీరోయిన్లు. ఇటీవల హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ను ముగించుకుంది. చదవండి: సినిమాల్లోకి సుమ రీఎంట్రీ, క్లారిటీ ఇచ్చిన యాంకర్ ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్కు కోసం చిత్ర బృందం రాజమండ్రి వెళుతుందని, అక్కడ మూడు రోజుల షెడ్యూల్ అనంతరం థ్యాంక్యూ టీం మైసూర్ వెళ్లనుందని సమాచారం. ఈ మైసూర్లో పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మైసూర్ షెడ్యూల్తో ప్యాచ్వర్క్ సహా సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. చదవండి: పైసా సంపాదన లేదు.. నా భార్య సంపాదనతో బ్రతికాను -
పెళ్లి మండపంలోనే పునీత్కు నివాళి అర్పించిన కొత్తజంట
Newly Married Couple Pays Tributes To Puneeth Rajkumar At Mysore: కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్కు శ్రద్ధాంజలి ఘటించి అభిమానాన్ని చాటుకున్నారు. మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట వివాహం జరిగింది. మూడుముళ్ల సంబరమయ్యాక అక్కడే పునీత్ రాజ్కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అతిథులు నూతన జంటని ఆశీర్వదించడంతో పాటు పునీత్కు శ్రద్దాంజలి ఘటించారు. అందరిలోనూ పెళ్లి సంతోషం కంటే పునీత్ దూరమయ్యాడన్న బాధ వ్యక్తమైంది.చదవండి: నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్వుడ్కు అది శాపమా? పునీత్ అభిమాని ఆత్మహత్య మైసూరు: పునీత్ రాజ్కుమార్ మరణాన్ని తట్టుకోలేక ఒక అభిమాని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం మైసూరు జిల్లాలోని కేఆర్ నగర పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుడైన అశోక్ (40) పునీత్ లేడన్న నిజాన్ని భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: పునీత్ మరణం: లైవ్లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు -
తండ్రి పట్టించుకోలేదని.. కుమారుడి కిరాతకం
మైసూరు: మైసూరులో దారుణం చోటు చేసుకుంది. కుమారుడి చేతిలో తండ్రి, మరో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... ఇక్కడి నగరంలోని కేజీ కొప్పలులో శివ ప్రకాశ్ నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు సాగర్. ఇదిలా ఉంటే శివప్రకాశ్, అతని స్నేహితుడు నాగరాజు కలిసి పలు వ్యాపారాలు చేశారు. 2016లో నాగరాజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ సమయంలో నాగరాజు తనకు ఆరోగ్యం సరిగా లేదని, తన భార్య లత, కుమారుడు నాగార్జునను బాగా చూసుకోవాలని కోరాడు. అప్పటి నుంచి శివప్రకాశ్ వీరి కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఇది నచ్చని కుమారుడు సాగర్ పలుమార్లు తండ్రిని హెచ్చరించాడు. తండ్రి పట్టించుకోకపోవడంతో గురువారం రాత్రి సాగర్ తన తండ్రి వద్దకు వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆగ్రహంతో సాగర్ తండ్రి శివప్రకాశ్ (56)ను అతనితో ఉన్న మహిళ లత (48)ను దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోడానికి వచ్చిన లత కుమారుడు నాగార్జునపై కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: తమతో పాటు ఆశ్లీల చిత్రాలు చూడలేదని.. బాలికను కిరాతకంగా రాళ్లతో కొట్టి.. -
సంబరాల దసరా
దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉత్సవాల పరమార్థం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయ దశమి. తమలోని దుర్గుణాలను తొలగించి సన్మార్గాన్ని ప్రసాదించ మని అమ్మవారిని కొలుచుకునే వేడుకే దసరా. ఈ శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజులపాటు జగన్మాతను భక్తి శ్రద్దలతో పూజించి, 10వ రోజు పండగ జరుపుకోవడం ఆనవాయితీ. భారతదేశం సాంస్కృతిక వైవిధ్యం కారణంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఇకనైనా కరోనా మహమ్మారినుంచి విముక్తి ప్రసాదించమని శరణు వేడుకుంటున్న ప్రత్యేక సందర్భంలో ఈ ఏడాది పండుగను నిర్వహించుకుంటున్నాం. ఆయురారోగ్యాలు, సకల శుభాలు వరించేలా ఆ దుర్గామాత దీవించాలని కోరుకుంటూ సాక్షి.కామ్ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. -
పీజీ గోల్డ్ మెడలిస్ట్.. ప్రేమించి పెళ్ళి చేసుకొంది.. అంతలో ఏమైందోగానీ!
సాక్షి, మైసూరు: చదువుల్లో మేటి, బంగారు పతకం కూడా సాధించింది, కానీ జీవితంలో ఓడిపోయింది. శనివారం మైసూరు జేపీ నగరంలో ఆశా (30) అనే వివాహిత అనుమానాస్పదరీతిలో శవమైంది. ఆమె స్వస్థలం మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా మడేనహళ్ళి. ఎనిమిదేళ్ల కిందట మళవళ్ళికి చెందిన నాగప్రసాద్ను ప్రేమించి పెళ్ళి చేసుకొంది. మైసూరులోని జేజీ నగరలో కాపురం పెట్టారు. ఆశా గతంలో మైసూరు వర్సిటీలో పీజీ పూర్తిచేసి స్వర్ణ పతకం కూడా సాధించింది. భర్త నాగప్రసాద్ కట్నం తేవాలని భార్యను తరచూ వేధించేవాడు. అతని పోరు తట్టుకోలేక ఆశా రెండుసార్లు పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు జడ్జి ఇద్దరికీ నచ్చజెప్పడంతో మళ్లీ కలిసి ఉన్నారు. అప్పటికీ భర్త వేధింపులు ఆపకపోవడంతో ఆశ వేరేగా పీజీ హాస్టల్లో ఉంటానని స్పష్టంచేసింది. ఇంతలో ఏమైందోగానీ శనివారం తెల్లవారుజామున ఇంటిలో ఉరి వేసుకొన్న స్థితిలో ఆమె మరణించింది. విద్యారణ్యపుర పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కొత్త కారుకు పూజ కోసం వెళుతూ..) -
Mysore: కాగడాల కవాతు... 4 వేలు పెట్టి విఐపి గోల్డ్కార్డ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే!
‘దసరా వచ్చింది... సరదా తెచ్చింది’ అంటూ... ఆడుతూ పాడుతూ చేసుకునే పండగ ఇది. దసరా మనదేశమంతటికీ పండగే. ఎవరు ఎలా వేడుక చేసుకున్నా సరే... అన్ని వేడుకల అంతరార్థం ఒక్కటే. చెడు మీద మంచి సాధించిన విజయం. మంచి–చెడులకు ప్రాంత – మత భేదాలుండవు. చెడు మీద సాగే పోరుకు కూడా ఆ తేడాలుండవు. అందుకే... ఇది సంస్కృతిలో భాగమైపోయింది. అందరూ కలిసి చేసుకునే వేడుక అయింది. సంబరాల ఊరేగింపు దక్షిణాది వాళ్లకు దసరా అంటే కర్ణాటక రాష్ట్రం మైసూరు దసరా ఉత్సవాలే గుర్తుకు వస్తాయి. ఈ వేడుకల్లో ఊరేగింపే చాలా పెద్ద ఘట్టం. ఊరేగింపు ప్యాలెస్ నుంచి మొదలై ఆల్బర్ట్ రోడ్, సయాజీ రావు రోడ్, బాంబూ బజార్ మీదుగా బన్ని మంటప మైదానానికి చేరుతుంది. ఊరేగింపు సాగిన ప్రదేశాలన్నీ రకరకాల సంబరాలతో నిండిపోయి ఉంటాయి. మైసూర్ పాలకులు వడయార్లు మొదలు పెట్టిన ఈ వేడుకలను ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ పూజలందుకునే దేవత చాముండేశ్వరీదేవి. దేశంలో మిగిలిన వేడుకల వలెనే ఈ వేడుకల్లో కూడా స్థానిక సంప్రదాయ కళల ప్రదర్శన ప్రధానంగా ఉంటుంది. ఊరేగింపులో పాల్గొనే ఏనుగులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఏనుగులతోపాటు గుర్రాలు, ఒంటెల కవాతులు, కళాకారుల విన్యాసాలు ఉంటాయి. మల్లయుద్ధం, సైక్లింగ్ పోటీలు, ఇతర అనేక క్రీడలు, యోగ విన్యా సాలు, పెట్ షోలు, ట్రెజర్ హంట్ ఆటలు, ఫుడ్ స్టాళ్లు ఉంటాయి. బన్ని మంటపానికి పౌరాణిక ప్రాధాన్యం ఉంది. బన్ని చెట్టు అంటే జమ్మిచెట్టు. పాండవులు ఆయుధాలను దాచుకున్న వనం ఇదేనని స్థానికుల విశ్వాసం. ఈ వేడుకలో కాగడాల కవాతు కూడా చూసి తీరాల్సిన వేడుక. ఈ ఉత్సవాలను చూడడానికి ప్రవేశ రుసుము లేకుండానే అందరికీ అనుమతి ఉంటుంది. అయితే... కాగడాల కవాతును ప్రత్యేక ఆహ్వానితులు, నాలుగు వేలు పెట్టి వి.ఐ.పి గోల్డ్కార్డ్ తీసుకున్న వాళ్లు మాత్రమే చూడగలుగుతారు. ఈ కార్డు తీసుకున్న వాళ్ల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఉంటుంది. వేడుకలను సౌకర్యంగా చూడడానికి వీలుగా ఉంటుంది గ్యాలరీ వ్యూ. లక్ష బల్బులతో వెలిగే ప్యాలెస్, ప్యాలెస్లోని దర్బారు హాల్లో బంగారు కిరీటాన్ని కూడా చూడవచ్చు. దసరా ఉత్సవాలు జరిగే పది రోజుల పాటూ కిరీటం దర్బారు హాల్లోనే ఉంటుంది. చదవండి: దసరా ఉత్సవాలు 75 రోజుల ముందే మొదలు -
కామాంధునికి 20 ఏళ్ల జైలు
మైసూరు: మూడున్నరేళ్ల పసిపాపపై లైంగికదాడికి పాల్పడిన కామాంధునికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. హుణసూరు తాలూకాలోని జగదీష్ (45) దోషి. ఇతను 2019లో హుణసూరు తాలూకా బిళకెరె పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు. పోక్సో కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి శ్యామ్ కంరోస్.. 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని
మైసూరు: కాయిన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని ఆయురహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) తన అవ్వ ఇంటి వద్ద ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. చదవండి: ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే? చదవండి: వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు -
Nagarjuna Bangarraju Movie: మైసూర్లో బంగార్రాజు
‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున– దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ ప్రీక్వెల్గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. నాగార్జున–నాగచైతన్యలు పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట కల్యాణ్ కృష్ణ. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీలో నాగార్జున పక్కన గ్రేస్ఫుల్గా కనిపించిన రమ్యకృష్ణ ‘బంగార్రాజు’ లోనూ నటిస్తున్నారు. నాగచైతన్య సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సత్యానంద్ స్క్రీన్ప్లే సమకూర్చారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం
బెంగుళూరు: మైసూరులోని లేడీస్ హాస్టల్లో 23 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మైసూరులోని లేడీస్ హాస్టల్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో గాయపరిచాడు. బాధితురాలి సహచరులు తిరిగి హాస్టల్కి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఓ మత అధ్యయన కేంద్రంలో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడు ఒకరికొకరు తెలిసిన వారేనని పోలీసులు వెల్లడించారు. చదవండి: పోలీసులమంటూ బురిడీ: పక్కా స్కెచ్.. రూ.50 లక్షలు దోపిడీ కాగా లా అండ్ ఆర్డర్ డీసీపీ ప్రదీప్ గుంటి ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసు అధికారులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. బాధితురాలు, ఆమె స్నేహితులు, హాస్టల్లోని సహచరుల చెప్పిన వివరాలను రికార్డ్ చేశారు. కాగా మొదట గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే పోలీసులు ఆమెను ప్రశ్నించిన తర్వాత నిందితుడు తెలిసిన వ్యక్తిగా తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆగస్టు 24 న లలితాద్రిపుర ప్రాంతానికి సమీపంలో చాముండి కొండ దిగువన మైసూరు శివార్లలో మరో గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: మూణ్నెళ్ల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే -
బార్క్, మైసూర్లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన మైసూర్లోని అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 20 ► పోస్టుల వివరాలు: డ్రైవర్, పంప్ ఆపరేటర్, ఫైర్మెన్, సబ్ ఆఫీసర్. ► అర్హత: హెచ్ఎస్సీ(10+2) ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–శారీరక ప్రమాణాలు ఉండాలి. ► వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.35,400 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించిన వారికి రాతపరీక్ష నిర్వహించి ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021 ► వెబ్సైట్: https://recruit.barc.gov.in/barcrecruit/ డీజీసీఏలో 27 కన్సల్టెంట్ పోస్టులు న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టరేట్జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!) ► మొత్తం పోస్టుల సంఖ్య: 27 ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్ లైసెన్స్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, సంబంధిత అనుభవం ఉండాలి. ► వేతనం: నెలకు రూ.75,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిక్రూట్మెంట్ సెక్షన్, డీజీసీఏ, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021 ► వెబ్సైట్: https://www.dgca.gov.in -
ఎంబీఏ విద్యార్థినిపై లైంగికదాడి: కటకటాల్లోకి కామాంధులు
సాక్షి, మైసూరు: మైసూరు నగరంలో చాముండికొండ లలితాద్రి పురంలో ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్టుచేసిన ఐదుగురు నిందితులను శనివారం రాత్రి మైసూరు నగర పోలీసులు మైసూరు మూడవ జేఎంఎఫ్సీ జడ్జి ఎదుట హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం వారిని 10 రోజుల పోలీసు కస్టడీకి ఇస్తున్నట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన నలుగురు నిందితులను తిరుపూరులో అరెస్టు చేసి మైసూరుకు తీసుకొచ్చి వారిని రహస్య స్థలంలో విచారించి వివరాలను సేకరించారు. తరువాత మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం మొత్తం ఆరు మందిని కలిపి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈ 10 రోజుల కస్టడీలో పోలీసులు మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. వీరు మరికొన్ని అత్యాచారాలకు, దోపిడీలకు పాల్పడి ఉంటారనే అనుమానాలున్నాయి. కళాకారుల ప్రదర్శన గ్యాంగ్ రేప్కు పాల్పడిన నిందితులను వెంటనే ఉరి తీయాలని కళాకారులు వినూత్నంగా కోరారు. దేవరాజు మొహల్లా రోడ్డులో గోడల పైన చిత్ర కళాకారులు రాహుల్ మనోహర, సుమంత్గౌడలు కామాంధులకు ఉరి వేసినట్లు చిత్రాలను గీశారు. చదవండి: Mysore Case: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్ చేశారు -
సామూహిక లైంగిక దాడి ఘటన: కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Mysore Gang Rape Case: మైసూర్ శివార్లలో పరిశోధక విద్యార్ధినిపై ఆరుగురు వ్యక్తుల సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్ణాటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడి ఘటనను ఉద్దేశిస్తూ.. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమెకు అక్కడేం పని అని అంటూ బాధితురాలని కించపరిచేలా వ్యాఖ్యానించారు. బాధితురాలు ఆమె స్నేహితుడు అక్కడికి కాకుండా వేరే నిర్జన ప్రదేశానికి వెళ్లాల్సిందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఏదిఏమైనప్పటికీ.. ఈ ఘటన అమానుషమని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఘటనను రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మైసూరులో ఘటన జరిగితే కాంగ్రెస్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ వ్యవహారం చూస్తే.. తనపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నట్లుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బ్రిజేష్ కల్లప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోం మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, తాను జవాబుదారిగా ఉండాల్సిన అంశంలో తనకేం సంబంధం లేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం మంత్రి అవగాహాన రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ నేత ఎస్ ప్రకాష్ కూడా స్పందించారు. ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయరాదని, హోం మంత్రి కూడా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిందని అన్నారు. చదవండి: తల్లి అయిన టీఎంసీ ఎంపీ, విషెస్ చెప్పిన మాజీ భర్త -
దారుణం: మద్యం తాగి యువతిపై సామూహిక అత్యాచారం
మైసూరు: ప్రశాంత మైసూరు నగరంలో నగల షాపులో దోపిడీదొంగలు లూటీ చేసి ఒకరిని కాల్చిచంపిన సంఘటన జరిగి మూడురోజులు కాక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానానికి కొంచెం దూరంలో ఒక యువతిపై సామూహిక లైంగికదాడి జరిగింది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో చాముండికొండ దగ్గర లలితాద్రిపుర సమీపంలో ఈ దారుణం జరిగింది. మైసూరు వర్సిటీలో పరిశోధక విద్యార్థినిగా భావిస్తున్న యువతి, ఆమె స్నేహితునితో కలిసి మాట్లాడుతూ ఉండగా, ఇద్దరు దుండగులు వారి వద్దకు వచ్చారు. డబ్బు, విలువైన వస్తువులను ఇవ్వాలని బెదిరించారు. యువతి, స్నేహితుడు నిరాకరించడంతో యువకున్ని కొట్టారు. యువతిపై అక్కడే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో దుండగులు మద్యం తాగి ఉన్నారు. యువతి స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇద్దరినీ అర్ధరాత్రి 1:30 సమయంలో ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బుధవారం ఉదయం సంఘటనాస్థలాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. హోంమంత్రి ఎ.జ్ఞానేంద్ర మాట్లాడుతూ తాను గురువారం మైసూరుకు వెళ్లి సమీక్షిస్తానని తెలిపారు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది. -
విద్యార్థినిపై గూండాల అమానుషం.. స్నేహితుడి కళ్లెదుటే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి కళ్లెదుటే యువతిపై ఒక గ్యాంగ్, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైనం ఆందోళన రేపింది. ఈ సంఘటన అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోమంగళవారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగి దాదాపు 24 గంటలు గడిచినా, నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మైసూర్ నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి దేవాలయం వద్ద దారికాచి ఆరుగురు వ్యక్తుల ముఠా వీరిని చుట్టుముట్టింది. యుతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న నగలు, నగదు ఇమ్మని అడిగారు. దీనికి నిరాకరించడంతో వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె ఫ్రెండ్ను తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితులిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశామనీ, బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని డీసీపీ ప్రదీప్ గుంటితెలిపారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందన్నారు.ఉత్తరప్రదేశ్కు చెందిన పరిశోధనా విద్యార్థినిగా బాధిత యువతిని పోలీసులు గుర్తించారు. తన స్నేహితుడితో కలిసి సంఘటన జరిగిన ప్రదేశం నుంచే రోజూ ఇంటికి తిరిగి వచ్చేదని పోలీసులు వెల్లడించారు. ఇది గమనించే ఈ ముఠా దారుణానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. -
మైసూరులో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ
మైసూరు: పర్యాటక రాజధాని నగరం మైసూరులో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒక నగల దుకాణంలోకి చొరబడి దోపిడీకి పాల్పడిన దుండగులు ఒకరిని కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో విద్యారణ్యపురలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక అమృత్ జ్యువెల్లరీ షాపునకు రెండు బైకులపై సుమారు ముగ్గురు– నలుగురు వ్యక్తులు వచ్చారు. లోపలికి ప్రవేశించిన వెంటనే షట్టర్ను మూసేసి దుకాణం యజమాని ధర్మేంద్రను పిస్టల్తో బెదిరించి అతని కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు. బంగారు నగలను బ్యాగుల్లో నింపుకుంటుండగా, అటువైపుగా వచ్చిన ధర్మేంద్ర బంధువు శరత్ చంద్ర షాపు షట్టర్ మూసి ఉండడం చూసి అనుమానంతో తెరవాలని యత్నించాడు. లోపలి నుంచి దుండగులు అతన్ని తుపాకీతో బెదిరించగా గట్టిగా కేకలు వేశాడు. దొంగలు తుపాకీతో కాల్పులు జరపడంతో శరత్ చంద్ర తప్పించుకోగా అతని వెనుకే ఉన్న చంద్రు (23) అనే సమీప బంధువు తలకు తూటా తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంతలో దొంగలు బంగారం దోచుకుని తమ బైక్లపై పరారయ్యారు. కొంతసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ సాయంతో ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. -
మరణించినా ప్రాణం పోశారు!
మైసూరు: మృత్యుఒడికి చేరుతూ ఆ ఇద్దరు మరికొందరికి జీవం పోశారు. కుశాల్నగరకు చెందిన శోభా, హుణసూరికి చెందిన లారెన్స్ మృత్యువుతో పోరాడుతూ 14 మందికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాలు... కుశాల్ నగర్కు చెందిన శోభాకు మెదడులో రక్తస్రావం జరగడంతో మెదడు స్తంభించిపోయింది. వివిధ రకాల చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. అదే విధంగా లారెన్స్ ఈనెల 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఇద్దరి మూత్రపిండాలు, లివర్, హృదయ కవటాలు, కార్నియా దానం చేశారు. మృతుల బంధువుల ఔదార్యాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడారు. -
‘చెన్నై’కు మైసూర్ శిలాఫలకాలు
సాక్షి, చెన్నై: మైసూరులో ఉన్న తమిళ శిలాఫలకాల్ని, పురాతన శాసనాలను, వస్తువులను చెన్నైకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్లోని పురవాస్తు విభాగం కేంద్రంలో తమిళనాడుకు సంబంధించిన 65 వేల మేరకు శిలాఫలాలకు, శాసనాలకు సంబంధించిన ఫలకాలు, పురాతన వస్తువులు ఉన్నట్టుగా మధురై ధర్మాసనంలో మదురై గోమతిపురానికి చెందిన న్యాయవాది మణి మారన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ గత వారం ముగిసింది. గురువారం న్యాయమూర్తులు కృపాకరన్, దురై స్వామి బెంచ్ తీర్పు వెలువరించింది. రెండు రాష్ట్రాల మధ్య కావేరి వివాదం సాగుతున్న నేపథ్యంలో మైసూరులోని తమిళ శిలాఫలకాలు, వస్తువులకు ఏవిధంగా రక్షణ ఉంటుందని కోర్టు ప్రశ్నించింది. అందుకే మైసూరులో ఉన్న శిలాఫలకాల్ని చెన్నైలోని పురావస్తు విభాగానికి తీసుకు రావాల్సిందేనని ఆదేశించారు. అలాగే, చెన్నైలోని శిలాఫలకాల విభాగాన్ని తమిళనాడు విభాగంగా మార్చాలని, నిపుణుల్ని సిబ్బందిని నియమించాలన్నారు. ఆరు నెలల్లో ఈ ప్రక్రియను ముగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. కాగా, మదురై ఎంపీ వెంకటేషన్ దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు కేంద్రం నుంచి హిందీలో సమాధానం ఇచ్చినట్టుగా వెంకటేషన్ ఆరోపించారు. కోర్టు స్పందిస్తూ, రాష్ట్రం ఏ భాషలో అయితే, విజ్ఞప్తిని లేదా లేఖను పంపించిందో.. ఆ భాషలోనే సమాధానం ఇవ్వా లని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. ముకుతాడుకు ప్రత్యామ్నాయం ఆలోచించండి ఆవులు, ఎద్దులకు ముకుతాడు వేయడం వల్ల జీవాలు హింసకు గురవుతున్నాయని కోర్టులో గురువారం ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ బెంచ్ విచారణకు స్వీకరించింది. కాగా ముకుతాడు జీవాలను బాధించే విధంగా ఉందని, దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని కేంద్ర, రాష్ట్రాలకు సూచించారు. ఇక సీనియర్ న్యాయమూర్తి కృపాకరణ్ పదవీ విరమణ పొందారు. వీడ్కోలు సభలో కృపాకరణ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు శాఖ లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, అప్పుడే సమ న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
కిరాతకం: బావను చంపి.. చేతిని నరికి..
సాక్షి, మైసూరు: అక్కను వేధిస్తున్నాడని సొంత బావను హతమార్చారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఉదయగిరిలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హతుడు ప్రైవేటు ఉద్యోగి మహమ్మద్ నురాన్ (36) కాగా, నిందితులు కలీం పాష, అజ్మల్ పాష, హలామత్ పాష, ఖదీర్ పాషా. వివరాలు.. మహమ్మద్ నురాన్ తన భార్యకు అక్రమ సంబంధం ఉందని నిత్యం వేధించేవాడు. దీనిపై అనేక పంచాయతీలు జరిగినా అతడు మానలేదు. దీంతో బావమరదులందరూ కలిసి అతనిని ఇంట్లోనే తీవ్రంగా కొట్టిచంపారు. ముగ్గురు పారిపోగా, ఖదీర్ ఒక్కడు తన బావ చేతిని నరికి ఆ ముక్కను సంచిలో తీసుకుని ఉదయగిరి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి పరారైన వారి కోసం గాలింపు చేపట్టారు -
శిశువులపై శ్రీమతి కన్ను పడితే అంతే
మైసూరు: మైసూరు జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న శ్రీమతి అనే మహిళ బాగోతం బయటపడింది. ఎస్పీ చేతన్ గురువారం మీడియాతో మాట్లాడారు. నంజనగూడులో ఇటీవల ఒక చిన్నారి మిస్సయింది. పేద వితంతు మహిళ మూడు నెలల బిడ్డను శ్రీమతి అనే మహిళ మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. ఈమె పేదలు, యాచకులను కలిసి మీ పిల్లలను తన వద్ద ఉన్న ఆశ్రమంలో చదివించి మంచిగా చూసుకుంటానని తీసుకుని వెళ్లి పిల్లలు లేనివారికి డబ్బులకు విక్రయించేది. ఇటీవల ఒక చిన్నారిని తీసుకెళ్లి రూ. 3 లక్షలకు అమ్మేసిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు శ్రీమతి కోసం గాలిస్తున్నారని, అతి త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
వీళ్లు మామూలు దొంగలు కాదు; విమానాల్లో వచ్చి.. ఆపై
బెంగళూరు: విమానాల్లో వచ్చి చోరీలు చేసి రైళ్లలో పరారవుతున్న ఇద్దరు ఖతర్నాక్ దొంగలను యూపీలో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అర్జున్సింగ్ (27), సోనుకుమార్ (32)లు గతనెల 30న బెంగళూరు గ్రామీణ జిల్లాలో 19 చోట్ల చైన్ స్నాచింగ్లు చేశారు. అనంతరం సర్జాపురలో స్నేహితుడి గదికి వెళ్లారు. ఇలా ఒకే రోజు పెద్ద ఎత్తున స్నాచింగ్లు జరగడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కేసులు నమోదు చేసుకుని, నిందితులను సర్జాపురలోని తన గదిలో ఉంచుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగి చివరకు యూపీలో నిందితులను అరెస్టు చేసారు. ఇంట్లో వారందరినీ కట్టేసి మైసూరు: ఇంట్లో వారందరినీ కట్టేసి నగదు, నగలు దోచుకుని పరారైన ఘటన జిల్లాలోని హణసూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని సుమన్ ఫంక్షన్ హాల్ యజమాని ఇంటికి సోమవారం అర్ధరాత్రి దుండగులు ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను మారణాయుధాలతో బెదిరించి దాడి చేసి కట్టేశారు. అనంతరం ఇంట్లోని రూ. 6 లక్షల నగదు, అరకేజీ బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. దొంగల దాడిలో గాయపడిన నస్రత్ ఉన్నిసా, మమ్తాజ్, ఆయేషా అంజుం, గజాలత్ తరనంలను ఆస్పత్రికి తరలించారు. భార్య పుట్టింటికి వెళ్లిందని... దొడ్డబళ్లాపురం: గొడవపడ్డ భార్య పుట్టింటికి వెళ్లడంతో కలతచెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా దాబస్పేట పట్టణంలో చోటుచేసుకుంది. దాబస్పేట శివగంగ సర్కిల్లో నివసిస్తున్న శివరామ్ (42) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. శివరామ్ భార్య వారం క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరామ్ మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా శివరామ్ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. మూడు రోజుల క్రితమే ఆత్మçహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
మరో మూడు నగరాల్లో బజాజ్ చేతక్ బుకింగ్స్ ఓపెన్
బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్ని నగరాల్లోకి వేగంగా తీసుకొనిరావడానికి ప్లాన్ చేసింది. మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్ వంటి కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ జూలై 22న ప్రారంభిస్తుంది. ఈ నగరాలకు చెందిన ఆసక్తి గల వినియోగదారులు ₹2,000 చెల్లించి ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. గత వారమే నాగ్ పూర్ లో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 2021 ఏప్రిల్ లో బజాజ్ చెన్నై, హైదరాబాద్ నగరాలకు చేతక్ తీసుకొనివస్తున్నట్లు ప్రకటించింది. పూణేకు చెందిన ఆటోమేకర్ వచ్చే ఏడాది నాటికి 22 భారతీయ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, అథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది. ఇది 3.8 కిలోవాట్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే). -
కీచక కానిస్టేబుల్: మహిళపై కన్నేసి.. అర్ధరాత్రి
మైసూరు/కర్ణాటక: మహిళలకు రక్షణగా ఉండాల్సిన ఓ పోలీస్ క్రమశిక్షణ తప్పాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మైసూరు నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని మెటగళ్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మహబూబ్పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు... మైసూరు నగరంలోని రాఘవేంద్ర నగర్లో కానిస్టేబుల్ మహబూబ్ నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటి పక్కనే ఉంటున్న ఓ మహిళ ఈనెల 13న అర్ధరాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం వచ్చింది. ఆమెపై కన్నేసిన మహబూబ్ ఆమె వెనుకాలే వెళ్లి గట్టిగా పట్టుకుని ఇంటిలోకి లాక్కెళ్లాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న మరోవ్యక్తి అడ్డుకోవడానికి యత్నించాడు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మహబూబ్ అక్కడి నుంచి పారిపోయాడు. నజరాబాద్ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి. -
ఆమె బతుకును ఎంచుకుంది
జీవించడంలో ఉన్న ఆనందం మరణించడంలో లేదు అంటుంది డాక్టర్ మహాలక్ష్మి. ఇటీవల గృహిణులు క్షణికావేశంలో ఆత్మహత్యలను ఎంచుకుంటున్నప్పుడు మహాలక్ష్మి వంటివారి జీవితం సరైన స్ఫూర్తి అనిపిస్తుంది. 26 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి లోనైన ఈ మైసూర్ వైద్యురాలు జీవించడాన్నే తన మార్గంగా ఎంచుకుంది. కోవిడ్ పేషెంట్స్కు వైద్యం చేస్తూ తను జీవించి ఉండటానికి ఒక అర్థాన్ని కూడా చెబుతోంది. ఇంతకన్నా ఏం కావాలి? మైసూర్ ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 50 నుంచి 60 మంది పేషెంట్స్ను ఓపిలో చూస్తుంది డాక్టర్ మహాలక్ష్మి. కోవిడ్ కాలం వచ్చాక ఆమె కోవిడ్ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరకాలంగా ప్రాణాలు కాపాడుతోంది. ‘నేను బతికి ఉండటం వల్లే వారిని బతికించగలుగుతున్నాను’ అంటుంది ఆమె. అవును... జీవితంలో ఆత్మహత్య చేసుకోవడానికి కావలసిన అన్ని కారణాలు ఆమె దగ్గర ఉన్నాయి. కాని ఆమె చావును కాకుండా బతుకును ఎంచుకుంది. బతుకులోనే అందం, ఆనందం, పరమార్థం ఉన్నాయని నిశ్చయించుకుంది. బతికి సాధించాలనేది ఆమె తత్త్వం. ఇవాళ కొంతమంది గృహిణులు చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లలతో సహా విపరీతమైన నిర్ణయాలను తీసుకోవడం కనిపిస్తూ ఉంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ప్రతికూలతలను ఎదుర్కొనే మనోబలాన్ని పెంచుకోవాలని అంటుంది మహాలక్ష్మి. 2001లో యాసిడ్ దాడి మైసూర్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేసిన మహాలక్ష్మి తన 26వ ఏట ఒక అద్దె ఇంటి లో క్లినిక్ మొదలెట్టింది. దాని యజమాని చిక్క బసవయ్య ఆమెను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అది భరించలేని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చి క్లినిక్ ఖాళీ చేసి వేరే చోట ప్రారంభించింది. ఇది చూసి ఓర్వలేని చిక్కబసవయ్య జనవరి 11, 2001న ఆమె క్లినిక్ మూసి ఇంటికి వెళుతుండగా ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఆ యాసిడ్ దాడి సరిగ్గా ఒక 60 సెకన్లలో ముగిసి ఉంటుంది. కాని అది ఆమె జీవితాన్నే మార్చేసింది. 25 సర్జరీలు ‘ముఖం వికారంగా ఉంటే ఈ సమాజంలో ఆదరణ ఉండదు. అటువంటివారు నాలుగు గోడల మధ్య మగ్గిపోవాల్సిందే. కాని నేనలా ఉండదలుచుకోలేదు. 25 సర్జరీలు చేయించుకుని ఎంతవరకు ముఖాన్ని సరి చేసుకోగలనో అంత చేయించుకున్నాను. ఆ సమయంలో డిప్రెషన్ చుట్టుముట్టింది. బతుకు మీద ఆశ సన్నగిల్లింది. కాని బతకాలనే నిశ్చయించుకున్నాను. నేను నా ప్రాక్టీస్ను కొనసాగిస్తూ ఈ కష్టాన్ని మర్చిపోవాలని అనుకున్నాను. వైద్యవృత్తి అభ్యసించిన నేను నా మానసిక భౌతిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో గట్టిగా ఆలోచించాను. నిజానికి యాసిడ్ దాడిలో గాని ఇతర ఏ ఆరోగ్య సమస్యల్లోగాని జీవిత సమస్యల్లో గాని మానసిక బలమే ముఖ్యం అని గ్రహించాను. ఆ మనసును గట్టి చేసుకుంటే మనం కష్టాలు దాటొచ్చు. నేను అదే చేశాను’ అంటుంది మహాలక్ష్మి. 2001లో ఆమెపై దాడి జరిగితే 2005లో సెషన్స్ కోర్టు ఆధారాల్లేవని నిందితుణ్ణి వదిలిపెట్టింది. కాని మహాలక్ష్మి హైకోర్టులో పోరాడింది. 2012లో హైకోర్టు చిక్కబసవయ్యకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ‘అంతవరకూ నేను కేసు ను గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. ఆలస్యంగానైనా న్యాయం జరిగింది’ అంటుంది మహాలక్ష్మి. చదువే శరణ్యం ‘స్త్రీలు బాగా చదువుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ఎదిరించాలంటే మన దగ్గర చదువు ఉండాలి. అప్పుడే మనం మరింత ధైర్యంగా ఉండగలం. అంతేకాదు మనకు జరిగే ఎటువంటి అన్యాయం పైన అయినా పోరాటం చేయగలం. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి’ అంటుంది మహాలక్ష్మి. ‘నేను జీవితంలో ఎన్నడూ నిరాశను దగ్గరకు రానిచ్చేలా ఉండకూడదు అని నిశ్చయించుకున్నాను. ఆశతో ఉంటే అన్నీ మారుతాయి’ అంటుంది మహాలక్ష్మి. సవాళ్లను ఎదుర్కొనే సందర్భాలు వస్తే మానసిక స్థయిర్యంతో ఎదుర్కొనాలి తప్ప మరణాన్ని ఆశ్రయించకూడదని మహాలక్ష్మి జీవితం గట్టిగా చెబుతోంది. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి. -
కామాంధుడు.. ఆసుపత్రి గదిలోకి చొరబడి...
మైసూరు(కర్ణాటక): మతిస్థిమితం లేని యువతి (30)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మైసూరు కేఆర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు... శుక్రవారం రాత్రి ఆస్పత్రి కిటికీ గ్రిల్స్ విరగ్గొట్టి గదిలోకి చొరబడిన కామాంధుడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిస్సహాయ యువతిపై లైంగికదాడికి పాల్పడి పారిపోయాడు. విషయాన్ని ఆమె బంధువులు వైద్యుల దృష్టికి తీసుకువచ్చినా ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని దాచిపెట్టాలని యత్నించారని వారు తెలిపారు. మానవ హక్కుల సేవా సమితి సభ్యులు విషయం తెలుసుకుని వైద్యులను ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. ఎక్కడా బయట చెప్పొద్దని ఆస్పత్రి సిబ్బందిని వైద్యులు బెదిరించినట్లు ఆరోపించారు. ఈ ఘటనతో అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది పారిపోయారు. -
ఆరు నెలలుగా పుట్టింట్లోనే.. అయినా వదలని భర్త
మైసూరు: కట్న పిశాచుల వేధింపులను భరించలేక ఓ అబల ఆత్మహత్య చేసుకుంది. నంజనగూడు తాలూకాలోని బిళిగెరె గ్రామానికి చెందిన సౌమ్యా (26)కి మూడేళ్ల కిందట మైసూరుకు చెందిన గౌతమ్ అనే వ్యక్తితో పెళ్లయింది. మరింత కట్నం తీసుకురావాలని ఆమెను భర్త అత్తమామలు వేధించడంతో తట్టుకోలేక ఆరునెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది. కట్నం తీసుకుని వస్తేనే రావాలని భర్త, అత్తమామలు ఒత్తిడి చేయడంతో జీవితంపై విరక్తి చెందింది. వారు కోరినట్లు మూడు లక్షల నగదు, బంగారం ఇచ్చే పరిస్థితి లేదని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు బిళగెరె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరాతక టెక్కీ మైసూరు: అదనపు కట్నం తేవాలని భార్యను కొట్టాడో టెక్కీ. ఆమె ఫిర్యాదుతో పోలీసులకు అతిథిగా వెళ్లాడు. మానస గంగోత్రికి చెందిన విశాలాక్షమ్మ, యశోదరాచార్ దంపతుల కుమారుడు ఆనంద్కు మూడేళ్ల కిందట మైసూరుకే చెందిన రమ్యతో ఘనంగా పెళ్లి చేశారు. బంగారంతో పాటు భారీగా కటా్నన్ని ఇచ్చారు. తరువాత బెంగళూరు ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం ఉండేవారు. రమ్య గర్భవతి కావడంతో మైసూరులో పుట్టింటికి చేరుకుంది. ఆనంద్కు ఖతార్ దేశంలో కొన్నాళ్లు ఉద్యోగం చేసి వచ్చాడు. రమ్యకు ఆడబిడ్డ పుట్టింది. ఈ నెల 2న రమ్య తన తండ్రిని తీసుకుని అత్తవారింటికి వెళ్లగా అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామని భర్త అత్తమామలు తెగేసి చెప్పారు. అంతేకాకుండా ఆమెపై పైశాచికంగా దౌర్జన్యం కూడా చేయడంతో చంటిపాప కన్నుకు, ముక్కుకు గాయాలు తగిలాయి. రమ్య మైసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘరానా భర్తను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
అలకు ఎదురు‘గీత’
నర్సు గీత గురించి వింటే ఒకటే అనిపిస్తుంది. రిటైర్మెంట్ అనేది ఎవరో ఇచ్చేస్తే పూలదండతో పాటు ఇంటికి తెచ్చేసుకునేది కాదని. గీత వయసు ప్రస్తుతం 66 ఏళ్లు. సర్వీస్ రూల్స్ ఆమెను రిటైర్ చేశాయి తప్పితే, సర్వీస్ చేయాలనే ఆమె తపనను ‘రిటైర్మెంట్ మోడ్’ లోకి నెట్టేయలేకపోయాయి. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో గీత చిన్నా చితక సేవల్ని అందించడం కాదు, లోకల్ యూత్ ని కలుపుకుని ఆపదలో ఉన్నవారి కోసం ఏకంగా పరుగులే పెడుతోంది. మైసూర్ లో ఇప్పుడు ‘అల’కు ఎదురీదుతున్న గీత.. ఆమె! మైసూరుకు, చామరాజనగర్కు మధ్య పెద్ద దూరం ఉండదు. అరవై కి.మీ. దూరం. లేదా గంటన్నర ప్రయాణం. అయితే ఈ సెకండ్ వేవ్లో అది క్షణాలతో సహా లెక్కించవలసిన అత్యవసర దూరం అయింది. చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగల్లు, హనూర్ తాలూకాల గ్రామాల్లో ఎంతోమంది కోవిడ్ బాధితులు మైసూర్ నుంచి వచ్చే ఆక్సిజన్ సిలెండర్ల కోసం, వైద్యసేవల కోసం ఎదురు చూస్తుండటం వల్ల ఇటీవల ఏర్పడిన అత్యవసర స్థితి. ఈ స్థితిలో గీత అనే రిటైర్డ్ నర్సు తన విశ్రాంత జీవితానికి స్వస్తి చెప్పి, విధులకు పునరంకితం అయిన విధంగా లేచి, గత రెండు నెలలుగా బాధితులకు అవసరమైన సిలెండర్లను, వైద్యసేవలను తనే స్వయంగా అందించి వస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ‘భయపడాల్సిందేమీ లేదు’ అని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గీతకు తెలిసిన వాళ్లిద్దరు ఇటీవల ఆక్సిజన్ అందుబాటులో లేక మరణించడం ఆమెను కదలించింది. ఆ కదలికే ఆమెను ఈ మార్గంలోకి రప్పించింది. ‘రిటైర్ అయి ఇంట్లో ఉంటే మాత్రం! నేనేమీ చేయలేనా..’ అని అనుకుంటున్న సమయంలో ‘స్వామీ వివేకానంద యూత్ మూవ్మెంట్’ (ఎస్వీవైఎం) గురించి ఆమెకు తెలిసింది. ఆ టీమ్ ఆక్సిజన్ అవసరం అయిన పేషెంట్ల వివరాలు తెలుసుకుని వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను సమకూర్చుతోంది. వెళ్లి వెంటనే వారిని కలిశారు గీత. నర్సుగా ఎమర్జెన్సీ సేవల్ని అందించడంలో తనకున్న అనుభవం గురించి వారికి చెప్పారు. ‘‘నేనూ మీతో కలిసి పని చేస్తాను’’ అన్నారు. ‘‘మీరు మాతో కలిసి పని చేయడం కాదు, మేమే మీతో కలిసి పనిచేస్తాం మేడమ్’’ అన్నారు వారు! అన్నమాట ప్రకారమే పేషెంట్ల సమాచారాన్ని వారు తెచ్చేవారు. వారికి ఏర్పరచవలసిన సదుపాయాలేమిటో గీత సూచించేవారు. మందులు, ఆహారం ఇవ్వడం వరకు మాత్రమే గీత అండ్ టీమ్ పరిమితం కాలేదు. గీత స్వయంగా పేషెంట్లను కలుసుకుని వారికి సేవలు చేసేవారు. ఆమె సేవాభావాన్ని, నిర్వహణ బలాన్ని గమనించిన ఎస్వీవైఎం మైసూరులోని ఆమె ఇంట్లోనే ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్యాంక్ను నెలకొల్పింది! ఇంటి నుంచి గీతే ఇప్పుడు వాటిని బట్వాడా చేస్తున్నారు. ‘‘కరోనా పేషెంట్లకు అంత సమీపంగా వెళ్లి సేవ చేస్తున్నారు.. మీకేమీ భయంగా ఉండదా?’’ అని ఆమెను అడిగితే.. ‘‘అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే ఉన్నాను’’ అని నవ్వుతూ చెప్తారు. గీత ఇంట్లో ఆమెతో పాటు 96 ఏళ్ల ఆమె తల్లి కూడా ఉంటారు. ఆమెను సంరక్షించుకుంటూనే, ఎంతోమందికి తల్లిలా తను సేవలు అందిస్తున్నారు. -
ఐఏఎస్ల మధ్య రగడ: ఇద్దరిపై బదిలీ వేటు
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లా నూతన కలెక్టర్గా డా.బగాది గౌతమ్, కార్పొరేషన్ కమిషనర్గా జి.లక్ష్మీకాంత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ రోహిణి సింధూరి, కమిషనర్ శిల్పా నాగ్లు పరస్పర విమర్శల పర్వంతో ఇరుకునపడిన సర్కారు ఇద్దరినీ బదిలీ చేసింది. రోహిణి సింధూరి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్గా బదిలీ చేశారు. గ్రామీణాభివృద్ధి– పంచాయతీ రాజ్లో ఈ గవర్నెన్స్ డైరెక్టర్గా శిల్పానాగ్ను నియమించారు. గౌతమ్, లక్ష్మీకాంత్రెడ్డి ఆదివారమే బాధ్యతలను తీసుకున్నారు. కాగా, రోహిణి సింధూరి బెంగళూరులో సీఎం యడియూరప్పను కలిసి తన బదిలీని రద్దు చేయాలని కోరగా, ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శిల్పానాగ్, మనసు మార్చుకుని కొత్త పోస్టులో చేరుతున్నట్లు తెలిపారు. (చదవండి: ఐఏఎస్ల మధ్య రగడ: లెక్కలు ఇవిగో..!) (చదవండి: దేశంలో లక్షకు దిగొచ్చిన కరోనా కేసులు) -
ఐఏఎస్ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా
మైసూరు: ‘మైసూరులో పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు, అందుకే నేను సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’అని మైసూరు కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి విధి నిర్వహణలో పదేపదే అడ్డొస్తున్నారని శిల్పానాగ్ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ రోహిణి సింధూరి తనను పని చేసుకోనివ్వడం లేదన్నారు. అడగడుగునా అడ్డు వస్తున్నారని, ఇలాంటి దురంహంకార కలెక్టర్ ఎవరికీ వద్దని, తాను విసిగిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజీనామానే మంచిదనుకున్నా ఒక ఐఏఎస్ అధికారికి, మరో ఐఏఎస్కు మధ్య ఇటువంటి వివాదం సరికాదని, తనను టార్గెట్ చేయడంతో ఎంతో బాధపడ్డానని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. చివరికి ఇక్కడ పనిచేయడం కంటే ఉద్యోగం నుంచి బయటకు రావడం మంచిదని భావించి రాజీనామా చేసినట్లు చెప్పా రు. తాను కలెక్టర్కు అన్నివిధాలా గౌరవం ఇ చ్చానని, కానీ తనపై ఆమెకు ఎందుకు పగ, కోపమో అర్థం కావడం లేదని అన్నారు. కాగా, శిల్పా నాగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూరు కమిషనర్గా నియమితులయ్యారు. ఆమె 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మరోవైపు ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. చదవండి: ఏడేళ్ల న్యాయ పోరాటానికి తెర -
లాక్డౌన్తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య
మైసూరు: లాక్డౌన్తో వ్యాపారం లేక పాన్ బ్రోకర్ ఆత్మహత్య చేసుకోగా ఆయన భార్య కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైసూరులో చోటు చేసుకుంది మండి మోహల్లా పరిధిలోని అక్బర్ రోడ్డులో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ (37) లాక్డౌన్ కారణంగా వ్యాపారం లేక అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఎమ్మెల్సీ కుమారుడి కబ్జాపర్వం: కేసు నమోదు
మైసూరు: బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కుమారుడు అమిత్ దేవరహట్టిపై మైసూరు విజయనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మైసూరు హినకల్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని దేవరహట్టి మద్దతుదారులతో కబ్జా చేసి, కాంపౌండ్ కట్టాడని, అడ్డుకున్న యజమాని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినట్లు కేసు నమోదు అయింది. స్థలం యజమాని యోగీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్, పటేల్, అనూప్, వైకుంఠాచార్ తదితర 8 మందిపై కేసు నమోదు చేశారు. -
నాన్న మృతదేహం నాకొద్దు.. వాటిని మాత్రం నాకు పంపండి
మైసూరు: కరోనా రక్కసి అనుబంధాలను తుడిచేస్తోంది. మరణించిన తండ్రి మృతదేహం తనకు వద్దని, మీరే తగులబెట్టుకోండి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల విలువైన డబ్బులు, డాక్యుమెంట్లను తెచ్చి ఇవ్వండంటూ ఒక కుమారుడు చాలా పరుషంగా మాట్లాడాడు. మైసూరు హెబ్బాళలో ఉన్న సూర్య బేకరి వద్ద ఒక ఇంట్లో వృద్ధుడు కరోనాతో మరణించాడు. అతని కొడుకు కువెంపు నగర శాంతి సాగర్ కాంప్లెక్స్ వద్ద నివసిస్తుంటాడు. కుమారుడు స్థానిక కార్పొరేటర్ కేవీ శ్రీధర్కు ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియలను మీరే పూర్తి చేసి, అతని వద్ద ఉన్న రూ. 6 లక్షల డబ్బులు, ఆస్తి పత్రాలను మాత్రం తనకు తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. కొడుకు వైఖరికి విస్తుపోయిన కార్పొరేటర్ పాలికె సిబ్బందితో అంత్యక్రియలు చేయించారు. చదవండి: Lockdown: వందలాది మంది ఒక్కచోట చేరి -
covid: డబ్బులు ఇస్తేనే నీ భర్త మృతదేహం..
మైసూరు: మైసూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. డబ్బు చెల్లించలేదని చెబుతూ మృతదేహాన్ని ఇవ్వకుండా ఓ ఆస్పత్రి యాజమాన్యం కర్కశంగా వ్యవహరించింది. మైసూరు ఆలనహళ్లి నివాసి బసవరాజు కరోనా సోకి శ్రీరాంపుర వద్ద ఉన్న గౌతమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. అయితే మృతదేహాన్ని ఇచ్చేందుకు వైద్యులు నిరాకరించారు. తన తాళిని తాకట్టు పెట్టి మృతుడి భార్య రూ.90 వేలు చెల్లించింది. కానీ రూ.లక్షన్నర చెల్లిస్తేనే కానీ మృతదేహాన్ని ఇవ్వలేమని వైద్యులు తేల్చి చెప్పారు. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు ఆస్పత్రికి వచ్చి మాట్లాడారు. కరోనా కష్ట సమయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించడం సరికాదని, మృతదేహాన్ని ఇవ్వకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన ఆస్పత్రి సిబ్బంది ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించింది. చదవండి: క్షుద్రపూజలు: మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి.. -
ఫ్రంట్లైన్ వారియర్స్పై ‘ఫంగస్’ దాడి
మైసూరు: రాచనగరిలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ బెడద వేధిస్తోంది. మైసూరు పాలికె కాంట్రాక్టు ఉద్యోగులు వినోద్ (28), రవి (38) బ్లాక్ ఫంగస్తో చనిపోయారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను తరలించే రవికి గత 16 రోజుల క్రితం కోవిడ్ సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనికి ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కూడా కనిపించగా బుధవారం మరణించాడు. ఫాగింగ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న వినోద్కు మూడు రోజుల క్రితమే కరోనాతో పాటు ఫంగస్ సోకడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం మరణించాడు. దీంతో పాలికె ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. చదవండి: డేంజర్ జోన్లో 6 జిల్లాలు చదవండి: టీకా రక్ష.. అందని ద్రాక్ష? -
మరీ ఇంత అమానుషమా: రోడ్డుపై రోగి హాహాకారాలు
మైసూరు: తండ్రికి ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి వస్తున్న సందర్భంగా కోవిడ్ నిబంధనల పేరిట పోలీసులు ఓ యువకుడి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆ యువకుడి తండ్రి నడిరోడ్డుపైనే పడి నరకయాతన అనుభవించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బీపీ, షుగర్ కలిగి ఉన్న చంద్రశేఖరయ్యను ఆయన కుమారుడు బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హుల్లహళ్లి రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని ఎంత ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదని, తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుడు ఆరోపించాడు. రోగుల ఇంటికి తెల్లజెండా మైసూరు: మైసూరులోని కృష్ణరాజ నియోజకవర్గంలో కరోనా రోగుల ఇంటి ముందు తెల్లజెండాను అమర్చడం ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఎస్ఏ రామదాస్ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాధితులకు మాస్కులు, సోప్, నిమ్మకాయలు, పసుపు, డిజిటల్ థర్మామీటర్, విటమిన్ సీ ట్యాబ్లెట్ల కిట్లను అందజేశారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి బాధితుల ఇంటికి తెల్లజెండాను అతికిస్తున్నట్లు చెప్పారు. చదవండి: కరోనా కల్లోలం: ఖాళీ అవుతున్న బెంగళూరు! -
బెంగళూరును వదలని కరోనా.. ఒక్కరోజులోనే
సాక్షి, బెంగళూరు: కన్నడనాట పతాకస్థాయికి ఎగబాకిన కరోనా రక్కసి అదేచోట కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,733 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. 21,149 మంది కోలుకున్నారు. ఇంకో 217 మంది కరోనాతో పోరాడి ఓడిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 16,01,865కు పెరిగింది. అందులో 11,64,398 మంది కోలుకున్నారు. మరో 16,011 మంది కన్నుమూశారు. ప్రస్తుతం 4,21,436 మంది చికిత్స పొందుతున్నారు. బెంగళూరులో 21,199 ఐటీ సిటీలో తాజాగా 21,199 పాజిటివ్లు, 10,361 డిశ్చార్జిలు, 64 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,97,292 మందికి కరోనా సోకగా 5,08,923 మంది కోలుకున్నారు. 6,601 మంది చనిపోయారు. 2,81,767 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా మరణాల వివరాలు బెంగళూరులో 64, బళ్లారిలో 18, చామరాజనగరలో 15, తుమకూరులో 13, శివమొగ్గలో 12, హాసనలో 11, మైసూరులో 8, రామనగరలో 8, కలబురిగిలో 7, ఉత్తరకన్నడలో 7, బీదర్లో 6, బెంగళూరు రూరల్లో 5, కోలారులో 5, కొప్పళలో 5, మండ్యలో 5 చొప్పున కన్నుమూశారు. 23,539 మందికి టీకా కొత్తగా 23,539 మందికి కరోనా టీకా ఇచ్చారు. దీంతో మొత్తం టీకాలు 98,05,229 కి పెరిగాయి. తాజాగా 1,58,365 నమూనా లు పరీక్షించగా మొత్తం టెస్టులు 2,59,33,338 కి పెరిగాయి. కేసులు: టాప్-5 జిల్లాలు బెంగళూరు – 21,199 మైసూరు – 2,750 తుమకూరు – 1,302 బళ్లారి – 1,156 దక్షిణ కన్నడ – 996 చదవండి: అంబులెన్స్ డ్రైవర్గా మారిన అధికారి -
అంబులెన్స్ డ్రైవర్గా మారిన అధికారి
మైసూరు: కరోనా కష్ట సమయంలో ఓ అధికారి తన హోదాను పక్కన పెట్టి అంబులెన్స్ డ్రైవర్గా మారి మృతదేహాన్ని శ్మశానానికి తరలించి మానవత్వం చాటారు. ఈ ఘటన మైసూరు నగరంలో శనివారం చోటు చేసుకుంది. మైసూరు నగర జనన, మరణ విభాగంలో అనిల్ క్రిస్టి అధికారిగా పనిచేస్తున్నారు. కరోనా కేసులు పెరిగి మృతుల సంఖ్య పెరుగుతుండటంతో వారిని శ్మశానంలో ఖననం చేసేందుకు ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ వ్యక్తి కోవిడ్తో ఆస్పత్రిలో మృతి చెందగా మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ అందుబాటులో లేకపోయాడు. దీంతో అధికారి అనిల్క్రిష్టి తానే అంబులెన్స్డ్రైవర్గా మారి మృతదేహాన్ని రుద్రభూమికి తరలించి మానవత్వం చాటారు. -
నలుగురు బాలికలపై లైంగిక దాడి.. పదేళ్ల జైలు
మైసూరు: నలుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి మైసూరు ఎఫ్టీఏసీ కోర్టు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. వివరాలు... 2019లో మైసూరు విజయనగరకు చెందిన దర్శన్ (19) ప్రభుత్వ బాల మందిరంలో ఉంటున్న సమయంలో అక్కడ ఉన్న నలుగురు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సంస్థ డైరెక్టర్ ఎంకే కుమారస్వామి విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఎఫ్టీసీ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి పదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. దొంగ అత్త, అల్లుడు అరెస్టు మైసూరు: చోరీలకు పాల్పడుతున్న అత్త, అల్లుడిని అరెస్ట్ చేసిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు పట్టణంలో చోటు చేసుకుంది. కొడుగు జిల్లా కుశాల నగరకు చెందిన నాగరాజు, అత్త ఆదియమ్మలను అరెస్ట్ చేసి వారి నుంచి 300 గ్రాముల బంగారు నగలు, కిలోకు పైగా వెండి స్వాధీనం చేసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు నమోదయ్యాయి. ప్రేమజంట బలవన్మరణం బనశంకరి: కలిసి జీవించడానికి పెద్దలు అడ్డుపడ్డారన్న ఆవేదనతో ప్రేమ జంట తనువు చాలించింది. హావేరి తాలూకా నాగనూరు గ్రామానికి చెందిన విద్యాశ్రీ గాలి (22), ఇర్షాద్ కుడచి (23) ఆత్మహత్య చేసుకున్నారు. మూడేళ్లుగా వీరులో ప్రేమలో మునిగి తేలుతున్నారు. విద్యాశ్రీ బీకాం చదువుతుండగా, ఇర్షాద్ కుడచి డిప్లొమా పూర్తిచేశాడు. ఇటీవల విద్యాశ్రీకి తల్లిదండ్రులు ఓ యువకునితో నిశ్చితార్థం చేశారు. ప్రేమకు దూరం కావడం ఎంతమాత్రం ఇష్టలేని విద్యాశ్రీ, ఇర్షాద్ కలిసి శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
యువ దంపతుల ఆత్మహత్య
మైసూరు: క్షణికావేశంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలోని కృష్ణాపుర గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న చంద్రశేఖర్ (30), కవిత (20)కు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఇటీవల కొన్ని రోజులుగా దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు ఏర్పడ్డాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరు ఘర్షణపడ్డారు. దీంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నంజనగూడు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పుట్టింటికి చేరిన వివాహితపై మేనబావ దారుణం
మైసూరు: భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన మహిళను ఆమె మేనత్త కుమారుడు దారుణంగా నరికి చంపిన ఘటన మైసూరు జిల్లా బెళవడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. హెచ్డి.కోటె తాలూకాలోని క్యాతనహళ్లి గ్రామానికి చెందిన ప్రేమకుమారి (25)కి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త పెట్టే వేధింపులు తాళలేక ఆమె భర్తను వదిలి తన మేనత్త కుమారుడైన కిరణ్తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో వీరి మధ్య కూడా తరచూ గొడవలు జరిగేవి. గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కిరణ్ అర్ధరాత్రి ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. బాధితురాలి అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఒక్కదాన్నే ఉన్నా.. నువ్వు రా; ఇంటికి పిలిపించి కాటికి పంపారు దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు -
ఆమెకు 73.. ఆయనకు 69.. ఓ శుభవార్త
మైసూరు: జీవితం చరమాంకంలో తోడు కావాలని భావించారు. వయసు శరీరానికే కాని మనసు కాదని ఒకరికొకరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో 73 ఏళ్ల వృద్ధురాలిని 69 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకోబోతున్నారు. వివరాలు... మైసూరు నగరంలో నివాసం ఉంటున్న ఓ రిటైర్డు ఉపాధ్యాయురాలు, కొన్నేళ్ల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒంటరి తనంతో ఉన్నఆమెకు తోడు అవసరమని కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించారు. దీంతో వరుడు కావలెను అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతే 69 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ ఆమెకు ఫోన్ చేశారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఇరువైపుల కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు. వృద్ధుడికి కూడా ఏడేళ్ల క్రితమే భార్య చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విదేశాలలో ఉన్నాడు. అతని ప్రోద్బలంతోనే పెళ్లికి అంగీకరించాడు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. చదవండి: పెళ్లి కోసం ఐదేళ్లుగా ఆరాటం: మొత్తానికి నిశ్చితార్థం.. -
చనిపోయిన కొడుకు ఫొటోతో థియేటర్కు తండ్రి..
మైసూరు: కన్నకొడుక్కి హీరో పునీత్ రాజ్కుమార్ అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాలన్నీ మొదటిరోజే చూసేవాడు. ఏప్రిల్ 1న విడుదలైన యువరత్న సినిమా కోసం ఎన్నోరోజులుగా వేచిచూశాడు. కానీ దురదృష్టశాత్తు అంతకు ముందే కన్నుమూశాడు. అంత దుఃఖంలోనూ తండ్రి బాలుని నిలువెత్తు ఫోటో తీసుకుని థియేటర్కు వచ్చాడు. ఫోటోతో కలిసి యువరత్న సినిమా చూసి కొడుకు ఆశ తీరినట్లుగా నిట్టూర్చాడు. 4 నెలల కిందటే మృతి.. మైసూరు కువెంపు నగరకు చెందిన మురళీధర్ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్ నాలుగు నెలల క్రితం స్నేహితునితో కలిసి వరుణ కాలువలో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోయాడు. యువరత్న సినిమా విడుదలైన రోజే మొదటి ఆట చూడాలని తండ్రితో చెప్పేవాడు. ఈ నేపథ్యంలో యువరత్న ఆడుతున్న ఓ థియేటర్కు బాలుని తల్లిదండ్రులు, అన్నయ్య వచ్చారు. తమతో పాటు బాలుని ఫోటోను తీసుకొచ్చి నాలుగు టికెట్లు తీసుకుని సినిమా చూశారు. దాంతో ప్రేక్షకులు ఏమిటని ఆశ్చర్యంతో ఆరా తీయగా అసలు విషయం చెప్పారు. చదవండి: చిన్నారి ప్రాణం తీసిన పబ్జీ గేమ్ గొడవ! మానవత్వం అంటే ఇదేనేమో -
జాడలేని తల్లి.. పాపం పులి కూనలు..
సాక్షి, మైసూరు: మైసూరు జిల్లాలోని బండీపుర అరణ్యంలో తల్లి లేని మూడు పెద్ద పులి పిల్లల్లో రెండు మృత్యువాత పడిన విషాదం వెలుగుచూసింది. బండీపుర అభయారణ్యంలో సోమవారం గస్తీలోనున్న అటవీ సిబ్బందికి పొదల్లో సుమారు నెలన్నర వయసున్న మూడు పులి కూనలు కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూడగా వాటిలో ఒకటి చనిపోయినట్లు గుర్తించారు. మరో రెండు తీవ్ర ఆకలితో మృత్యువుకు చేరువగా ఉన్నాయి. ఏ కారణం వల్లనో తల్లిపులి వాటిని వదిలేసి వెళ్లడంతో రోజుల తరబడి పాలు, పోషణ కరువైనట్లు అధికారులు తెలిపారు. జీవించి ఉన్న పులి కూనలను హుటాహుటిన మైసూరు జూకు తెస్తుండగా మరొకటి కూడా చనిపోయింది. బతికి ఉన్న ఏకైక కూనకు ఆహారం అందించి చికిత్స చేపట్టారు. చనిపోయినవాటికి పోస్టుమార్టం నిర్వహించగా ఆహారం లేకపోవడమే మృతికి కారణమని తేలిందని అధికారులు చెప్పారు. తల్లి పులి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బావిలో పడ్డ పంగోలిన్ మరో ఘటనలో మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని చిక్కాడనహళ్ళి గ్రామంలో ఓ బావిలో అరుదైన పంగోలిన్ దర్శనమిచ్చింది. బావిలో పడిన అలుగు బయటకు రాలేకపోయింది. గ్రామస్తులు గమనించి దానిని బయటకు తీసి అటవీ సిబ్బందికి అప్పగించారు. సాధారణ పంగోలిన్లు బూడిద, నలుగు రంగులో ఉంటాయి. ఇది నారింజ రంగులో ఉండడం విశేషమని తెలిపారు. -
‘నీ జన్మకు సిగ్గుందా?’ కమిషనర్పై బీజేపీ ఎమ్మెల్సీ చిందులు
మైసూరు: రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై కర్నాటకలో తీవ్ర వివాదాస్పదమవుతోంది. సోమవారం సాయంత్రం మైసూరు రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం సంఘటనలో దాడికి గురైన పోలీసులను మెచ్చుకుని, ప్రశంసాపత్రాలను ఇచ్చిన పోలీసు కమిషనర్ డా. చంద్రగుప్తపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మైసూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రింగ్రోడ్లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల బైక్ మీద వస్తున్న వ్యక్తి మరణిస్తే, ఆ పోలీసులకు మీరెలా ప్రశంసా పత్రాలిస్తారు? నీవు కమిషనర్వా?, అయ్యా, తూ, నీ జన్మకు సిగ్గుండాలి’ అని విశ్వనాథ్ మండిపడ్డారు. ‘మైసూర్ నగర పోలీస్ కమిషనర్గా ఉన్న నువ్వు రోడ్డుపైకి వచ్చేది లేదు. సిటీలో ఏం జరుగుతుందో తెలియదు. కనీసం సిటీలో రౌండ్స్ వేయవు. ఎన్ని సంవత్సరాలు అయ్యింది నీవు మైసూర్కు వచ్చి?. ఎంత మంది సీసీపీలు, ఏసీపీలు వచ్చి పని చేశారు? ట్రాఫిక్ పోలీసులకు మైసూర్లో ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యడం రాదా?. ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదా?’ అని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఒక బైకర్ కిందపడి మరణించడం, దాంతో స్థానికులు ఆగ్రహంతో ముగ్గురు పోలీసులను చితకబాదడం తెల్సిందే. తర్వాత కమిషనర్ ఆ ముగ్గురు పోలీసులను పిలిపించి బాగా పనిచేశారని కితాబిస్తూ ప్రశంసాపత్రాలను అందజేయడం విమర్శలకు తావిచ్చింది. -
నమ్మించి సర్వం దోచేసింది.. ఆ తర్వాత
మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుని నుంచి లక్షలాది రూపాయల మేర నగదును, ఆభరణాలను దోచుకున్న కిలాడీ లేడీని మైసూరు మేటగళ్లి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఆంధ్రహళ్లి రెండో ప్రధాన రహదారిలో నివాసం ఉండే మేఘ అలియాస్ బిందుగౌడ (25) నిందితురాలు. ఈమె టెన్త్ చదివింది. ఫేస్బుక్లో చిన్నుగౌడ పేరుతో ఖాతా తెరిచి రవి అనే వ్యక్తితో స్నేహం ప్రారంభించింది. తన పేరు బిందు గౌడ అని చెబుతూ అందమైన ఒక అమ్మాయి ఫోటోలను రవికి పంపింది. తమకు మైసూరులో రెండు పెట్రోల్ బంకులు, బార్ ఉన్నాయని, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని రవిని కోరింది. నీ పుట్టిన రోజుకు రూ. 45 లక్షల ఫార్చ్యూనర్ కారు బహుమతిగా ఇస్తానని, అందుకు ఒక రూ. లక్ష తక్కువగా ఉన్నాయని, ఆ డబ్బును తన స్నేహితునికి ఇచ్చి పంపాలని మాయమాటలు చెప్పింది. మీ అమ్మ మెడలోని గొలుసు చాలా అందంగా ఉందని, తనకెంతో నచ్చిందని, దాన్ని అదే స్నేహితునికి ఇచ్చి పంపిస్తే అదేమాదిరి డిజైన్ను తయారు చేయించి తిరిగి ఇచ్చేస్తానని మభ్యపెట్టింది. అన్నీ ఇచ్చాక ఫోన్ స్విచ్చాఫ్ మేఘ మాయమాటలను నమ్మిన రవి ఆమె చెప్పినట్లుగా అన్ని చేశాడు. నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మోసగత్తె మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మేటగళ్లి పోలీసు స్టేషన్ను బాధితుడు రవి ఆశ్రయించాడు,. ఈ కేసును విచారించిన పోలీసులు బిందుగౌడను అరెస్టు చేశారు. విచారణ చేయగా, పెద్ద చీటర్ అని, 2018లో యోగానంద నుంచి రూ. 15 లక్షలు, శ్రీనివాస్ నుంచి రూ. 9.70 లక్షలను ఏమార్చి దోచుకున్నట్లు తేలింది. -
హైటెక్ వేశ్యావాటిక.. యాప్ ద్వారా..
మైసూరు: హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను మైసూరు మేటెగళ్లి పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన సుమ, సిద్ధరాజులను అదుపులోకి తీసుకున్నారు. కాగా మైసూరు కుంబారకొప్పలిలోని కిడిగణ్నమ్మన లేఔట్లో నివాసం ఉంటూ యాప్ ద్వారా విటులను ఆకట్టుకుని, సుమ దందా నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె నివాసంపై దాడి చేసి అరెస్ట్ చేశారు. రూ.6.9 లక్షల చోరీ సొత్తు స్వాధీనం యశవంతపుర: చోరీలు, చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న శిడ్లఘట్టకు చెందిన అసీఫ్పాషా, ఆర్టీ నగరకు చెందిన అర్షద్ఖాన్లను సంజయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ. 6.9 లక్షల విలువైన 154 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంజయనగర్లో మాలా అనే మహిళకు చెందిన బైక్ను చోరీ చేశారు. ఈకేసు దర్యాప్తు చేస్తుండగా భూపసంద్ర వద్ద నిందితులు పట్టుబడ్డారు. అసీఫ్పాషాపై చంద్రలేఔట్, కలాసిపాళ్య పోలీసుస్టేషన్ల పరిధిలో, అర్షద్ఖాన్పై ఆర్టీనగర పోలీసుస్టేషన్ పరిధిలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు రైలు కింద పడి బలవన్మరణం శివమొగ్గ: కదులుతున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి పట్టణంలోని రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. మృతుడికి 25 సంవత్సరాల ఉంటాయని, వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: కీచకుడిని వెంటాడి రఫ్ఫాడించిన యువతి ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య