విద్యుత్ను పొదుపుగా వాడాలి
ఎడపల్లి(బోధన్): వేసవిలో డిమాండ్ దృష్ట్యా వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని బోధన్ డీఈ ముక్తార్ కోరారు. మండలంలోని ఠాణాకలాన్ గ్రామంలో సోమవారం విద్యుత్ వినియోగ దారులకు, రైతులకు విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించడానికి పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీఈ ప్రభాకర్, సిబ్బందితో కలిసి ఆయన గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కిశోర్ రెడ్డి, సిబ్బంది శంకర్ నాయక్, గంగయ్య, హైమద్ పాష, గజానంద్, అశోక్, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment