![Viral Video: Pregnant Woman Taken On JCB Machine At Madhya Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/25/Madhya.jpg.webp?itok=F6zY8_HG)
భోపాల్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఐతే మధ్యప్రదేశ్లోని నీమాచ్ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్కి కాల్ చేశారు. కానీ వరదల ఉధృతి కారణంగా అంబులెన్స్ ఆ గర్భిణి నివాసానికి చేరుకోవడం సాధ్యం కాలేదు.
దీంతో స్థానిక అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు సదరు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు జేసీబీ మెషిన్ని ఏర్పాటు చేశారు. ఈఘటన నీమాచ్ జిల్లాలోని రావత్పూర్లో చోటు చేసుకుంది. వాస్తవానికి ఈ వరదలు కారణంగా మధ్యప్రదేశ్లోని 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. ఐతే ప్రభుత్వం జారీ చేసిన ప్రమాద హెచ్చరికల్లో ఆ గర్భిణి నివాసిత జిల్లా కూడా ఉంది.
దీంతో అదికారులు ఆమెను సకాలంలో ఆస్పత్రికి తరలించేందుకు ఈ ఏర్పాటు చేశారు. అంతేకాదు భోపాల్తో సహా మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర రాజధాని తోపాటు ఇతర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
नीमच के बेसदा की रहने वाली गीता बाई प्रसव पीड़ा में पुलिया पर पानी होने की वजह से एंबुलेंस नदी के दूसरे पार नही जा सकी ऐसे में उन्हें जेसीबी में बिठाकर सुरक्षित नदी पार कराई गई, किनारे पहुंचने पर उन्हें एंबुलेंस से मनासा सरकारी अस्पताल भेजा गया @ndtv @ndtvindia pic.twitter.com/IJw91C2Yya
— Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2022
(చదవండి: ప్రయాణికుడికి అస్వస్థత.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్)
Comments
Please login to add a commentAdd a comment