జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు : జస్టిస్‌ వర్మ ఇంటికి ‘సుప్రీం’ కమిటీ | Supreme Court Panel Reach Justice Yashwant Varma Home | Sakshi
Sakshi News home page

జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసు : జస్టిస్‌ వర్మ ఇంటికి ‘సుప్రీం’ కమిటీ

Mar 25 2025 4:46 PM | Updated on Mar 25 2025 4:54 PM

Supreme Court Panel Reach Justice Yashwant Varma Home

ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల కమిటీ ఇవాళ జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటికి వెళ్లింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బయపడ్డ నోట్ల కట్టల గురించి దర్యాప్తు చేపట్టనుంది.

మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

 

ఇదే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు..పలు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని నియమించింది. ఆ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది.  

కాలిన నోట్ల కట్టల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా అంటూ పలు రిపోర్టులు వెలుగులోకి వచ్చింది. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, మరో నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల కొలీజియం జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అల్హదాబాద్‌ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్‌ చేసింది.

నోట్ల కట్టల విషయంలో స్పష్టత వచ్చే వరకు న్యాయపరమైన పనులు కేటాయించవద్దని సుప్రీం కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర ఉపాధ్యాయకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement